Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో నటించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా గత నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి షో తోనే ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడి ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.ఇకపోతే ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆచార్య సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడానికి కొరటాల శివ కారణం కాదని, ఆయనకు సంబంధం లేదని వెల్లడించారు. కొరటాల శివకు ఇదో అనుభవం ఉంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన జనతాగ్యారేజ్ కూడా ఆచార్య కాన్సెప్ట్ తోనే వచ్చింది. అయితే ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది అంటూ యండమూరి వెల్లడించారు.మెగాస్టార్ చిరంజీవి నక్సలైట్ గా గతంలో తన దర్శకత్వంలో రక్తసింధూరం అనే చిత్రం తెరకెక్కిన ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఒక స్టార్ హీరో నక్సలైట్ గా చూపించడం ప్రేక్షకులు స్వీకరించలేకపోయారు. రక్తసింధూరం సినిమాలో నక్సలైట్ గా చిరంజీవిని చూపించి ఇన్స్ స్పెక్టర్ గా చిరంజీవిని చూపించడంతో సెట్ అవ్వలేదని మేము భావించాము. అయితే ఇన్స్పెక్టర్ స్థానంలో చిరంజీవి బదులు వేరే వారిని పెడితే చిరంజీవి పాత్ర చిన్నది అయిపోతుంది. ఆచార్య విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి నక్సలైట్ పాత్రల్లో కనిపించారు. అయితే నక్సలైట్ పాత్ర చిరంజీవికి అచ్చి రాలేదని కాదు కానీ కొన్నిసార్లు అలా జరుగుతుంటాయి. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కొరటాలకు ఏమాత్రం సంబంధం లేదని, ఆయనకు ఎంతో అనుభవం ఉందని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా యండమూరి తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…