Upasana Konidela: మెగా కోడలిగా ఉపాసన ఎన్నో బరువు బాధ్యతలను తన భుజాలపై వేసుకొని ఎంతో చక్కగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఒకవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలను చక్కగా నిర్వహించడమే కాకుండా మెగా కుటుంబ కోడలిగా ఇంటి బాధ్యతలను చక్కగా నిర్వహిస్తూ మెగా కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడుతూ వస్తున్నారు.
Upasana Konidela: 150 వృద్ధాశ్రమాలకు సాయం అందించి మంచి మనసు చాటుకున్న మెగా కోడలు!
ఇలా ఇంటి బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్న ఉపాసన సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి కూడా ముందు వరుసలో ఉంటారు.ఇప్పటికే ఎన్నో మూగజీవాలను దత్తత తీసుకొని వాటి సంరక్షణ చేపట్టిన ఉపాసన తాజాగా 150 వృద్ధాశ్రమాలకు తన వంతు సహాయం చేసి తన మంచి మనసు చాటుకున్నారు.
Upasana Konidela: 150 వృద్ధాశ్రమాలకు సాయం అందించి మంచి మనసు చాటుకున్న మెగా కోడలు!
బిలియన్ హార్ట్స్ బీటింగ్ అనే ఫౌండేషన్తో కలిసి ఉపాసన ఈ గొప్ప గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇలా తన వంతుగా వృద్ధాశ్రమాలకు సహాయం చేస్తూ వృద్ధులతో కలిసి సంతోషంగా గడుపుతున్నటువంటి క్షణాలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు మెగా కోడలు మనసు బంగారం అంటూ తన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ విధంగా సామాజిక కార్యక్రమాలలో ఎంతో చురుగ్గా పాల్గొనే ఉపాసన ఆరోగ్య విషయాల గురించి కూడా సోషల్ మీడియా ద్వారా అందరికీ అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఇక కరోనా సమయంలో ఈమె ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి తన వంతు సహాయం చేసే అందరి ప్రశంసలు అందుకున్నారు.
Radhe shyam-Prabhas: యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘రాధేశ్యామ్’. దీనికి సంబంధించి ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్సిటీ సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఊహించిన దానికంటే భారీగా ప్రభాస్ అభిమానులు తరలివచ్చారు. దీంతో వారిని కంట్రోల్ చేయడంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ వల్ల కాలేదు.
Radhe shyam-Prabhas: వారికి ఆర్థిక సహాయం చేసిన ప్రభాస్..!వైరల్ అవుతున్న న్యూస్..!
దీంతో కొంతమంది ప్రభాస్ అభిమానులు అక్కడ ఏర్పాటు చేసిన కృష్ణంరాజు కటౌట్పైకి ఎక్కి.. ప్రభాస్ ను చూసే ప్రయత్నంలో అది విరిగిపోయింది. ఈ క్రమంలోనే ముగ్గురు అభిమానులకు తీవ్రంగా గాయాలయ్యాయి. 28 మంది పాక్షికంగా గాయాలతో బయటపడ్డారు. అంతేకాకుండా.. గాయపడిన ముగ్గురు అభిమానుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Radhe shyam-Prabhas: వారికి ఆర్థిక సహాయం చేసిన ప్రభాస్..!వైరల్ అవుతున్న న్యూస్..!
ఇక ఈ విషయం ప్రభాస్ కు తెలవడంతో.. వారి వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం చేశారు. తీవ్రంగా గాయపడిని వారికి వైద్య ఖర్చులతో పాటు.. వ్యక్తిగతంగా కూడా ఆర్థిక సహాయం చేసినట్లు సమచారం. ఇప్పుడు దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వింటేజ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు.
పూజాహెగ్డే కథానాయిక. ఇందులో ప్రభాస్ లవర్బాయ్ పాత్రలో కనిపించనున్నారు. హస్తసాముద్రిక నిపుణుడి పాత్రలో విక్రమాదిత్యగా మెప్పించనున్నారు. పూజా ప్రేరణ పాత్రలో ఆకట్టుకోనున్నారు. విక్రమాదిత్య.. ప్రేరణను సొంతం చేసుకోగలిగాడా.. లేదా.. వారి ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనే ఆసక్తికర కథాంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకొంది. వచ్చే ఏడాది జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమాకు నేపథ్య సంగీతాన్ని సమకూర్చడానికి తమన్ రంగంలోకి దిగుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ సినిమా పాటల కోసం జస్టిన్ ప్రభాకరన్ బాణీలు అందించగా, హిందీ పాటలకి మిథున్, అమాల్ మాలిక్, మనన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎంతో పేరు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. సమంత హీరోయిన్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది అనాధలకు తన వంతు సహాయం చేస్తూ తన మనస్సు ఏంటో నిరూపించుకున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా సమంతకు సంబంధించిన ఓ విషయం బయటపడింది. సమంత కేవలం చారిటీ ద్వారా మాత్రమే కాకుండా ఆపదలో ఉన్న ఎంతో మందికి తన వంతు సహాయం చేశారని అలా ఒక హీరోయిన్ కి కూడా సమంత ఎంతో సహాయం చేసి తన మంచి మనసు ఏంటో నిరూపించుకుని తాజాగా ఆ హీరోయిన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,పలు సినిమాలలో హీరోయిన్ గా చేసిన తేజస్వి మడివాడ గురించి అందరికీ తెలిసిందే. ఈమె చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ పెరిగి చదువులు పూర్తి చేసుకుని అనంతరం నటనపై ఉన్న ఆసక్తితో అవకాశాలు వెతుక్కుంటూ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇలా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సమయంలో తేజస్వి టీబీ వ్యాధితో బాధ పడింది.
ఆ సమయంలో డాక్టర్ తనకు ఆపరేషన్ చేయాలని చెప్పారని అయితే ఆపరేషన్ కు సరిపడే డబ్బులు తన దగ్గర లేకపోవడంతో సమంత తన వైద్యానికి అయ్యే ఖర్చులన్నింటిని తానే భరించిందని ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తేజస్వి ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ విషయం బయటకు తెలియడంతో సమంత మంచితనం మరోసారి బయటపడటంతో పలువురు ఆమెపై ప్రశంసలు కురిపించారు.
మంచు మోహన్ బాబు తనయుడు, నటుడు మంచు మనోజ్ గొప్ప మనస్సు చాటుకున్నారు. బోన్ క్యాన్సర్ తో బాధ పడుతున్న బాబుకు తన వంతు సహాయం అందించడానికి అండగా నిలిచారు. బాబు వైద్యానికి కావాల్సిన సహాయం తాను తప్పకుండా చేస్తానని కీలక ప్రకటన చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే ఒక నెటిజన్ ఒక బాబు బోన్ క్యాన్సర్ తో బాధ పడుతున్నాడని ఆ బాలుడి వైద్యానికి సరిపోయేంత డబ్బు తల్లిదండ్రుల దగ్గర లేదని ట్వీట్ చేశాడు.
ఆ బాలుడి తగిన వైద్య సహాయం అందేలా చేయాలని కోరుతూ సోనూసూద్, నందమూరి ఫ్యాన్స్ తో పాటు, మంచు మనోజ్, మరి కొందరిని నెటిజన్ ట్యాగ్ చేశాడు. ఆ ట్వీట్ తన దృష్టికి రావడంతో మంచు మనోజ్ స్పందించి బాలుడి వైద్యానికి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. నెటిజన్ చేసిన ట్వీట్ లో మనోహర్ బాబు అనే వ్యక్తి తాను వృత్తిరిత్యా ఆటోడ్రైవర్ నని తన కొడుకు బోన్ క్యాన్సర్ తో బాధ పడుతున్నాడని సహాయం చేయాలని కోరాడు.
మంచు మనోజ్ తన ఇన్ బాక్స్ కు బాలుడు చికిత్స చేయించుకుంటున్న ఆస్పత్రి పేరు, వైద్యుల పేర్లు పంపాలని.. బాలుడు త్వరలోనే కోలుకుంటాడని.. ధైర్యంగా ఉండాలని చెప్పారు. దీంతో నెటిజన్లు మంచు మనోజ్ ను ప్రశంసిస్తున్నారు. మరో సోనూసూద్ అంటూ రియల్ హీరో అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో సైతం మంచు మనోజ్ వలస కార్మికులకు తన వంతు సాయం చేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ లో ఉన్న కార్మికులను మనోజ్ తన సొంత డబ్బులతో సొంతూళ్లకు తరలించారు. మనోజ్ అభిమానులు దైవం మనుషుల రూపంలోనే ఉంటాడని.. నిజంగా మీరు గ్రేట్ అంటూ మంచు మనోజ్ ను ప్రశంసిస్తున్నారు.
Please send me all the details to my inbox – Hospital name and Doctors name too please … Stay strong andi .. praying for his speedy recovery 🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️ Much love to your boy and family 🙏🏻 https://t.co/w8m6tkc6LX
గతంలో ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ మహానగరాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. నగరంలో పరిస్థితి అదుపు వచ్చిందనుకునే లోపు నగరంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం కురుస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత పది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నగరంలోని ప్రధాన ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. వాతావరణశాఖ మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ప్రజలను హెచ్చరిస్తోంది.
వర్షాలు, వరదల వల్ల కొందరి ఇళ్లు పాక్షికంగా దెబ్బ తినగా మరి కొందరి ఇళ్లు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఇలాంటి సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ సాయం కోరారు. జగన్ కేసీఆర్ మధ్య సత్సంబంధాలే ఉన్నప్పటికీ జల వివాదం వల్ల వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే తెలంగాణ ప్రజలు వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జగన్ సహాయం చేయడానికి అంగీకరించారు.
సీఎం కేసీఆర్ నగరంలో వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసం స్పీడ్ బోట్స్ అవసరమని అధికారులతో సమ్జీక్ష అనంతరం జగన్ ను కోరగా జగన్ స్పీడ్ బోట్స్ ను పంపించడానికి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో ఈ విషయాలను వెల్లడించింది. సీఎం జగన్ సహాయం చేయడానికి ముందుకు ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం జగన్, సీఎం కేసీఆర్ మధ్య సత్సంబంధాలు ఉంటే ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు ఏవైనా ఉంటే ఆ సమస్యలు సులువుగా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఏపీ తెలంగాణ రాష్ట్రాల బస్ సర్వీసులు దసరా పండుగకు లేనట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Top Telugu website in the world | Telugu Gossips | Breaking News Headlines, Latest Andhra News, Telangana News, India News, World News – Telugudesk.net