Tag Archives: money

Money Tips: వీటిని పూజ గదిలో ఉంచితే డబ్బులే డబ్బులు..! ఇంకెందుకు ఆలస్యం ఆ పని చేసేయండి..!

Money Tips: సాధారణంగాప్రతీ ఇళ్లలో బల్లులు ఉంటాయి. వీటిని చూసి చాల మంది భయపడుతాారు. కానీ హిందు శాస్త్రాల ప్రకారం బల్లులకు కూడా విశేష స్థానం ఉంది. మనపై బల్లులు పడటం కూడా రాబోయే మంచిని చెడుతు సూచిస్తాయని శాస్త్రాలు చెబుతుంటాయి.

Money Tips: వీటిని పూజ గదిలో ఉంచితే డబ్బులే డబ్బులు..! ఇంకెందుకు ఆలస్యం ఆ పని చేసేయండి..!

అయితే బల్లుల ఇళ్లలోని కొన్ని ప్రదేశాల్లో కనిపిస్తే మంచిదేనట. కానీ ఆలయంలో లేదా దేవుడి గుడిలో బల్లి కనిపిస్తే మంచిది. ఆది ధనం, సంతోషాన్ని సూచిస్తుందట. అంతే కాకుండా ఇంటిలోని వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలకు చిహ్నమట.

Money Tips: వీటిని పూజ గదిలో ఉంచితే డబ్బులే డబ్బులు..! ఇంకెందుకు ఆలస్యం ఆ పని చేసేయండి..!

ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుందని చెబుతున్నారు పండితులు. భవిష్యతు్లో ఎదురయ్యే సంఘటనలను కూడా బల్లులు సూచిస్తాయని చెబతున్నారు. ఇంట్లో దీపావళి రోజు బల్లి కనిపిస్తే శుభ సూచకం. బల్లి లక్ష్మీదేవిని సూచిస్తుందని అంటుంటారు. దీపావళి రోజు బల్లి కనిపిస్తే త్వరలోనే లక్ష్మీ దేవి వస్తుందని అంటుంటారు. 


పూడ్చిపెట్టిన బల్లి కానీ కనిపిస్తే..

ఇక బల్లులు ఇంట్లో కొట్లాడుకుంటే ఏమవుతుంది… బల్లి చనిపోతే ఎదురయ్యే సంకేతాలేమిటనేవి ఇప్పుడు చూద్దాం. కొత్తగా ఇంట్లోకి వచ్చేవారికి బల్లులు కనిపిస్తే మన పూర్వీకుల రాకను లేకపోతే తండ్రి రాకను సూచిస్తుంది. ఆ సమయంలో మన పూర్వీకులు బల్లి రూపంలో వచ్చి దీవిస్తారని నమ్ముతారు. ఇదిలా ఉంటే ఇంట్లోకి వచ్చే సమయంలో బల్లులు చనిపోయి కానీ… పూడ్చిపెట్టిన బల్లి కానీ కనిపిస్తే అశుభమని నమ్ముతారు. బల్లులు పోట్లాడుకుంటే మంచిది కాదట. కలలో మీరు  బల్లిని పట్లుకోవాలని ప్రయత్నిస్తే .. అది పారిపోతే మంచిదని నమ్మకం. రెండు బల్లులు కొట్లాడుకుంటే చూడకూడదట. అలా చేస్తే అశుభాలు కలుగుతాయట. ఇంట్లో బల్లులు కొట్లాడుకుంటే… ఆ ఇంట్లోని వ్యక్తుల మధ్య కూడా మనస్పర్థలు పెరుగుతాయని అంటున్నారు.

Chanakya Niti: డబ్బు వృధా కాకూడదంటే చాణిక్యుడు చెప్పిన ఈ అలవాట్లు మానుకోవాలి?

Chanakya Niti: ఆచార్య చాణిక్యుడు నీతి గ్రంథం ద్వారా ఒక మనిషి ఉన్నత మార్గంలో ఎలా ఉపయోగించాలి అనే విషయాల గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. అయితే ఒక మనిషి తను అనుకున్న లక్ష్యాలను నెరవేరాలన్న ,జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలని తన నీతి గ్రంథం ద్వారా తెలిపారు.అదేవిధంగా మన దగ్గర ఉన్న డబ్బు వృధా కాకుండా ఉండాలన్న లేదా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలన్న తప్పనిసరిగా కొన్ని సూత్రాలను పాటించి.. కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిదని చాణిక్య నీతి గ్రంధం ద్వారా తెలిపారు. మరి ఆ అలవాట్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

Chanakya Niti: డబ్బు వృధా కాకూడదంటే చాణిక్యుడు చెప్పిన ఈ అలవాట్లు మానుకోవాలి?

కోపం: కోపం మనిషి నాశనానికి పునాది. కోపంలో తీసుకునే నిర్ణయాలు ఎంతో ప్రమాదకరంగా ఉంటాయి. ఎప్పుడైతే ఒక మనిషి కోపం వ్యక్తం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటారు అలాంటివారు నష్ట పోవడమే కాకుండా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది అందుకే కోపం మానుకోవాలని తెలిపారు.

Chanakya Niti: డబ్బు వృధా కాకూడదంటే చాణిక్యుడు చెప్పిన ఈ అలవాట్లు మానుకోవాలి?

అహంకారం: మనకు లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఉండి మన డబ్బు మన దగ్గర ఉంది అంటే ఆ డబ్బును సరైన మార్గంలో సద్వినియోగం చేసుకున్నప్పుడే అమ్మవారి అనుగ్రహం మనపై కలుగుతుంది అంతే కానీ ఆ డబ్బులు అహంకారంతో దుర్వినియోగం చేసుకుంటే లక్ష్మీదేవి కొలువై ఉండదని చాణిక్యుడు తెలిపారు.

అత్యాశ: ఒక మనిషి ఎప్పుడైతే అత్యాశతో డబ్బు సంపాదించాలని చెడుమార్గంలో ప్రయాణం చేస్తే అలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉండదు. కనుక మనం కష్టపడి సరైన మార్గంలో పయనిస్తూ ఉన్నప్పుడే అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది.

సోమరితనం విడిచిపెట్టడం..

లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలగాలంటే తప్పనిసరిగా మనకు పెద్ద శత్రువు అయిన సోమరితనాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే సోమరితనం ఉంటుందో అప్పుడు డబ్బులు కూడా వృథాగా ఖర్చు అవుతాయి అందుకే సోమరితనం విడిచిపెడితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని తెలిపారు.

CM KCR-Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త..! నెలకు రూ.2016 పింఛన్ ఇచ్చేందుకు కేసీఆర్ ఆదేశం..!

CM KCR-Farmers: తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతులకు రైతుబంధు, రైతుభీమా వంటి పథకాలతో ముందుకు సాగుతోంది. రైతుబీమాతో ఒకవేళ రైతు మరణిస్తే అతడి కుటుంబసభ్యుల్లోని నామినీకి రూ.5లక్షలు ఇవ్వనున్నారు. దీనికి ఎల్ఐసీతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం ప్రతీ సంవత్సరం దానికి సంబంధించిన ప్రీమియాన్ని చెల్లిస్తుంది.

CM KCR-Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త..! నెలకు రూ.2016 పింఛన్ ఇచ్చేందుకు కేసీఆర్ ఆదేశం..!

ఇక రైతు బంధు విషయానికి వస్తే భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం కింద సాయం చేస్తోంది.
ఎకరం పొలం ఉన్న రైతులకు రెండు దఫాలకు ఐదు వేల చొప్పున రూ.10 వేలు రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారు. తాజాగా మరో శుభవార్తను అందించింది కేసీఆర్ ప్రభుత్వం.

CM KCR-Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త..! నెలకు రూ.2016 పింఛన్ ఇచ్చేందుకు కేసీఆర్ ఆదేశం..!

రైతులకు పింఛన్‌‌ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే బడ్జెట్‌‌లో ఈ స్కీమ్ ప్రకటించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఫైనాన్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఎక్సర్‌‌సైజ్‌‌ మొదలు పెట్టింది. దీనికి సంబంధించి పథకాన్ని సీఎం కేసీఆర్ కొండపోచమ్మసాగర్‌‌ ప్రారంభోత్సవం సందర్భంగా రైతులకు గుడ్‌‌ న్యూస్‌‌ చెప్తానని వెల్లడించారు.

పలు కారణాలతో ఆ హామీ అలాగే మిగిలిపోయిందని.. రైతుబంధు, రైతుబీమాలకు తోడుగా అన్నదాతల కోసం ఈ స్కీం తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు ప్రభుత్వవర్గాలు పలు సందర్భాల్లో వెల్లడించాయి.
రైతులకు నెలకు రూ.2016 ఫిచన్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రైతు పింఛన్‌‌ విధివిధానాలు ఖరారు చేసే పనిలో ఫైనాన్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ నిమగ్నమైంది.


చిన్న, సన్న కారు రైతులకు..

చిన్న, సన్న కారు రైతులకు రూ.2016 పింఛన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారని.. రైతుకు 47 ఏల్లు నిండాలని పేర్కొన్నారు. 50 ఏళ్లు నిండిన గీత కార్మికులకు పింఛన్ ఇప్తున్న ప్రభుత్వం.. ఆ కార్మికుల కంటే వయోపరిమితి రెండేళ్లు తగ్గించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే 47 ఏళ్లు వయస్సు పరిమితి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట ఎందుకంటే.. రాష్ట్రంలో రైతుబంధు పొందుతున్న రైతులు 67 లక్షల పైచిలుకు ఉన్నారు. వీరిలో 47 ఏళ్లు నిండిన వాళ్లు ఎంత మంది ఉన్నారు..? 49 ఏళ్లు నిండిన వాళ్లు ఎంతమంది ఉన్నారనే లెక్కలు తీస్తున్నారు. ఫైనల్ గా 47 ఏళ్లు నిండి ప్రతీ రైతుకు పింఛన్ ఇచ్చే ఆలోచన ఉన్నట్లు సమాచారం. మూడెకరాల నుంచి ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు పింఛన్‌‌ ఇచ్చే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి సమగ్ర సమాచారం.. బడ్జెట్ లో ప్రవేశపెట్టేందుకు అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం.

Ram Charan: నా దగ్గర డబ్బులు లేవు అందుకే సినిమాల్లో నటిస్తున్నా.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్!

Ram Charan: రామ్ చరన్ తేజ్ ప్రత్యేకంగా పరిచయం అక్కరలేని పేరు. తెలుగుతో పాటు బాలీవుడ్, తమిళ్, కన్నడ, మళయాళ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా రాజమౌళి రూపొందిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా కనిపిస్తున్నాడు. మరో హీరోగా ఎన్టీఆర్.. కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు.

Ram Charan: నా దగ్గర డబ్బులు లేవు అందుకే సినిమాల్లో నటిస్తున్నా.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్, స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ నటిస్తుండటంతోె ఈసినిమాపై భారీ అంచానాలు ఉన్నాయి. జనవరి 7న 14 భాషల్లో ట్రిపుల్ ఆర్ రిలీజ్ కాబోతోంది. 

Ram Charan: నా దగ్గర డబ్బులు లేవు అందుకే సినిమాల్లో నటిస్తున్నా.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్!

అయితే ఇప్పటికే సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేస్తోంది. చెన్నై, హైదరాబాద్, బెంగళూర్, ముంబై, కొచ్చిలలో సినిమా ప్రమోషన్లు చేశారు. బాలీవుడ్ లో భారీ ఎత్తున సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అయితే తాజాగా ఓ షోలో రామ్ చరణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ షోకు గెస్ట్ లుగా రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియాభట్, రాజమౌళి హాజరయ్యారు. ’ది కపిల్ శర్మ‘ షోకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. 

అన్నీ ఉంటే మీ షోకి ఎందుకు వస్తాను..

కపిల్ శర్మ.. రామ్ చరణ్ గురించి మీకు ఏయిరోప్లెన్ కంపెనీ, హోటళ్లు, ఆసుపత్రులు ఇలా చాలా బిజినెస్ లు ఉన్నాయంట కదా.. మరి మీరు హాయిగా రెస్ట్ తీసుకోక ఎందుకు సినిమాలు.. ప్రమోషన్లు అంటూ పరుగులు పెడుతున్నారంటూ అడిగారు. దీనికి రామ్ చరణ్ తేజ్ నాకేమీ ఎయిరోప్లెన్ కంపెనీలు లేవు… ఇదే ఉంటే మీ షోకు ఎందుకు వస్తాను, డబ్బులు లేవు అందుకే సినిమాలు చేస్తున్నా అంటూ బదులిచ్చారు. ప్రస్తుతం ఈ విడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త..ఆ డబ్బులు జమ చేసేందుకు తొలగిన అడ్డంకులు..!

Telangana Farmers: తెలంగాణ సీఎం కేసీఆర్.. రైతులు పంట పెట్టుబడికి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో 2018, ఏప్రిల్‌ నుంచి రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. సాగు పనులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశ్యంతో తలపెట్టిన రైతుబంధు ఇప్పటికీ కొనసాగుతోంది.

Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త..ఆ డబ్బులు జమ చేసేందుకు తొలగిన అడ్డంకులు..!

సంవత్సరంలో రెండు సార్లు ప్రస్తుతం ఎకరాకు రూ.10వేల చొప్పున రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నారు. మొదట ఎకరాకు రూ.8వేల చొప్పున ఇచ్చిన కేసీఆర్ సర్కార్.. ఆ పెట్టుబడి సాయాన్ని మరో వెయ్యి రూపాయలు పెంచి.. రూ.5 వేల చొప్పున రెండు సీజన్లలో రూ.10 వేలకు పెంచాడు.

Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త..ఆ డబ్బులు జమ చేసేందుకు తొలగిన అడ్డంకులు..!

ఇక ఈ పథకం కింద లబ్ధి పొందే వారి సంఖ్య ఏడాదిఏడాదికి పెరుగుతూ వస్తోంది. పథకం అమల్లోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల ఎకరాల భూమికి సంబంధించి 50.25 లక్షల మంది లబ్ధిదారులకు రూ.5,236.30 కోట్లు పంపిణీ చేశారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన మూడేళ్లలో లబ్ధిదారుల సంఖ్య 60.84 లక్షలకు చేరింది.

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 1.47 కోట్ల ఎకరాల విస్తీర్ణానికిగాను రూ.7,360.41 కోట్లు రైతుబంధు కింద లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. ప్రస్తుతం యాసంగి సీజన్‌ నిధులను డిసెంబర్ 28న లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పంట పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు ఈ నెల 28 నుంచి రైతులకు అందనుంది.

డిసెంబర్ 28న ఎకరాలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమ:

మొదట ఈ నిధులు సరిగ్గా సర్దుబాటు కాకపోవడంతో డిసెంబర్ 15న రావాల్సిన ఈ రైతుబంధు డబ్బులు ఆలస్యం అవుతూ వచ్చింది. తాజాగా ఈ నిధులు జమ చేసేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని.. సీఎం కెసిఆర్ ఆదేశాలతో మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రూ. 7,500 కోట్లు యాసంగి పంట కోసం రైతు బంధు సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. మొదట ఎకరాలోపు భూమి ఉన్నవాళ్లకు.. తర్వాత ఎకరా నుంచి రెండకరాల మధ్య భూమి ఉన్నవారికి ఈ రైతుబంధు నిధులు జమ కానున్నాయి.

రూ.50లక్షలు గెలుచుకున్న సన్నీకి ట్యాక్స్ పోను అతడి చేతికి వచ్చేది ఎంతో తెలుసా..?

భారత్ లో ఒక లాటరీ గెలుచుకున్నా.. రియాల్టీ షోలల్లో ఫ్రైజ్ మనీ గెలుచుకున్నా చేతికి అందేది మొత్తం అమౌంట్ ఉండదు. అందులోదాదాపు 31.2 శాతం ట్యాక్స్ కింద కట్ అవుతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్న సన్నీ విషయంలో కూడా అంతే.

అతడికి ప్రైజ్ మనీ కింద రూ.50 లక్షలను బిగ్ బాస్ విజేతగా కల్పించారు.అయితే అతడికి అందులో వచ్చేది కేవలం రూ.34.40 లక్షలు మాత్రమే. అతనికి వచ్చిన రూ. 50 లక్షల్లో.. రూ. 15.60 లక్షలు ఇన్కమ్ టాక్స్ కట్ అయినట్టు తెలుస్తుంది. ఏదైనా షోలో పాల్గొన్నప్పుడు రూ.10 వేల కంటే ఎక్కువ గెలిస్తే అందులో 31.2% టాక్స్ చెల్లించాల్సి ఉంటుందట.

అంతే కాదు ఇటీవల ఎన్టీఆర్ హోస్ట్ గా నిర్వహించిన మీలోఎవరు కోటీశ్వరులు లో ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి కూడా రూ.ఒక కోటి గెలుచుకున్నాడు. అతడి ప్రైజ్ మనీలో కూడా 31.2 శాతం ట్యాక్స్ కట్ అయింది.
ఇక సన్నీ ప్రైజ్ మనీ కాకుండా వారానికి రూ.లక్ష చొప్పున ఒప్పుకున్నాట. దీంతో అతడిని 15 వారాలకు గాను రూ.లక్ష రూపాయల చొప్పున రూ.15లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో మొత్తం అతడు రూ.25లక్షలు విలువ చేసే ప్లాట్, రూ.50 లక్షలు మరియు రూ.15లక్షలు మొత్తంగా రూ.90 లక్షల వరకు సన్నీ గెలుచుకున్నాడు. అయితే సన్నీ ఓవరాల్ ప్రైజ్ మనీతో పోల్చితే.. యాంకర్ రవి ప్రైజ్ మనీ కూడా సమానంగా కనిపిస్తుంది. అతడు 12 వారాలకు గాను అత్యధిక పారితోషికం తీసుకున్నాడు. రూ.90లక్షల వరకు యాంకర్ రవి రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

11 వారాలకు అనీ మాస్టర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ చూస్తుండగానే చివరి దశకు చేరుకుంది.ఈ క్రమంలోనే 11 వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మరికొన్ని వారాలలో ముగుస్తుందని తెలుస్తోంది. ఇకపోతే 11వ వారంలో భాగంగా నామినేషన్ లో ఉన్నటువంటి ఎనిమిది మందిలో అనీ మాస్టర్ బయటకు వచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ వారం అనీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు.

ఇక ఈమె గత రెండు వారాల నుంచి వింతగా ప్రవర్తించడం ఆమె వింత ప్రవర్తన కారణం వల్లనే ప్రేక్షకులు విసుగుచెంది తనకు ఓట్లు తక్కువగా వేశారని ఆ కారణం వల్లే ఈమె ఎలిమినేట్ అయ్యారు అంటూ వార్తలు వినబడుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈమె బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఎంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నారో అనే విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి.

అనీ మాస్టర్ వృత్తిపరంగా కొరియోగ్రాఫర్ కావడంతో ఈమెకు బయట ఎంతో మంచి డిమాండ్ ఉంది ఈ క్రమంలోని వీరి డిమాండ్ ను బట్టి బిగ్ బాస్ వారికి రెమ్యూనరేషన్ చెల్లిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అనీ మాస్టర్ కి వారానికి బిగ్ బాస్ నిర్వాహకులు 3.5 లక్షల రెమ్యూనరేషన్ చెల్లించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే 11 వారాలు ఈమె హౌస్ లో సందడి చేసినందుకుగాను అనీ మాస్టర్ కి బిగ్ బాస్ 38.5 లక్షల రెమ్యూనరేషన్ చెల్లించారని తెలుస్తోంది. ఇకపోతే ఈమె బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులను సందడి చేసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు ఈమెకు మరింత ఎక్కువగా రెమ్యునరేషన్ చెల్లించే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇంటి కోసం దాచుకున్న డబ్బులను .. పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తా: విశాల్

సినీ పరిశ్రమలో అడుగుపెట్టి పదహారు సంవత్సరాలైనప్పటికీ తనకు సొంత ఇల్లు లేదని నటుడు విశాల్‌ అన్నారు. ఇటీవల కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ స్వర్గీయులైన విషయం తెలిసిందే. దానికి కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో పునీత్‌ సంస్మరణ సభ నిర్వహించారు. దీనికి దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు పాల్గొన్నారు.

పునీత్ తో తమకున్న అనుబంధాన్ని ప్రతీ ఒక్కరు గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన మంచి పనులను కొనియాడారు. ఇందులో భాగంగా విశాల్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. పునీత్ మరణ వార్త వినగానే షాక్ కు గురయ్యానని.. కళ్ల నుంచి నీరు ఆగలేదని.. ఆ వార్తను తాను జీర్ణించుకోలేకపోయానని విశాల్ చెప్పాడు.

పునీత్‌తో నాకు అంత అనుబంధం లేదు. కానీ, ఆయనకు నేనూ ఒక అభిమానినే అని చెప్పుకొచ్చారు. అయితే ఆయన చేసిన కార్యక్రమాలు ఎవ్వరికీ తెలియదని.. అలాంటి గొప్ప వ్యక్తి చేసిన సేవా కార్యక్రమాల్లో తాను భాగం కావాలనుకుంటున్నానని తెలిపారు. అందులో భాగంగా పునీత్‌ చదివిస్తున్న 1800 మంది పిల్లలను ఇకపై నేను చదివిస్తాను.. వాళ్ల చదువులకు అయ్యే ఖర్చు నేను భరిస్తానన్నారు.

సినిమాల్లో ఇన్ని రోజుల నుంచి తాను నటిస్తున్నప్పడికీ సొంత ఇల్లు అనేది లేదని.. ఇప్పటికీ తల్లిదండ్రుల వద్దే ఉంటున్నానని చెప్పారు. సొంత ఇంటి కోసం డబ్బులు దాచుకున్నానని.. ప్రస్తుతం ఆ డబ్బులనే పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తానన్నారు. పునీత్‌ ఆత్మకు శాంతి చేకూరాలని విశాల్‌ అన్నారు. ఈ సభపైనే శరత్ కుమార్ భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే.

రేయ్ సుధీర్.. నా 15 లక్షలు నాకు ఎప్పుడు ఇస్తావు.. వేణు షాకింగ్ కామెంట్స్!

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమంలో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ మనకు పరిచయమయ్యారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కమెడియన్ వేణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన జబర్దస్త్ ద్వారా ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకుని ఆ తర్వాత పలు సినిమాలలో తన అద్భుతమైన కామెడి ద్వారా ప్రేక్షకులను సంపాదించుకున్నారు.

అయితే కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ కి దూరమైన కమెడియన్ వేణు గురించి గత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వినిపించాయి. జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన తర్వాత వేణు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని,అతడికి ఎలాంటి అవకాశాలు లేక ఇండస్ట్రీలో దీనమైన పరిస్థితులలో ఉన్నారనే వార్తలు వినిపించాయి. అయితే ఈ కష్టాలనుంచి జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్ వేణును ఆదుకున్నట్లు వార్తలు వినిపించాయి.

సుడిగాలి సుదీర్ నటుడు వేణుకు 15 లక్షలు ఇచ్చాడని ఆ 15 లక్షలతోనే వేణు కాలం గడుపుతున్నట్లు అతని గురించి వచ్చిన వార్తలపై తాజాగా నటుడు కమెడియన్ వేణు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సుడిగాలి సుదీర్ తనకు 15 లక్షలు ఇచ్చాడన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. ఈ వార్త విన్న తర్వాత ఒరేయ్ సుదీర్ నా 15 లక్షలు నాకు ఎప్పుడు ఇస్తావు అంటూ అతనిని అడగడంతో అన్న వాడెవడో సరదాగా రాశారు అంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుత కాలంలో యూట్యూబ్ ఛానల్స్ అధికమవడంతో వారి చానల్స్ కు ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు రావడం కోసం వారి రాసే వార్తలకు అధిక వ్యూస్ రావడం కోసం ఇలాంటి వార్తలను సృష్టిస్తున్నారని అలా రాయడంతో వారికి కాస్త ఫుడ్ దొరుకుతుందన్న ఉద్దేశంతో ఇలాంటి వార్తలు రాస్తున్నారని తెలిపారు. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తన అన్న ఫోన్ చేసి ఇది నిజమేనా అందుకే నువ్వు డల్ గా ఉన్నావా నిజం చెప్పు అంటూ తనని అడిగారని ఈ సందర్భంగా వేణు ఆ 15 లక్షల విషయం గురించి చెప్పుకొచ్చారు.