Tag Archives: mother

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన యాంకర్ రవిభార్య కూతురు.. ఎమోషనల్ అయిన కంటెస్టెంట్స్!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఎన్నో ఎమోషన్ సన్నివేశాలు జరుగుతున్నాయి. కంటెస్టెంట్ లో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి దాదాపు 80 రోజులు కావడంతో ప్రతి సీజన్లో మాదిరిగానే ఈ సీజన్లో కూడా బిగ్ బాస్ వారి కుటుంబ సభ్యులను హౌస్ లోపలకి పంపించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే కాజల్, శ్రీరామ్, మానస్, సిరి ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వచ్చారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా సన్నీ, రవి, పింకీ,షన్ను మదర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ రవి భార్య నిత్య రావడంతో సంతోషపడిన రవి అనంతరం తన కూతురు రాలేదని బాధపడ్డారు. అయితే కొంత సమయానికి తన కూతుర్ని పంపించి బిగ్ బాస్ రవికి సర్ ప్రైస్ ఇచ్చారు.

ఇలా తన కూతురిని చూడటంతో రవి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. అనంతరం రవి తనకు బిగ్ బాస్ అంకుల్ ని చూపించమని కోరింది. అలాగే రవి కూతురు వియా రావడంతో హౌస్ మొత్తం ఎంతో సందడి వాతావరణం ఏర్పడింది. ప్రతి రోజు టీవీలో నిన్ను చూస్తూ మమ్మీ ఏడుస్తుందని వియా తన తండ్రికి ఫిర్యాదు చేసింది.

రవి కోసం బిగ్ బాస్ గుమ్మాడి గుమ్మాడి అనే పాటను ప్లే చేయడంతో హౌ సభ్యులందరూ ఎంతో సరదాగా డాన్స్ చేశారు.ఈ విధంగా అందరూ ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో బిగ్ బాస్ తన ఫ్యామిలీ మెంబర్స్ ను హౌస్ నుంచి బయటకు రావాలని సూచించడంతో కంటెస్టెంట్స్ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

మరోసారి తల్లి కాబోతున్న ఐశ్వర్యరాయ్.. ఇదే సాక్ష్యం?

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాజీ ప్రపంచ సుందరిగా స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఐశ్వర్య రాయ్ అమితాబ్ బచ్చన్ ఇంటికి వెళ్ళింది. ఇలా 2007వ సంవత్సరంలో అమితాబచ్చన్ ఐశ్వర్య రాయ్ వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఈ క్రమంలోనే వీరికి 2011వ సంవత్సరంలో అమ్మాయి పుట్టగా తనకు ఆరాధ్య అనే పేరు పెట్టారు.

ఇకపోతే ఐశ్వర్యారాయ్ ఎక్కడికి వెళ్లినా తన కూతుర్ని తీసుకుని వెళ్లడంతో ఇప్పటికే ఈమెకు ఒక రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఐశ్వర్య కూతురు ఫోటోలు పెద్దఎత్తున వైరల్ గా మారుతుంటాయి. ఈ క్రమంలోనే గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో ఐశ్వర్యరాయ్ మరోసారి తల్లి కాబోతుంది అనే వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్తల గురించి ఐశ్వర్య రాయ్ ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా ఐశ్వర్య రాయ్ తన భర్త కూతురుతో కలిసి బయటకు రాగా మీడియా ఆమెపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాయ్ కి అడ్డుగా తన కూతురు తన భర్త అభిషేక్ బచ్చన్ రావడం విశేషం. ఐశ్వర్యరాయ్ కూడా తన పొట్ట కనపడకుండా ఒక బ్యాగ్ అడ్డుపెట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

అయితే ఐశ్వర్య రాయ్ ఇలాంటి ప్రవర్తన చూసిన పలువురు నెటిజన్లు ఈమె తల్లి కాబోతుందనీ వచ్చే వార్తలలో నిజం ఉందని అందుకోసమే ఐశ్వర్య ఇలా ఫోటోలకు అడ్డుగా తన కూతురిని పెట్టుకున్నట్లు బలంగా భావిస్తున్నారు.త్వరలోనే మరొక బుల్లి ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ను ఇవ్వబోతున్నట్లు నెటిజన్లు బలంగా నమ్ముతున్నారు. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందనే విషయాన్ని బచ్చన్ కుటుంబం తెలియజేయాల్సి ఉంది.

మానస్‌తో ప్రియాంక పెళ్లికి ఒప్పుకోను.. కానీ దగ్గరుండి పెళ్లి చేస్తా.. మానస్‌ తల్లి పద్మిని..

బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుంచి కూడా లవ్ స్టోరీలు నడిచాయి. ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్నా సీజన్ 5 లో కూడా ఇలాంటి కపుల్స్ ఉన్నారు. అంతక ముందు రాహుల్‌ సింప్లిగంజ్‌, పునర్నవి జోడి, అలాగే అఖిల్‌, మోనాల్‌ జోడీలే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రస్తుతం శ్రీరామ చంద్ర, హమిదా బెస్ట్ కపుల్ గా మూడు వారాలు ప్రేక్షకులను మెప్పించారు.

కానీ అనూహ్యంగా హమిదా 5వ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. దీంతో శ్రీరామ చంద్ర డల్ అయ్యాడు. అతడు చెప్పకపోయినా హౌస్ లో అతడి వ్యవహార శైలి బట్టి ప్రేక్షకులకు అర్థం అయిపోయింది. ఇదిలా ఉండగా.. మానస్, ప్రియాంక్ సింగ్ మధ్య కూడా లవ్ స్టోరీ నడుస్తోంది. ప్రియాంక ప్రపోజ్ చేసినా.. మానస్ పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. కానీ బిగ్ బాస్ మాత్రం వాళ్లిద్దరినే ఫోకస్ చేసి మరీ చూపిస్తున్నాడు.

అయితే మానస్, ప్రియాంక పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. దీనిపై మానస్ తల్లి పద్మిని స్పందించారు. బిగ్ బాస్ హౌస్ లో ఎంతో మంది కపుల్స్ బయటకు వచ్చారు. బయక కూడా అలానే ఉన్నారా.. ఎంత మంది పెళ్లి చేసుకున్నారు అంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రియాంక అంటే తనకు ఇష్టమని.. ఆమె మానస్ విషయంలో కాస్తంగా క్లోజ్ గా ఉంటుంది అంతే గానీ.. పెళ్లి మాత్రం కాదు అంటూ చెప్పేసింది.

కానీ ప్రియాంకకు పెళ్లి చేసే విషయంలో తాను దగ్గర ఉండి చేయిస్తానని.. ఆమెకు తగిన అబ్బాయిని చూపించి.. ఆమె ఒప్పుకుంటే సాయం చేయడంతో పాటు.. బాధ్యతగా అన్నీ చూసేకుంటానని చెప్పింది. హౌస్ లో ఒకానొక సందర్బంలో ప్రియాంక మానస్ ను అతడు హస్బెండ్ మెటీరియల్ అని అంటే.. తనను నేనే మరదలిగా ట్రీట్ చేస్తున్నా అంటూ మానస్ అంటాడు. మానస్ తో ప్రియాంక పెళ్లికి మాత్రం తాను ఒప్పుకోను అంటూ ఓ ఇంటర్వ్యూలో పద్మిని చెప్పింది.

అమ్మ పేరు పెట్టి తిడతారా.. ఉత్తేజ్ ఎమోషనల్ కామెంట్స్..!

ఎట్టకేలకు మా ఎన్నికలు ముగిశాయి. మంచు విష్ణు అధ్యక్షుడిగా ప్రకాశ్ రాజ్ పై గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల వ్యవహారం ముగిసిన దగ్గర నుంచి ప్రతీ ఒక్కరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నిన్న సాయంత్రం ప్రకాష్ రాజ్ విలేకరుల సమావేశంలో విష్ణు కు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశ్యంతో ప్యానల్ సభ్యులు రాజీనామా చేశారని చెప్పాడు.

ఇలా.. మా ఎన్నికలు ముగిసినా వేడి మాత్రం తగ్గలేదు. ఆ రాజీనామాలను తాను ఆమోదించనని.. అందరం కలిసి ముందుకు వెళ్తాం అంటూ చెప్పుకొస్తున్నాడు మంచు విష్ణు. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు ఉత్తేజ్ మాట్టాడారు. ఆయన ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఎన్నికలు ముగిసిన తర్వాత ‘మా’లో నరేష్ ప్రవర్తన అస్సలు బాగాలేదేని.. ఎన్నికలు జరిగిన రోజు దగ్గర నుంచి కూడా ప్రతీ ఒక్క వ్యక్తిని వ్యక్తిగతంగా దూషిస్తున్నారని.. అమ్మల పేరు పెట్టి మరీ బూతులు తిడుతున్నారని అన్నారు. ఈసీ సభ్యులం అయిన తాము ‘మా’ కార్యాలయానికి వెళ్లాలంటే.. థంబ్ ఇంప్రెషన్ పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అతడు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల రోజు నరేష్ అన్న మాటలు తాను మర్చిపోలేను అని.. అతడు తన మొహంలో పెట్టి.. ఒక్కో ల*జా కొడుకు పని చెప్తా అంటూ సవాల్ విసిరాడు అని చెప్పాడు. ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాము వారితో కలిసిపోయి ఎలా పని చేస్తాం అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా ఉత్తేజ్ ఎమోషనల్ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

దర్శకుడిగా మారిన కొడుకును చూసి.. అతని విజయాన్ని మాత్రం చూడలేకపోయిన ఆ డైరెక్టర్ తల్లి!

బీటెక్ పూర్తిచేసిన కొరటాల శివ.. 1998లో ఉద్యోగం చేసుకుంటూ తనకు బావ వరుసైన పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, ఊసరవెల్లి వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశాడు. కొరటాల శివ తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. సినీ రచయితగా తన కెరీర్ ను ప్రారంభించిన కొరటాల 2013లో ప్రభాస్ హీరోగా మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు.

తొలి సినిమాతోటే బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాడు. ఆ సినిమా ప్ర‌భాస్ కెరీర్‌లో అప్ప‌టికి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో కొరటా శివ వెనక్కి తిరిగి చూడలేదు. తర్వాత ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కొరటాల చిరంజీవితో ‘ఆచార్య’ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే.

ఇక్కడ విషాదం ఏంటంటే.. దర్శకుడిగి మారిన శివను తన తల్లి చూడకుండానే చనిపోయారు. 1985లో తన తండ్రిని కోల్పోయిన శివ.. తల్లే అన్నీ తానై పెంచింది. రైట‌ర్‌గా శివ.. 2002 లో గర్ల్‌ఫ్రెండ్ కు రాశాడు. తర్వాత భద్ర, మున్నా, ఒక్కడున్నాడు, సింహా, బృందావనం, 2011 లో ఊసరవెల్లి వంటి వాటికి రచయితగా పని చేశారు. ఈ విజయాలను కళ్లారా చూశారు శివ తల్లి.

దర్శకుడిగా మిర్చి సినిమా చేస్తున్నప్పడు ఆ తల్లి ఎంతో సంతోషించారు.. కానీ ద‌ర్శ‌కుడిగా అత‌డు సాధించిన విజ‌యాన్ని క‌ళ్లారా చూసి.. ఆనందించ‌కుండానే ఆ త‌ల్లి క‌న్నుమూసింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో మధ్యలోనే ఆమె కన్నుమూశారు. ఆమెలేని లోటు పూడ్చలేనిదంటూ కొరటాల శివ ఎన్నోసార్లు కంటతడి పెట్టుకున్నారు. తన జీవితంలో ఇదొక్కటే వెలితి అంటూ చెప్పి భావోద్వేగానికి గురయ్యాడు కొరటా శివ.

సీనియర్ హీరోయిన్ రేఖను అవమానించిన హీరో తల్లి ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రెటీలు ప్రేమించుకోవడం విడిపోవడం సర్వసాధారణమే. వారు ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారో ఎప్పుడు ఎవరితో విడిపోతారు ఎవరికీ తెలియదు. ఈ విధంగా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయిన తరువాత మరొకరితో జీవితం పంచుకున్న సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. ఇలా ఎంతో మంది హీరో హీరోయిన్ల ప్రేమ కథల గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ విధంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు సీనియర్ హీరోయిన్ రేఖను ఒక హీరో తల్లి ఎంత దారుణంగా అవమానించారు. మరి ఆ హీరో ఎవరు ఎందుకు అవమానించారనే విషయానికి వస్తే…

సీనియర్ నటి రేఖ గురించి అందరికీ తెలిసిందే. ఎక్కువగా ఈమె ఎప్పుడు లవ్ ఎఫైర్స్ గురించి వార్తలలో నిలిచేది. అప్పట్లో రేఖ.. వినోద్ మెహ్రాతో పీకల్లోతు ప్రేమలో ఉండేది. వీరు పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే రేఖను తన కుటుంబంలోకి ఆహ్వానించడానికి వినోద్ మెహ్రా తల్లి అంగీకరించలేదు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఇంట్లో తెలియకుండా వివాహం చేసుకుని ఇంటికి వచ్చారు.

ఈ విధంగా పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన వారిని చూసి వినోద్ మెహ్రా తల్లి ఎంతో ఆగ్రహానికి గురయ్యారు. తన తల్లికి నచ్చచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె రేఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా చెప్పు తీసుకొని దాడి చేయడానికి ప్రయత్నించారు. అలా వినోద్ మెహ్రా తల్లి తనని అవమానించడం తో అక్కడి నుంచి వెళ్లిపోయిన రేఖ కొన్ని రోజులపాటు వినోద్ మెహ్రాతో మాట్లాడకుండా ఉన్నప్పటికీ ఆ తర్వాత పరస్పరం వీరిద్దరు విడాకులు తీసుకుని దూరమయ్యారు.

ఇలా వినోద్ తల్లి రేఖను ఎన్నో ఇబ్బందులకు గురి చేయడంతో వినోద్ మెహ్రా నుంచి విడిపోయిన రేఖ ఆ తర్వాత ముఖేష్ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే అతను కూడా మరణించడంతో అతని మరణానికి కారణం కూడా రేఖ అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

తన తల్లి ముందే నటి అన్నపూర్ణమ్మను చెట్టుకు కట్టేసి కొట్టారట.. కారణం ఏమిటంటే?

అలనాటి అగ్ర హీరోల నుంచి నేటి యువ హీరోల వరకు ఎన్నో విభిన్నమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటీమణులలో అన్నపూర్ణమ్మ ఒకరు. అన్నపూర్ణమ్మ తన సినీ ప్రస్థానంలో పలు భాషలలో ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఉన్న అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తన చిన్నప్పటి జీవితంలో జరిగిన ఓ సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు.

ఎన్నో సినిమాలలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పించిన అన్నపూర్ణమ్మను చిన్నప్పుడు తన తల్లి ఎదురుగానే ఓ చెట్టుకు కట్టేసి కొట్టారనే ఆసక్తికరమైన విషయాలను ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. అసలు ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టేంత తప్పు ఏం చేసింది.? అలా కొట్టడానికి గల కారణం ఏమిటనే విషయాలను ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.

అన్నపూర్ణమ్మ చదువుకునే రోజుల్లో తెనాలిలో తన ఇంటి పక్కన ఓ మాస్టర్ దగ్గరికి హిందీ నేర్చుకోవడానికి ట్యూషన్ కి వెళ్ళేది. ఆ సమయంలో తన పక్కింటిలో తన స్నేహితురాలి అక్క మాస్టర్ ను ప్రేమించింది. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఆమె ఒక ఉత్తరం మాస్టర్ కి ఇవ్వమని చెబుతుండేది.అయితే ఆ ఉత్తరం ఏంటో తెలియని వయసులో అన్నపూర్ణమ్మ ఆ లెటర్ తీసుకువెళ్లి మాస్టర్ చేతికి ఇచ్చేది.

ఈ విధంగా ఒకరోజు ఉత్తరం తీసుకువెళ్తున్న సమయంలో తన స్నేహితురాలు తల్లిదండ్రులు చూసి ఆమె చేతిలో ఉన్న ఉత్తరం లాక్కున్నారు.ఆ విషయం గ్రహించిన మాస్టర్ అక్కడినుంచి పారిపోగా ఆ ఉత్తరంలో వారిద్దరూ ప్రేమించుకున్నట్టు ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు రాసి ఉంది. ఈ విషయం తెలిసిన స్నేహితురాలు తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ తల్లికి ఈ విషయం చెప్పడంతో తల్లి బాగా ఉతకమని ఇంకోసారి ఇలాంటి వెధవ పనులు చేయకుండా ఉంటుందని చెప్పారు.

ఈ క్రమంలోనే తన స్నేహితురాలి తల్లిదండ్రులు అన్నపూర్ణను చెట్టుకు కట్టేసి తన తల్లి ఎదురుగా కొట్టారని అయితే ఆ సమయంలో నాకు ఒక అవగాహన వచ్చిందని ఇకపై ఎవరి విషయంలోనూ ఇక్కడి విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ చెప్పకూడదనే విషయాన్ని గ్రహించానని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఈ సంఘటన గురించి అన్నపూర్ణమ్మ తెలియజేశారు.