Tag Archives: Orphans

Nara Brahmani: తండ్రి అంటే బ్రాహ్మినికి అంత ప్రేమనా… ఇప్పటికీ తండ్రి కోసం అలా చేస్తుందా?

Nara Brahmani: నారా బ్రాహ్మణి పరిచయం అవసరం లేని పేరు నందమూరి ఆడపడుచుగా నారావారి కోడలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె బిజినెస్ రంగంలో దూసుకుపోతూ బిజినెస్ ఉమెన్ గా సక్సెస్ సాధించారు. ఇలా వ్యాపార రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి బ్రాహ్మిని సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా ముందుంటారు.

ఈ క్రమంలోనే బ్రాహ్మినికి సంబంధించినటువంటి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా స్టార్ డాటర్ అయినటువంటి ఈమె, ఒక పొలిటీషియన్ కోడలిగాను అలాగే వ్యాపారవేత్తగాను భారీగానే సంపాదించారు. అయితే ఈమె ఖర్చు చేయాలి అనుకుంటే ఏమాత్రం వెనకాడకుండా తన జీవితాన్ని ఎంతో స్వేచ్ఛగా గడపవచ్చు కానీ బ్రాహ్మణి మాత్రం అలా ఎప్పుడూ చేయరట.

కాలేజీ చదువుతున్న సమయంలోనే తన వద్ద డబ్బు ఉంటే ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయకుండా ఆ డబ్బును పేదవారికి పంచే గుణం బ్రాహ్మణిలో ఉందని చెప్పాలి.ఇక ఈమె కాలేజీలో చదువుతున్నప్పటినుంచి కూడా తన తండ్రి పట్ల ఎంతో ప్రేమను చూపించేవారు తన తండ్రి పుట్టిన రోజు కనుక వచ్చిందంటే చాలు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసేవారట. అయితే అందరిలాగా కేక్ కట్ చేసి ఫ్రెండ్స్ కి పార్టీలు ఇవ్వకుండా అనాధ పిల్లల కోసం పెద్ద ఎత్తున డబ్బును ఖర్చు చేసే వారిని తెలుస్తుంది.

Nara Brahmani: అనాధ పిల్లలకు అన్న దానం….

తన తండ్రి పుట్టిన రోజు కనుక వస్తే చాలు బ్రాహ్మిని పేద పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టడమే కాకుండా వారి అవసరాలను కూడా తీరుస్తారట.అయితే ఇప్పటికి ఈమె ఇదే పనిని ఆచరిస్తూ ఉన్నారని బ్రాహ్మిని గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ఇలా బ్రాహ్మణి గురించి ఈ వార్త తెలియడంతో తండ్రి అంటే తనకు ఎంత ఇష్టం ఉందో అర్థమవుతుంది. ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఈమె మంచి మనసు పై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఆమె పెంపకం అలాంటిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Manchu Manoj -Mounika: అనాధల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మనోజ్ మౌనిక దంపతులు.. గ్రేట్ అంటూ?

Manchu Manoj -Mounika: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మనోజ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో ఈయన సినిమాల పరంగాను తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.మనోజ్ భూమ మౌనిక వివాహం చేసుకున్న తర్వాత తన జీవితంలో చాలా సంతోషంగా గడుపుతున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే తిరిగి సినిమా పనులలో కూడా ఈయన బిజీ అయ్యారు.ఇకపోతే మౌనిక మనోజ్ దంపతులు అనాధ పిల్లల కోసం ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు హీరోలు పేదవారి కోసం అనాధ పిల్లల కోసం పెద్ద ఎత్తున టికెట్లు కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే మనోజ్ మౌనిక దంపతులు కూడా 2500 టికెట్లను కొనుగోలు చేశారు. ఇక ఈ విషయాన్ని మనోజ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఎలాంటి హద్దులు లేకుండా అందరూ ఒక వేడుకల జరుపుకోవాల్సిన సినిమా ఆది పురుష్. దీనిని మా జీవితంలో వచ్చిన ఒక గొప్ప అవకాశం గా భావిస్తున్నామంటూ తెలియజేశారు.

Manchu Manoj -Mounika: జైశ్రీరామ్ అన్న శ్లోకం వినిపించాలి…


ఈ క్రమంలోని ఇలాంటి ఒక గొప్ప సినిమాని రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ఆశ్రమాలలో ఉన్న అనాధ పిల్లలకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ ఏర్పాటు చేయబోతున్నాం జైశ్రీరామ్ అనే పవిత్ర శ్లోకం అన్నిచోట్ల వినిపించాలి అంటూ ఈ సందర్భంగా మనోజ్ మౌనిక దంపతులు సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తెలంగాణలో అనాధలు ఉండరు_ మంత్రి సత్యవతి రాథోడ్

తెలంగాణాల ఇక అనాథలు ఉండరన్నారు స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్. హోమ్స్ లలో ఉండే పిల్లలకు అన్ని ప్రభుత్వమే చూసుకుంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్ నియమించిన కేబినెట్ సబ్ కమిటీ అనాథ పిల్లల సంక్షేమానికి గొప్ప విధానం తీసుకుని రాబోతోందన్నారు సత్యవతి రాథోడ్.

కాగా తల్లిదండ్రులకు దూరమై హోమ్స్ లో ఉండే పిల్లలకు కుటుంబం ఏర్పడే వరకు ప్రభుత్వమే అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ లోని సైదాబాద్, నింబోలి అడ్డా ప్రాంతాలలో బాల, బాలికల సదన్ భవనాలను మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ప్రారంభించారు.