Acharya: ఆచార్య నైజాం డిస్ట్రిబ్యూటర్ కి 14 కోట్ల రూపాయలను వెనక్కి ఇచ్చిన కొరటాల.. ఆచార్య తిప్పలు మామూలుగా లేవుగా?
Acharya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు డైరెక్టర్ కొరటాల శివ. రచయితగా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈయన సినిమాతో దర్శకుడిగా మారారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కొరటాల అనంతరం శ్రీమంతుడు జనతాగ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకొని అపజయం ఎరుగని దర్శకుడు గా పేరు సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన సినిమా ఆచార్య. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా థియేటర్ వద్ద విడుదల అయ్యి మొదటి షో తోనే ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. కొరటాల శివ దర్శకత్వంలో మెగా హీరోలు కలిసి నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే డిస్ట్రిబ్యూటర్లు సైతం కోట్లల్లో డబ్బులు ఖర్చు చేసి సినిమాని కొనుగోలు చేశారు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కోవడంతో ఈసినిమా కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు పెద్దఎత్తున నష్టపోయారు. ఈ విధంగా నష్టపోయిన వారికి మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ రామ్ చరణ్ ఆర్థిక సహాయం చేశారని తెలుస్తోంది. ఇకపోతే వీరందరిలో కెల్లా నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను అధిక మొత్తంలో డబ్బును నష్టపోయినట్లు తెలుస్తోంది.
ఇలా వరంగల్ శీను ఆచార్య సినిమాని నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి కోట్ల రూపాయల నష్టపోవడంతో కొరటాల శివ ముందుకు వచ్చి వరంగల్ శీనుకి ఏకంగా 14 కోట్ల రూపాయలు రిటర్న్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. కొరటాల శివ తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ 30సినిమా మొదలు పెట్టడానికి ముందే ఇదంతా క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే వరంగల్ శీనుకి 14 కోట్ల రూపాయలను రిటర్న్ చేశారట. ఏది ఏమైనా ఇండస్ట్రీలో అపజయమే తెలియని కొరటాల శివకు ఆచార్య సినిమా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని చెప్పవచ్చు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశకు గురి చేయడంతో ఎన్టీఆర్ సినిమా విషయంలో కొరటాల ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి…
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…