Tag Archives: pavitri lokesh

Naveen: పవిత్ర లోకేష్ నరేష్ లవ్ స్టోరీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నరేష్ కుమారుడు నవీన్!

Naveen: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నరేష్ ఒకరు. అయితే ఈయన గత కొంతకాలంగా తన వ్యక్తిగత కారణాల వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలకు దూరమైనటువంటి నరేష్ ప్రస్తుతం నటి పవిత్ర లోకేష్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

ఇలా పవిత్ర లోకేష్ కారణంగా నరేష్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు అయితే తాజాగా నటుడు నరేష్ పవిత్ర లోకేష్ గురించి నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట్లోనవీన్ హీరోగా చేసినప్పటికీ అనంతరం సత్య అనే షార్ట్ ఫిలిం ద్వారా డైరెక్టర్ గా మారిపోయారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నవీన్ ఎన్నో విషయాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ మొదటి నుంచి మా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా వారికి ఏది తోచితే అదే చేసే అలవాటు ఉంది ఇలా చేయడం వల్ల కొన్ని తప్పులు జరిగాయి అయితే మా ఫ్యామిలీ గురించి బయట ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయని వాటి గురించి పట్టించుకోనని నవీన్ తెలిపారు. వారు కోరుకున్నట్టు బ్రతకాలంటే మేము బ్రతకలేమని తెలియజేశారు.

Naveen: పవిత్ర గారు బాగా తెలుసు..


ఇక నాన్న తన గురించి ఎవరు ఏమన్నా వాటి గురించి పట్టించుకోకుండా ముందుకు వెళ్తారు ఆయనలో నాకు నచ్చినది ఇదేనని బయట ఎవరు ఎన్ని అనుకున్నా మా నాన్న హ్యాపీగా ఉండడమే మాకు ముఖ్యం అంటూ నవీన్ తెలిపారు.ఇక పవిత్ర గురించి కూడా మాట్లాడుతూ పవిత్ర గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆమె నేను ఏదైనా పని మొదలు పెడుతున్నటువంటి సమయంలో ఆమె నాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఉంటారు తరచూ నేను తనతో మాట్లాడుతూ ఉంటానని తనని పవిత్ర గారు అని పిలుస్తాను అంటూ నవీన్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Naresh: ఊపిరి ఉన్నంతవరకు పవిత్రకు అండగా నిలుస్తాను… నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు!

Naresh: సీనియర్ నటుడు నరేష్ ఇటీవల తరచూ వార్తలో నిలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన పవిత్ర లోకేష్ తో నరేష్ రిలేషన్ లో ఉండటం వల్ల తరచూ వీరు వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఇటీవల వీరిద్దరూ కీలకపాత్రలలో మళ్ళీ పెళ్లి అనే సినిమాలో కూడా నటించారు. ఈ సినిమాకు ఎంఎస్ రాజు దర్శకత్వం వహించగా.. నరేష్ ఈ సినిమాని నిర్మించాడు.

ఈనెల 26వ తేదీన ఈ సినిమా తెలుగు కన్నడ భాషలలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ పనులలో నరేష్, పవిత్ర లోకేష్ బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగా టీవీ షోలలో, ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ .. పవిత్ర లోకేష్ తో తన రిలేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో నరేష్ మాట్లాడుతూ…”

ఈ సినిమా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనల గురించి ఆధారంగా తీసినదేనని, తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కాదని నరేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుత కాలంలో ఒత్తిడి, అనుమానం అనుబంధాలు లేకపోవడం వల్ల వివాహ వ్యవస్థ దెబ్బతింటుందని, వివాహ బంధం పై గౌరవానికి అర్థం పడుతూ ఈ సినిమాని రూపొందించినట్లు తెలిపాడు. అంతేకానీ ఎవరిమీద కక్ష తీర్చుకోవటానికి కాదని చెప్పుకొచ్చాడు.

Naresh: రివెంజ్ తీర్చుకోవడం కోసం ఇంత ఖర్చు అవసరం లేదు…

కక్ష తీర్చుకోవాలి అనుకుంటే యూట్యూబ్ వీడియోస్ రిలీజ్ చేస్తే సరిపోతుందని 15 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మరి సినిమా తీసి కక్ష తీర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. పవిత్ర నన్ను నమ్మి వచ్చింది. నా ప్రాణం పోయేవరకు ఆమెకు అండగా ఉంటాను. మమ్మల్ని విడదీయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ నేను ఆమెకు జీవితాంతం తోడుగా ఉంటాను అంటూ నరేష్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ క్రమంలో పవిత్ర లోకేష్ మాట్లాడుతూ..” ఒక సినిమా షూటింగ్ సమయంలో మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మా ఇద్దరి వ్యక్తిత్వాలు ఒక్కటే. ఒకరి మీద కక్ష తీర్చుకోవాలని ఉద్దేశం మాకు లేదు అంటూ పవిత్ర లోకేష్ చెప్పుకొచ్చింది. నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Ramya Raghupathi: నరేష్ పవిత్ర గురించి శపథాలు చేస్తున్న రమ్య.. ఎలా కలిసి ఉంటారో నేను చుస్తానంటూ కామెంట్స్!

Ramya Raghupathi: గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అలాగే కన్నడ చిత్ర పరిశ్రమలోనూ నటి పవిత్ర లోకేష్, నరేష్ గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.రమ్య నరేష్ మూడవ భార్య అయితే ఎనిమిది సంవత్సరాల క్రితమే పలుగొడవల కారణంగా రమ్య నరేష్ జీవితంలో నుంచి వెళ్ళిపోయింది. ఈ విధంగా తన భర్తకు దూరంగా ఉన్నప్పటికీ వీరిద్దరికీ విడాకులు మాత్రం కాలేదు.

Ramya Raghupathi: నరేష్ పవిత్ర గురించి శపథాలు చేస్తున్న రమ్య.. ఎలా కలిసి ఉంటారో నేను చుస్తానంటూ కామెంట్స్!

ఈ క్రమంలోనే నరేష్ నటి పవిత్ర లోకేష్ తో ఎంతో చనువుగా ఉన్నారు.ఈ క్రమంలోనే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు రావడంతో నరేష్ మూడో భార్య రమ్య ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి ఈ వివాదం తారస్థాయికి చేరుకుంది.

Ramya Raghupathi: నరేష్ పవిత్ర గురించి శపథాలు చేస్తున్న రమ్య.. ఎలా కలిసి ఉంటారో నేను చుస్తానంటూ కామెంట్స్!

ఇప్పటివరకు వీటి మధ్య మాటల యుద్ధం జరిగినా,ఆదివారం నరేష్ పవిత్ర మైసూర్ లోని ఒక రెస్టారెంట్లో అడ్డంగా రమ్య చేతికి దొరికిపోయారు. ఇలా రెస్టారెంట్లో వీరిద్దరిని చూసిన రమ్య ఆగ్రహంతో ఊగిపోయి ఏకంగా వారిపై చెప్పుతో దాడికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోని ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

నరేష్ పవిత్ర జంటకు అండగా నిలిచిన పోలీసులు…

వీరి వ్యవహారం గురించి రమ్య మాట్లాడుతూ.. తాను ఇంకా నరేష్ నుంచి విడాకులు తీసుకోలేదని, అలా నేను విడాకులు తీసుకోకుండా నే నరేష్ మరుగు మహిళతో ఎలా తిరుగుతారు? నేను ఆయనకు విడాకులు ఇవ్వడం అందరి ముందు అతనిని వివాహం చేసుకున్నాను, ఇలా విడాకులు ఇవ్వకుండా పవిత్ర లోకేష్ నరేష్ తో తిరగడం భవ్యం కాదంటూ మండి పడ్డారు. అదేవిధంగా వీరికి పోలీసులు కూడా అండగా నిలబడడం ఏంటో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు ఎలా కలిసి ఉంటారో నేను చూస్తా..అంటూ నరేష్ వ్యవహారంపై ఘాటుగా స్పందిస్తూ శపథాలు చేశారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.