Tag Archives: RAJINI

Revanth Reddy: రజనీకి ఉద్యోగం ఇచ్చి మాట నిలబెట్టుకున్న రేవంత్…ఏ ఉద్యోగం ఇచ్చారు జీతం ఎంతో తెలుసా?

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఆరు గ్యారెంటీ హామీల ఫైల్ పై ఆయన సంతకం చేశారు. ఇక రెండవ సంతకం దివ్యాంగ మహిళ అయినటువంటి రజనికి ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేస్తూ రేవంత్ రెడ్డి రెండవ సంతకం చేశారు.

ఇక ఈయన ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే రజిని ఆహ్వానించి ఆమెకు ప్రభుత్వ కొలువులో నియామక పత్రాన్ని అందజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్టోబర్ 17వ తేదీ గాంధీభవన్ లో రేవంత్ రెడ్డిని కలిసినటువంటి రజిని హైదరాబాద్ నగరం నాంపల్లి దగ్గరలోని బోయిగూడకు చెందినది. ఈమె లయోలా స్కూల్, వనితా కాలేజీల్లో చదివారు. ఓపెన్ యూనివర్సిటీలో ఎంకామ్ పూర్తి చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డిని కలిసినటువంటి ఈమె తనకు ఉద్యోగం లేదు అంటూ తన బాధను మొత్తం చెప్పకున్నారు అయితే తన పరిస్థితి విన్నటువంటి రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి తన ఉద్యోగ నియామక పత్రంపై సంతకం చేస్తానని తెలియజేశారు.

టీఎస్‌ఎస్ఓసీఏ మేనేజర్ గా రజిని..

ఇక ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం రజనికి ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేస్తూ మొదటి ఉద్యోగ నియామక పత్రకం పై సంతకం చేశారు.ఆమెకు తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ (టీఎస్‌ఎస్ఓసీఏ)లో ప్రాజెక్టు మేనేజర్‌గా కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగం కల్పించారు ఇక ఈమెకు నెలకు 50 వేల వరకు వేతనం రాబోతుందని నియామక పత్రాలలో పేర్కొన్నారు.

Balakrishna: ఇన్నేళ్ల సినీ కెరియర్లో బాలయ్య ఇద్దరు హీరోయిన్లకు మాత్రమే లిప్ లాక్ పెట్టారని తెలుసా.. ఆ ఇద్దరు ఎవరంటే?

Balakrishna: ప్రస్తుత కాలంలో వచ్చే సినిమాలలో తప్పనిసరిగా లిప్ లాక్ సన్నివేశాలు ఉంటేనే సినిమా యువతను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే హీరోయిన్లు కూడా భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ లిప్ లాక్ సన్నివేశాలకు సై అంటున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలు క్రితం లిప్ లాక్ సన్నివేశాలకు హీరోయిన్లు చాలా దూరంగా ఉండేవారు.

ఇక తప్పనిసరి పరిస్థితులలో తప్ప వీళ్ళు లిప్ లాక్ సన్నివేశాలకు ఒప్పుకునే వారు కాదు.ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో దాదాపు 47 సంవత్సరాల సినీ కెరియర్లో నందమూరి నటసింహం బాలకృష్ణ కేవలం రెండుసార్లు మాత్రమే హీరోయిన్లకు లిప్ లాక్ పెట్టారట.

సాధారణంగా బాలకృష్ణ ఇలాంటి సన్నివేశాలకు చాలా దూరంగా ఉంటారు కానీ ఈయన నటించిన కేవలం రెండు సినిమాలలో ఓ పాటలో భాగంగా ఇలా ఇద్దరు హీరోయిన్లకు లిప్ లాక్ పెట్టారు. మరి బాలకృష్ణ లిప్ లాక్ పెట్టిన ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు ఆ సినిమాలు ఏమిటి అనే విషయానికి వస్తే…

 


Balakrishna బాలయ్య లిప్ లాక్ చేసిన హీరోయిన్లు వీళ్లే…

1987లో బాలకృష్ణ రజనీ హీరో హీరోయిన్లుగా రాము అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఓ పాటలో భాగంగా బాలకృష్ణ హీరోయిన్ రజనీకి లిప్ లాక్ చేశారు.అలాగే 2012 వ సంవత్సరంలో శ్రీమన్నారాయణ సినిమాలో భాగంగా నటి ఇషా చావ్లాకు బాలకృష్ణ లిప్ లాక్ చేయాల్సి వచ్చింది. ఇలా తన 47 సంవత్సరాల సినీ కెరియర్లో బాలకృష్ణ కేవలం ఇద్దరి హీరోయిన్లకు మాత్రమే లిప్ లాక్ చేశారు.

రజిని అంటే రాజేంద్రప్రసాద్ కు ఎందుకు అంత ఇంట్రెస్ట్..? వారిద్దరి మధ్య ఏం జరిగింది..?

‘అహ నా పెళ్లంట’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు. 1987 లో విడుదలైన ఈ సినిమా ఒక ట్రెండ్ ను సెట్ చేసింది. అయితే ఇందులో హీరో, హీరోయిన్లుగా రాజేంద్రప్రసాద్, రజిని నటించిన విషయం తెలిసిందే. ఆ ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ, రొమాన్స్‌ ఎంతగానో కుదరింది. దీంతోనే వారిద్దరి పెయిర్ ఎంతగానో హిట్ అయింది.

ఆ సినిమా తర్వాత ఎన్నో చిత్రాల్లో వీరిద్దరు కలిసి నటించారు. ప్రస్తుతం ఒక సినిమాలో హీరో, హీరోయిన్ లు హిట్ కొట్టారంటే.. అదే పెయిర్ ను కొనసాగించాలని దర్శక, నిర్మాతలు చూస్తుంటారు. అంతేకాకుండా వాళ్ల మధ్య ఎదో ఉందని.. సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వస్తుంటాయి. ఈ ఆచారం అప్పట్లో కూడా ఉండేదట. వాళ్లిద్దరు కలిసి మాట్లాడుకున్నా ఏదో ఉందని అనుకునే వారట. ఎన్నో కథనాలను పత్రికల్లో రాశారని రజిని చెప్పుకొచ్చారు.

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. రాజేంద్ర ప్రసాద్ తో కొంత మంది హీరోయిన్లు నటించమని చెప్పినప్పుడు అతనితో నటించడానికి రజిని ముందుకు వచ్చి ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డానికి తనను అడిగిన‌ప్పుడు తనకు చిన్నా, పెద్దా అనే తేడా లేదు. ఒక‌ప్పుడు నేనూ కొత్తే, నేనూ చిన్నే కనుక రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమా చేస్తాన‌ని చెప్పి అతనితో సినిమాలు చేశానని చెప్పుకొచ్చారు.

అందుకే రాంజేంద్రప్రసాద్ కు తను అన్నా.. తన ఫ్యామిలీ అన్న ఎంతో అభిమానం అంటూ చెప్పారు. తను ఎప్పుడూ తన అందానికి గల రహస్యం ఏంటి? అని అడిగేవారని.. మీరు ఏం తింటారు? అంటూ అడిగేవారని తెలిపారు. నా డైట్ ఏంటి.. ఏం తింటుంది అంటూ.. మా అమ్మను అడిగేవారని తెలిపింది. దానికి సమాధానంగా రజిని తల్లి … ప్ర‌త్యేకంగా త‌నేమీ తిన‌దు బాబు అంటూ చెప్పేదని రజిని చెప్పారు. ఇలా వీరిద్దరు ఎంతో చనువుగాఉండటంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అని ఓ సందర్భంలో తెలియజేశారు.

హాకీ ప్లేయర్ రజినీకి ఏపీ ప్రభుత్వం నజరానా!

భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు, తెలుగు అమ్మాయి రజినీకి ఏపీ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. టోక్యో నుంచి తిరిగి వ‌చ్చిన ర‌జ‌నీ ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో క్యాంపు ఆఫీసులో స‌మావేశం అయ్యింది. ర‌జ‌నీకి 25 ల‌క్ష‌ల రూపాయ‌ల న‌గ‌దు బ‌హుమ‌తిని ప్ర‌క‌టించారు. దాంతో పాటు ఆమె కోరుకున్న‌ట్టుగా తిరుప‌తిలో వెయ్యి గ‌జాల ఇంటి స్థ‌లాన్ని కేటాయించారు. నెల‌కు 40 వేల రూపాయ‌ల చొప్పున ఇన్సెంటివ్స్ ఇవ్వాల‌ని కూడా అధికారుల‌ను జ‌గ‌న్ ఆదేశించారు.

కాగా గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ర‌జ‌నీకి ప్ర‌క‌టించిన ప్రోత్స‌హ‌కాలు పెండింగ్ లో ఉన్న విష‌యాన్ని ఆమె ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్లిన‌ట్టుగా స‌మాచారం. వాటిని స‌త్వ‌రం కేటాయించాల‌ని కూడా జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించిన‌ట్టు తెలిసింది.

.