Jr.NTR: నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈయన బాల నటుడిగా పలు సినిమాలలో నటించి ఉత్తమ బాల నటుడిగా అవార్డు తీసుకున్నారు. బాలనటుడిగా మెప్పించి 17 సంవత్సరాలకే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే ఈయన హీరోగా మొదటిసారిగా నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
2001 లో వచ్చిన ఈ సినిమాలో రవీందర్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమాని ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించారు. ఇక ఈ సినిమా విడుదల అయ్యి పరవాలేదనిపించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంలో నటించారు.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాతో ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా ఈ సినిమా నుంచి వెనుతిరిగి చూసుకోలేదు.ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతూ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఎన్టీఆర్ తన మొదటి సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.
ఎన్టీఆర్ తన మొదటి సినిమాకు గాను అక్షరాల 4 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు.17 సంవత్సరాల వయసులోనే హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా నాలుగు లక్షల రెమ్యూనరేషన్ అంటే పెద్ద మొత్తమే అని చెప్పాలి.ఈ విధంగా నాలుగు లక్షల రెమ్యూనరేషన్ అందుకున్న ఎన్టీఆర్ ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియక ఆ డబ్బు తీసుకెళ్లి తన తల్లి చేతిలో పెట్టారు.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకొని వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…