Tag Archives: Raj Kundra

మొహం దాచుకున్న రాజ్ కుంద్రా.. మొహమాటం లేకుండా నెటిజన్లు ఏం చేశారో తెలుసా..?

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఇటీవల అతడు అశ్లీల వీడియోల కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఆ సమస్యల నుంచి కొన్ని రోజుల వరకు కోలుకోలేదు. తర్వాత ఇప్పుడిప్పడే వాళ్లు బయటకు రావడం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి ఆలయాలకు, షాపింగ్ లకు వెళ్తూ.. సమయం గడుపుతున్నారు.

అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. రాజ్ కుంద్రాను నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే.. తాజాగా వాళ్లిద్దరు కలిసి ముంబై విమానాశ్రయం వద్ద ఏదో ప్రదేశానికి బయలు దేరి వెళ్లారు. విమానాశ్రయంలో ఉండగా.. అక్కడ ప్రముఖ సెలబ్రిటీ ఫొటో గ్రాఫర్ వైరల్ భయానీ వీడియో తీసి.. ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఆ వీడియోలో ఏ ముందంటే..శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా వేరువేరుగా తమ కార్ల నుంచి దిగి విమానాశ్రయం గేట్ల వైపు నడుచుకుంటూ వెళ్లారు. శిల్పాశెట్టి హడావుడి లేకుండా కారు దిగి.. ఎయిర్ పోర్ట్ గేట్ల వద్దకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. కానీ రాజ్ కుంద్రా మాత్రం కారు దిగి.. తన మొహాన్ని ఎవరికీ కనిపించడకుండా.. తల దించుకొని.. ఫోన్ చూసుకుంటూ.. ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్లాడు.

అయితే ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. రాజ్ కుంద్రా తన ముఖం కవర్ చేసుకున్నందుకు తెగ ట్రోల్ చేశారు. మీ ముఖాన్ని దాచుకునే పనులు ఎందుకు చేస్తారు సార్.. అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. ఇలా మొహం దాచుకోవడం చూసి.. చాలా మంది నవ్వుతారు అంటూ మరొకరు ఇలా కామెంట్ చేశాడు. ఏదేమైనా అతడు కెమెరాలకు చిక్కకుండా.. మొహం దాచుకోవడంపై నెటిజన్లు.. మొహమాటం లేకుండా.. ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు.

అశ్లీల చిత్రాల కేసు.. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు..

అశ్లీల చిత్రాల కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు రూ .50 వేల పూచీకత్తుపై బెయిల్ లభించింది. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను అశ్లీల చిత్రాలు నిర్మించడం, వాటిని విక్రయించడం వంటి ఆరోపణలతో పోలీసులు జులై 19న అరెస్ట్ చేశారు.

అతనిపై భారతీయ శిక్షాస్మృతి మరియు సమాచార సాంకేతికత చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడిన విషయం తెలిసిందే. అప్పటినుంచి జైలులో ఉన్న రాజ్ కుంద్రాకు ఇప్పుడు బెయిల్ లభించింది. అరెస్టైన రెండు నెలల తర్వాత బెయిల్‌ రావడంతో కుంద్రా బయటకు రానున్నారు. ఇటీవలే రాజ్ కుంద్రాపై ముంబయి పోలీసులు 1,400 పేజీల భారీ చార్జిషీటు దాఖలు చేశారు.

ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందని, చార్జిషీటు కూడా దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇకనైనా తనకు బెయిల్ మంజూరు చేయాలని అర్థించారు. అసలు ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని వాపోయారు. బ్రిటన్ సిటిజన్ గా ఉన్న రాజ్ కుంద్రా దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందంటూ పోలీసులు భావించగా.. ఇప్పటికే ఎన్నోసార్లు కుంద్రా బెయిల్ నిరాకరించారు. ఈ క్రమంలోనే కుంద్రా పాస్ పోర్ట్ కూడా స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఈ కేసులో ముఖ్యుడు అతడే అని.. మరికొంత మంది వ్యక్తులతో కలిసి యువతులను మభ్యపెట్టి అశ్లీల చిత్రాల రొంపిలోకి దించేవారని పోలీసులు చార్జిషీటులో పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురైన యువతులను టార్గెట్ చేసినట్లు వెల్లడించారు. ఏదేమైనా బెయిల్ లభించిన కుంద్రా వైవాహిక జీవితం అంతకు ముందు ఉన్నట్లు ఉంటుందా.. లేదా అనే అనుమానాలు వ్యక్తం అవున్నాయి.

విడాకులకు సిద్ధమైన రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి..! బాలీవుడ్ లో మరో చర్చ..!

బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి.. తన భర్త ఓ ప్రముఖ వ్యాపార వేత్త అయినా రాజ్ కుంద్రా గతనెల అశ్లీల వీడియోలను తీసి వాటిని యాప్స్ లో అప్లోడ్ చేస్తూ లక్షలకు లక్షలు డబ్బులు సంపాదిస్తున్నారని అభియోగం రావడంచేత ఆయనని ముంబై పోలీసులు అరెస్టు చేయగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఒక్కసారిగా రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు బయటపడటంతో బాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ అయింది.

ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న రాజ్ కుంద్రా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అతనికి బెయిల్ దొరకలేదు.అయితే తన భర్త ఈ విధమైనటువంటి వీడియోలను చిత్రీకరించి డబ్బులు సంపాదిస్తున్నారనే విషయం తెలియని శిల్పాశెట్టి ఈ విషయం బయటపడటంతో ఒక్కసారిగా షాక్ అయింది. ఈ క్రమంలోనే ఈ కేసులో తనకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు ఈమెను కూడా విచారించారు.

తాజాగా తన భర్త చేసిన పనికి తన వ్యక్తిగత జీవితంపై చాలా ప్రభావం పడుతుందని భావించిన శిల్పాశెట్టి తన నుంచి విడిపోయి తన పిల్లలతో కలిసి ఒంటరిగా జీవించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతను ఈ విధంగా సంపాదించిన డబ్బును తాను తాకకూడదని అందుకే తన నుంచి విడిపోయి ఒంటరిగా జీవించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తన భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా జీవించడానికి సిద్ధపడిన శిల్పాశెట్టి తిరిగి సినిమాలలో నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే అనురాగ్ బసు, ప్రియదర్శన్ వంటి దర్శకులు తమ సినిమాలలో ఈమెకు అవకాశం కల్పించినట్లు సమాచారం.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే శిల్పాశెట్టి తన భర్త పోర్నోగ్రఫీ విషయం బయట పడిన తర్వాత మోటివేషనల్ పోస్టులు పెడుతున్నారు. మరి నిజంగానే శిల్పాశెట్టి తన భర్త నుంచి విడాకులు తీసుకుంటుందా లేదా అనే విషయాన్ని శిల్పాశెట్టి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఆ షోలో జడ్జిగా కనిపించిన శిల్పాశెట్టి.. వీడియో వైరల్..

గత కొన్ని రోజుల నుంచి బాలీవుడ్‌‌‌లో సంచలనం రేపిన శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే కొనసాగుతుంది. గతంలో ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టు యజమానిగా వ్యవహరించిన రాజ్‌కుంద్రా పోర్న్ చిత్రాలు నిర్మించే స్థాయికి దిగజారడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. పోర్న్ చిత్రాల ద్వారా ఆయన పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. అయితే అతడి చీకటి కోణాలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి.

ఈ కేసు నడుస్తుండగానే మరికొంత మంది మోడల్స్ బయటకు వచ్చి అతడిపై ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి ఈ కేసు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బయటపడింది. ఆసమయంలోనే మహిళలను బలవంతంగా శృంగార సినిమాల్లోకి నెట్టిన ఆరోపణలపై ఐదుగురిని అరెస్టు చేశారు. దీనిపై విచారణ ప్రారంభించిన మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులకు పోర్న్ చిత్రాల వ్యాపార రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. ఇందులో భాగంగానే ఇంగ్లాండ్ వేదికగా యూకే ప్రొడక్షన్ యజమాని ఉమేష్ కామత్ తో రాజ్ కుంద్రాకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు.

సినిమాలో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలను.. అవకాశం కచ్చితంగా కల్పిస్తానని చెప్పి.. ఈ ఊబిలోకి దించుతున్నారని పోలీసులు తెలిపారు. ఇలా తన భర్త వ్యవహారాలు ఒకొక్కటిగా బయటకు వస్తుండటంతో శిల్పాశెట్టికి తలనొప్పులు మొదలయ్యాయి. ఇప్పటికే సినిమాలకు దూరంగా ఉన్న శిల్పాశెట్టి టీవీ షోలల్లో జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే వాటికి కూడా గత కొన్ని రోజుల నుంచి దూరంగా ఉన్నారు. కొన్ని ప్రొడక్ట్స్ ఉత్పత్తులకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ స్థానాన్ని కూడా వదులుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ముందు ఆమె కనిపించకవోచ్చు అంటూ.. అందరూ అనుకున్నారు.

https://www.instagram.com/p/CStWn_pK3ma/?utm_source=ig_web_copy_link

కానీ తాజాగా ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్న ఓ షోలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ ప్రముఖ ఛానెల్లో ప్రసారమవుతున్నా ‘సూపర్ డాన్సర్-4’కు జడ్జిగా శిల్పా వ్యవహరిస్తున్నారు. ఆమె జడ్జి సీటు ఆమెకు ఇంకా కేటాయించడానికి కారణం ఏంటంటే.. ఈ షో పాపులర్ అవ్వడానికి కారణం శిల్పాశెట్టి అవ్వడమే. అందుకే ఆమె మళ్లీ ఇలా షోలో అడుగుపెట్టారు. అయితే ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. భర్త జైల్లో ఉండగా ఇలా శిల్పాశెట్టి షోలు చేయడం ఏంటని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా అరెస్టు కాగానే.. సాక్షాలు నాశనమయ్యాయి?

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో పోర్నోగ్రఫీ కేసు తీవ్ర సంచలనంగా మారింది.బాలీవుడ్ నటి శిల్పా భర్త ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో గత రెండు వారాల క్రితం ముంబై పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రాజ్ కుంద్రాను అరెస్టు చేసినప్పటి నుంచి పోలీసులు ఈ కేసును పలు కోణాలలో విచారిస్తున్నారు.ఈ కేసును ఆరా తీసేకొద్దీ పలు ఆసక్తికరమైన సంఘటనలు బయటపడుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం పోర్నోగ్రఫీ కేసు ద్వారా రాజ్ కుంద్రాను పోలీసులు కస్టడీలోకి తీసుకోగానే ఆ కేసుకు సంబంధించిన పలు సాక్షాలన్నింటిని నాశనం చేశారని ముంబై హైకోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుణ్ పాయ్ వెల్లడించారు.రాజ్ కుంద్రా అరెస్ట్ అవుతాడని ముందుగా గ్రహించడం చేతనే ఈ సాక్షాలు అన్నింటిని నాశనం చేశారని, తన వాట్సాప్ చాట్,హాట్ షాట్ బోలీ ఫేమ్ యాప్ లను ముందుగానే నాశనం చేసినట్లు తెలిపారు.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కోకుండా రాజ్ కుంద్రా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మాత్రం ఈ రెండు వెబ్ సైట్ల నుంచి సుమారు 50కి పైగా అశ్లీల చిత్రాల వీడియోలను సేకరించినట్లు తెలిపారు. రాజ్ కుంద్రా తీసిన ఈ పోర్నోగ్రఫీ వీడియోలను హాట్ షాట్ యాప్ లోఅప్లోడ్ చేస్తూ లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు అనే ఆరోపణలు రావడం చేతనే గతవారం అతనికి బెయిల్ రద్దయిందని తెలిపారు.

ఈ విధంగా తన అరెస్టు గురించి ముందుగా గ్రహించి సాక్ష్యాధారాలను నాశనం చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనను వినిపించారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై మరింత లోతుగా విచారణ చేపట్టే వరకు అతనికి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ తనని డిమాండ్ కి తరలించారు. ప్రస్తుతం రాజ్ కుంద్రా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇక ముందు ముందు రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు విషయంలో ఎలాంటి నిజాలు బయట పడతాయన్న విషయం ప్రస్తుతం బీ టౌన్ లో చర్చనీయాంశంగా మారింది.

అవకాశాల పేర్లతో అమాయకులతో బ్లూ ఫిలిమ్స్ .. సెట్లోనే మోడల్ అరెస్ట్!

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు తీవ్ర సంచలనంగా మారిన సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా మరో ఫోర్న్ రాకెట్ కేసు వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్లోని ఎవరికీ తెలియకుండా ఈ విధంగా బ్లూ ఫిలిమ్స్ తీసుకున్నటువంటి ఓ మోడల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే బాధితులు తెలిపిన ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేసి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

నటి నందితా దత్త ఒకప్పుడు ఎంతో పాపులారిటీ ఉన్న మోడల్. ఈ క్రమంలోనే ఆమె పలు సినిమాలలో హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలోనే ఎలాంటి సినిమా అవకాశాలు రాకపోవడంతో ఈ విధంగా బ్లూ ఫిలిమ్స్ లో నటిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే తనకున్న పరిచయాలను ఆధారంగా చేసుకొని యంగ్ మోడల్స్‌కు వెబ్‌ సిరీస్ అవకాశాలను ఎర్రగా వేస్తూ వారిని లొంగదీసుకుంది. ఈ క్రమంలోనే వారిని బ్లూ ఫిలిమ్స్ లో నటించమని వారిపై అధిక ఒత్తిడి తీసుకు వచ్చేది.

ఈ విధంగా నందిత అరాచకాన్ని ఇద్దరు మోడల్స్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆమె నివసిస్తున్న అటువంటి డమ్‌ డమ్‌, నక్‌టాలాలోని కొన్ని ఇళ్లల్లో ఒకేసారి దాడులు జరపగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది.నక్‌టాలాలోని ఓ ఇంట్లో ఒక మోడల్ ను నగ్నంగా నటించాలని ఒత్తిడి చేస్తున్న క్రమంలో పోలీసులు ఆమెను రెడ్ హ్యాండ్ గా అరెస్టు చేశారు. అదేవిధంగా డమ్ డమ్ మా ఇంట్లో తన అనుచరుడు నీలి చిత్రాలను షూటింగ్ చేస్తున్న క్రమంలో అతను పట్టుబడ్డాడు.

ఈ విధంగా బాధితులు తెలిపిన ఫిర్యాదు మేరకు రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు అరెస్టు చేయడంతో బాధితులు ఫిర్యాదు చేశారు.అవకాశాల ఆశచూపి ఇంత దారుణానికి పాల్పడ్డారని నీలి చిత్రాలలో చేయడానికి ఒప్పుకోకపోతే తన మనుషుల చేత చంపిస్తానని బెదిరిస్తారు అంటూ ఫిర్యాదు చేశారు. అయితే ఈ విధంగా బయటపడిన వీరి సెక్స్ రాకెట్ కేసుకు రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసుకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

గదిలో బంధించి.. ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించాడు..! విచారణలో షెర్లీన్ చోప్రా వెల్లడి..!

ఈ మధ్య సంచలనం రేపిన రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో శృంగార తార షెర్లీన్ చోప్రా సంచలన విషయాలను బయటపెట్టింది. జూలై 27న విచారణకు హాజరైన ఆమెను అధికారులు ప్రశ్నించగా రాజ్ కుంద్రా లైంగిక వేధింపులను చెప్పి ఆవేదనకు గురైంది. కుంద్రా గురించి చెబుతూ.. అతడు ఎప్పుడూ చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఉండేవాడు అనే విషయాలను షెర్లీన్ చోప్రా పేర్కొన్నారు.

అంతేకాకుండా రాజ్ కుంద్రా తనతో పిచ్చి వేషాలు వేసేందుకు ప్రయత్నించాడని.. ఆయన వ్యవహారంతో భయమేసిందని ఆమె విచారణలో భాగంగా చెప్పింది. తనను ఓ రోజు గదిలో బంధించాడని.. ఎలాగోల తప్పించుకొని తాను వాష్ రూమ్ లో దాచుకున్నానని చెప్పింది.

ముద్దు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నించినట్లు ఆమె చెప్పింది. నాపై రాజ్ కుంద్రా దారుణంగా వేధింపులకు పాల్పడ్డారు అని షెర్లీన్ చోప్రా తెలిపారు. రాజ్ కుంద్రాపై ఏప్రిల్‌ 2021లోనే లైంగిక వేధింపుల కేసును నమోదు చేసింది. కుంద్రా, అతడి బిజినెస్ మేనేజర్‌తో మీటింగ్ జరిగింది. ఆ సమయంలోనే నా పేరు (షెర్లీన్ చోప్రా యాప్)తో యాప్‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. పోర్న్ కంటెంట్ తో యాప్ ను రిలీజ్ చేద్దాం.. అంటూ తనను బలవంతం కూడా చేసినట్లు ఆమె చెప్పింది.

తాను దీనికి ఒప్పుకోకపోవడంతో తీవ్ర వాదనలు కూడా జరిగాయని ఆమె పేర్కొంది. రాజ్ కుంద్రాకు శిల్పాశెట్టికి మధ్య సంబంధాలు సరిగా లేవని ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులకు వెల్లడించింది. ఆమె మార్చి 2021 లోనే పోర్న్ రాకెట్ కేసులో విచారణకు హాజరైంది. సైబర్ సెల్‌ విభాగంలోని అధికారులకు అన్ని విషయాలు వెల్లడించాను. ఇంకా చెప్పాల్సినవి ఏమీ లేవు అని షెర్లీన్ చోప్రా చెప్పినట్టు సమాచారం.

శిల్పా శెట్టి నిద్రపోయాక తన చెల్లెలితో..నైట్ పార్టీలు చేసుకున్న రాజ్ కుంద్రా.. బయటపడుతున్న నిజాలు!

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేస్ హాట్ టాపిక్ గా మారింది. రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ చేస్తూ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు రావడంతో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను ఈనెల 19న అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ముంబై పోలీసులు కేసు గురించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.

రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో తన భార్య శిల్పాశెట్టికి కూడా ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులు ఆమెను కూడా విచారిస్తున్నారు. తాజాగా ఈ కేసులో మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా తన కుటుంబ విషయాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

తాజాగా రాజ్ కుంద్రా శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి పాల్గొన్న కపిల్ శర్మ ఇంటర్వ్యూ వీడియో ఒకటి బయట పడింది.ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా శిల్పా శెట్టి సోదరి రాజ్ కుంద్రా మధ్య ఉన్న పలు రహస్యాలు బయటపడ్డాయి.ఈ వీడియోలో భాగంగా రాజ్ కుంద్రా రాత్రి శిల్పాశెట్టి నిద్ర పోయిన తరువాత తన సోదరితో కలిసి నైట్ పార్టీలకు వెళ్లేవాళ్ళమని తెలిపారు. అలాగే శిల్పాశెట్టి తన వివాహం జరిగినప్పుడు షమితా శెట్టి నెలరోజులపాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన విషయం కూడా బయటపడింది.

శిల్పాశెట్టి సోదరితో కలిసి పార్టీలకు వెళ్లడం విషయంపై శిల్పా శెట్టి స్పందిస్తూ…రాజ్‌.. శెట్టి సోదరీమణులతో ప్యాకేజీ ఒప్పందం కుదుర్చుకున్నాడనీ తెలుపగా ఆ సమయంలో రాజ్ కుంద్రా తన వైపు చూస్తూ తనను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేననీ చెప్పడంతో తన సోదరి మీరు దారుణంగా మాట్లాడుతున్నారు అంటూ స్పందించింది. ఇలా వీరందరి మధ్య ఎంతో హాస్యాస్పదంగా సాగిన ఈ వీడియో ప్రస్తుతం అనేక అనుమానాలకు దారి తీయడం గమనార్హం. అయితే ఈ విచారణలో భాగంగా మరెన్ని విషయాలు బయటపడతాయో తెలియాల్సి ఉంది.

ఫోర్న్ కేసులో శిల్పాశెట్టికి సంబంధం ఉందా… అనుమానాలను పెంచిన ఆ వీడియో?

బాలీవుడ్ ఇండస్ట్రీలో గత వారం రోజుల నుంచి ఫోర్న్ రాకెట్ కేసు తీవ్ర సంచలనం రేపుతోంది. రోజురోజుకు ఈ కేసులో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే క్రైమ్ బ్రాంచ్, సైబర్ సెల్, విభాగాలు వివిధ కోణాలలో ఈ కేసును దర్యాప్తు చేస్తూ ఒక్కొక్కటిగా బయటపేడుతున్నారు. తాజాగా ఈ కేసులో రాజ్ కుంద్రా భార్య సినీ నటి శిల్పాశెట్టిని కూడా విచారించాలని భావిస్తున్నారు.

ఈ కేసులో ఇప్పటి వరకు కేవలం రాజ్ కుంద్రాను మాత్రమే విచారించిన పోలీసులు ఇప్పుడు వారి దృష్టిని శిల్పాశెట్టి పైకి మరలించారు. నిన్నటి వరకు ఈ కేసు విషయంలో శిల్పాశెట్టికి ఏమాత్రం సంబంధం లేదని మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు స్పష్టం చేశారు. కానీ గతంలో శిల్పా శెట్టి జేఎల్ స్ట్రీమ్ సమస్థకి సంబంధించిన వెబ్ సైట్ కు ప్రచారకర్తగా వ్యవహరించారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ కంపెనీలో ఫోర్న్ రాకెట్ జరుగుతుందని ఆరోపణలు రావడం చేత పోలీసులు శిల్పాశెట్టి పై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించడం వల్లే ఇప్పుడు ఈ వ్యవహారంలో శిల్పాశెట్టి పాత్ర ఉంటుందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ కంపెనీకు,శిల్పాశెట్టికి ఉన్న సంబంధాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.అలాగే రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన తర్వాత మీడియాకు దూరంగా ఉంటున్న శిల్పాశెట్టి శుక్రవారం తన భర్త గురించి భావోద్వేగమైన పోస్ట్ చేయడం విశేషం. ఈ విధంగా శిల్పాశెట్టిపై పలు అనుమానాలు వ్యక్తమవడంతో ఆమెను కూడా విచారించాలని భావించడంతో ఈ విషయం బీ టౌన్ లో చర్చనీయాంశంగా మారింది.

భర్త అరెస్టు తర్వాత మొదటిసారి స్పందించిన శిల్పాశెట్టి… ఏమన్నారంటే?

అశ్లీల చిత్రాలను తీస్తూ.. వాటిని యాప్ లో అప్లోడ్ చేస్తూ అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త… బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తన భర్త అరెస్ట్ అయిన తరువాత శిల్పాశెట్టి ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు.

తాజాగా శిల్పాశెట్టి సోషల్ మీడియా వేదికగా మొదటిసారిగా స్పందించారు. ఈ క్రమంలోనే ఆమె గురువారం రాత్రి ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటోను షేర్ చేశారు. ఇందులో ప్రస్తుతం మమ్మల్ని బాధపెట్టిన వ్యక్తులపై.. మేము అనుభవిస్తున్న టువంటి దురదృష్టం.. చిరాకుపై మేము తిరిగి కోపాన్ని చూస్తాము. ప్రస్తుతం మేము మా ఉద్యోగాలను కోల్పోవచ్చు, లేదా ప్రియమైన వ్యక్తులను కోల్పోవచ్చు అయితే అందరం ఉండాల్సింది ఇక్కడే.

ప్రస్తుతం ఏం జరిగిందో.. ఏం జరుగుతుందో అని ఆత్రుతగా ఎదురు చూడటం లేదు. జరుగుతున్నది మాత్రం పూర్తిగా నాకు తెలుసు. ఇప్పటి వరకు గతంలో వచ్చిన సవాళ్లను తట్టుకున్నాను.. భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఈ జీవితాన్ని గడపడం కోసం మనం ఏది మార్చుకోవాల్సిన పనిలేదని తెలిపారు.

ప్రస్తుతం శిల్పా శెట్టి షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో షేర్ చేయడంతో శిల్పాశెట్టి ప్రస్తుత తన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుపుతూ ఎలాంటి పరిస్థితులు వచ్చిన ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో శిల్పాశెట్టి తన భర్త కు మద్దతుగా నిలబడతారా.. లేక వ్యతిరేకంగా పోరాడుతారా అనే విషయం తెలియాల్సి ఉంది.