Sreeleela: నటి శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే ఈమె మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల కాబోతుంది. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకేక్కినటువంటి ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఇటీవల గుంటూరులో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమంలో శ్రీ లీల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ కార్యక్రమానికి ఈమె నెట్టెడ్ శారీ ధరించి వచ్చారు. బాటిల్ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఈ శారీలో శ్రీ లీలా చాలా క్యూట్ గా కనిపించారు. దీంతో ఈమెకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలపై ఎంతో మంది అభిమానులు ఫోకస్ చేస్తూ శ్రీ లీల కట్టుకున్నటువంటి చీర గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు.
ఈ కార్యక్రమానికి శ్రీ లీల కట్టుకున్నటువంటి ఈ చీర ఖరీదు ఎంత అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ చీర ఏకంగా 1.59 లక్షల రూపాయల ఖరీదని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. చూడటానికి సింపుల్ గా ఉన్నప్పటికీ ఈ చీర కోసం ఈమె ఇంత ఖరీదు చేసిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు పైనే ఆశలు..
శ్రీ లీల మహేష్ బాబుతో కలిసి ఈ సినిమాలో నటించడంతో ఈమె కూడా ఈ సినిమా పట్ల చాలా ఎక్సైట్ గా ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా శ్రీ లీల మాత్రమే కాకుండా మరొక హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్స్ ట్రైలర్ టీజర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి మరి ఈ సినిమా శ్రీ లీలకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…