Bank Charges: బ్యాంకులు బాదుడు షురూ..అవి 5 కంటే ఎక్కువైతే అంతే ఇక.. బాదుడే బాదుడు!
Bank Charges: బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్లాక్ మనీని బయటకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. 2016లో పెద్ద నోట్లను రద్దు చేసి..ఎక్కువగా డిజిటల్ కరెన్సీ వైపు మొగ్గు చూపే విధంగా చేశారు.
అప్పటి నుంచి డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. దీనికి తోటు డిజిటల్ ప్లాట్ ఫాంలు అయిన ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి వాటికి విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఒక అకౌంట్ నుంచి డబ్బులను మరో అకౌంట్ ని ట్రాన్స్ ఫర్ చేయడం అనేది మరింత సులువు అయిపోయింది.
బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయాయి. ఒకప్పుడు డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేయాలంటే.. క్యూలో నిల్చొని.. గంటలు గంటలు నిలబడి.. చివరికి పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చే సరికి చాలా సమయం పట్టేది. అంతే డబ్బుల తీసుకోవాలన్నా ఇదే ప్రాసెస్. తర్వాత రోజులు మారాయి. ఏటీఎం సెంటర్లు వచ్చాయి. డిజిటల్ వ్యాలెట్లు వచ్చాయి. దీంతో పని అంతా సులభం అయిపోయింది.
ఇక ఏటీఎం సెంటర్లలో డబ్బులను తీసుకోవాలంటే.. కేవలం 5 ట్రాన్సాక్షన్ల వరకు ఉచితంగా ఉండేది.
తర్వాత ప్రతీ ట్రాన్సాక్షన్కు సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే కొత్త సంవత్సరం నేపథ్యంలో ఈ చార్జీలు మరింత పెరిగాయి. ఆర్బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు ఈ చార్జీలను పెంచాయి.
గతంలో ఒక్క ట్రాన్సాక్షన్ కు రూ.20 వసూలు చేసేవారు.. ప్రస్తతుం దానిని రూ.21 చేశారు. పెంచిన చార్జీలు ఇప్పటికే అమలులోకి వచ్చేశాయి. ఈ చార్జీల పెంపు అనేది 2021 జూన్ 10 నే అనుమతులు వచ్చిన న.. జనవరి 1, 2022 నుంచి అమలు చేస్తున్నారు.
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…
తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…
హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…
సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…
ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…