Tag Archives: maldives

Jr.NTR: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరు కలేనని తేల్చి చెప్పిన జూనియర్ ఎన్టీఆర్… అదే కారణమా?

Jr.NTR: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఈనెల 20 వ తేదీన హైదరాబాదులో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు అన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులను కూడా ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఆహ్వానం అందింది. అయితే చాలాకాలం తరువాత టీడీపీ తరపున, నందమూరి కుటుంబం తరపున జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందింది.

గతంలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు కూడా జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించలేదన్న వార్తలు వినిపించాయి. అయితే ఈనెల 20న ఎంతో ఘనంగా నిర్వహించనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ అలాగే టిడిపి నేత జనార్ధన్ కలిసి జూనియర్ ఎన్టీఆర్ నివాసంలో ఆయనను కలిసి ఈ ఉత్సవాలకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవం కావడంతో.. ఆయన ఈ కార్యక్రమానికి వస్తారా ? లేదా ? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

అయితే టీడీపీ ఎంతో పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ఈ సభకు జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యే అవకాశాలు లేనట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ వేడుకలకు ఆహ్వానించినప్పుడు ఎన్టీఆర్ చెప్పిన మాటలు బట్టి చూస్తే ఆయన ఈ వేడుకలకు హాజరయ్యే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. టిడిపి నేత జనార్ధన్ ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ నివాసానికి వెళ్లి జూనియర్ ఎన్టీఆర్ ని ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ఆహ్వానించారు.

Jr.NTR: మాల్దీవ్ ట్రిప్ ప్లాన్ చేసిన తారక్…


ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ ఉత్సవాలకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిపినట్లు తెలుస్తోంది. ఈ నెల 20 ఈ కార్యక్రమాన్ని నిర్వహించే రోజునే తన పుట్టిన రోజు కూడా ఉందని… ఆ రోజు మాల్దీవుల్లో గడపాలని మొత్తం 20 కుటుంబాల నుంచి అందరం ప్లాన్ చేసుకున్నట్లు ఎన్టీఆర్ తెలిపాడు. ఆ ట్రిప్ కి సంబంధించి ఇప్పటికే అన్నీ బుక్ చేసేసుకొన్నామని.. ఈ షెడ్యూల్ మార్చుకొనే అవకాశం ఉంటే సభకు వస్తానని ఎన్టీఆర్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

Manoj -Mounika: హనీమూన్ ఏర్పాట్లను భారీగా చేసిన కొత్తజంట.. హనీమూన్ కోసం అక్కడికి వెళ్ళనున్న మౌనిక మనోజ్!

Manoj -Mounika: గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ మార్చ్ 3వ తేదీ మరోసారి పెళ్లి పీటలు ఎక్కి ఏడడుగులు నడిచారు భూమా మౌనిక మంచు మనోజ్. ఇలా ఈ దంపతులు ఇదివరకే పెళ్లి చేసుకొని వారి జీవిత భాగస్వామిలకు విడాకులు ఇచ్చి ఒంటరిగా గడుపుతున్న అనంతరం వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

మార్చి 3 వ తేదీ పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంట ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తమ అత్తారింటికి బయలుదేరారు. ఈ క్రమంలోనే మనోజ్ మౌనిక భారీ కాన్వాయ్ నడుమ కర్నూలుకు చేరుకున్నారు. వీరి పెళ్లి తంతు కార్యక్రమం ముగియడంతో వీరి హనీమూన్ గురించి కూడా పలు వార్తలు వస్తున్నాయి.

వివాహం తర్వాత ఈ దంపతులు తమ జీవితాన్ని చాలా సంతోషంగా గడపడం కోసం ప్లాన్ చేశారట ముందుగా ఇతర దేశాలకు వెళ్లి అనంతరం ఇండియాలోనే పలు పర్యాటక ప్రాంతాలకు వెళ్లి తమ కొత్త జీవితాన్ని సంతోషంగా ప్రారంభించడానికి ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం.

Manoj -Mounika: వారం రోజుల పాటు మాల్దీవ్స్ వెళ్ళనున్న జంట…

ఈ క్రమంలోనే మరో రెండు మూడు రోజులలో వీరు తమ హనీమూన్ కోసం వారం రోజుల పాటు మాల్దీవ్స్ వెళ్ళనున్నారని అనంతరం ఇండియాలో పలు పర్యాటక ప్రాంతాలకు కూడా వెళ్ళబోతున్నారని సమాచారం. ఈ విధంగా ఈ జంట తమ జీవితాన్ని సంతోషంగా గడపడం కోసం భారీగా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మనోజ్ మౌనికల వివాహానికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Rashmika: అవును విజయ్ తో కలిసి మాల్దీవులకు వెళ్లాను .. ఎట్టకేలకు ఓపెన్ అయిన రష్మిక!

Rashmika: రష్మిక మందన్న ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయారు.భాషతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్నారు. ఇలా వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా గడుపుతున్న రష్మిక తరచూ వివాదాలను కూడా ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా రష్మిక నటుడు విజయ్ దేవరకొండ గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.అయితే వీరిద్దరి రిలేషన్ గురించి ఇప్పటికే రష్మిక స్పందించి తామిద్దరం మంచి స్నేహితులు అని చెప్పినప్పటికీ వీరి గురించి వచ్చే వార్తలు ఏమాత్రం ఆగడం లేదు. ఇలా ఎప్పటికప్పుడు రష్మిక తన గురించి వచ్చే వార్తలపై స్పందిస్తూ వచ్చారు.

మరోసారి విజయ్ దేవరకొండతో తనకున్న రిలేషన్ ఏంటో బయట పెట్టేశారు. న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరూ ఒకే చోట సెలబ్రేషన్స్ చేసుకున్నారని అర్థమైంది. ఇద్దరు విడివిడిగా మాల్దీస్ ఫోటోలు షేర్ చేసినప్పటికీ ఒకే చోటే ఉన్నారని భావించిన నేటిజన్స్ వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు సృష్టించారు. అయితే ఈ వార్తలు పై స్పందించిన రష్మిక తనకు విజయ్ మంచి స్నేహితుడని చెప్పేశారు.

Rashmika: ఫ్రెండ్స్ తో వెకేషన్ వెళ్లకూడదా…

మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ తప్ప మరి ఏమీ లేదని, న్యూ ఇయర్ సందర్భంగా ఇద్దరం మాల్దీవ్స్ వెళ్లి ఎంజాయ్ చేశామని ఇందులో తప్పు ఏమాత్రం లేదంటూ ఈమె విజయ్ దేవరకొండతో మాల్దీవ్స్ ట్రిప్ గురించి తెలిపారు. ఇలా విజయ్ దేవరకొండతో తనకు కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కి వెళ్ళకూడదా అన్నట్టు రష్మిక మరోసారి వీరి గురించి వీరి మధ్య ఉన్న రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చారు.

వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న సుమ కనకాల.. ఎక్కడికి వెళ్లారో తెలుసా..?

యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేరళకు చెందిన ఈమె మాతృ భాష తెలుగు కానప్పటికీ.. తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె తెలుగు భాషను ఎంతో చక్కగా మాట్లాడడమే కాదు యాంకరింగ్‌ చేస్తూ కూడా ఈ రంగంలో మంచి స్థానానికి చేరుకున్నారు. ఆమె యాంకరింగ్ స్పూర్తితో ఎంతో మంది యాంకర్స్ తయారు అయ్యారు.

ఆమె ప్రతీ ఒక్క కార్యక్రమాన్ని చక్కటి చిరునవ్వు, సమయస్ఫూర్తితో యాంకరింగ్ రంగంలో రాణిస్తుంది. తెలుగు, మలయాళంలతో పాటు హిందీ, ఆంగ్ల భాషలలోను ఆమె మాట్లాడగలదు. పంచావతారం, స్టార్ మహిళ, భలే ఛాన్సులే వంటి కార్యక్రమాలకు యాంకరింగ్ చేసి మంచి గుర్తింపును పొందింది సుమ. టీవీ షోలనే కాకుండా ఆమె పలు చలన చిత్రాలకు సంబంధించి ఆడియో ఫంక్షన్లకు వ్యాఖ్యతా వ్యవహరించి ఎంతో పేరు తెచ్చుకుంది.

అయితే ఇటీవల ఆమె యూట్యూబ్ చానల్ కూడా ప్రారంభించి అందులో మంచి కంటెంట్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఆమె 1999లో తన తోటి నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆమెకు ఇద్దరు పిల్లలు రోషన్, కార్తికేయ. అయితే ఇటీవల ఆమె ఫ్యామిలీతో మాల్దీవ్స్ లో వెకేషన్ కు వెళ్లారు.

అక్కడ ఆమెతో పాటు తమ ఫ్యామిలీతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆ ఫొటోలకు నెటిజన్లు ‘ఎంజాయ్ యు ఆర్ వెకేషన్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఆ ఫోటోలతో సమంత వ్యాపారం చేస్తోంది.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..?

రెండు తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులకు శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎంతోమంది సినీప్రముఖులపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి శ్రీరెడ్డి గతంలో వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి తాజాగా మరోమారు స్టార్ హీరోయిన్ సమంతపై సెన్సేషనల్ కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు. సమంత ఫోటోలతో వ్యాపారం చేస్తోందంటూ శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల సమంత మాల్దీవుల్లో వెకేషన్ ట్రిప్ కు వెళ్లి అక్కడ దిగిన బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. సమంత షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. సమంత షేర్ చేసిన ఆ ఫోటోల గురించి శ్రీరెడ్డి స్పందిస్తూ గాయ్స్ ఆ ఫోటోను ఒకసారి పూర్తిగా చూడండి. సమంతకు ఇప్పటికే పెళ్లైందని.. కొన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉందని.. అయినా ఆమె అందాలను ఆరబోస్తూ వ్యాపారం చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శ్రీరెడ్డి చేసిన కామెంట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. గతంలో చాలా సందర్భాల్లో సమంతను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి తాజాగా మరోమారు అలాంటి కామెంట్లు చేయడం గమనార్హం. శ్రీరెడ్డి చేసిన కామెంట్లపై సమంత అభిమానులు మండిపడుతున్నారు. సమంత అభిమానుల్లో కొందరు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ వ్యవహారం ఎక్కడివరకు వెళుతుందో చూడాల్సి ఉంది.

చెన్నైకు వెళ్లిన తరువాత కొంతకాలం సైలెంట్ అయిన శ్రీరెడ్డి మళ్లీ సమంతను టార్గెట్ చేయడంతో మరి కొంతమందిని కూడా ఆమె టార్గెట్ చేసే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే సమంత మాత్రం ఇలాంటి ట్రోల్స్ ను, నెగిటివ్ కామెంట్స్ ను పట్టించుకోదనే సంగతి తెలిసిందే.