Tag Archives: kangana ranaut

Kangana Ranaut: కొత్త సంవత్సరానికి పూజలతో స్వాగతం పలికిన కాంట్రవర్సి బ్యూటీ.. ఈ ఏడాదైనా లవ్ లెటర్స్ రావాలంటూ!

Kangana Ranaut: కొత్త సంవత్సరం రోజున ప్రతి ఒక్కరూ కుంటుంబంతో కలిసి పార్టీలు చేసుకుంటారు. కానీ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పూజలు చేస్తూ కనిపించింది. బాలీవుడ్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ శనివారం నూతన సంవత్సరం సందర్భంగా శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని.. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించి పీఠాధిపతిని ఆరాధించారు.

Kangana Ranaut: కొత్త సంవత్సరానికి పూజలతో స్వాగతం పలికిన కాంట్రవర్సి బ్యూటీ.. ఈ ఏడాదైనా లవ్ లెటర్స్ రావాలంటూ!

తెలుగు సినీ నటుడు సాయి కుమార్, దర్శకుడు అనిల్ రావిపూడి ఇతర ప్రముఖులు కూడా తిరుమల ఆలయాన్ని సందర్శించారు. శ్రీకాళహస్తి ఆలయంలో కంగనా ‘గౌ పూజ’ , రాహుకేతు పూజలు చేసింది. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆలయ ఈఓ డి పెద్దిరాజు ఆమెకు స్వాగతం పలికి దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు.

Kangana Ranaut: కొత్త సంవత్సరానికి పూజలతో స్వాగతం పలికిన కాంట్రవర్సి బ్యూటీ.. ఈ ఏడాదైనా లవ్ లెటర్స్ రావాలంటూ!

అనంతరం ఆమెకు వేదశీర్వచనం అందించి ఎమ్మెల్యే జ్ఞాపికలు.. ప్రసాదాలు అందజేశారు. కంగనాకు శ్రీకాళహస్తి ముక్కంటి దర్శనం చేయించిన వేద పండితులు ఆ తర్వాత ఆశీర్వచనాలు ఇచ్చి ప్రసాదంను ఇచ్చి పట్టు వస్త్రాలతో సత్కరించారు.

ఆమెను చూసేందుకు పోటెత్తారు..

హీరోయిన్ ఆలయానికి రావడంతో చాలామంది ఆమెను చూసేందుకు ఎగబడ్డారు.దీంతో పోలీసులు ఆమెకు భద్రత కల్పించారు. ఇదిలా ఉండగా.. హెచ్ వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్ల సమర్పణలో కూడా ఆమె పాల్గొన్నారు. క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఇంటర్నల్ ఆపరేషన్ సిస్టమ్, ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ , ఆక్యుపేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ సిస్టమ్ కేటగిరీల కింద ఆలయం ఆరు ISO సర్టిఫికేట్‌లను పొందింది. హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రతినిధి శివయ్య హాజరై సర్టిఫికెట్లను ఆలయ అధికారులకు అందజేశారు. ఇక ఆలయంలో పూజలు చేసిన ఏమిటి ఈ ఏడాది తనపై పోలీసు కేసులు ఎక్కువగా వచ్చి.. లవ్ లెటర్స్ రావాలని పూజలు చేసినట్టు తెలియజేశారు.

మరో వివాదంలో కంగనా.. ఆమెపై విరుచుకుపడుతున్న రైతులు..!

కొంతమంది సినీ ప్రముఖులు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. అందులో ముఖ్యంగా కంగనా రనౌత్ ముందుంటారు. బోల్డ్‌గా, ఎవరు ఏమనుకున్నా.. అనిపించింది చెప్పేస్తుంది. సినీ పరిశ్రమలో ఇలాంటి వారు కనిపించడం చాలా అరుదు. ఏ సమస్యపై అయినా తనదైన రీతిలో స్పందిస్తూ కంగనా ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది.

అంతే కాకుండా తనకు అవసరం లేని విషయాల్లో కూడా స్పందిస్తూ ఏరికోరి సమస్యలను తెచ్చుకుంటుంది. తాజాగా ఆమె సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు దాదాపు సంవత్సరం నుండి నిరసనలు చేపట్టారు. అయితే ఇన్ని రోజుల తర్వాత ప్రభుత్వం వారి నిరసనలకు తలొంచి సాగు చట్టాలను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం ప్రకటనను ఇచ్చిన విషయం తెలిసిందే.

తర్వాత రైతులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కంగనా స్పందించారు. ఆమె ఢిల్లీ సరిహద్దులో ఏకధాటిగా నిరసనలు చేస్తున్న ఖ‌లిస్థానీ ఉద్య‌మంతో రైతులను పోలుస్తూ పోస్ట్ పెట్టింది. దీనిపై సిక్కు మతస్తులు ఆమెపై కేసు నమోదు చేశారు.

సబ్‌ అర్బన్‌ ఖార్‌ పోలీస్ స్టేషన్‌లో కంగనాపై కేసు నమోదయ్యింది. ఆమె ఉద్దేశ్యపూర్వకంగా ఆ పోస్టు చేశారని.. సిక్కులను ఖలిస్తానీ టెర్రరిస్టులంటూ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో సిక్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తండ్రి వయసున్న వ్యక్తితో డేటింగ్ చేసిన స్టార్ హీరోయిన్..!

సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య సహజీవనం సర్వసాధారణం. ఎంతోమంది నటీనటులు వారి కన్నా వయసులో పెద్దవారు లేదా చిన్న వారితో సహజీవనం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఇండస్ట్రీలో సహజీవనం చేసిన ఎంతోమంది నటీనటులు గురించి మనకు తెలిసిందే. అయితే కొందరు ఒకరినొకరు ప్రేమించుకుని సహజీవనం చేయగా మరికొందరు మాత్రం సినిమా అవకాశాల కోసం స్టార్ ప్రొడ్యూసర్ డైరెక్టర్లతో సహజీవనం చేస్తూ ఉంటారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంది అవకాశాల కోసం వారి కన్నా వయసులో ఎంతో పెద్ద వారితో డేటింగ్ చేశారు. అలాంటి వారిలో మన కాంట్రవర్సి క్వీన్ కంగనారనౌత్ ఒకరు.బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త ద్వారా సంచలనం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈమె కెరియర్ మొదట్లో ఏకంగా తండ్రి వయసున్న వ్యక్తితో డేటింగ్ చేసిందనే విషయం చాలా మందికి తెలియదు.

కెరియర్ మొదట్లో ఈమెకు ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో చిన్న చిన్న ప్రకటనలలో కనిపించిన ఈమెకు డైరెక్టర్ అనురాగ్ బసు గ్యాంగ్ స్టర్ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆతర్వాత ఈ బ్యూటీ తనకన్నా వయసులో ఎంతో పెద్దవాడైన ఆదిత్య పంచోలితో డేటింగ్ చేసింది. ఈ విధంగా ఒకరినొకరు ఎంతో గాఢంగా ప్రేమించుకున్న సమయంలో కంగనా ఎక్కువగా హృతిక్ రోషన్ తో సినిమాలు తీయడంతో క్రమంగా అతనితో ప్రేమలో పడింది.

ఈ విధంగా హృతిక్ రోషన్ ప్రేమలో పడిన కంగనారనౌత్ ఆ తర్వాత ఆదిత్య పంచోలికి దూరమయ్యే హృతిక్ రోషన్ కు దగ్గర అయింది. అయితే అప్పటికే హృతిక్ తన భార్యతో ఉన్న గొడవల కారణంగా తన భార్యకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే కొద్దిరోజులకు కంగనా హృతిక్ మధ్య మనస్పర్థలు రావడంతో వీరిరువురు విడిపోయారు. ఇలా అవకాశాల కోసం ఆదిత్య పంచోలితో డేటింగ్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది.

కంగనా రనౌత్ అందాలకు హాలీవుడ్ నటుడు ఫిదా.. ఆ కోరిక అంటూ?

బాలీవుడ్ బ్యూటీ, కాంట్రవర్సీ క్వీన్ కంగనారనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిత్యం ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియాలో వివాదం సృష్టించే కంగనా అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారులకు మతి పోగొడుతుంది. ఈ క్రమంలోనే కంగనా నటిస్తున్న టువంటి “ధాకడ్”సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఈమె చిత్ర బృందానికి ప్రత్యేక పార్టీ అరేంజ్ చేశారు. ప్రస్తుతం ఈ పార్టీ గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఈ విధంగా సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్ర బృందానికి పార్టీ ఇచ్చిన ఈమె బ్రాలెట్ టాప్ ధరించి తన ఎద అందాలను ఆరబోసింది.ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో పలువురు నెటిజన్లు ఈ ఫోటో పై భారీ స్థాయిలో ట్రోలింగ్ చేశారు. ఈ క్రమంలోని ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కంగనా షేర్ చేసిన ఈ ఫోటోను చూసిన హాలీవుడ్ నటుడు ఆమె అందానికి ఫిదా అయ్యాడు. హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో గొప్ప నటుడిగా పేరు సంపాదించుకున్నటువంటి రస్సెల్ఈమె అందానికి ఫిదా అవడమే కాకుండా ఈమెతో కలిసి ఓ సినిమాలో నటించాలని ఆశించిన ఒక అభిమాని ఇచ్చిన ట్వీట్ ను రీట్వీట్ చేశారు .

ఈ క్రమంలోనే ఈ ట్వీట్ ను రస్సెల్ క్రో రీట్వీట్ చేయడంతో ఇద్దరు నటుల అభిమానులలో ఈ విషయం తీవ్ర కలకలం రేపిందని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే మరికొందరు వీరిద్దరూ కలిసి సినిమా తీస్తే ఒక అద్భుతమైన జోడి అవుతుందని వీరికి మద్దతుగా నిలబడ్డారు.అయితే ప్రస్తుతం ఈ హాలీవుడ్ స్టార్ హీరో రీట్వీట్ చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి చర్చనీయాంశం అయింది. ఇక కంగనా తమిళనాడు మాజీ దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

వామ్మో… హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కాంట్రవర్సి క్వీన్… ఫోటోలు వైరల్!

కాంట్రవర్సి క్వీన్ అనగానే అందరికీ టక్కున బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గుర్తుకు వస్తారు. ఏ విషయమైనా తన ఎదుట ఎవ్వరు ఉన్న వారికి ఏ మాత్రం భయపడకుండా ముక్కుసూటితనంగా కుండలు బ్రద్దలు కొట్టినట్లు మాట్లాడే ఈమె నిత్యం పలు వివాదాలకు కారణం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే నిత్యం సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటారు.

ఇలా సామాజిక అంశాలపై స్పందిస్తూనే మరోవైపు.. సినిమాలతో ఎంత బిజీగా ఉంటూ బాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో ఒకరిగా ఉన్న ఈ బ్యూటీ తను చేసే ప్రతి సినిమాను ఎంతో విభిన్నంగా ఉండే కథలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోల ద్వారా కుర్రకారును సందడి చేస్తుంటారు.

కంగనా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఏమాత్రం హద్దులు లేకుండా తన హాట్ నెస్ డోస్ పెంచుతూ అభిమానులను సందడి చేస్తోంది. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా క్లీవేజ్ షో చూపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సీరియస్ లుక్ లో ఉన్నప్పటికీ తన ఎద అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఫోటో షేర్ చేసిన కొన్ని క్షణాలకే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక సినిమాల విషయానికొస్తే ఈ బ్యూటీ కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన “పంగా” సినిమా బాక్సాఫీస్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది.అదేవిధంగా తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో కూడా ఈమె కీలక పాత్రను పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రీమియర్ షోకి వచ్చిన కంగనాపై చెప్పుతో దాడి.. సినిమా చూడకుండానే బయటకు వెళ్లిన కంగనా..!

కంగనా రనౌత్ ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మిగులుతుంది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎవరో ఒకర్ని టార్గెట్ చేయకుండా ఈ అందగత్తె నిద్రపోదు. ఇంత చేస్తున్న ఆమె సోషల్ మీడియా అకౌంట్లను బ్యాన్ చేసినా ఆమె మాత్రం రూట్ మార్చలేదు. ఆమె అనుకున్నది చెప్పాల్సిందే. దీనికి ఆమె చెల్లి కూడా ఎప్పుడూ ఆజ్యం పోస్తూ ఉంటుంది.

వివాదాల్లో ప్రధానమైన వాటిని ఏరితే తప్పకుండా మనకు దొరికేవి మహేశ్ భట్, ఆలియా భట్ పై ఆమె చేసిన ఆరోపణలు. కరణ్ జోహర్ తరువాత కంగనా వద్ద నుంచీ అంతగా సెగ ఎదుర్కొంది మహేశ్ భట్, ఆలియానే. నిజానికి మహేశ్ భట్ ‘వో లమ్హే’ సినిమాలో మంచి పాత్రని అందించాడు కంగనాకి. అది ఆమె కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడింది అని చెప్పుకుంటూనే ఏనాడు వాళ్లను మన్నించలేదు.

వీలైనప్పుడల్లా ఏకి పారేసింది. ఆమెతో పాటు ఆమె సోదరి రంగోలీ ఛండేల్ కూడా భట్ ఫ్యామిలీని సొషల్ మీడియాలో చాలా రోజులు టార్గెట్ చేసింది. కంగనా, రంగోలి మాటలతో హర్టైన ఆలియా తల్లి సోనీ రాజ్దాన్ 2006లో ఓ ట్వీట్ చేసింది. మహేశ్ భట్ తనకి బ్రేక్ ఇచ్చినా కూడా కంగనా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తోందని ఆమె వాపోయింది.

రంగోలి ఆ ట్వీట్ కు సమాధానం చెబుతూ.. కగనాకు అసలు మొదటి చిత్రం అందించింది అనురాగ్ బసు అంటూ గుర్తు చేసింది. ‘వో లమ్హే’ తరువాత కంగనా మహేశ్ భట్ తో పనిచేయనుందని చెప్పింది. అందుకు కోపగించిన భట్ ఆమె ప్రీమియర్ షోకి వస్తే చెప్పు విసిరేసి దుర్భాషలాడాడని పేర్కొంది. స్పెషల్ షో చూడనీయకుండానే కంగనాని మహేశ్ భట్ తిప్పి పంపాడట. అప్పట్నుంచీ కంగనాకి, భట్ ఫ్యామిలీకి పర్మనెంట్ గా శత్రుత్వం ఏర్పడిపోయింది

కరోనా నుంచి కోలుకున్న కంగనా.. ఇక కాంట్రోవర్సీలే?

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, కంగనా రౌనత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదో ఒక వివాదాస్పద ట్వీట్ ద్వారా వార్తల్లో నిలుస్తూ ట్రెండ్ అవుతుంటారు.అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తీవ్రరూపం దాలుస్తున్నడడంతో సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఈ కరోనా బారిన పడుతున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా రంగంలో ఎంతో మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడి ఎంతో మంది మరణిస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా కరోనా బారిన పడినట్టు మే 8న తెలియజేశారు. ఇంట్లో ఉంటూనే చికిత్స తీసుకున్న కంగన తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షలలో నెగిటివ్ వచ్చినట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో ద్వారా తెలిపారు.ఈ సందర్భంగా కంగనా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ చేశారు. ”నేను ఇంట్లోనే ఉండి కరోనా నుంచి ఎలా కోలుకున్నానో రాయాలని ఉంది. కానీ కరోనాను తక్కువ చేసి మాట్లాడితే కొందరు బాధపడతారు” అంటూ పోస్ట్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గత కొంతకాలం నుంచి తన చేస్తున్నటువంటి ట్వీట్స్ ఎంతో వివాదాస్పదంగా ఉండడంతో ట్విట్టర్ ట్వీట్స్ ను బ్లాక్ చేసిన సంగతి మనకు తెలిసిందే. గతంలో కూడా కరోనా వైరస్ ని ఉద్దేశించి అది కేవలం చిన్న ఫ్లూ అని ట్వీట్ చేయడంతో ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్ తొలగించిన సంగతి తెలిసిందే. ఈమె చేసే ట్వీట్స్ ట్విట్టర్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని భావించిన ట్విట్టర్ టీమ్ ఆమె ట్విట్టర్ అకౌంట్‌ను శాశ్వతంగా బ్యాన్ చేసింది.

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కంగనా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురచ్చి తలైవి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 23న విడుదల కావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

‘కంగనా’ ను చూసి స్టార్ హీరోలందరూ భయపడుతున్నారట.. ఎందుకో తెలుసా..??

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఈ మధ్య ఎక్కువ వివాదాలతోనే ఫేమస్ అయిపోతోంది.. ఎవ్వరికీ భయపడకుండా ముక్కుసూటిగా మాట్లాడుతూ.. తప్పు చేస్తున్న వాళ్ళని పరోక్షంగా ఓ ఆట ఆడేసుకుంటోంది ఈ బాలీవుడ్ బ్యూటీ.. ఇక ఇండ్రస్టీ లో ఆమెను ఎలాగైనా తొక్కేయాలని చాలా ప్రయత్నాలే జరిగాయి. విచిత్రంగా ఎంత తొక్కేయడానికి ప్రయత్నిస్తే కంగనా అంత ఎత్తుకు ఎదుగుతుంది.

మొదట్లో జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్న రోజుల్లో కంగనాను చాలామంది చాల రకాలుగా ఇబ్బంది పెట్టారు. వారందరితో తనకు తానుగా పోరాడి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఐతే, ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడి అతనితో చనువుగా ఉండి, మొత్తానికి అతని చేతిలో గాయపడి తనలోని విప్లవాన్ని బయటకు తీసి, నోటికొచ్చినట్టు పేలుతూ.. తనను మోసం చేసిన హీరోను డైరెక్ట్ గానే అడ్డమైన తిట్లు తిడుతూ ఆఖరకు తనకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేసుకుంది.

కంగనా మార్కెట్ ను దెబ్బ కొడటానికి థియేటర్స్ విషయంలో అలాగే సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో చాలా రకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టారు. ఒక రకంగా అన్ని ఇబ్బందులు పడుతూ ‘కంగనా’లా ఎదిగిన హీరోయిన్ మరొకరు లేరు ఏమో. అలాగే కంగనాలా తీవ్ర వేధింపులకు లోనయిన వారు కూడా మరొకరు ఉండరు. ఈ విషయాలను పదే పదే చెప్పుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది కంగనా.

ఏది ఏమైనా ఒకవైపు ప్రేక్షకుల సానుభూతిని పొందాలని ఆరాటపడుతునే, మరోవైపు తనకు మాత్రమే సాధ్యం అయిన తన అహాన్ని పరిపూర్ణంగా ప్రదర్శిస్తూ ఉంటుంది కంగనా. అసలు కంగనా ఆలోచనలు ఎవ్వరికీ అంతుపట్టడం సాధ్యం కావు. ఆమె ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తోందో అర్ధం కాక, అందరూ ఆమెతో మర్యాదగానే ముందుకు పోతున్నారు. స్టార్ హీరోలు సైతం కంగనా నోరు ముందు, తీరు ముందు నిలబడడానికి భయపడుతున్నారట..!! 

వాళ్లే సుశాంత్ మృతికి కారణమంటున్న బాలీవుడ్ హీరోయిన్..?

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ సంవత్సరం జూన్ 14వ తేదీన మృతి చెందిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఇప్పటికే సుశాంత్ ది హత్య కాదని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. అయితే కొందరు మాత్రం సుశాంత్ ది హత్యేనని కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం. సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ కేసు వెలుగులోకి రాగా ఈ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది.

డ్రగ్స్ కేసులో ఇప్పటికే రియాను అరెస్ట్ చేసిన అధికారులు పలువు స్టార్ హీరోయిన్లకు సమన్లు జారీ చేసి విచారణ జరిపారు. డ్రగ్స్ గురించి వెలుగులోకి రావడంతో సుశాంత్ కేసు పక్కదారి పట్టిందనే కామెంట్లు సైతం వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సుశాంత్ మృతి గురించి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. సుశాంత్ ది ఆత్మహత్య కావచ్చని అయితే సుశాంత్ మృతికి కారణాలు మాత్రం వేరని ఆమె చెప్పారు.

సుశాంత్ సింగ్ యువకుడని… మంచి ప్రతిభ ఉన్న హీరో అని అలాంటి హీరోకు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. తన లైఫ్ ప్రమాదంలో ఉన్నట్టు సుశాంత్ చాలా సందర్భాల్లో వెల్లడించాడని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో సుశాంత్ ను కొందరు బెదిరించారని ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. సుశాంత్ కు కొందరు అవకాశాలు రాకుండా చేశారని తెలిపారు.

మూవీ మాఫియా సుశాంత్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. సుశాంత్ పై కొందరు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారని.. వాళ్లు చేసిన ఆరోపణలే సుశాంత్ ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయని తెలిపారు. సుశాంత్ తీవ్ర మానసిక వేదనకు గురి కావడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు.