సుకుమార్ దర్శకత్వంలో సమంత రామ్ చరణ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం “రంగస్థలం”. అప్పటివరకు క్లాస్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సుకుమార్ “రంగస్థలం” సినిమా ద్వారా తనలో ఉన్న మాస్ యాంగిల్ ని బయట పెట్టాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటివాడి పాత్రలో,అచ్చం పల్లెటూరి యువకుడిలా ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా తర్వాత నటుడు రామ్ చరణ్ కూడా వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఇకపోతే ఈ సినిమా లోజగపతిబాబు విలక్షణ నటుడి పాత్రలో అద్భుతంగా చేశారు. అదేవిధంగా ఆది పినిశెట్టి రంగమ్మత్త పాత్రలో అనసూయ పాత్ర ఈ సినిమాకు హైలెట్ అయ్యాయని చెప్పవచ్చు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ కూడా కీలక పాత్రల్లో నటించారు.
పృధ్విరాజ్ దాదాపు ఒక వారం రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని తన పాత్రను పూర్తిచేశారు. అదేవిధంగా తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పినప్పటికీ, కొన్ని కారణాల వల్ల పృథ్వీరాజ్ పాత్రను ఎడిటింగ్ లో తీసేసారనీ తాజాగా పృథ్వి రాజ్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. అసలు ఈ సినిమా షూటింగ్ మొత్తం చెప్పి డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆ సన్నివేశాలు తొలగించడానికి కారణం ఏంటి అనే విషయాలను కూడా ఓ ఇంటర్వ్యూలో పృధ్విరాజ్ వెల్లడించారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. రంగస్థలం సినిమాలో నాపై సన్నివేశాలు అన్నింటినీ తెరకెక్కించారు, నా పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పాను. కానీ అమెరికా నుంచి సుకుమార్ స్నేహితుడు ఈయనను ఎందుకు పెట్టుకున్నారు, ఈయన సినిమాలలో ఉంటే రావు గోపాల్ రావుల అవుతారని చెప్పారట అందుకోసమే నేను నటించిన సన్నివేశాలు అన్నింటిని తీసేశారని ఈ సందర్భంగా పృథ్వీరాజ్ తెలియజేశారు.ఇక ప్రస్తుతం పృథ్వి రాజ్ తెలుగు తమిళ సినిమాలలో పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…