తెలుగు సినిమా ఇండస్ట్రీకి “నచ్చావులే” సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి మాధవి లత. ఆ తరువాత నాని సరసన “స్నేహితుడా” సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఈమె ఆ తర్వాత మరోసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈమె పలు సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పవచ్చు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి అవకాశాలు లేకుండా ఉన్నప్పటికీ ఈమె బిజెపి పార్టీలోకి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్ గా ఉండే మాధవి లత నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వివాదం సృష్టిస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు.ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తనకు ఇండస్ట్రీలో జరిగిన అవమానాలు గురించి తెలియజేస్తూ బాధపడ్డారు.
ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవి లత స్నేహితుడు సినిమా షూటింగ్ సమయంలో తనని ఘోరంగా అవమానించారని, ఇప్పటికీ ఆ బాధ తనని వెంటాడుతూనే ఉందని తెలిపారు. స్నేహితుడు సినిమా షూటింగ్ జరిగే సమయంలో సెట్లోకి వెళ్లగా అక్కడ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో ఒకతను తనని చాలా అవమానపరచారని తెలియజేశారు.సాధారణంగా సెట్లోకి వెళ్ళినప్పుడు మనం అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పడం సర్వసాధారణం.
ఈ విధంగా సెట్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒకతనికి గుడ్ మార్నింగ్ చెబుతూ ఇందాక మిమ్మల్ని పలకరించాను మీరు వినిపించుకోవడం లేదు అనగా..ఓ.. మీరు సెట్ కు వచ్చారా.. నేను చూడలేదండి..మీరు కూడా హీరోగారి మాదిరిగా సొంత కారు కొనుక్కొని వస్తే హీరోయిన్ వచ్చిందని గుర్తు పడతాము. సెట్ కారులో వచ్చారు కదా ఎలా గుర్తు పడతాము. అంటూ తనని అవమానించారని ఇప్పటికీ ఆ మాట గుర్తొచ్చినప్పుడు ఎంతో బాదేస్తుందని ఇంటర్వ్యూ సందర్భంగా మాధవీలత అన్నారు. మనిషికి గుర్తింపు కేవలం కార్లు, బ్రాండ్ లు మాత్రమే కానీ ఆ మనిషికి ఎలాంటి గుర్తింపు లేదా అంటూ బాధపడినట్లు మాధవి లత ఈ సందర్భంగా తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…