Tag Archives: photos

Jabardasth Faima: బ్లాక్ మెయిల్ చేసి ఇండస్ట్రీలోకి వచ్చాను.. నాతో ఫొటోలు దిగడానికి రావడం హ్యాపీగా ఉంది: జబర్దస్త్ ఫైమా

Jabardasth Faima: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది అవకాశాలను అందుకోని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంచి స్థాయిలో ఉన్నారు. ఈ విధంగా జబర్దస్త్ ద్వారా పేరు సంపాదించుకున్న కొందరు కమెడియన్స్ ప్రస్తుతం వెండితెర అవకాశాలను అందుకుని జబర్దస్త్ కార్యక్రమానికి కూడా దూరమయ్యారు. ఈ విధంగా జబర్దస్త్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో కమెడియన్ ఫైమా ఒకరు.

Jabardasth Faima: బ్లాక్ మెయిల్ చేసి ఇండస్ట్రీలోకి వచ్చాను.. నాతో ఫొటోలు దిగడానికి రావడం హ్యాపీగా ఉంది: జబర్దస్త్ ఫైమా

బుల్లెట్ భాస్కర్ టీమ్ లో ఈమె చేసే కామెడీకి విపరీతమైన అభిమానులు ఉన్నారు. బుల్లెట్ భాస్కర్ టీమ్ ద్వారం విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఫైమా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాది చాలా నిరుపేద కుటుంబం అని ఒకప్పుడు మా ఇంట్లో టీవీ కూడా ఉండేది కాదని తెలిపారు.

Jabardasth Faima: బ్లాక్ మెయిల్ చేసి ఇండస్ట్రీలోకి వచ్చాను.. నాతో ఫొటోలు దిగడానికి రావడం హ్యాపీగా ఉంది: జబర్దస్త్ ఫైమా

కాలేజీ చదువుతున్న రోజులలో ఒక రోజు మా సార్ కాలేజీ ట్రిప్ అని చెప్పి పటాస్ కార్యక్రమానికి తీసుకువెళ్లారు. ఆ విధంగా పటాస్ కార్యక్రమానికి వచ్చాను.అక్కడ నేను మాట్లాడే యాస, భాష డైరెక్టర్లకు నచ్చడంతో వాళ్లు నాకు ఆఫర్ ఇచ్చారు. అయితే ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెబితే వాళ్ళు ఒప్పుకోలేదు.దీంతో నేను పటాస్ కార్యక్రమానికి వెళ్లకపోతే చచ్చిపోతా అని బ్లాక్ మెయిల్ చేసి ఈ కార్యక్రమానికి వచ్చాను.

నాతో ఫోటోలు దిగడం కోసం వస్తున్నారు….

పటాస్ షో ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనకు జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చింది. బుల్లెట్ భాస్కర్ అన్న తనకి ప్రతి ఒక్క విషయం ఎంతో వివరంగా చెబుతూ తనని ఎంతగానో ప్రోత్సహించారని ఆమె తెలియజేశారు. అయితే తన ఊర్లోకి ఎవరైనా సెలబ్రిటీలు వస్తే వారితో ఫోటో దిగడం కోసం పరుగులు పెడుతూ వెళ్ళేదాన్ని. ఇప్పుడు నేను ఊర్లోకి వెళ్తే నాతో ఫోటోలు దిగడం కోసం అందరూ వస్తున్నారు. ఈ విధంగా నాతో ఫోటోలు కోసం అందరూ రావడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంటూ ఫైమా వెల్లడించారు.

Josh Ravi: జబర్దస్త్ వాళ్లతో ఫోటోలు అడిగితే హీరోల మాదిరిగా బిల్డప్ ఇస్తారు… హైపర్ ఆది అలా మెసేజ్ చేసేవాడు: జోష్ రవి

Josh Ravi: సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు అందుకుని నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న జోష్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ జబర్దస్త్ ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేశారు.

ప్రస్తుతం జోష్ రవి జబర్దస్త్ నుంచి విడిపోయారు. పలు సినిమాలలో అవకాశాలు రావడంతోనే తను జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. కాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తాను ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ఎన్నో కష్టాలు పడ్డానని అయితే తనకు బాగా పరిచయమున్న దర్శకులు నిర్మాతలు కారణంగా తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయని తెలియజేశారు.

ఇకపోతే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో కొనసాగుతున్న తనకు ఏ దర్శకుడితో ఏ విధమైనటువంటి విభేదాలు లేవని, ఒక షార్ట్ తీసేటప్పుడు ఎన్నిసార్లు టేక్ లు తీసుకుంటారని అడిగిన డైరెక్టర్ ఇప్పటివరకు ఒక్కరు కూడా లేరు అంటూ రవి వెల్లడించారు. ఇక తాను ఇండస్ట్రీలో కొనసాగుతున్న చాలామంది తనుపెద్ద సెలబ్రిటీ అని భావిస్తుంటారు. ఇకపోతే మా ఊరికి కనుక వెళ్తే ఊరు మొత్తం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టి, తనపై అభిమానాన్ని చూపిస్తూ ఉంటారని వెల్లడించారు.

జబర్దస్త్ లో వాళ్లంటే ఇష్టం..


ఇక బయట మేము కనుక కనబడితే పెద్ద ఎత్తున ఫోటోలు కోసం ఎగపడతారని జోష్ రవి వెల్లడించారు. ఇక జబర్దస్త్ వాళ్ళతో ఫోటోలు కోసం వెళితే వాళ్లు పెద్ద హీరోలంటూ బిల్డప్ ఇస్తారు. అయితే అది ఆ క్షణం వరకు మాత్రమే.. ఆ తర్వాత తిరిగి మనం ఏంటో మనకు తెలుసు కనుక హీరో అనే ఊహ నుంచి బయటకు రావాలని ఆయన వెల్లడించారు.ఇక జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటానని జబర్దస్త్ వారితో తనకు మంచి అనుబంధం ఉందని జోష్ రవి తెలిపారు. ఇక జబర్దస్త్ లో తాను సుడిగాలి సుధీర్ హైపర్ ఆదికి ఫేవరెట్ అని తెలిపిన జోష్ రవి వారి స్కిట్లు కనుక బాగా ఉంటే నేను చాలా అద్భుతంగా ఉంది అంటూ మెసేజ్ చేస్తాను. వాళ్లు కూడా నాకు నీ పర్ఫామెన్స్ బాగుంది, సినిమాలు బాగున్నాయని మెసేజ్ చేస్తారని, హైపర్ ఆది ఎప్పుడు కూడా ఇలాగే మెసేజ్ చేస్తారని ఈ సందర్భంగా జోష్ రవి తెలిపారు.

Karthika Deepam Shobhashetty: సీతగా మారిపోయిన కార్తీకదీపం మోనిత… ఫోటోలు వైరల్!

Karthika Deepam Shobhashetty: బుల్లితెరపై ప్రసారం అవుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి టాప్ రేటింగ్ లో కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ ద్వారా దీప పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాథ్, కార్తీక్ పాత్రలో నటించిన నిరుపమ్, మోనిత పాత్రలో నటించిన శోభా శెట్టికి ఎంతో మంచి గుర్తింపు వచ్చింది.

Karthika Deepam Shobhashetty: సీతగా మారిపోయిన కార్తీకదీపం మోనిత… ఫోటోలు వైరల్!

ఈ సీరియల్ లో విలన్ పాత్రలో నటించిన మోనిత అలియాస్ శోభా శెట్టి ఇది వరకు ఎన్నో సీరియల్స్ లో నటించిన రాని గుర్తింపు కార్తీకదీపం సీరియల్ లో విలన్ పాత్ర ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సీరియల్లో సూర్పనఖ తరహా పాత్రలో నటించిన మోనిత తన విలనిజంతో అందరినీ భయబ్రాంతులకు గురి చేసింది.

Karthika Deepam Shobhashetty: సీతగా మారిపోయిన కార్తీకదీపం మోనిత… ఫోటోలు వైరల్!

ఈ విధంగా కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం ఈ సీరియల్ లో తర్వాత జనరేషన్ ప్రారంభం కావడంతో సీరియల్ నుంచి తప్పుకుంది. ఈ విధంగా ఈ సీరియల్ నుంచి దూరమైన శోభా శెట్టి సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.సోషల్ మీడియా వేదికగా తన ఫొటోలు వీడియోలను షేర్ చేస్తూ నిత్యం అభిమానులను సందడి చేస్తున్నారు.

విలన్ గా భయపెట్టిన మోనిత..

ఇక శోభా శెట్టి ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా శోభా శెట్టి తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే సీరియల్స్ లో సూర్పణక పాత్రలలో నటిస్తూ విలన్ గా ముద్ర వేయించుకున్న శోభా శెట్టి తాజాగా సీతమ్మ గెటప్ వేసి అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం శోభా శెట్టి సీత పాత్రకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Krishnam Raju Home Tour: రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇంటిని చూశారా… ఇంద్ర భవనంలా ఉంది.. అట్రాక్షన్ గా మారిన బంగారపు బొమ్మ!

Krishnam Raju Home Tour: టాలీవుడ్ సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సీనియర్ హీరోగా ప్రభాస్ పెదనాన్న గా అందరికీ సుపరిచితమైన కృష్ణంరాజు ఇప్పటికే ప్రభాస్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంలో కూడా కృష్ణంరాజు పరమహంస పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Krishnam Raju Home Tour: రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇంటిని చూశారా… ఇంద్ర భవనంలా ఉంది.. అట్రాక్షన్ గా మారిన బంగారపు బొమ్మ!

ఇక ఈ సినిమాలో కృష్ణంరాజు కూడా నటించడంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా కృష్ణంరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ క్రమంలోనే ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తన హోమ్ టూర్ చేసి చూపించారు.

Krishnam Raju Home Tour: రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇంటిని చూశారా… ఇంద్ర భవనంలా ఉంది.. అట్రాక్షన్ గా మారిన బంగారపు బొమ్మ!

ఈ క్రమంలోనే కృష్ణంరాజు ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఈ ఇంటిని చూసి ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే తన ఇంటి గురించి శ్యామల దేవి వివరిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

30 సంవత్సరాల క్రితం నాటి బంగారపు పులి బొమ్మ…

సాధారణంగా కృష్ణం రాజు కుటుంబానికి దైవభక్తి ఎక్కువ కనుక ప్రతిరోజూ తప్పనిసరిగా తమ ఇంట్లో పూజా కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతాయని వెల్లడించారు.అదేవిధంగా కృష్ణం రాజు గారికి పురాతన వస్తువులు అంటే ఎంతో ఇష్టం కనుక తమ ఇంటిలో ఎక్కువగా అలాంటి వస్తువుల కనబడతాయని ఈ సందర్భంగా శ్యామలాదేవి వెల్లడించారు.ఇకపోతే వీరి ఇంటిలో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా పూర్తిగా బంగారంతో తయారుచేసిన పులి బొమ్మ ఎంతో అట్రాక్షన్ గా నిలిచింది.గత 30 సంవత్సరాల క్రితం ఇటలీ నుంచి ఈ బొమ్మను తీసుకు వచ్చామని ఇలాంటి బంగారపు పులి బొమ్మలు చాలా అరుదుగా ఉంటాయని శ్యామలాదేవి తెలియజేశారు.ఇక ఈ పులి బొమ్మ ప్రత్యేకత ఏమిటి అంటే 50 సంవత్సరాల తర్వాత తిరిగి దీనిని సరి కొత్తగా రూపొందించ వచ్చని ఈమె వెల్లడించారు.ప్రస్తుతం వీరి హోమ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు వీరి ఇంటిని చూసి ఫిదా అవుతున్నారు.

Actor Naresh: ఫోటోలను అడ్డుపెట్టుకొని కోట్లలో డబ్బులు వసూలు…. నరేష్ మాజీ భార్యపై కేసు నమోదు!

Actor Naresh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడు నరేష్ ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నరేష్ మూడవ భార్య పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.

Actor Naresh: ఫోటోలను అడ్డుపెట్టుకొని కోట్లలో డబ్బులు వసూలు…. నరేష్ మాజీ భార్యపై కేసు నమోదు!

నరేష్ గత కొన్ని సంవత్సరాల క్రితం ఏపీ మాజీ ముఖ్యమంత్రి రఘువీరా రెడ్డి సోదరుడి కుమార్తె రమ్య రఘుపతిని వివాహం చేసుకున్నారు.అయితే కొన్ని సంవత్సరాలపాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరు అనంతరం మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు.

Actor Naresh: ఫోటోలను అడ్డుపెట్టుకొని కోట్లలో డబ్బులు వసూలు…. నరేష్ మాజీ భార్యపై కేసు నమోదు!

వీరందరూ కలిసి ఉన్న సమయంలో రమ్య నరేష్ కుటుంబంతో దిగిన ఫోటోలను అడ్డుపెట్టుకొని కొందరి నుంచి అధిక వడ్డీలు వసూలు చేయడమే కాకుండా రిజిస్ట్రేషన్ పేరిట కోట్ల రూపాయలలో మోసానికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే కొందరు మహిళలు రమ్య పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

నాకు ఎలాంటి సంబంధం లేదు….

ఈ క్రమంలోనే నటుడు నరేష్ ఈ విషయంపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఆమేతో తాను విడాకులు తీసుకున్నానని తాను తీసుకున్న డబ్బులకు, తన అప్పుకు నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని నరేష్ కొట్టిపారేశారు. ఈ విధంగా తన మాజీ భార్య గురించి నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదేవిధంగా నరేష్ కుటుంబ సభ్యులతో కలిసి రమ్య దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Kajal Aggarwal: ఘనంగా కాజల్ అగగర్వాల్ సీమంతం వేడుక.. నెట్టింట వైరల్ గా మారిన ఫొటోలు.. !

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ మొదట 2007 సంవత్సరంలో నందమూరి కళ్యాణ్ రామ్ తో ‘‘లక్ష్మీ కళ్యాణం’’ సినిమాలో హీరోయిన్ గా తెలుగులో పరిచయం అయిన విషయం తెలిసిందే.అయితే మొదటి సినిమా కంటే కూడా.. ఆమెకు చందమామ సినిమాలో ఎక్కువగా పాపులారిటీని సాధించింది.

Kajal Aggarwal: ఘనంగా కాజల్ అగగర్వాల్ సీమంతం వేడుక.. నెట్టింట వైరల్ గా మారిన ఫొటోలు.. !

అతి తక్కువ కాలంలోనే ఆమె అత్యంత వేగంగా 50 సినిమాలను పూర్తి చేసుకున్న హారోయిన్ గా కూడా రికార్డులకెక్కింది. ఇక మగధీర సినిమా ఆమె కెరీర్ లోనే ఓ మైలురాయి అని చెప్పవచ్చు. అంతలా ఆ సినిమాలో రామ్ చరణ్ సరసన ఒదిగిపోయింది. ఆ సినిమాకు కాజల్ కు ఎన్నో అవార్డులు వరించాయి.

Kajal Aggarwal: ఘనంగా కాజల్ అగగర్వాల్ సీమంతం వేడుక.. నెట్టింట వైరల్ గా మారిన ఫొటోలు.. !

ఒక్క మగధీర కాకుండా.. ఆమె కెరీర్ లో సువర్ణ అక్షరాలతే లిఖించే సినిమాలు ఎన్నో ఉన్నాయి. డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, నా పేరు శివ, బిజినెస్ మెన్, టెంపర్, నేనే రాజు నేనే మంత్రి, ఖైదీ నెంబర్ 150 సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేసిన విషయం విధితమే.

Kajal Aggarwal: ఘనంగా కాజల్ అగగర్వాల్ సీమంతం వేడుక.. నెట్టింట వైరల్ గా మారిన ఫొటోలు.. !

రిలేటివ్స్ సమక్షంలో సీమంతం వేడుక..


అయితే ఆమె చిరకాల స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లును 2020 అక్టోబరులో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె వివాహం చేసకున్నా సినిమాల్లో నటన మాత్రం ఆపలేదు. అయితే తాను ప్రెగ్నెంట్ అంటూ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆమె తన అభిమానులకు తెలిపింది. దీనిలో భాగంగానే.. ఇటీవల తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ సమక్షంలో సీమంతం వేడుక వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం కాజల్ సీమంతం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఆమె సినిమాల విషయానికి వస్తే.. హే సినామిక మార్చి 3న థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. దీనిలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. మెగస్టార్ తో ఆమె ఆచార్య మూవీలో నటిచింది. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆమె సీమంతం ఫొటోలు చేసిన సగటు నెటిజన్లు అభినందలనలు తెలియజేస్తున్నారు.

Priyanka Singh: ఎద అందాలను ఆరబోసిన ప్రియాంక సింగ్..! ఫోటో వైరల్!

Priyanka Singh: తెలుగులో ఎక్కువగా పాపులారిటీ సంపాధించిన రియాల్టీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షో అనే చెప్పాలి. పాపులరిటీతో పాటుగా వివాదాలను కూడా మూటగట్టుకుంటుంది. బిగ్ బాస్ సీజన్ 5 ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే.

Priyanka Singh: ఎద అందాలను ఆరబోసిన ప్రియాంక సింగ్..! ఫోటో వైరల్!

2021 సెప్టెంబర్ నెలలో ప్రారంభం కాగా.. ఇది మొదలు పెట్టిన రోజు నుంచే దీనిపై విమర్శలు వచ్చాయి. సీపీఐ నేత నారాయణ ఇది బిగ్ బాస్ షో కాదు అని.. బ్రోతల్ షో అని.. నాగార్జునపై కూడా ఫైర్ అయిన విషయం తెలిసిందే.

Priyanka Singh: ఎద అందాలను ఆరబోసిన ప్రియాంక సింగ్..! ఫోటో వైరల్!

ఇక ఏదేమైనా.. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన వారికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. వాళ్ల ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో అయితే విపరీతంగా ఫాలోవర్స్ వచ్చేశారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగిన కంటెస్టెంట్ ఎవరంటే ప్రియాంకా సింగ్.

వావ్.. వాట్ ఏ ఎక్స్ ప్రెషన్స్..

జబర్దస్త్ లో సాయిగా ఎంట్రీ ఇచ్చి.. కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత అతడు అమ్మాయిగా సర్జరీ చేయించుకొని.. ప్రియాంక సింగ్ గా (పింకీ)మారాడు. తర్వాత కూడా జబర్దస్త్ లేడీ గెటప్ తో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం అదే ఫేమ్ ద్వారా బిగ్ బాస్ సీజన్ 5లో 9వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన పింకీ.. అంత కంటే ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తూ అప్ డేట్స్ ఇస్తూ వస్తోంది. ప్రస్తుతం ఇన్ స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది ప్రియాంక. అందులో‘‘ కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యో’’ అనే సాంగ్ తమిళ వర్సెన్ కు ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు వావ్ వాట్ ఏ ఎక్స్ ప్రెషన్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోలో ప్రియాంక సింగ్ తన అందాలను కాస్త ఎక్కువగానే చూపించదని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Prabhas-Anushka: ప్రభాస్ ఇంట పెళ్లి పనులలో అనుష్క… ఫొటో వైరల్..!

Prabhas-Anushka: సినీ ఇండస్ట్రీకి హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు. కానీ కొంతమంది మాత్రమే లాంగ్ స్టాండింగ్ గా ఉండగలుతారు. అందులో కూడా కొంతమందికి మాత్రమే స్టార్ స్టేటస్ వస్తుంది. వారిని చూసే సినిమాకు వెళ్తుంటారు అభిమానులు. ఇదిలా ఉంటే లేడీ ఓరియంట్ సినిమాలతో పాటు గ్లామర్ పాత్రలు చేసే హీరోయిన్లు చాలా తక్కువగానే ఉంటారు.

Prabhas-Anushka: ప్రభాస్ ఇంట పెళ్లి పనులలో అనుష్క… ఫొటో వైరల్..!

అలాంటి కోవలోకే వస్తుంది హీరోయిన్ అనుష్క శెట్టి. తన గ్లామర్ తో దాదాపు 15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా… ఇప్పటికీ అదే స్టార్ స్టేటస్ ను కొనసాగిస్తోంది.  అనుష్క కెరీర్ ‘ అరుంధతి’ సినిమాకు ముందు, దాని తర్వాతగా చూస్తుంటారు. కోడి రామక్రిష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జేజమ్మ పాత్రలో అనుష్క తన నటవిశ్వరూపాన్ని చూపించింది.

Prabhas-Anushka: ప్రభాస్ ఇంట పెళ్లి పనులలో అనుష్క… ఫొటో వైరల్..!

ఆ తరువాత వరసగా సినిమాలు చేసింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి1, బాహుబలి 2తో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. అప్పటి వరకు సౌత్ కే తెలిసిన అనుష్క ఒక్కసారిగా ఆల్ ఇండియా స్టార్ గా మారింది. 

ప్రభాస్- అనుష్కల మధ్య ప్రెండ్షిప్ కొద్ది మాత్రమే…

ఇదిలా ఉంటే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న అనుష్క ఇటీవల ఓ ఫంక్షన్ లో కనిపించింది. అయితే ఇది కృష్ణంరాజు స్టాఫ్ కుమార్తె పెళ్లిక. దీనికి హాజరైన అనుష్క పెళ్లి పను చేస్తున్న ఓ పిక్ ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఇప్పటికే అనుష్క- ప్రభాస్ మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ రూమర్లు కూడా వచ్చాయి. వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ.. వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పడు ఈ పిక్ వైరల్ కావడం అది కూడా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఇంట్లోని ఫంక్షన్ కావడంతో మళ్లీ అనుమానాలు వస్తున్నాయి ప్రేక్షకులకి. అయితే ప్రభాస్- అనుష్కల మధ్య ప్రెండ్షిప్ కొద్ది మాత్రమే ఫంక్షన్ కు వచ్చిందంటూ మరికొంత మంది అనుకుంటున్నారు. ఇక రెండేళ్ల తరువాత మళ్లీ అనుష్క  మళ్లీ తెరపై కనిపించబోతోంది. నవీన్ పొలిశెట్టి కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పిక్ లో అనుష్క బరువు తగ్గి స్లిమ్ గా మారింది. దీంతో షూటింగ్ త్వరలోనే మొదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ వారు నిర్మించనున్నారు.

Naveen Polishetty: ఆ ఫొటోలు చూసి బాలీవుడ్ హీరోయిన్లు కుళ్లుకోవాలి.. జాతి రత్నాలు ఫేమ్..

Naveen Polishetty: ‘జాతి రత్నాలు’ సినిమాతో భారీ హిట్ కొట్టాడు నవీన్ పోలిశెట్టి. తనదైన కామెడీతో జాతి రత్నాలు సందడి చేశాడు. బాక్సాఫీస్ వద్ద ఈసినిమా భారీ విజయాన్ని దక్కించుకుంది.  ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఈ సినిమాతో హీరోగా తన కెరీర్ను స్టార్ట్ చేశాడు. మొదటి సినిమాతోనే తనేంటో నిరూపించుకున్నాడు. జాత రత్నాలు తర్వాత వరసగా సినిమాలు కమిట్ అవుతున్నాడు.

Naveen Polishetty: ఆ ఫొటోలు చూసి బాలీవుడ్ హీరోయిన్లు కుళ్లుకోవాలి.. జాతి రత్నాలు ఫేమ్..

ఇటీవల ప్రభాస్ నటించిన ‘రాధేశ్యాం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హోస్ట్ గా వ్యవహరించి అందరినీ ఆకట్టుకున్నాడు. కాగా జాతి రత్నాలు విడుదలై దాదాపుగా ఏడాది కావస్తుంది. అప్పటి నుంచి కొత్తగా ఏ సినిమాతో ముందుకు రాలేదు నవీన్ పొలిశెట్టి. హీరో కాకముందు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో కీలక రోల్ లో కనిపించాడు.

Naveen Polishetty: ఆ ఫొటోలు చూసి బాలీవుడ్ హీరోయిన్లు కుళ్లుకోవాలి.. జాతి రత్నాలు ఫేమ్..

చిచ్చోరే సినిమాలో సుశాంత్ రాజ్ పుత్ పక్కన అని ఫ్రెండ్ గా కనిపించాడు. ఆ సినిమాలో కూడా తన నటనతో ప్రేక్షకులకు కామెడీ పంచాడు. తాజాగా తన కొత్త సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ చేశాడు.  ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.


సోషల్‌ మీడియాలో అదిరిపోవాలని..

నవీన్ హీరోగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది.  ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  తాజాగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ లో తనదైన శైలిలో నవ్వులు పూయించాడు నవీన్. తన ఆహర్యం, డైలాగ్ డెలవరీతో అదుర్స్ అనిపిస్తున్నాడు. తన పెళ్లికి సంబంధించి గొప్పలు చెబుతూ.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచబోతున్నాడు. తన పెళ్లికి తీసే ఫొటోలు సోషల్‌ మీడియాలో అదిరిపోవాలని, కత్రీనా, విక్కీ కౌశల్‌ కుళ్లుకోవాలని చెప్పడం సరదాగా ఉంటుంది. ‘నేను చెప్పకూడదు కానీ, ఈ డికెడ్‌లో అలరించే కార్యక్రమం ఇదే. థియేటర్లలో మీరే చూస్తారుగా’ అంటూ వీడియో ముగించారు. తాజాగా ఈ టీజర్ మంచి వ్యూస్ దక్కించుకుంటోంది.

Siri-Srihaan: సిరి శ్రీహన్ ను విడదీయడం ఎవరి వళ్ల కాదేమో..ఈ ఫొటో అలాంటిది మరి..!

Siri-Srihaan: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ముగిసినా ఇద్దరు జంటల మధ్య వస్తున్న రూమర్స్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. హౌస్ లో సిరి, షణ్ముఖ్ ఒకరిపై ఒకరు పడుతూ.. ముద్దులు పెట్టుకుంటూ రచ్చరచ్చ చేసేశారు. ఆ ఎఫెక్ట్ బయట వేరే రకంగా వచ్చేసింది. దీంతో.. ఎక్కువగా షణ్ముఖ్, దీప్తి సునయనా జంట ఇప్పటికే బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే.

Siri-Srihaan: సిరి శ్రీహన్ ను విడదీయడం ఎవరి వళ్ల కాదేమో..ఈ ఫొటో అలాంటిది మరి..!

తాజాగా దీనిలో భాగంగానే సిరి, శ్రీహాన్ జంట కూడా విడిపోయే స్థితిలో ఉన్నారని.. మొన్నటి వరకు వార్తలు కొకొల్లలుగా వచ్చాయి.. వస్తున్నాయి కూడా. అయితే తాజాగా సిరి తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫొటోను పోస్టు చేసింది.

Siri-Srihaan: సిరి శ్రీహన్ ను విడదీయడం ఎవరి వళ్ల కాదేమో..ఈ ఫొటో అలాంటిది మరి..!

దీంతో అనుమానాలు అన్నీ పెటాపంచలు చేసేసింది. దీనిలో సిరి, శ్రీహీన్ ఇద్దరు కలిసి ఉండటం కనిపించింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు అవాక్కయ్యారు. హౌస్ లో సాగించిన వ్యవహారానికి శ్రీహాన్ కూడా ఆమెకు బ్రేకప్ చెప్పే చాన్స్ ఉంటుంది అనుకున్నారు.

వాళ్లను విడదీయడం ఇక ఎవరి వల్ల కాదంటూ..

ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ నుంచి సిరికి సంబంధించిన ఫొటోలను డిలీట్ చేసి అందరికీ షాకిచ్చాడు. సిరితో అతడు చేసిని వెబ్ సిరీసల్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను మాత్రమే ఉంచాడు. ఒక్కసారిగా ఇలా సిరి షాక్ ఇచ్చింది. ఇది చూసిన వాళ్లు సిరిని, శ్రీహాన్ ను విడదీయడం ఇక ఎవరి వల్ల కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సిరి బర్త్ డే సందర్భంగా.. అదిరిపోయే గిఫ్ట్ తో సర్ ఫ్రైజ్ ఇచ్చాడు. దీంతో సిరి ఆ గిప్ట్ తో ఆనందంలో మునిగితేలిపోయింది. ఈ ఒక్క ఫొటోతో ఇక సిరి, శ్రీహాన్ విడిపోతున్నారన్న రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారు.