Tag Archives: junior ntr

Chiranjeevi: మెగా ప్రిన్సెస్ కి వెల్కమ్ చెప్పిన.. మెగాస్టార్, జూనియర్ ఎన్టీఆర్…. ట్వీట్స్ వైరల్!

Chiranjeevi: మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని తాగుతున్నాయి. తాజాగా మెగా కోడలు ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రామ్ చరణ్, ఉపాసన వివాహం జరిగిన పది సంవత్సరాలకు వీరిద్దరు తల్లిదండ్రులయ్యారు. ఇంతకాలం పిల్లల విషయంలో ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొన్న ఈ జంట తాజాగా తల్లిదండ్రులయ్యారు. గతేడాది డిసెంబర్ లో రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. అప్పటినుండి మెగా వారసుడి కోసం అభిమానులు మెగా కుటుంబ సభ్యులు ఎంతో అద్భుతగా ఎదురుచూశారు. మొత్తానికి మంగళవారం ఉదయం ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

మెగా ప్రిన్సెస్ రాకతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. మరొకవైపు మెగా కుటుంబంలో కూడా సంబరాలు మిన్నంటాయి. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మెగా ప్రిన్సెస్ రాకతో తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. ఈ క్రమంలో చిరంజీవి ట్వీట్ చేస్తూ ..” మెగా ప్రిన్సెస్ కి స్వాగతం.. నీ రాకతో కొట్లాదిమంది మెగా కుటుంబ సభ్యుల్లో సంతోషం నింపావు. రామ్ చరణ్ ఉపాసనని తల్లిదండ్రులు చేసి మమ్మల్ని గ్రాండ్ ని పేరెంట్స్ చేశావు. ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు” అంటూ ట్వీట్ చేశాడు.

Chiranjeevi: సంతోషంగా ఉండాలి…


ఇక మరొక వైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్ ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేసాడు. ఈ మేరకు ” తల్లిదండ్రుల క్లబ్ లోకి మీ ఇద్దరికీ స్వాగతం.. ఈ సమయంలో బేబీ గర్ల్ తో మీరు గడిపిన క్షణాలు జీవితాంతం తీపి జ్ఞాపకాలుగా గుర్తుంటాయి. మీ ముగ్గురు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను” అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా .. ఎన్టీఆర్ అభిమానులు కూడా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

NTR -Ram Charan: మరో అరుదైన గౌరవం దక్కించుకున్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్..?

NTR -Ram Charan: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ విడుదలై సంవత్సరం గడిచింది. అయినప్పటికీ ఆ సినిమా హవా మాత్రం తగ్గటం లేదు. ఇప్పటికీ మన దేశంలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడ ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో నటించిన మన తెలుగు హీరోలకు కూడా అరుదైన గౌరవం లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రతిష్టాత్మకంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది.

ప్రపంచ సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఆస్కార్ అవార్డులతో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా దక్కించుకుంది. అలాగే ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమాకి తాజాగా మరొక అరుదైన గౌరవం దక్కింది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీం తెలియచేసింది. దేశ విదేశాలలో ఆర్ ఆర్ ఆర్ ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక జపాన్ లో కొమరం భీం, అల్లూరి సీతారామరాజు ఇప్పటికి ప్రకంపనలు సృష్టిస్తున్నారు.

తాజాగా జపాన్ లో ఆర్ఆర్ఆర్ హీరోలైన రాంచరణ్, ఎన్టీఆర్ లకి అరుదైన గౌరవం లభించింది. జపాన్ లో పాపులర్ మ్యాగజైన్ ఆన్ ఆన్ కవర్ పేజీపై రాంచరణ్,ఎన్టీఆర్ ఫోటోలు ప్రచురించారు. ఇలా జపాన్ లో పాపులర్ మ్యాగజైన్ కవర్ పేజ్ పై మన హీరోల ఫోటోలు రావటం అరుదైన గౌరవం అని చెప్పవచ్చు. ఆన్ ఆన్ కవర్ పేజీ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


NTR -Ram Charan: సంతోషంలో తారక్ చరణ్ ఫాన్స్..

ఇక జపాన్ లో విడుదలైన ఈ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పటికే జపాన్ లో 1 బిలియన్ యెన్ వసూలు చేసింది. అంతే కాకుండా ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ సినిమా చూడటం కోసం జపాన్ వాసులు ఎగబడుతున్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా మన తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సొంతం చేసింది. ఇక ఎంతో కాలంగా భారతీయ సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కాలని ఆశించిన ప్రజలకు ఈ సినిమా ఆస్కార్ అవార్డు దక్కించుకొని ఆ కోరిక నెరవేర్చింది.

Jr.NTR: మొదటి సినిమాకు ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఆ డబ్బుతో తారక్ ఏం చేశారో తెలుసా?

Jr.NTR: నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈయన బాల నటుడిగా పలు సినిమాలలో నటించి ఉత్తమ బాల నటుడిగా అవార్డు తీసుకున్నారు. బాలనటుడిగా మెప్పించి 17 సంవత్సరాలకే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే ఈయన హీరోగా మొదటిసారిగా నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

2001 లో వచ్చిన ఈ సినిమాలో రవీందర్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమాని ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించారు. ఇక ఈ సినిమా విడుదల అయ్యి పరవాలేదనిపించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంలో నటించారు.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాతో ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా ఈ సినిమా నుంచి వెనుతిరిగి చూసుకోలేదు.ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతూ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఎన్టీఆర్ తన మొదటి సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.

మొదటి పారితోషికాన్ని తల్లి చేతిలో పెట్టిన తారక్…

ఎన్టీఆర్ తన మొదటి సినిమాకు గాను అక్షరాల 4 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు.17 సంవత్సరాల వయసులోనే హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా నాలుగు లక్షల రెమ్యూనరేషన్ అంటే పెద్ద మొత్తమే అని చెప్పాలి.ఈ విధంగా నాలుగు లక్షల రెమ్యూనరేషన్ అందుకున్న ఎన్టీఆర్ ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియక ఆ డబ్బు తీసుకెళ్లి తన తల్లి చేతిలో పెట్టారు.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకొని వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Junior NTR: కొన్నేళ్లుగా మా రెండు కుటుంబాల మధ్య పోరు..! కానీ మేమిద్దరం మాత్రం…

Junior NTR: దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ట్రిపుల్ ఆర్. దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న ట్రిపుల్ ఆర్ కోసం దేశవ్యాప్తంగా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. బాహుబలి హిట్ తరువాత అంతేస్థాయిలో ట్రిపుల్ ఆర్ తెరకెక్కడంతో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Junior NTR: కొన్నేళ్లుగా మా రెండు కుటుంబాల మధ్య పోరు..! కానీ మేమిద్దరం మాత్రం…

చారిత్రక కథాంశంతో వస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా చేస్తుండగా… ఎన్టీఆర్ కోమురభీంగా కనబడనున్నారు. బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ్ గన్ కీలక పాత్ర పోషిస్తుండగా.. అలియాభట్ చరణ్ కు జోడీగా కనబడనుంది. దాదాపు 450 కోట్ల రూపాయలతో సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి బిజీగా ఉన్నారు.

Junior NTR: మా రెండు కుటుంబాల మధ్య పోరు ఉంది..కానీ మేమిద్దరం మంచి స్నేహితులం అంటున్న యంగ్ హీరో!

సౌత్ తో పాటు నార్త్ లో ప్రమోషన్లను నిర్వహించారు. ఇప్పటికే బెంగళూర్, హైదరాబాద్, కొచ్చి, చెన్నై, ముంబై లలో ట్రిపుల్ ఆర్ యూనిట్ సందడి చేసింది. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యేందుకు మూవీ సిద్ధమైంది. అయితే తాజాగా ఎన్టీఆర్ ఇచ్చిన ఇంటర్య్వూలో మల్టీ స్టారర్ చిత్రాలపై స్పందించారు.

మా కుటుంబాల మధ్య 35 ఏళ్లుగా పోరు నడుస్తోంది.. ఎన్టీఆర్..

ఈ విషయం ఇప్పుడు చెప్పొచ్చో లేదో తెలియదు కానీ.. మా రెండు కుటుంబాల మధ్య  గత 35 ఏళ్లుగా పోరు నడుస్తోందని అన్నారు. అయితే ఇది మా మధ్య ఎప్పుడూ పాజిటివ్ గానే ఉందని చెప్పు కొచ్చారు ఎన్టీఆర్. అయినా రామ్ చరణ్ నేను మంచి స్నేహితులం అని బదులిచ్చాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత దేశంలోని టాప్ స్టార్స్ ఒకేతాటి మీదకు వస్తారని.. భవిష్యత్తులో మల్టీ స్టారర్ చిత్రాలు వస్తాయని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.

మెగా హీరో రామ్ చరణ్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..??

టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది.. ఇక ఇదిలా ఉంటె ఇండ్రస్టీ లో అందరితో మంచి సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేసే రామ్ చరణ్ మొదటి క్రష్ ఎవరనేది ఇప్పుడు బయటికి వచ్చింది. ఆమె ఎవరో కాదు అతిలోకసుందరిగా పేరు సంపాదించిన శ్రీదేవి.

శ్రీదేవి అంటే రామ్ చరణ్ కి ఎంతో అభిమానం అని తెలిసింది. అయితే రాంచరణ్ తో పాటు మరో నటుడైన జూనియర్ ఎన్‌టిఆర్ కి కూడా శ్రీదేవి అంటే ఎంతో అభిమానం అని ఆమె చూస్తే అన్నీ మర్చిపోతారని తెలిసివచ్చింది. స్నేహితులైన వీరిద్దరు ఒకే హీరోయిన్ అయినా శ్రీదేవిని అభిమానించడం విశేషం. ఇక వీరిద్దరు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఇదే సంవత్సరంలో విడుదల కావలసిన సినిమా కరోనా కారణంగా కొంచం వాయిదా పడేలా కనిపిస్తుంది.

ఇక మిగతా నటుల యొక్క ఫస్ట్ క్రష్ ఎవరో చూస్తే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఐశ్వర్య రాయ్ ఫస్ట్ క్రష్ కాగా, మరో నటుడు ప్రభాస్ కు తాను చిన్నపుడు చదివిన స్కూల్ టీచర్ ఫస్ట్ క్రష్ అని తెలుస్తుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక హాలీవుడ్ నటి తన ఫస్ట్ క్రష్ అని చెప్పుకొచ్చారు. అలాగే టాలీవుడ్ కి చెందిన కొందరు హీరోయిన్స్ తమ ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పడం జరిగింది.

మొదటిగా చూస్తే పూజ హెగ్డే ఈమె తన ఫస్ట్ క్రష్ హృతిక్ రోషన్ అని తెలుపగా, మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రణ్ వీర్ సింగ్ తన మొదటి క్రష్ అని తెలిపింది. అలాగే మరో నటి ప్రణీత కూడా తన స్కూల్ లో చదివిన అబ్బాయే తన మొదటి క్రష్ అని ఒక సందర్భం లో చెప్పుకొచ్చింది..ఇక ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న చెర్రీ.. నెక్స్ట్ శంకర్ డైరెక్షన్ లో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు.!!

14 రోజుల క్వారంటైన్ లో చరణ్, ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా…?

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్న ప్రకారం జరిగి ఉంటే 2021 సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై ఉండేది. అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల అన్ని సినిమాల్లానే ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. అయితే దర్శకధీరుడు రాజమౌళి అతి త్వరలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారు.

వీలైతే ఈ నెల చివరి వారం నుంచి లేదంటే వచ్చే నెల తొలివారం నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం కొన్ని రోజుల క్రితమే షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడంతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా మిగిలిన భాగం చిత్రీకరణకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా మిగిలిన 30 షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది.

షూటింగ్ సమయంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా నటీనటులందరూ ఈ నెల 10 నుంచి హోటల్స్ లో క్వారంటైన్ లో ఉండాలని సూచించారని సమాచారం. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కూడా షూటింగ్ లో పాల్గొంటూ ఉండటంతో వాళ్లు కూడా క్వారంటైన్ లో ఉండబోతున్నారని సమాచారం.

అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తైతే 2021 దసరా పండుగ సందర్భంగా లేదా 2022 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. రాజామౌళి డైరెక్షర్ లో బాహుబలి సిరీస్ తరువాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్ సులువుగా బాహుబలి2 కలెక్షన్లను క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించే చిత్రంగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.