ఎట్టకేలకు మా ఎన్నికలు ముగిశాయి. మంచు విష్ణు అధ్యక్షుడిగా ప్రకాశ్ రాజ్ పై గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల వ్యవహారం ముగిసిన దగ్గర నుంచి ప్రతీ ఒక్కరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నిన్న సాయంత్రం ప్రకాష్ రాజ్ విలేకరుల సమావేశంలో విష్ణు కు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశ్యంతో ప్యానల్ సభ్యులు రాజీనామా చేశారని చెప్పాడు.
ఇలా.. మా ఎన్నికలు ముగిసినా వేడి మాత్రం తగ్గలేదు. ఆ రాజీనామాలను తాను ఆమోదించనని.. అందరం కలిసి ముందుకు వెళ్తాం అంటూ చెప్పుకొస్తున్నాడు మంచు విష్ణు. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు ఉత్తేజ్ మాట్టాడారు. ఆయన ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఎన్నికలు ముగిసిన తర్వాత ‘మా’లో నరేష్ ప్రవర్తన అస్సలు బాగాలేదేని.. ఎన్నికలు జరిగిన రోజు దగ్గర నుంచి కూడా ప్రతీ ఒక్క వ్యక్తిని వ్యక్తిగతంగా దూషిస్తున్నారని.. అమ్మల పేరు పెట్టి మరీ బూతులు తిడుతున్నారని అన్నారు. ఈసీ సభ్యులం అయిన తాము ‘మా’ కార్యాలయానికి వెళ్లాలంటే.. థంబ్ ఇంప్రెషన్ పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అతడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల రోజు నరేష్ అన్న మాటలు తాను మర్చిపోలేను అని.. అతడు తన మొహంలో పెట్టి.. ఒక్కో ల*జా కొడుకు పని చెప్తా అంటూ సవాల్ విసిరాడు అని చెప్పాడు. ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాము వారితో కలిసిపోయి ఎలా పని చేస్తాం అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా ఉత్తేజ్ ఎమోషనల్ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…