బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అక్టోబర్ 10వ తేదీ జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా ఈమె ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మద్దతు తెలుపుతూ ఎన్నికల బరిలో దిగింది. అయితే ఎన్నికలలో అనసూయ గెలిచిందని తరువాత ఈమె ఓడిపోయింది అంటూ విభిన్న రకాలుగా కథనాలు వెలువడ్డాయి.
ఈ క్రమంలోనే అనసూయ స్పందిస్తూ మీడియా పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఒకవైపు ఎన్నికల కౌంటింగ్ జరుగుతుండగానే అనసూయ గెలిచిందని మీరు ఎలా బ్రేకింగ్స్ వేస్తారు. అసలు నేను గెలిచానని మీకు ఎవరు చెప్పారు అంటూ మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనికి సమాధానం ఎవరు చెబుతారు అంటూ అనసూయ మీడియాని ప్రశ్నించింది.
అనసూయ అడిగిన ఈ ప్రశ్నకు మీడియా వారు మాకు ఇన్ పుట్స్ వచ్చాయని సమాధానం చెప్పడంతో నేను కూడా మీడియా నుంచే ఇక్కడికి వచ్చాను ఇప్పటికీ కూడా నేను మీడియాలో ఉంటే న్యూస్ రిపోర్ట్ చేస్తాను కానీ క్రియేట్ చేయను అంటూ వారిపై ఆగ్రహం తెచ్చుకుంది. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో చిరాకు పడుతూ సమాధానం చెప్పిన అనసూయ ఆ తర్వాత తన గురించి ఇకపై ఎవరైనా తప్పుడు రాతలు రాస్తే వారిపై యాక్షన్ తీసుకుంటానని చెప్పింది.
నా ప్రమేయం లేకుండా నా గురించి తప్పుడు వ్యాఖ్యలు రాసే వారిపై, నా పేరును పలు మీడియా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్ లో ఉపయోగించిన వారిని కోర్టుకు లాగుతా అంటూ మీడియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఈ యాంకరమ్మ.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…