Featured

Vineetha : అలనాటి వెంకటేష్ హీరోయిన్ ఇలా గుర్తుపట్టకుండా మారిపోయిందేంటి..?

Vineetha : కొంత మంది హీరోయిన్లు ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రేక్షకుల మదిలో నిలిచిపోతారు. సినిమా సూపర్ హిట్ అయినా కూడా కొంతమంది హీరోయిన్లకు మంచి అవకాశలు రావు. అలానే వెంకటేష్ సినిమాలో తళుక్కుమని మెరిసిన అలనాటి తార వినీత ఆ తరువాత కొన్ని సినిమాల్లో కనిపించి ఆ తరువాత అంతగా కనిపించలేదు. చాలా రోజుల తరువాత మళ్ళీ సోషల్ మీడియాలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.

గుర్తుపట్టకుండా తయారైన మనీషా…

వెంకటేష్ సరసన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వినీత ఆ సినిమాల్లో నేపాలి అమ్మాయి మనీషా లాగా చాలా బాగా నటించింది. ఆ పాత్రతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే వినీత మొదట తమిళం లో పరిచయమై తెలుగు సినిమాల్లోకి వచ్చింది. తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు ఇలా అన్ని భాషలలోనూ సినిమాల్లో నటించిన వినీత తెలుగులో అంతగా చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించలేదు.

ఇక వినీత వేశ్య గా మారిందంటూ కథనాలు రావడం, పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమె కెరీర్ మరింత మసకబారింది. ఇక కోర్ట్ లో మానసిక స్థితి సరిగా లేక అలా చేసానంటూ బెయిల్ తెచ్చుకుంది. పోలీస్ తనను అలా ఇరికించారంటూ ఆరోపణ చేసింది వినీత. ఇక ఆ సంఘటన తరువాత కెరీర్ పూర్తిగా పోయి వినీత జీవితం దిగజారి పోయింది. ప్రస్తుతం ఆమె లుక్ కోల్పోయి ఈమె ఒకప్పుడు హీరోయినా అనేంతలా మారిపోయింది. అందరూ ఇప్పుడు ఆమె ఫోటోలు చూసి అప్పటి మనీషా ఇలా అయ్యిందేంటి అంటూ విస్తుపోతున్నారు.

Bhargavi

Recent Posts

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

8 hours ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

8 hours ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

8 hours ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

8 hours ago

జై వాసవి నినాదాలతో మారుమోగిన సిద్దిపేట.. అంగరంగ వైభవంగా రథయాత్ర!

తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…

8 hours ago

మోహిని ఏకాదశి వ్రతం చేస్తే ఏమవుతుంది? పురాణాల్లో ఆసక్తికర విశేషాలు!

వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…

9 hours ago