ఎట్టకేలకు మా ఎన్నికలు ముగిశాయి. మంచు విష్ణు అధ్యక్షుడిగా ప్రకాశ్ రాజ్ పై గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల వ్యవహారం ముగిసిన దగ్గర నుంచి ప్రతీ ఒక్కరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నిన్న సాయంత్రం ప్రకాష్ రాజ్ విలేకరుల సమావేశంలో విష్ణు కు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశ్యంతో ప్యానల్ సభ్యులు రాజీనామా చేశారని చెప్పాడు.
ఇలా.. మా ఎన్నికలు ముగిసినా వేడి మాత్రం తగ్గలేదు. ఆ రాజీనామాలను తాను ఆమోదించనని.. అందరం కలిసి ముందుకు వెళ్తాం అంటూ చెప్పుకొస్తున్నాడు మంచు విష్ణు. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు ఉత్తేజ్ మాట్టాడారు. ఆయన ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఎన్నికలు ముగిసిన తర్వాత ‘మా’లో నరేష్ ప్రవర్తన అస్సలు బాగాలేదేని.. ఎన్నికలు జరిగిన రోజు దగ్గర నుంచి కూడా ప్రతీ ఒక్క వ్యక్తిని వ్యక్తిగతంగా దూషిస్తున్నారని.. అమ్మల పేరు పెట్టి మరీ బూతులు తిడుతున్నారని అన్నారు. ఈసీ సభ్యులం అయిన తాము ‘మా’ కార్యాలయానికి వెళ్లాలంటే.. థంబ్ ఇంప్రెషన్ పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అతడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల రోజు నరేష్ అన్న మాటలు తాను మర్చిపోలేను అని.. అతడు తన మొహంలో పెట్టి.. ఒక్కో ల*జా కొడుకు పని చెప్తా అంటూ సవాల్ విసిరాడు అని చెప్పాడు. ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాము వారితో కలిసిపోయి ఎలా పని చేస్తాం అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా ఉత్తేజ్ ఎమోషనల్ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…