Tag Archives: krishnamraju

Actress Jayachitra: ఆ చిన్న పొరపాటు వల్ల బాహుబలి సినిమా అవకాశాన్ని కోల్పోయాను.. సీనియర్ నటి జయ చిత్ర కామెంట్స్ వైరల్!

Actress Jayachitra: సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో గ్లామరస్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన వారిలో నటి జయ చిత్ర ఒకరు.అప్పట్లో ఈమె కృష్ణంరాజు కృష్ణ శోభన్ బాబు వంటి హీరోల సరసన నటించి అద్భుతమైన నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఈ విధంగా గట్టిగా ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె అనంతరం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎంతో అద్భుతంగా అవకాశాలను అందుకొని బిజీగా మారిపోయారు.

హీరోయిన్ గా ఎంతో గుర్తింపు పొందినటువంటి జయ చిత్ర సెకండ్ ఇన్నింగ్స్ పవర్ ఫుల్ అత్త పాత్రలలో నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. అయితే తాజాగా ఈమె మణిరత్నం దర్శకత్వంలో వచ్చినటువంటి పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జయచిత్ర ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తాను తన సెకండ్ ఇన్నింగ్స్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు సీరియల్స్ లో కూడా నటించానని తెలిపారు. ఈ క్రమంలోనే తెలుగులో రాఘవేంద్రరావు బంధువులు తెరకెక్కిస్తున్నటువంటి మంగమ్మగారి మనవడు సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది.ఆ సమయంలో తాను రాజమౌళి గెస్ట్ హౌస్ లో ఉన్నానని ఇలా తనకు అవకాశం రావడంతో తాను ఈ సీరియల్లో చేయడానికి ఓకే చెప్పాను.అయితే అదే సమయంలోనే కొందరు ఉద్దేశపూర్వకంగా తాను ఈ సీరియల్ లో నటించడానికి ఇష్టత చూపలేదని తను ఫారెన్ వెళ్లాలనుకుంటున్నాను అంటూ దర్శకులకు అబద్ధాలు చెప్పారు.

Actress Jayachitra:శివగామి పాత్ర నాకే వచ్చేది..

ఇది నిజమే అనుకొని నాకు ఈ సీరియల్లో అవకాశం లేకుండా పోయింది.హీరోయిన్ గా ఎన్నో సినిమా అవకాశాలను అందుకొని మంచి గుర్తింపు సంపాదించుకున్న తనకు ఈ సీరియల్ మిస్ అవ్వడంతో ఆ అసంతృప్తి తనలో అలాగే ఉండిపోయిందని ఈమె తెలియజేశారు.ఒకవేళ ఈ సీరియల్లో కనుక నేను నటించి ఉంటే తప్పకుండా నాకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో నటించే అవకాశం వచ్చేదని ఆ చిన్న పొరపాటు కారణంగా ఈ అవకాశాన్ని కోల్పోయానంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Tammareddy Bharadwaj: కృష్ణంరాజు గారు అడిగిన ఆపని చేయలేకపోయాను.. నాకు మాట్లాడటానికి కూడా సిగ్గుగా ఉంది: తమ్మారెడ్డి భరద్వాజ్

Tammareddy Bharadwaj: తెలుగు వెండితెర రారాజుగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు కృష్ణంరాజు ఆదివారం మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఆదివారం ఈయన మరణించడంతో తెలుగు సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే మంగళవారం ఈయన సంస్కరణ సభను నిర్వహించారు.

ఫిల్మినగర్ కల్చరల్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సంస్కరణ సభలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈ సంస్కరణ సభలో పాల్గొన్నటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇక తాను నిర్మాతగా కృష్ణంరాజు హీరోగా ఫస్ట్ సినిమా చేశానని అయితే ఈ సినిమాకు మా అన్నయ్య దర్శకుడు అంటూ తమ్మారెడ్డి తెలియచేశారు.

ఈ సినిమాలో మా అన్నయ్య ఏకంగా నాలుగు పాటలు పెడతానన్నారు అయితే నాలుగు పాటలు పెడితే ఎవరు చూస్తారు అంటూ తాను అడ్డుపడ్డానని ఇదే విషయాన్ని కృష్ణంరాజు దగ్గరికి వెళ్లి మా అన్నయ్య నాలుగు పాటలు పెడతానన్నారు అసలు ఎవరు చూస్తారు ఈ పాటలు అని అతనితో చెప్పాను. ఆ స్థానంలో కృష్ణంరాజు కాకుండా వేరే ఏ హీరో ఉన్న లాగిపెట్టి నన్ను కొట్టేవారు. ఆయన మాత్రం ఓ చిన్న నవ్వు నవ్వి నేను పనికిరానా? అంటూ మా అన్నయ్యని ఒప్పించారు. ఆయన సినిమాకు ఏం కావాలో అంతే చేస్తారని తమ్మారెడ్డి పేర్కొన్నారు.

Tammareddy Bharadwaj:ఆయన ఇష్టపడిన ఫ్లాట్ ఇవ్వలేకపోయాను…

ఈ సంఘటన తర్వాత దాదాపు ఒక మూడు సంవత్సరాల పాటు ఆయన ఫోన్ ఎత్తాలన్న భయం వేసేదని తమ్మారెడ్డి పేర్కొన్నారు.ఇకపోతే మూడు సంవత్సరాల క్రితం కృష్ణంరాజు గారు తన వద్దకు వచ్చి మూవీ టవర్స్ లో తనకు ఒక ఫ్లాట్ కావాలని అడిగారు.అయితే తనకు మార్కెట్ రేట్ కావాలని చెప్పగా మార్కెట్ రేట్ ఎంత ఉంటే అంత ఇస్తానని కృష్ణంరాజు గారు చెప్పారు. అయితే ఆయనకు చెప్పినట్టుగా నేను ఆ ఫ్లాట్ ఇవ్వలేకపోయానని ఈ విషయం గురించి మాట్లాడాలన్నా చాలా సిగ్గుగా ఉందంటూ ఈ సందర్భంగా గతంలో జరిగిన విషయాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నటి హేమకు షాక్..షోకాజ్‌ జారీచేసిన “మా”..!

గత రెండు రోజుల క్రితం నటి హేమ “మా” అసోసియేషన్ లో అవకతవకలు జరిగాయని, మా అసోసియేషన్ కు నిధులు సమకూర్చుకుండా ఉన్న నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నారంటూ ప్రస్తుతమున్న మా అధ్యక్షుడు నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఎలక్షన్లు జరగకుండా మరికొన్ని రోజులపాటు తానే అధికారంలో ఉండాలని మా అధ్యక్షుడు భావిస్తున్నారని హేమ ఆరోపించారు.

ఈ క్రమంలోనే హేమ మా అధ్యక్షుడు గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఆడియో టేప్ బయటకు వచ్చింది. అదేవిధంగా తక్షణమే మా ఎన్నికలు జరగాలని హేమ సంతకాల సేకరణ కూడా చేపట్టారు. ఈ విధంగా ఈమె చేసిన వ్యాఖ్యలపై సోమవారం మా అధ్యక్షుడు నరేష్, జీవిత స్పందిస్తూ నటి హేమకు కౌంటర్ వేశారు.

ఈ క్రమంలోనే మా పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి సీరియస్ అయ్యారు. ఈ విధమైనటువంటి బహిరంగ ప్రకటనలు చేస్తూ మా ప్రతిష్టను దిగజారుస్తున్నారని, వారిపై చర్యలు తీసుకొని తక్షణమే ఎన్నికలు జరపాలంటూ చిరంజీవి క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాశారు.

ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి క్రమశిక్షణ సంఘానికి లేఖ రాయడంతో వెంటనే క్రమశిక్షణ సంఘం స్పందించి నటి హేమకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న మా అధ్యక్షుడు నరేష్ పై చేసిన ఆరోపణలకు ఆమెను వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులను జారీ చేసింది. అదేవిధంగా తక్షణమే మా ఎన్నికలు కూడా జరిగేలా చర్యలు తీసుకుంటామని క్రమశిక్షణ సంఘం తెలియజేసింది. అయితే ఈ సారి మా ఎలెక్షన్ బరిలో మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, ప్రకాష్ రాజ్, హేమ,సీవీఎల్‌ నర్సింహ రావు తదితరులు పోటీలో నిలబడ్డారు.