Tag Archives: insult

Ramcharan: ఇడ్లీ వడ అంటూ చరణ్ ను అవమానించిన బాలీవుడ్ హీరో.. ఫైర్ అవుతున్న మెగా ఫాన్స్?

Ramcharan: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన తన భార్య ఉపాసనతో కలిసి అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ముగ్గురు కలిసి వేదికపై నాటు నాటు పాటకు స్టెప్పులు వేశారు అయితే వేదికపై నుంచి ఈ హీరోలు రామ్ చరణ్ ని పిలిచి మరి నలుగురు కలిసి డాన్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇకపోతే షారుఖ్ ఖాన్ వేదికపై నుంచి రామ్ చరణ్ ను పిలిచేటప్పుడు ఇడ్లీ వడ అంటూ ఆయనని ఉద్దేశించి పిలిచారు. దీంతో రాంచరణ్ ఫీలవుతూ స్టేజ్ పైనుంచి దిగిపోయారని స్వయంగా ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ షారుక్ ఖాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్ పై అసూయ..
బాలీవుడ్ హీరోలను పావు బాజీ వడపావ్ అని పిలిస్తే ఫీలవుతారు కదా. సరదాగా పిలిచిన ఇలా ఒక హీరోని అవమానించడం సరైనది కాదు అంటూ కొందరు కామెంట్లు చేయగా, మరికొందరు టాలీవుడ్ హీరోలు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడంతో బాలీవుడ్ హీరోలు ఈ విధంగా అక్కసు వెళ్ళకక్కుతున్నారు అంటూ షారుక్ ఖాన్ వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Actor Josh Ravi: ఖలేజా షూటింగ్ లో భోజనం చేస్తుంటే పక్కకెళ్ళు అంటూ అవమానించారు.. నా ముందే నా ఫోటోలు చెత్తబుట్టలో వేశారు : జోష్ రవి

Actor Josh Ravi: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే ఎంతో కష్ట పడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలా అవకాశాల కోసం కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీ చుట్టూ తిరిగిన వారిలో జోష్ రవి ఒకరు. ఈయన అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగానని అయితే ఇలా ఆఫీసుల చుట్టూ తిరిగిన ఇప్పటికీ తనకు ఏ ఒక్క సినిమాలో కూడా అవకాశం రాలేదని వెల్లడించారు.

Actor Josh Ravi: ఆ సినిమా టైంలో భోజనం చేస్తుంటే పక్కకెళ్ళు అంటూ అవమానించారు.. నా ముందే నా ఫోటోలు చెత్తబుట్టలో వేశారు: జోష్ రవి

దర్శక నిర్మాతలతో పరిచయం ఉండటం లేదా తెలిసిన వారి వల్ల నాకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయని జోష్ రవి తెలిపారు. ఇకపోతే రచయితగా తన కొద్దిగా అనుభవం ఉందని, ఈ క్రమంలోనే ఖలేజా సినిమా సమయంలో తాను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కొన్ని డైలాగులు రాసి వినిపించారు. ఇక తన డైలాగ్ లు చూసి త్రివిక్రమ్ తనని భుజంతట్టి మెచ్చుకున్నారని తెలిపారు.

Actor Josh Ravi: ఆ సినిమా టైంలో భోజనం చేస్తుంటే పక్కకెళ్ళు అంటూ అవమానించారు.. నా ముందే నా ఫోటోలు చెత్తబుట్టలో వేశారు: జోష్ రవి

ఇక ఖలేజా సినిమా షూటింగ్ సమయంలో తనకు ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు లేదు ఈ క్రమంలోనే అందరూ భోజనం చేస్తున్న సమయంలో ప్రొడక్షన్ బాయ్స్ వచ్చి తింటున్న తనని ఇక్కడ కాదు పక్కకెళ్లు అంటూ అవమానించారని ఈ సందర్భంగా జోష్ రవి తెలిపారు. ఇలా ఇండస్ట్రీలో ఇలాంటి అవమానాలను చాలామంది ఎదుర్కొంటారని ఆయన చెప్పుకొచ్చారు.

చెత్త బుట్టలో వేశారు…

అదేవిధంగా కెరియర్ మొదట్లో అవకాశాలు కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను నా కళ్ళ ముందే నా ఫోటోలు తీసుకొని చెత్త బుట్టలో వేశారని జోష్ రవి ఈ సందర్భంగా కెరియర్ మొదట్లో తాను ఎదుర్కొన్న అవమానాలును వెల్లడించారు. మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని వెల్లడించారు.ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Anchor Suma: సుమ పరువు తీసిన జబర్దస్త్ కమెడియన్..షో నుంచి బయటకు వెళ్ళిన సుమ!

Anchor Suma: ప్రస్తుతం బుల్లిపెరపై తన యాంకరింగ్ తో ప్రేక్షకులను కట్టి పడేస్తూ, పలు టీవీ షోల్లోనే కాకుండా, ప్రముఖ హీరోలు నటించిన సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు యాంకర్ సుమ. తెలుగు టెలివిజన్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వారి జాబితాలో ముందుంటూ, పలువురి మన్ననలు పొందుతూ, ఇటీవలే సినిమాల్లోనూ నటిస్తూ తన హవాను కొనసాగిస్తోంది సుమ. తన కామెడీతో, పంచ్ లతో టీవీ వీక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ అభిమానుల ఆదరాభిమానాలను చూరగొంటుంది.

Anchor Suma: సుమ పరువు తీసిన జబర్దస్త్ కమెడియన్..షో నుంచి బయటకు వెళ్ళిన సుమ!

ఇకపోతే ఇటీవలే సినిమాల్లోకి ప్రవేశించిన సుమ, ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా జబర్దస్త్ అనే కామెడీ షోకి జడ్జ్ గా విచ్చేసింది. దాంతో అక్కడి వాతావరణమంతా కోలాహలంగా మారింది. మామూలుగానే కమెడియన్స్ పంచులతో ఆ షో దూసుకుపోతూ ఉంటుంది. ఇక దానికి తోడు సుమ కూడా జాయిన్ కావడంతో సెట్ అంత నవ్వుల మయం అయినట్టు తెలుస్తోంది.

Anchor Suma: సుమ పరువు తీసిన జబర్దస్త్ కమెడియన్..షో నుంచి బయటకు వెళ్ళిన సుమ!

సుమ పై పంచ్ ల వర్షం…

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, కంటెస్టెంట్స్ చేసే స్కిట్స్ అన్నీ కూడా సుమ మీదే ఉండడం ఈ సారి మరిన్ని నవ్వులు పూయిస్తుందని అవగతం అవుతుంది. ఇందులో ముఖ్యంగా ఒక కంటెస్టెంట్ సుమ యాంకరింగ్ చేసేటపుడు ఎలా ఉంటుంది, బ్రేక్ వచ్చినపుడు ఏం చేస్తుందనే విషయాలను కామెడీగా ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ఇక పక్కనే ఉన్న అసలు జడ్జీలు మనో, రోజులు కూడా సుమను బాగానే ఆడుకున్నట్టు ఈ వారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను చూస్తే తెలుస్తోంది. ప్రోమోనే ఇంత నవ్విస్తే, ఇక ఎపిసోడ్ మొత్తం ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Jr NTR: ఆర్టిస్ట్ గా కూడా పనికి రాదు గాని, ఎన్టీఆర్ ను కించపరుస్తుందా…ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు!

Jr NTR: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్ ఇటీవలే విడుదలైన ఈ సినిమా సంచలనం సృష్టించింది. రోజుకో రికార్డుతో బాక్సాఫీసును బద్దలు కొడుతూ అశేష అభిమానాన్ని చూరగొంది. దీంతో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ పై రోజు రోజుకి ప్రశంసలు పెరుగుతూనే ఉన్నాయి. ఆ స్థాయిలో వారికి అభిమానులు కూడా పెరుగుతూనే ఉన్నారు. దీంతో ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

Jr NTR: ఆర్టిస్ట్ గా కూడా పనికి రాదు గాని, ఎన్టీఆర్ ను కించపరుస్తుందా…ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు!

ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్.ఆర్ ఆర్ కనిపిస్తుంది బాక్సాఫీస్ ను షేక్ చేసి ఇప్పటి వరకు దాదాపు వెయ్యి కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి టాలీవుడ్ సినిమాను ఎక్కడికో తీసుకు వెళ్ళింది ఈ చిత్రం. కొమరం భీమ్, అల్లూరి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ముందు నుంచే భారీ అంచనాలు ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. దానికి తగ్గట్టుగానే రాజమౌళి సృష్టించిన విజువల్ వండర్ మామూలు ప్రేక్షకుడిని సైతం కట్టిపడేసిందంటే మామూలు విషయం కాదు. అంతే కాకుండా ఈ సినిమా పై పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు.

Jr NTR: ఆర్టిస్ట్ గా కూడా పనికి రాదు గాని, ఎన్టీఆర్ ను కించపరుస్తుందా…ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు!

ఈ నేపథ్యంలోనే ప్రముఖ హీరోయిన్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు మీరాచోప్రా. కెరీర్ ప్రారంభంలో వాన, బంగారం లాంటి చిత్రాలతో తళుకుమన్నా, ప్రస్తుతం అరకొర అవకాశాలతో నెట్టుకొస్తోంది ఈ భామ. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఈ చిత్రంపై స్పందించిన మీరా చోప్రా, కేవలం రామ్ చరణ్ పేరును మాత్రమే ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ అభిమానులను అసంతృప్తికి గురి చేసింది.

ట్రోల్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్…

సౌత్ ఇండియా హీరోలు చాలా ఎత్తుకు ఎదుగుతున్నారని పొగుడుతూ ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, యశ్ పేర్లను హాష్ ట్యాగ్ తో జత చేసింది. కానీ ఎక్కడా కూడా ఎన్టీఆర్ పేరును ప్రస్తావించకపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ కథానాయికలు సైతం ఎన్టీఆర్ తో నటించాలని ఓపక్క ఆసక్తిగా ఎదురు చూస్తుంటే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి కూడా పనికిరాని మీరాచోప్రా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం కోల్పోయిన ఈ భామ, అప్పటి నుంచే తారక్ పై ఇలా నెగటివ్ స్ప్రెడ్ చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Chinna Jeeyar: సమ్మక్క సారక్క దేవతల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చినజీయర్… ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజన నేతలు!

Chinna Jeeyar: ఆధ్యాత్మిక గురువుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న చిన్న జీయర్ స్వామి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ గిరిజనులు ఎంతో పవిత్రంగా భావించే సమ్మక్క సారక్క వనదేవతల పై చిన్న జీయర్ స్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇలా ఈయన సమ్మక్క సారక్క గురించి ఇలా మాట్లాడటంతో ఒక్కసారిగా తెలంగాణ గిరిజన నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.

Chinna Jeeyar: సమ్మక్క సారక్క దేవతల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చినజీయర్… ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజన నేతలు!

ఈ సందర్భంగా చిన జీయర్ వనదేవతల గురించి మాట్లాడుతూ వాళ్లేం దేవతలా..? బ్రహ్మలోకం నుంచి దిగివచ్చినవాళ్లా..? ఏమిటి చరిత్ర..? ఏదో ఒక అడవి దేవత. గ్రామ దేవత. ఈ గ్రామదేవతను అక్కడున్న వాళ్ళు పూజించుకోడంలో తప్పులేదు కానీ విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు అక్కడ వ్యాపారం పెట్టేశారు. చాలా అన్యాయం జరుగుతోంది అంటూ మేడారం సమ్మక్క సారక్కలపై చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Chinna Jeeyar: సమ్మక్క సారక్క దేవతల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చినజీయర్… ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజన నేతలు!

అయితే ఆయన ఇప్పుడు మాట్లాడిన వ్యాఖ్యలు కావు గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సమ్మక్క సారక్క భక్తులు చిన్న జీయర్ స్వామి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆత్మ గౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారక్కల గురించి ఇలా మాట్లాడటంతో ఎమ్మెల్యే సీతక్క చిన్నజీయర్ స్వామి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి….

వనదేవతగా భావిస్తున్న మాతల్లులది వ్యాపారమా?మా తల్లిని దర్శించుకోవడానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేకుండా ఉచితంగా దర్శనం చేసుకోవచ్చు. కానీ మీరు బంగారంతో తయారు చేయించిన సమతా మూర్తి విగ్రహాన్ని దర్శించుకోవాలంటే 150 రూపాయలు టికెట్టు పెట్టి దర్శించుకోవాలి. ఇలా తెలంగాణ గిరిజనులు ఎంతో పవిత్రంగా భావించే సమ్మక్క సారక్కల గురించి ఇలా మాట్లాడటం పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చినజీయర్ స్వామి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు.

Zee Saregamapa Singer: రూపం కాకిలా.. గొంతు కోకిలలా అంటూ హేళన.. జీ సరిగమప పార్వతి కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు..!

Dasari Parvathi: ఆమె సరిగమల పూదోటలో విరిసిన కుసుమం. ఎంతో ప్రతిభ ఉన్నా సరైన అవకాశం లేక ఎంతో ఎదురు చూసింది. అయితే నేడు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. ఒకప్పుడు ఆమెను హేళన చేసిన వారే నేడు దేవత అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె మధురమైన స్వరానికి అందరూ మంత్రముగ్ధుల్ని అయ్యారు.

ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా జీ తెలుగులో ప్రసారం కాబోయే సరిగమప సింగింగ్ కాంపిటీషన్ లో భాగంగా సరికొత్త కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తమ అద్భుతమైన గాత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఇక ఇందులో భాగంగా దాసరి పార్వతి అనే ఓ యువతి పాడిన పాటలకు మాత్రమే కాకుండా జడ్జీలు సైతం ఆమె పాటకు మంత్రముగ్దులయ్యారు.

Dasari Parvathi: రూపం కాకిలా.. గొంతు కోకిలలా అంటూ హేళన చేశారు…. నేడు దేవత అంటున్నారు!

కర్నూలు జిల్లా లక్కసాగరం గ్రామంలో వ్యవసాయమే  జీవనాధారంగా బ్రతుకుతున్న కుటుంబంలో జన్మించింది దాసరి పార్వతి. ఈమెకు ఇద్దరు అన్నయ్యలు.ఇంటర్ వరకు చదివిన ఈమె చదువు మానేసి సంగీతంపై ఆసక్తి ఉండడంతో ప్రతిరోజు పక్క ఊరికి వెళ్లి సంగీతం నేర్చుకుంది. అయితే వారి గ్రామానికి సరైన బస్సు సౌకర్యం లేక కాలినడకన వెళ్లి కష్టపడి సంగీతం నేర్చుకున్న పార్వతి సరిగమప కార్యక్రమంపై తన పాటతో అందరిని మైమరిపించారు.

Dasari Parvathi: రూపం కాకిలా.. గొంతు కోకిలలా అంటూ హేళన చేశారు…. నేడు దేవత అంటున్నారు!

గ్రామానికి బస్సు సౌకర్యం…

తన అద్భుతమైన గాత్రానికి ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధులై ఆమె పై ప్రశంసలు కురిపించారు.ఇక చూడటానికి నలుపు రంగులో ఉన్న పార్వతి కలర్ ముఖ్యం కాదు.. కంటెంట్ ముఖ్యం అని నిరూపించారు.ఒకప్పుడు ఆమె రంగు చూసి రూపం కాకిలా .. గొంతు కోకిల అంటూ హేళన చేశారని అయితే ఆనాడు హేళన చేసిన వారే నేడు ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారని చెప్పవచ్చు.ఎంతో అద్భుతంగా పాడిన పాటకు మైమరిచిన జడ్జ్ ఏం కావాలో కోరుకో అని చెప్పగా నిస్వార్థంతో మా ఊరికి బస్సు సౌకర్యం లేదు సార్ బస్సు కావాలని అడగడంతో తన మనస్సు ఏంటో తెలుస్తుంది.ఇలా మొదటి పాటతోనే ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్న పార్వతి ముందు ముందు మంచి అవకాశాలను దక్కించుకోవాలని కోరుకుందాం.

Meka Ramakrishna: టీలో మోషన్ టాబ్లెట్ కలిపి ఇచ్చేవారు… ఆ అవమానంతో చచ్చిపోవాలనుకున్నా: మేక రామకృష్ణ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సీరియల్స్ లో తనదైన శైలిలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మేక రామకృష్ణ గురించి అందరికీ తెలిసిందే.ఈయన పేరు చెబితే బహుశా గుర్తు పట్టకపోవచ్చు. కానీ ఇతనిని చూస్తే మాత్రం అందరికీ ఎంతో సుపరిచితమైన వ్యక్తి అని మాత్రం తెలుస్తుంది.ఇలా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన మేక రామకృష్ణ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని ప్రొడక్షన్ హౌస్ లో చిన్న ఆర్టిస్టులకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి వెల్లడించారు.

Meka Ramakrishna: టీలో మోషన్ టాబ్లెట్ కలిపి ఇచ్చేవారు…ఆ అవమానంతో చచ్చిపోవాలనుకున్నా: మేక రామకృష్ణ

సాధారణంగా ప్రొడక్షన్ హౌస్లో మన క్యాటగిరిని బట్టి మనకు విలువ ఇస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అడుక్కునే వాళ్లకి కూడా మనం మర్యాదగా వాళ్లకి కావాల్సిన వస్తువులను చేతితో ఇస్తాం కానీ ఇండస్ట్రీలో మాత్రం ఆర్టిస్టులను అంత కన్నా దారుణంగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిసార్లు ప్రొడక్షన్ బాయ్స్ చేష్టలకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి.

Meka Ramakrishna: టీలో మోషన్ టాబ్లెట్ కలిపి ఇచ్చేవారు…ఆ అవమానంతో చచ్చిపోవాలనుకున్నా: మేక రామకృష్ణ

ఇండస్ట్రీలో సాధారణంగా కేటగిరీలను బట్టి వారికి ఫుడ్ అందిస్తూ వుంటారు. పొరపాటున కేటగిరికి కాకుండా వేరే క్యాటగిరి దగ్గరకు వెళ్తే అక్కడ ప్రొడక్షన్ బాయ్స్ ఎంతో నీచంగా మాట్లాడతారని… ఎన్నోసార్లు వారిని తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయనీ తెలిపారు.అయితే ప్రొడక్షన్ బాయ్స్ చేసే ఈ పనులన్నీ దర్శక నిర్మాతలకు తెలియవుపొరపాటున ప్రొడక్షన్ బాయ్స్ ని తిడితే వారికి కాఫీలో మోషన్ టాబ్లెట్ కల్పించడం. టాయిలెట్ లో నీళ్లు తీసుకొచ్చి ఇవ్వడం వంటివి చేస్తుంటారు.


నీకు అంత రేంజ్ లేదన్నారు..

అయితే ప్రొడక్షన్ హౌస్ లో అందరూ అలాగే ఉంటారా అంటే ఉండరని కొందరు గురించి మాత్రమే తాను మాట్లాడుతున్నానని తెలిపారు.ఒక సమయంలో సెట్లో ఎనిమిది మందితో కలిసి కూర్చొని భోజనం చేస్తుండగా ప్రొడక్షన్ బాయ్స్ మిగిలిన ఏడుగురికి వేడి అన్నం పెట్టి నాకు మాత్రం బయట నుంచి తెప్పించిన భోజనం పెట్టారు. అదే నాకు కూడా అదే పెట్టొచ్చు కదా అని అడిగితే నీకు అంత రేంజ్ లేదని చెప్పారు. ఇలా అందరి ముందు అనడంతో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయని ఆ అవమానంతో చచ్చిపోవాలనుకున్నానని ఈ సందర్భంగా మేక రామకృష్ణ ఇండస్ట్రీలో చిన్న ఆర్టిస్టుల బతుకులు ఏ విధంగా ఉంటాయో తెలిపారు.

స్నేహితుడు సినిమా సెట్ లో ఘోరంగా అవమానించారు : నటి మాధవీలత

తెలుగు సినిమా ఇండస్ట్రీకి “నచ్చావులే” సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి మాధవి లత. ఆ తరువాత నాని సరసన “స్నేహితుడా” సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఈమె ఆ తర్వాత మరోసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈమె పలు సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పవచ్చు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి అవకాశాలు లేకుండా ఉన్నప్పటికీ ఈమె బిజెపి పార్టీలోకి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్ గా ఉండే మాధవి లత నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వివాదం సృష్టిస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు.ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తనకు ఇండస్ట్రీలో జరిగిన అవమానాలు గురించి తెలియజేస్తూ బాధపడ్డారు.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవి లత స్నేహితుడు సినిమా షూటింగ్ సమయంలో తనని ఘోరంగా అవమానించారని, ఇప్పటికీ ఆ బాధ తనని వెంటాడుతూనే ఉందని తెలిపారు. స్నేహితుడు సినిమా షూటింగ్ జరిగే సమయంలో సెట్లోకి వెళ్లగా అక్కడ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో ఒకతను తనని చాలా అవమానపరచారని తెలియజేశారు.సాధారణంగా సెట్లోకి వెళ్ళినప్పుడు మనం అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పడం సర్వసాధారణం.

ఈ విధంగా సెట్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒకతనికి గుడ్ మార్నింగ్ చెబుతూ ఇందాక మిమ్మల్ని పలకరించాను మీరు వినిపించుకోవడం లేదు అనగా..ఓ.. మీరు సెట్ కు వచ్చారా.. నేను చూడలేదండి..మీరు కూడా హీరోగారి మాదిరిగా సొంత కారు కొనుక్కొని వస్తే హీరోయిన్ వచ్చిందని గుర్తు పడతాము. సెట్ కారులో వచ్చారు కదా ఎలా గుర్తు పడతాము. అంటూ తనని అవమానించారని ఇప్పటికీ ఆ మాట గుర్తొచ్చినప్పుడు ఎంతో బాదేస్తుందని ఇంటర్వ్యూ సందర్భంగా మాధవీలత అన్నారు. మనిషికి గుర్తింపు కేవలం కార్లు, బ్రాండ్ లు మాత్రమే కానీ ఆ మనిషికి ఎలాంటి గుర్తింపు లేదా అంటూ బాధపడినట్లు మాధవి లత ఈ సందర్భంగా తెలియజేశారు.

సీనియర్ హీరోయిన్ రేఖను అవమానించిన హీరో తల్లి ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రెటీలు ప్రేమించుకోవడం విడిపోవడం సర్వసాధారణమే. వారు ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారో ఎప్పుడు ఎవరితో విడిపోతారు ఎవరికీ తెలియదు. ఈ విధంగా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయిన తరువాత మరొకరితో జీవితం పంచుకున్న సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. ఇలా ఎంతో మంది హీరో హీరోయిన్ల ప్రేమ కథల గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ విధంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు సీనియర్ హీరోయిన్ రేఖను ఒక హీరో తల్లి ఎంత దారుణంగా అవమానించారు. మరి ఆ హీరో ఎవరు ఎందుకు అవమానించారనే విషయానికి వస్తే…

సీనియర్ నటి రేఖ గురించి అందరికీ తెలిసిందే. ఎక్కువగా ఈమె ఎప్పుడు లవ్ ఎఫైర్స్ గురించి వార్తలలో నిలిచేది. అప్పట్లో రేఖ.. వినోద్ మెహ్రాతో పీకల్లోతు ప్రేమలో ఉండేది. వీరు పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే రేఖను తన కుటుంబంలోకి ఆహ్వానించడానికి వినోద్ మెహ్రా తల్లి అంగీకరించలేదు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఇంట్లో తెలియకుండా వివాహం చేసుకుని ఇంటికి వచ్చారు.

ఈ విధంగా పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన వారిని చూసి వినోద్ మెహ్రా తల్లి ఎంతో ఆగ్రహానికి గురయ్యారు. తన తల్లికి నచ్చచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె రేఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా చెప్పు తీసుకొని దాడి చేయడానికి ప్రయత్నించారు. అలా వినోద్ మెహ్రా తల్లి తనని అవమానించడం తో అక్కడి నుంచి వెళ్లిపోయిన రేఖ కొన్ని రోజులపాటు వినోద్ మెహ్రాతో మాట్లాడకుండా ఉన్నప్పటికీ ఆ తర్వాత పరస్పరం వీరిద్దరు విడాకులు తీసుకుని దూరమయ్యారు.

ఇలా వినోద్ తల్లి రేఖను ఎన్నో ఇబ్బందులకు గురి చేయడంతో వినోద్ మెహ్రా నుంచి విడిపోయిన రేఖ ఆ తర్వాత ముఖేష్ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే అతను కూడా మరణించడంతో అతని మరణానికి కారణం కూడా రేఖ అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

తారక్ నువ్వు చాలా అసహ్యంగా ఉన్నానంటూ హేలన చేసారు.. : ఎన్టీఆర్

ఒకవైపు సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉంటూనే రియాలిటీ షోలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రారంభ ఎపిసోడ్ నుంచి మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. హిందీలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి ఎంతటి పాపులర్ షోగా మారిందో అందరికీ తెలుసు.

ఆ కార్యక్రమం లాగానే ఎవరు మీలో కోటీశ్వరులు పేరుతో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఆగస్టు 22వ తేదీ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఈ షో ప్రారంభం అయింది. ఇదిలా ఉండగా.. మొదట బిగ్ బాస్ రియాల్టీ షో కి ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మొదటి సీజన్ ప్రతీ ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంది. తర్వాత నానీ, గత మూడు సీజన్ల నుంచి నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. అయితే అంతటి హైప్ ను కూడా ఎవరు మీలో కోటీశ్వరులు వస్తుందని.. యంగ్ టైగర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తాజాగా రిలీజైన ఓ ప్రోమోలో ఎన్టీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అందేంటంటే.. మొదట ఎన్టీఆర్ ఎంతో లావుగా ఉండేవారు.. తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన యమదొంగలో బాగా స్లిమ్ గా తయారు అయ్యారు ఎన్టీఆర్.

ఈ విషయం గురించి ఎన్టీఆర్ ప్రస్తావిస్తూ.. తాను ఒకప్పుడు చాలా లావుగా ఉండేవాడినని అందుకు కొందరు తనని అసహ్యంగా ఉన్నావని అన్నారని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. దానికి తాను ఎంతో బాధపడేవాడిని అంటూ ఎదురుగా ఉన్న కంటెస్టెంట్ తో చెప్పారు. ఇలా షోలో అతడు తన వ్యక్తిగత విషయాలను కూడా ప్రేక్షకులతో పంచుకుంటూ.. కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు యంగ్ టైగర్.