Radhe shyam-Prabhas: వారికి ఆర్థిక సహాయం చేసిన ప్రభాస్..!వైరల్ అవుతున్న న్యూస్..!
Radhe shyam-Prabhas: యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘రాధేశ్యామ్’. దీనికి సంబంధించి ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్సిటీ సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఊహించిన దానికంటే భారీగా ప్రభాస్ అభిమానులు తరలివచ్చారు. దీంతో వారిని కంట్రోల్ చేయడంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ వల్ల కాలేదు.
దీంతో కొంతమంది ప్రభాస్ అభిమానులు అక్కడ ఏర్పాటు చేసిన కృష్ణంరాజు కటౌట్పైకి ఎక్కి.. ప్రభాస్ ను చూసే ప్రయత్నంలో అది విరిగిపోయింది. ఈ క్రమంలోనే ముగ్గురు అభిమానులకు తీవ్రంగా గాయాలయ్యాయి. 28 మంది పాక్షికంగా గాయాలతో బయటపడ్డారు. అంతేకాకుండా.. గాయపడిన ముగ్గురు అభిమానుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ విషయం ప్రభాస్ కు తెలవడంతో.. వారి వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం చేశారు. తీవ్రంగా గాయపడిని వారికి వైద్య ఖర్చులతో పాటు.. వ్యక్తిగతంగా కూడా ఆర్థిక సహాయం చేసినట్లు సమచారం. ఇప్పుడు దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వింటేజ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు.
పూజాహెగ్డే కథానాయిక. ఇందులో ప్రభాస్ లవర్బాయ్ పాత్రలో కనిపించనున్నారు. హస్తసాముద్రిక నిపుణుడి పాత్రలో విక్రమాదిత్యగా మెప్పించనున్నారు. పూజా ప్రేరణ పాత్రలో ఆకట్టుకోనున్నారు. విక్రమాదిత్య.. ప్రేరణను సొంతం చేసుకోగలిగాడా.. లేదా.. వారి ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనే ఆసక్తికర కథాంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకొంది. వచ్చే ఏడాది జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమాకు నేపథ్య సంగీతాన్ని సమకూర్చడానికి తమన్ రంగంలోకి దిగుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ సినిమా పాటల కోసం జస్టిన్ ప్రభాకరన్ బాణీలు అందించగా, హిందీ పాటలకి మిథున్, అమాల్ మాలిక్, మనన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…