Tag Archives: prudhvi raj

Prudhvi Raj: నా తండ్రి ఎన్టీఆర్ తో కలిసి సినిమాలు చేశారు.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన కమెడియన్ పృథ్వీ రాజ్!

Prudhvi Raj: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఈయనకు ఖడ్గం సినిమాలో ఈ డైలాగు ద్వారా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక అప్పటి నుంచి పలు సినిమాలలో నటించిన పృధ్విరాజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

Prudhvi Raj: నా తండ్రి ఎన్టీఆర్ తో కలిసి సినిమాలు చేశారు.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన కమెడియన్ పృథ్వీ రాజ్!

ఈ క్రమంలోనే 2019 ఎన్నికల సమయంలో పృథ్విరాజ్ వైసీపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో భాగంగా ఈయన పడిన కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ చైర్మన్ పదవి ఇచ్చారు.ఇలా చైర్మన్ గా కొనసాగుతున్న ఈయన మహిళల పట్ల లైంగిక ఆరోపణలు రావడంతో ఈ పదవి నుంచి తొలగించారు.

Prudhvi Raj: నా తండ్రి ఎన్టీఆర్ తో కలిసి సినిమాలు చేశారు.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన కమెడియన్ పృథ్వీ రాజ్!

ఇక రాజకీయాలలో అధికారంలోకి వచ్చిన ఈయన ఏకంగా ప్రతిపక్ష పార్టీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో పలువురు నటీనటుల పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ విధంగా పృథ్వి రాజ్ పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి వంటి హీరోల పై కూడా ఆరోపణలు చేశారు.
పృథ్వీరాజు నోటిదూల కారణంగా ఈయన చైర్మన్ పదవిని కోల్పోవడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలను కోల్పోయారు.

కర్ణుడు పాత్రలో నటించిన పృథ్వి రాజ్ తండ్రి…

ఇదే విషయాన్ని పృథ్వీరాజ్ పొరపాటుగా మాట్లాడానని సినీ పెద్దలకు క్షమాపణలు చెబుతూ తిరిగి ఇండస్ట్రీలో అవకాశాలను అందుకున్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పృధ్విరాజ్ తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను వైసిపి అనే ఉగ్రవాద సంస్థలో ఉండి ఒక ఉగ్రవాదిగా మాట్లాడాను అంటూ ఏకంగా పార్టీపై ఆరోపణలు చేయడమే కాకుండా, తన కుటుంబ విషయాల గురించి కూడా తెలిపారు. తన తండ్రి సుబ్బారావు సీనియర్ ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణవతారం సినిమాలో కర్ణుడి పాత్రలో నటించారని, ఆయన సుమారు 17 సినిమాల వరకు నటించారని ఈ సందర్భంగా తెలిపారు.

Prudhvi Raj: ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చినట్టు నా మైండ్ పొల్యూట్ చేసి నన్ను వైసీపీ పార్టీ వైపు తీసుకెల్లాడు. అప్పుడు కొవ్వు ఎక్కువై అలా మాట్లాడాను.. పృథ్వీరాజ్ కామెంట్స్ వైరల్!

Prudhvi Raj: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిన పృథ్విరాజ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.

Prudhvi Raj: నేను వైసీపీ ఉగ్రవాదిని… కొవ్వు పట్టి అలాంటి వ్యాఖ్యలు చేశాను.. పృథ్వీరాజ్ కామెంట్స్ వైరల్!

2014వ సంవత్సరంలో పృథ్వీరాజ్ వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఎంతో కీలకంగా వ్యవహరించారు.ఇక ఈయన పార్టీ ప్రచారంలో భాగంగా పార్టీ కోసం పడిన కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పృథ్వీరాజ్ ఎస్విబీసీ చైర్మన్ పదవిని ఇచ్చారు అయితే ఈయన ద్వారా ఆ పదవిని ఎక్కువకాలం నిలబెట్టుకోలేకపోయారు.

Prudhvi Raj: నేను వైసీపీ ఉగ్రవాదిని… కొవ్వు పట్టి అలాంటి వ్యాఖ్యలు చేశాను.. పృథ్వీరాజ్ కామెంట్స్ వైరల్!

ఇతని పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయనని ఆ పదవి నుంచి తొలగించారు. ఇలా పదవికి దూరమైనపృథ్వీరాజ్ క్రమక్రమంగా పార్టీకి దూరమవుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈయన వైసిపి పార్టీపై పలు సందర్భాలలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పృధ్విరాజ్ ఏకంగా వైసీపీ పార్టీని ఉగ్రవాద సంస్థతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

నాలో ఉగ్రవాది ఉన్నారు..

పాకిస్థాన్ లో ఉగ్రవాదులకు ఏ విధంగా శిక్షణ ఇస్తారో అలాగే ఒక వ్యక్తి నా మైండ్ మొత్తం పొల్యూట్ చేసి తనని వైసీపీ పార్టీ వైపు వెళ్లేలా చేశారని తెలిపారు. ఇక పార్టీలోకి వెళ్ళిన తర్వాత నేనే వళ్ళు కొవ్వుపట్టి నోటికొచ్చినది మాట్లాడానని తెలిపారు. ఆ సమయంలో నాలో పృధ్విరాజ్ కాకుండా ఒక వైసీపీ ఉగ్రవాది ఉన్నారని ఈ సందర్భంగా పృథ్వి రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Prudhvi Raj: వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కింగ్.. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్!

Prudhvi Raj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు పృథ్వీరాజ్ గురించి మనకు తెలిసిందే.30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగుతో ఎంతో పాపులర్ అయిన ఈయన ఒకవైపు సినిమాలలో కొనసాగుతూనే గత ఎన్నికలలో వైయస్సార్ సిపి పార్టీ తరఫున ప్రచారం చేసి పార్టీ కార్యక్రమాలలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఇక ఈయన సేవలను గుర్తించిన వైసీపీ ప్రభుత్వం పృథ్వీరాజ్ కి ఎస్వీబీసీ చైర్ పర్సన్ గా బాధ్యతలు అప్పగించారు.

Prudhvi Raj: వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కింగ్.. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్!

ఈ విధంగా ఎస్వీబీసీ చైర్ పర్సన్ బాధ్యతలను తీసుకున్న పృథ్వీరాజ్ ఒక మహిళతో ఎంతో అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నటువంటి ఆడియో బయటకు రావడంతో ఆయనపై చర్యలు తీసుకుని అతని తొలగించిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా
పృథ్వీరాజ్ క్రమక్రమంగా పార్టీకి దూరమవుతూ వచ్చారు.అయితే ఈయన వైసీపీ పార్టీలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే.

Prudhvi Raj: వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కింగ్.. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్!

ఈ విధంగా రాజకీయ నాయకుడిగా రాజకీయాలలో ఇమడ లేకపోయిన పృథ్వీరాజ్ తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ కుటుంబం పై ఈయన ప్రశంసలు కురిపిస్తూ పలు వ్యాఖ్యలు చేయడమేకాకుండా తాజాగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో గెలుపోటముల గురించి జోస్యం చెప్పారు.

అధికారం లేకపోయినా ప్రజల కోసం సేవ….

తాజాగా ఒక న్యూస్ చానల్ తో మాట్లాడిన ఈయన పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారని చాలామంది కామెంట్లు చేశారు అయితే వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ 40 నుంచి 50 వరకు గెలు పొందుతారని,పృథ్వీరాజ్ తెలిపారు. వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కింగ్ అవుతారని తాను రాసిస్తానని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అధికారం లేకపోయినా నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తున్నారని ఆయన అతని పై ప్రశంసలు కురిపించారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గురించి పృథ్వీరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Actor Prudhvi Raj : నన్ను టిష్యూ పేపర్ లా వాడుకొని వదిలేశారు.. పవన్ కళ్యాణ్ పేదల కోసం మాట్లాడితే వ్యక్తిగతంగా తిడతారు : పృథ్వి రాజ్

Actor Prudhvi Raj:30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఇండస్ట్రీలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు పృథ్వీరాజ్ గురించి అందరికీ సుపరిచితమే.ఈయన నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే గత ఎన్నికలలో వైయస్సార్ సిపి పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ పార్టీకి మద్దతు తెలిపారు. ఈ విధంగా వైయస్సార్సీపి పార్టీకి మద్దతు తెలపడంతో ఈయనకు ఎస్విబిసి చైర్ పర్సన్ పదవి ఇచ్చారు.

Actor Prudhvi Raj: నన్ను టిష్యూ పేపర్ లా వాడుకొని వదిలేశారు.. పవన్ కళ్యాణ్ పేదల కోసం మాట్లాడితే వ్యక్తిగతంగా తిడతారు: పృథ్వి రాజ్

అయితే ఈ పదవిలో కొనసాగుతుండగా ఒక ఆడియో రికార్డు కావడంతో ఈయన ఈ పదవి నుంచి వైదొలగిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎస్విబీసీ చైర్ పర్సన్ పదవి నుంచి బయటకు వచ్చిన పృథ్వి రాజ్ తిరిగి ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ పలు సినిమా అవకాశాలను అందుకున్నారు. అయితే తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Actor Prudhvi Raj: నన్ను టిష్యూ పేపర్ లా వాడుకొని వదిలేశారు.. పవన్ కళ్యాణ్ పేదల కోసం మాట్లాడితే వ్యక్తిగతంగా తిడతారు: పృథ్వి రాజ్

రాజకీయాలలో మాట్లాడే వారికి అవకాశాలు ఉండవని నోరు లేని వారికి కూడా మంత్రి పదవులు ఇస్తున్నారు అంటూ ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర రాజకీయాల గురించి ఆయన ప్రస్తావించారు. ఇక ఈయన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను అయితే తనకు కరోనా వచ్చిన సమయంలో మరుసటి రోజు సూర్యోదయాన్ని చూస్తాన లేదా అని సందేహం కలిగింది. ఈ విధంగా తన ఆరోగ్యం బాగాలేకపోయినా నాకు ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సహకారం కానీ మాట గాని అందలేదని, ఆ సమయంలో నన్ను పలకరించినది మాత్రం సినీ ప్రముఖులే అని పృథ్వీరాజ్ ఈ సందర్భంగా వెల్లడించారు.

తాను రాజకీయాలలో ఉన్నప్పటికీ మెగాస్టార్ కుటుంబం తనను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుందని పృథ్వీరాజ్ ఈ సందర్భంగా వెల్లడించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఆయన పేదల కోసం తన గళాన్ని విప్పుతారు.అయితే ఆయన ఏ విషయాన్ని అయినా చాలా గట్టిగా ప్రశ్నిస్తారు. ఆ విధంగా అడిగే విధానం వీళ్లకు నచ్చకపోవటం వల్ల తన పై వ్యక్తిగత దూషణలకు దిగుతారని పృథ్వీరాజ్ వెల్లడించారు.

పేపర్ లా వాడుకున్నారు…

ఇక గత ఎన్నికలలో భాగంగా పార్టీ ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్న పృద్వి రాజ్ కు అనంతరం పృధ్విరాజ్ అవసరం రాలేదా అని యాంకర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ పార్టీ గెలిచిన తర్వాత తన అవసరం రాలేదని తనని ఒక టిష్యూ పేపర్ లా వాడుకొని వదిలేసారు. నా విషయంలో అలా జరిగిందని ఈయన తన ఆవేదన వెల్లడించారు.

రంగస్థలం సినిమాలో పృద్విరాజ్ సీన్లు తీసేయడానికి కారణం ఏంటో తెలుసా?

సుకుమార్ దర్శకత్వంలో సమంత రామ్ చరణ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం “రంగస్థలం”. అప్పటివరకు క్లాస్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సుకుమార్ “రంగస్థలం” సినిమా ద్వారా తనలో ఉన్న మాస్ యాంగిల్ ని బయట పెట్టాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటివాడి పాత్రలో,అచ్చం పల్లెటూరి యువకుడిలా ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా తర్వాత నటుడు రామ్ చరణ్ కూడా వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఇకపోతే ఈ సినిమా లోజగపతిబాబు విలక్షణ నటుడి పాత్రలో అద్భుతంగా చేశారు. అదేవిధంగా ఆది పినిశెట్టి రంగమ్మత్త పాత్రలో అనసూయ పాత్ర ఈ సినిమాకు హైలెట్ అయ్యాయని చెప్పవచ్చు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

పృధ్విరాజ్ దాదాపు ఒక వారం రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని తన పాత్రను పూర్తిచేశారు. అదేవిధంగా తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పినప్పటికీ, కొన్ని కారణాల వల్ల పృథ్వీరాజ్ పాత్రను ఎడిటింగ్ లో తీసేసారనీ తాజాగా పృథ్వి రాజ్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. అసలు ఈ సినిమా షూటింగ్ మొత్తం చెప్పి డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆ సన్నివేశాలు తొలగించడానికి కారణం ఏంటి అనే విషయాలను కూడా ఓ ఇంటర్వ్యూలో పృధ్విరాజ్ వెల్లడించారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. రంగస్థలం సినిమాలో నాపై సన్నివేశాలు అన్నింటినీ తెరకెక్కించారు, నా పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పాను. కానీ అమెరికా నుంచి సుకుమార్ స్నేహితుడు ఈయనను ఎందుకు పెట్టుకున్నారు, ఈయన సినిమాలలో ఉంటే రావు గోపాల్ రావుల అవుతారని చెప్పారట అందుకోసమే నేను నటించిన సన్నివేశాలు అన్నింటిని తీసేశారని ఈ సందర్భంగా పృథ్వీరాజ్ తెలియజేశారు.ఇక ప్రస్తుతం పృథ్వి రాజ్ తెలుగు తమిళ సినిమాలలో పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

పృథ్వి రాజ్ ఆమెను గోకాడు.. ఏంటి ఈ దరిద్రం అంటూ ఫైర్ అయిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ!

సినిమా ఇండస్ట్రీలో ఓ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకుని 30 ఇయర్స్ ఇండస్ట్రీ గా పేరు సంపాదించుకున్న కమెడియన్ పృథ్విరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుతమైన కామెడీతోఎంతోమందిని ఆకట్టుకున్న పృథ్విరాజ్ గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్దఎత్తున నెగిటివ్ కామెంట్లు చేస్తుంటారు.

పృధ్విరాజ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా ఉండేవారు. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక పదవిలో ఉన్న పృద్విరాజ్ కొన్ని ఆరోపణల కారణంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ పై పృథ్వి రాజా స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రోలింగ్ అంటే పృథ్వీరాజ్ అని చెప్పవచ్చు.సోషల్ మీడియా వేదికగా చాలామంది తన గురించి పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తుంటారని అయితే వాటన్నింటి గురించి తను ఏమాత్రం పట్టించుకోనని తెలిపారు.అయితే సన్నిహితులు బంధువులు వాటిని చూసినప్పుడు నాకు చెబుతున్నారని, అలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోనని పృథ్విరాజ్ తెలియజేశారు. కుటుంబం పట్ల బాధ్యతగా ప్రవర్తించలేనివారు, ఎలాంటి పని పాట లేనివారు ఈ విధమైనటువంటి కామెంట్లు చేస్తుంటారని వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

అయితే గతకొద్ది రోజుల కిందట పృధ్విరాజ్ ఎవరినో గోకారంటూ పెద్ద ఎత్తున నా పై కామెంట్ చేస్తున్నారు. అలా తప్పుడు వ్యాఖ్యలు చేయటం వల్ల నాకు ఏ విధమైనటువంటి నష్టం జరగదని, ఈ సందర్భంగా పృధ్విరాజ్ తెలియజేశాడు. ఏ విధమైనటువంటి పని పాట లేనివారు ఎలాంటి కారణం లేకుండా నాపై పడి ఏడవడం ఎందుకు రా వెధవల్లారా అంటూ పృథ్వి రాజ్ తన గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసే వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అలా ఉండకపోతే తల తీసేస్తారని కత్తి మహేష్ అనే వాడు.. కమెడియన్ పృథ్వి సంచలన వ్యాఖ్యలు!

సినిమా ఇండస్ట్రీలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు పృథ్వి రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గత కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న పృథ్వి ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పృథ్వి రాజ్ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా పృథ్వి రాజా నటుడు ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా పృథ్వి రాజ్ మాట్లాడుతూ కత్తి మహేష్ మరణించినప్పటికీ అతని గురించి చేసే పలు వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉంటాయని పృద్వి తెలిపారు. కత్తి మహేష్,కమెడియన్ పృథ్వి గత ఎన్నికలలో భాగంగా వైసీపీ తరఫున పెద్దఎత్తున ప్రచారం చేశారు. ఈ విధంగా వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం గురించి పృధ్విరాజ్ తెలియజేశారు. ఈ క్రమంలోనే పృథ్వి రాజ్ తనని కత్తి మహేష్ అన్నా అని పిలిచే వాడని, ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు ఎంతో సహాయం చేశాడని తెలిపారు.

ఈ క్రమంలోనే ఇద్దరం క్యాజువల్ గా మాట్లాడుతున్న సమయంలో ఎందుకు అంత వివాదాలకు కారణమవుతూ దారుణంగా ఎందుకు ట్రోలింగ్ అవుతున్నావని కత్తి మహేష్ ను అడిగినప్పుడు అందుకు సమాధానంగా అన్నా.. మనం యుద్ధం చేస్తున్నాము. సైలెంట్ గా ఒక చెట్టు కింద కూర్చుంటే అవతలి వారు మన తల తీసేస్తారు. అందుకే ఎప్పుడూ సైలెంట్ గా ఉండకూడదు అని చెప్పేవారు.

నిజానికి కత్తి మహేష్ ఎంతో మంచి మనస్తత్వం కలవాడు. కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో మరణించినప్పటికీ ఆయన మరణంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. డ్రైవర్ కి ఏమీ కాకుండా కేవలం మహేష్ కు మాత్రమే అలా జరగడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఏది ఏమైనా చనిపోయిన ఒక వ్యక్తి గురించి ఎంతో దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. అది ఎంతో బాధాకరం..అంటూ కమెడియన్ పృథ్విరాజ్ కత్తి మహేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.