Movie News

ఇకపై నా పేరును వాడితే అందరినీ కోర్టుకు ఈడుస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అనసూయ..!

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అక్టోబర్ 10వ తేదీ జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా ఈమె ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మద్దతు తెలుపుతూ ఎన్నికల బరిలో దిగింది. అయితే ఎన్నికలలో అనసూయ గెలిచిందని తరువాత ఈమె ఓడిపోయింది అంటూ విభిన్న రకాలుగా కథనాలు వెలువడ్డాయి.

ఈ క్రమంలోనే అనసూయ స్పందిస్తూ మీడియా పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఒకవైపు ఎన్నికల కౌంటింగ్ జరుగుతుండగానే అనసూయ గెలిచిందని మీరు ఎలా బ్రేకింగ్స్ వేస్తారు. అసలు నేను గెలిచానని మీకు ఎవరు చెప్పారు అంటూ మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనికి సమాధానం ఎవరు చెబుతారు అంటూ అనసూయ మీడియాని ప్రశ్నించింది.

అనసూయ అడిగిన ఈ ప్రశ్నకు మీడియా వారు మాకు ఇన్ పుట్స్ వచ్చాయని సమాధానం చెప్పడంతో నేను కూడా మీడియా నుంచే ఇక్కడికి వచ్చాను ఇప్పటికీ కూడా నేను మీడియాలో ఉంటే న్యూస్ రిపోర్ట్ చేస్తాను కానీ క్రియేట్ చేయను అంటూ వారిపై ఆగ్రహం తెచ్చుకుంది. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో చిరాకు పడుతూ సమాధానం చెప్పిన అనసూయ ఆ తర్వాత తన గురించి ఇకపై ఎవరైనా తప్పుడు రాతలు రాస్తే వారిపై యాక్షన్ తీసుకుంటానని చెప్పింది.

నా ప్రమేయం లేకుండా నా గురించి తప్పుడు వ్యాఖ్యలు రాసే వారిపై, నా పేరును పలు మీడియా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్ లో ఉపయోగించిన వారిని కోర్టుకు లాగుతా అంటూ మీడియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఈ యాంకరమ్మ.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమలలో తమన్నా దర్శనం.. శ్రీవారి ఆశీస్సులు పొందిన స్టార్ హీరోయిన్!

ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…

18 minutes ago

సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ.. “అది నా ఉద్దేశ్యం కాదు!”

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…

18 minutes ago

శ్రీశైలంలో భక్తుడి అరుదైన కానుక.. వెండి నాగాభరణం సమర్పణ!

తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…

48 minutes ago

ఏడాదిలో ఒక్కరోజే అవకాశం.. సింహాచలం స్వామి నిజరూప దర్శనం కోసం భక్తుల తాకిడి

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…

1 hour ago

రాజకీయాలకు ఆధ్యాత్మిక టచ్.. విజయ్ వినూత్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షించింది!

తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…

2 hours ago

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం.. యమునోత్రి, గంగోత్రి దర్శనాలకు భారీగా తరలివచ్చిన భక్తులు!

ఉత్తరాఖండ్‌లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్‌ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…

2 hours ago