Kangana Ranaut: కొత్త సంవత్సరానికి పూజలతో స్వాగతం పలికిన కాంట్రవర్సి బ్యూటీ.. ఈ ఏడాదైనా లవ్ లెటర్స్ రావాలంటూ!
Kangana Ranaut: కొత్త సంవత్సరం రోజున ప్రతి ఒక్కరూ కుంటుంబంతో కలిసి పార్టీలు చేసుకుంటారు. కానీ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పూజలు చేస్తూ కనిపించింది. బాలీవుడ్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ శనివారం నూతన సంవత్సరం సందర్భంగా శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని.. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించి పీఠాధిపతిని ఆరాధించారు.
తెలుగు సినీ నటుడు సాయి కుమార్, దర్శకుడు అనిల్ రావిపూడి ఇతర ప్రముఖులు కూడా తిరుమల ఆలయాన్ని సందర్శించారు. శ్రీకాళహస్తి ఆలయంలో కంగనా ‘గౌ పూజ’ , రాహుకేతు పూజలు చేసింది. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి, ఆలయ ఈఓ డి పెద్దిరాజు ఆమెకు స్వాగతం పలికి దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు.
అనంతరం ఆమెకు వేదశీర్వచనం అందించి ఎమ్మెల్యే జ్ఞాపికలు.. ప్రసాదాలు అందజేశారు. కంగనాకు శ్రీకాళహస్తి ముక్కంటి దర్శనం చేయించిన వేద పండితులు ఆ తర్వాత ఆశీర్వచనాలు ఇచ్చి ప్రసాదంను ఇచ్చి పట్టు వస్త్రాలతో సత్కరించారు.
హీరోయిన్ ఆలయానికి రావడంతో చాలామంది ఆమెను చూసేందుకు ఎగబడ్డారు.దీంతో పోలీసులు ఆమెకు భద్రత కల్పించారు. ఇదిలా ఉండగా.. హెచ్ వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్ల సమర్పణలో కూడా ఆమె పాల్గొన్నారు. క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇంటర్నల్ ఆపరేషన్ సిస్టమ్, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ , ఆక్యుపేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ సిస్టమ్ కేటగిరీల కింద ఆలయం ఆరు ISO సర్టిఫికేట్లను పొందింది. హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రతినిధి శివయ్య హాజరై సర్టిఫికెట్లను ఆలయ అధికారులకు అందజేశారు. ఇక ఆలయంలో పూజలు చేసిన ఏమిటి ఈ ఏడాది తనపై పోలీసు కేసులు ఎక్కువగా వచ్చి.. లవ్ లెటర్స్ రావాలని పూజలు చేసినట్టు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…