Actor Prudhvi Raj:30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఇండస్ట్రీలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు పృథ్వీరాజ్ గురించి అందరికీ సుపరిచితమే.ఈయన నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే గత ఎన్నికలలో వైయస్సార్ సిపి పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ పార్టీకి మద్దతు తెలిపారు. ఈ విధంగా వైయస్సార్సీపి పార్టీకి మద్దతు తెలపడంతో ఈయనకు ఎస్విబిసి చైర్ పర్సన్ పదవి ఇచ్చారు.
అయితే ఈ పదవిలో కొనసాగుతుండగా ఒక ఆడియో రికార్డు కావడంతో ఈయన ఈ పదవి నుంచి వైదొలగిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎస్విబీసీ చైర్ పర్సన్ పదవి నుంచి బయటకు వచ్చిన పృథ్వి రాజ్ తిరిగి ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ పలు సినిమా అవకాశాలను అందుకున్నారు. అయితే తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
రాజకీయాలలో మాట్లాడే వారికి అవకాశాలు ఉండవని నోరు లేని వారికి కూడా మంత్రి పదవులు ఇస్తున్నారు అంటూ ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర రాజకీయాల గురించి ఆయన ప్రస్తావించారు. ఇక ఈయన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను అయితే తనకు కరోనా వచ్చిన సమయంలో మరుసటి రోజు సూర్యోదయాన్ని చూస్తాన లేదా అని సందేహం కలిగింది. ఈ విధంగా తన ఆరోగ్యం బాగాలేకపోయినా నాకు ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సహకారం కానీ మాట గాని అందలేదని, ఆ సమయంలో నన్ను పలకరించినది మాత్రం సినీ ప్రముఖులే అని పృథ్వీరాజ్ ఈ సందర్భంగా వెల్లడించారు.
తాను రాజకీయాలలో ఉన్నప్పటికీ మెగాస్టార్ కుటుంబం తనను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుందని పృథ్వీరాజ్ ఈ సందర్భంగా వెల్లడించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఆయన పేదల కోసం తన గళాన్ని విప్పుతారు.అయితే ఆయన ఏ విషయాన్ని అయినా చాలా గట్టిగా ప్రశ్నిస్తారు. ఆ విధంగా అడిగే విధానం వీళ్లకు నచ్చకపోవటం వల్ల తన పై వ్యక్తిగత దూషణలకు దిగుతారని పృథ్వీరాజ్ వెల్లడించారు.
ఇక గత ఎన్నికలలో భాగంగా పార్టీ ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్న పృద్వి రాజ్ కు అనంతరం పృధ్విరాజ్ అవసరం రాలేదా అని యాంకర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ పార్టీ గెలిచిన తర్వాత తన అవసరం రాలేదని తనని ఒక టిష్యూ పేపర్ లా వాడుకొని వదిలేసారు. నా విషయంలో అలా జరిగిందని ఈయన తన ఆవేదన వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…