Tag Archives: Koratala shiva

Sekhar Master: ప్రభాస్ పవన్ సినిమాలకు పని చేయకపోవడానికి అదే కారణం.. వారి వల్లే అవకాశం కోల్పోయా: శేఖర్ మాస్టర్

Sekhar Master: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకరు. ప్రస్తుతం ఈయన ఇండస్ట్రీలో కుర్ర హీరోల నుంచి అగ్ర హీరోల వరకు తన స్టెప్పులతో అందరిని సందడి చేస్తున్నారు.ప్రస్తుతం శేఖర్ మాస్టర్ కెరియర్ పరంగా ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అదేవిధంగా ఒకవైపు కొరియోగ్రాఫర్ గా బిజీగా ఉండటమే కాకుండా మరోవైపు శేఖర్ స్టూడియో ద్వారా ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.

శేఖర్ మాస్టర్ స్టెప్స్ ఎంతో స్టైలిష్ గా ఉండడంతో ఈయన కొరియోగ్రఫీకి అందరూ అభిమానులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క సినిమాలో తప్పనిసరిగా ఈయనకు అవకాశం ఉంటుందని చెప్పాలి.ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి యంగ్ హీరోలు అందరికీ తాను కొరియోగ్రాఫర్ గా పనిచేశానని అయితే ప్రభాస్ పవన్ కళ్యాణ్ కి మినహా మిగిలిన హీరోలు అందరీ సినిమా కోసం తాను పనిచేశానని తెలిపారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రభాస్ సినిమాలకు కూడా తనకు అవకాశం వచ్చినట్టే వచ్చి, ఆ అవకాశాలు జారిపోయాయని శేఖర్ మాస్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు.పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో తనకు ఒక పాటకు కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చిందని తీరా ఆ పాట షూట్ చేసే సమయంలో టెక్నీషియన్ కు అనారోగ్యం చేయడం వల్ల తాను వేరే సినిమాకు కమిట్ అయ్యాను అలా ఈ సినిమా అవకాశం కోల్పోయిందని తెలిపారు.

Sekhar Master: తప్పకుండా వారితో సినిమాలు చేస్తా….

ఇక ప్రభాస్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన మిర్చి సినిమాకి తనకు అవకాశం వచ్చిందని శేఖర్ మాస్టర్ వెల్లడించారు.అయితే అప్పుడే తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరియర్లో ఎదుగుతుండడంతో కొరటాల శివ తనకు ఆ అవకాశం ఇవ్వలేదని అలా ప్రభాస్ సినిమా కూడా మిస్ అయిందని శేఖర్ మాస్టర్ తెలిపారు.అయితే వీరిద్దరితో ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో అయినా తప్పకుండా సినిమా చేస్తానని ఈయన ధీమా వ్యక్తం చేశారు.

Acharya: ఆచార్య నైజాం డిస్ట్రిబ్యూటర్ కి 14 కోట్ల రూపాయలను వెనక్కి ఇచ్చిన కొరటాల.. ఆచార్య తిప్పలు మామూలుగా లేవుగా?

Acharya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు డైరెక్టర్ కొరటాల శివ. రచయితగా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈయన సినిమాతో దర్శకుడిగా మారారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కొరటాల అనంతరం శ్రీమంతుడు జనతాగ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకొని అపజయం ఎరుగని దర్శకుడు గా పేరు సంపాదించుకున్నారు.

Acharya: ఆచార్య నైజాం డిస్ట్రిబ్యూటర్ కి 14 కోట్ల రూపాయలను వెనక్కి ఇచ్చిన కొరటాల.. ఆచార్య తిప్పలు మామూలుగా లేవుగా?

ఈ క్రమంలోనే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన సినిమా ఆచార్య. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా థియేటర్ వద్ద విడుదల అయ్యి మొదటి షో తోనే ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. కొరటాల శివ దర్శకత్వంలో మెగా హీరోలు కలిసి నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే డిస్ట్రిబ్యూటర్లు సైతం కోట్లల్లో డబ్బులు ఖర్చు చేసి సినిమాని కొనుగోలు చేశారు.

Acharya: ఆచార్య నైజాం డిస్ట్రిబ్యూటర్ కి 14 కోట్ల రూపాయలను వెనక్కి ఇచ్చిన కొరటాల.. ఆచార్య తిప్పలు మామూలుగా లేవుగా?

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కోవడంతో ఈసినిమా కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు పెద్దఎత్తున నష్టపోయారు. ఈ విధంగా నష్టపోయిన వారికి మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ రామ్ చరణ్ ఆర్థిక సహాయం చేశారని తెలుస్తోంది. ఇకపోతే వీరందరిలో కెల్లా నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను అధిక మొత్తంలో డబ్బును నష్టపోయినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న కొరటాల…

ఇలా వరంగల్ శీను ఆచార్య సినిమాని నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి కోట్ల రూపాయల నష్టపోవడంతో కొరటాల శివ ముందుకు వచ్చి వరంగల్ శీనుకి ఏకంగా 14 కోట్ల రూపాయలు రిటర్న్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. కొరటాల శివ తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ 30సినిమా మొదలు పెట్టడానికి ముందే ఇదంతా క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే వరంగల్ శీనుకి 14 కోట్ల రూపాయలను రిటర్న్ చేశారట. ఏది ఏమైనా ఇండస్ట్రీలో అపజయమే తెలియని కొరటాల శివకు ఆచార్య సినిమా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని చెప్పవచ్చు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశకు గురి చేయడంతో ఎన్టీఆర్ సినిమా విషయంలో కొరటాల ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Geetha Krishna : బాలకృష్ణ సినిమాని కాపీ కొట్టి కొరటాల శ్రీమంతుడు సినిమా చేశారు.. డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Geetha Krishna : కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం శ్రీమంతుడు. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాతో కొరటాల శివ పేరు ఇండస్ట్రీలో మారు మోగిపోయింది. ఒక ఊరిని దత్తత తీసుకొని ఆ ఊరిలో సేవా కార్యక్రమాలు చేయడం వంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాతో కొరటాల శ్రీమంతుడు సినిమాను తెరకెక్కించారు.

Srimanthudu: బాలకృష్ణ సినిమాని కాపీ కొట్టి కొరటాల శ్రీమంతుడు సినిమా చేశారు.. గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్!

తాజాగా ఈ సినిమా గురించి డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్ చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన గీతాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను కాలేజీ చదువుకునే రోజుల్లోనే బాలచందర్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.

Srimanthudu: బాలకృష్ణ సినిమాని కాపీ కొట్టి కొరటాల శ్రీమంతుడు సినిమా చేశారు.. గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్!

ఈ విధంగా తన కెరియర్ మొదట్లో బాలచందర్, విశ్వనాథ్ వంటి లెజెండరీ డైరెక్టర్ దగ్గర తాను అసిస్టెంట్డైరెక్టర్ గా పని చేశానని తెలిపారు. ఈ క్రమంలోనే కె విశ్వనాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో బాలకృష్ణ నటించిన జననీ జన్మభూమి సినిమాని తెరకెక్కించారని తెలిపారు. అప్పుడప్పుడే బాలక్రిష్ణ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్నారు.

పెద్ద లైబ్రరీగా మారిపోయాయి..

ఆ సమయంలో ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు. ఇక జననీ జన్మభూమి సినిమాని కొరటాల శివ మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమాగా తెరకెక్కించారని ఈ సందర్భంగా గీతాకృష్ణ వెల్లడించారు. జననీ జన్మభూమి సినిమాల్లో కూడా ఇలాంటి కాన్సెప్టే ఉందని సొంత ఊరికి వెళ్లి సేవా కార్యక్రమాలు చేస్తూ ఊరిని బాగు చేయడం అప్పట్లోనే ఇలాంటి కథ వచ్చిందని గీతా కృష్ణ వెల్లడించారు. అప్పట్లో వచ్చిన ఈ సినిమాలన్ని ప్రస్తుత డైరెక్టర్లకు ఒక లైబ్రరీలాగా పనిచేస్తాయని, అలా వచ్చిన సినిమానే శ్రీమంతుడు అంటూ ఈ సందర్భంగా గీత కృష్ణ మహేష్ బాబు కొరటాల శివ సినిమా గురించి షాకింగ్ కామెంట్ చేశారు.

NTR 30: ఒక్క పోస్టర్ తో అడ్డంగా బుక్కయిన కొరటాల.. భారీగా ట్రోల్ చేస్తున్న అభిమానులు!

NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRRఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రానికి కొరటాల శివతో చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమాపై అభిమానులు కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

NTR 30: ఒక్క పోస్టర్ తో అడ్డంగా బుక్కయిన కొరటాల.. భారీగా ట్రోల్ చేస్తున్న అభిమానులు!

ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటేనే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిన్న ఎన్టీఆర్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సినిమా నుంచి ఒక వీడియోని విడుదల చేశారు.

NTR 30: ఒక్క పోస్టర్ తో అడ్డంగా బుక్కయిన కొరటాల.. భారీగా ట్రోల్ చేస్తున్న అభిమానులు!

ఈ వీడియోలో ఎన్టీఆర్ మొహం కనిపించక పోయినప్పటికీ ఎన్టీఆర్ డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమా పక్కా హిట్ అని ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్న సమయంలో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కొరటాల ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా ఇది వరకే అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా అని అదే కథతోనే కొరటాల తారక్ తో సినిమా చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి.

ఒకే విధమైన పోస్టర్స్…

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తో కొరటాల శివ మాస్ ఎంటర్ టైనర్ తెరకెక్కించాలని అనుకున్నారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సినిమాకి సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్దఎత్తున ఎన్టీఆర్ అభిమానులు కొరటాల శివను ట్రోల్ చేస్తున్నారు.
NTR30 పోస్టర్..అల్లు అర్జున్ 21 లుక్స్ ఒకే విధంగా ఉండటంతో నెటిజన్లు భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై కొరటాల ఏవిధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Acharya Movie: ఆచార్య ప్లాప్ కు కొరటాలకు సంబంధం లేదు.. అతనిది మామూలు అనుభవం కాదు!

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో నటించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా గత నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి షో తోనే ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడి ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.ఇకపోతే ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆచార్య సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడానికి కొరటాల శివ కారణం కాదని, ఆయనకు సంబంధం లేదని వెల్లడించారు. కొరటాల శివకు ఇదో అనుభవం ఉంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన జనతాగ్యారేజ్ కూడా ఆచార్య కాన్సెప్ట్ తోనే వచ్చింది. అయితే ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది అంటూ యండమూరి వెల్లడించారు.మెగాస్టార్ చిరంజీవి నక్సలైట్ గా గతంలో తన దర్శకత్వంలో రక్తసింధూరం అనే చిత్రం తెరకెక్కిన ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఆయనకు ఎంతో అనుభవం ఉంది…


ఒక స్టార్ హీరో నక్సలైట్ గా చూపించడం ప్రేక్షకులు స్వీకరించలేకపోయారు. రక్తసింధూరం సినిమాలో నక్సలైట్ గా చిరంజీవిని చూపించి ఇన్స్ స్పెక్టర్ గా చిరంజీవిని చూపించడంతో సెట్ అవ్వలేదని మేము భావించాము. అయితే ఇన్స్పెక్టర్ స్థానంలో చిరంజీవి బదులు వేరే వారిని పెడితే చిరంజీవి పాత్ర చిన్నది అయిపోతుంది. ఆచార్య విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి నక్సలైట్ పాత్రల్లో కనిపించారు. అయితే నక్సలైట్ పాత్ర చిరంజీవికి అచ్చి రాలేదని కాదు కానీ కొన్నిసార్లు అలా జరుగుతుంటాయి. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కొరటాలకు ఏమాత్రం సంబంధం లేదని, ఆయనకు ఎంతో అనుభవం ఉందని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా యండమూరి తెలియజేశారు.

Pawan Kalyan : కొరటాల డైరెక్షన్ లో పవన్ సినిమా మాకొద్దు.. మరో ఆచార్యను మేము చూడలేము : పవన్ ఫ్యాన్స్

Pawan Kalyan: కొరటాల శివ విజయానికి మారుపేరుగా నిలిచినటువంటి ఈయన ఆచార్య సినిమాతో పరాజయం పాలయ్యారు.ఇప్పటివరకు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య సినిమాపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి షో తోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో వీఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ వాడటంతో చిరంజీవి లుక్ పూర్తిగా మార్చేశారని పెద్దఎత్తున మెగా అభిమానులు కొరటాల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కొరటాల శివ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తప్పనిసరిగా సినిమా వస్తుందని వెల్లడించారు.అయితే ఆచార్య సినిమా విడుదల అయి ఈ సినిమా ఫలితాన్ని చూసిన అనంతరం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్దఎత్తున సోషల్ మీడియా వేదికగా కొరటాల పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా మాకొద్దు మహాప్రభో అంటూ మీమ్స్, పోస్టులు పెడుతున్నారు.

కొరటాల నుంచి ఊహించలేదు…

ఈ క్రమంలోనే వీటిపై మరికొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్పందిస్తూ… ఈ కాంబినేషన్లో సినిమా మాకొద్దు మేము మరో ఆచార్య సినిమాని చూడాలనుకోవడం లేదు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఏదిఏమైనా ఆచార్య సినిమా ఫై ఎన్నో అంచనాలు పెట్టుకున్న మెగా అభిమానులకు కొరటాల తీవ్ర నిరాశ కలిగించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్దఎత్తున సోషల్ మీడియా వేదికగా ఇలాంటి మీమ్స్ వైరల్ చేస్తున్నారు.

Chiranjeevi: వీఎఫ్ఎక్స్‌ తో చిరంజీవిని దారుణంగా చూపించారు.. చిరంజీవి లుక్స్ పై మండి పడుతున్న అభిమానులు!

Chiranjeevi:కొరటాల శివ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఈ సినిమా కోసం గత మూడు సంవత్సరాల నుంచి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం, అలాగే పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే అన్ని అడ్డంకులను తొలగించుకుని ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు కొంతమేర నిరాశ కలిగించిందని చెప్పాలి. ఈ సినిమా చూసిన అభిమానులు విభిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు పర్వాలేదని కామెంట్ చేస్తున్నప్పటికీ మరికొందరు రాజమౌళి సెంటిమెంట్ వర్కౌట్ అయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరైతే పూజా హెగ్డే ఐరన్ లెగ్ అంటూ తనపై కామెంట్లు చేస్తున్నారు. ఏదిఏమైనా ఎన్నో అంచనాలు పెట్టుకున్న మెగా అభిమానులకు ఈ సినిమా కాస్త నిరాశ పరిచిందని చెప్పాలి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన ఒక సన్నివేశం లీక్ అయింది.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఎలా కలుసుకున్నారనే విషయాన్ని చూపించారు.ఇందులో రామ్ చరణ్ చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవిని యవ్వనంగా చూపించే ప్రయత్నం చేశారు.

అక్కడ చిరంజీవి కానేకాదు…


మెగాస్టార్ చిరంజీవి ఇలా చూపించడం కోసం దర్శకుడు
వీఎఫ్ఎక్స్‌ ఉపయోగించారు. ఇలా వీఎఫ్ఎక్స్‌ ఉపయోగించడం వల్ల మెగాస్టార్ చిరంజీవి మొహం గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. చిరంజీవి మామూలుగానే పెద్ద వయసు ఉన్నట్టు కనిపించదు అలాంటి అతనికి ఈ విధమైనటువంటి ఎఫెక్ట్స్ వాడటం వల్ల మెగా అభిమానులు దర్శకుడు కొరటాల శివ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే అక్కడ చిరంజీవి కాదు,ఆయన డూప్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Acharya: ఆచార్య సినిమా బాధ్యత మొత్తం కొరటాలదే సినిమా విషయంలో దర్శకుడు కీలక నిర్ణయం..!

Acharya: చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం ’ఆచార్య‘ కొరటాల శివ దర్శకత్వంతో రూపొందుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచానాలు ఉన్నాయి. చిరంజీవితో పాటు మరో క్యారెక్టర్ లో రామ్ చరణ్ తేజ్ నటిస్తుండటంతో భారీ క్రేజ్ నెలకొంది. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కనిపిస్తుండగా… చెర్రీ పక్కన పూజా హెగ్డే నటిస్తున్నారు. 

Acharya: ఆచార్య సినిమా బాధ్యత మొత్తం కొరటాలదే సినిమా విషయంలో దర్శకుడు కీలక నిర్ణయం..!

2022 ఫిబ్రవరి 4న ఆచార్య సినిమా రిలీజ్ చేసేందుకు సినిమా యూనిట్ సిద్దమవుతోంది. సైరా తరువాత చిరంజీవి తీస్తున్న సినిమా కావడంతో ఇందులో కమర్షియల్ అంశాలు తగ్గకుండా… దర్శకుడు కొరటాల శివ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ తో కలిసి రామ్ చరణ్ తేజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో దర్శకుడు కొరటాల శివకు కూడా వాటా ఉందని తెలుస్తోంది.

Acharya: ఆచార్య సినిమా బాధ్యత మొత్తం కొరటాలదే సినిమా విషయంలో దర్శకుడు కీలక నిర్ణయం..!

దీంతో కొరటాల శివ దగ్గరుండీ మరీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారట. సినిమాకు సంబంధించి ఆర్థిక పరమైన అంశాలను కొరటాల శివే తనపై వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆచార్య సినిమాకు నష్టాలు వస్తే కొరటాల శివ చేతి నుంచి ఇవ్వనున్నట్లు తెలిసింది.

ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్.. మరీ ఈ సినిమా….

అయితే ఇప్పటి వరకు కొరటాల శివ తీసిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు బాక్సాఫీస్ వద్ద దమ్మురేపాయి. తీసిన అన్ని సినిమాలు కూడా పెద్ద హిట్లను సాధించాయి. ప్రస్తుతం ఈ అంశమే కొరటాల శివకు సానుకూలంగా మారనుంది. మెగాస్టార్ ఇమేజ్, కొరటాల ట్రాక్ రికార్డ్ ఆచార్య సినిమాకు ప్లస్ కానున్నాయి. దీంతో సినిమా ఓపెనింగ్స్ బాగానే ఉంటాయనేది వాస్తవం. ఏపీలో టికెట్ రేట్లు పెరిగితే మాత్రం కలెక్షన్లు దుమ్మురేపుతాయి. ఏది ఏమైనా కొరటాల శివ ఖాతాలో మరో హిట్ పడుతుందో లేదో వేచి చూడాల్సిందే.

చిరంజీవికి పోటీగా రంగంలోకి దిగిన సూర్య.. గెలుపెవరిది?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా షూటింగ్ ఇటీవలె పూర్తి అయ్యింది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం తెరకెక్కిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమాకు పోటీగా ఎవరు రంగంలోకి దిగటం లేదు.

కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు పోటీగా తమిళ హీరో సూర్య తన సినిమాని ఆచార్యకు పోటీగా పెడుతున్నారు. సూర్య ప్రస్తుతం దర్శకుడు పాండీరాజ్ తో ఎతరక్కుమ్ తునిందవన్ ఆ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు భారీగానే అంచనాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్రబృందం ఫిక్స్ చేశారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా విడుదల రోజునే మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమా కూడా విడుదల కానుంది. రెండు మంచి సినిమాలు ఒకే రోజు విడుదల అవుతుండటంతో పోటీ కూడా బాగానే ఉంటుందని భావిస్తున్నారు. తెలుగులో తాజాగా ఈ సినిమాపై ఉన్న అంచనాలు దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు పోటీగా వెళ్లడం లేదు. కానీ ఎవరూ ఊహించని విధంగా సూర్య సినిమా పోటీకి రావడం అందరికీ షాక్ ఇచ్చింది.

ప్రస్తుతం ఆచార్య సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాను మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ గా చిత్రంగా రాబోతున్న బాలయ్య.. మరొక హీరో ఎవరంటే?

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాని పూర్తి చేసిన తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్న పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.

ఇందులో బాలకృష్ణ సరసన శృతి హాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణ మరొక దర్శకుడికి ఓకే చెప్పినట్లు సమాచారం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ మరో మల్టీస్టారర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలుస్తుంది. అయితే అనిల్ రావిపూడి సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది.

కొరటాల శివ చెప్పిన కథ బాలకృష్ణకు నచ్చడంతో ఆలోచించకుండా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.అయితే ఇది ఎంతవరకు నిజం అనే విషయం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మరి ఇందులో బాలకృష్ణతో పాటు నటించే మరొక హీరో ఎవరనే విషయాన్ని కూడా తెలియజేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే బాలకృష్ణకు సంబంధించిన ఈ మల్టీస్టారర్ చిత్రం గురించి త్వరలోనే అధికారకంగా వెల్లడించనున్నట్లు సమాచారం.