Tag Archives: rashmika

ప్రెస్ మీట్ లో ఇబ్బందిగా రష్మిక.. జర్కిన్ తో అలా కవర్ చేసింది.. వేసుకోవడం ఎందుకు ఇబ్బంది పడటం ఎందుకు అంటున్న నెటిజన్స్

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా.. సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియన్ చిత్రం పుష్ప: ది రైజ్ – పార్ట్ 1 . ఈ చిత్రం నేడు ఉదయమే ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు పుష్ప నిర్మాతలు చేయగలిగినదంతా చేశారు.

తెలంగాణ , తమిళనాడు పర్యటనల అనంతరం సిబ్బంది నిన్న సాయంత్రం బెంగళూరు చేరుకున్నారు . అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని రద్దు చేశారు. అల్లు అర్జున్ , అతని సహచరులు ఊహించిన దాని కంటే కొంచెం ఆలస్యంగా లొకేషన్‌కు చేరుకున్నారు. ఈ వార్తలపై బెంగళూరు జర్నలిస్టులు తీవ్రంగా స్పందించారు.

దీనికి అల్లు అర్జున్ క్షమాపణ కూడా చెప్పిన విషయం తెలిసిందే. వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రైవేట్ విమానం టేకాఫ్ కాలేకపోయిందని వివరిస్తూ.. క్షమించండి అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. ఈ ప్రమోషన్లో భాగంగా అల్లు అర్జున్ తో పాటు రష్మిక కూడా పాల్గొంది. అక్కడ ఆమె తన పొట్టి డ్రెస్ ల వల్ల కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినట్లు కనిపించింది.

ఆ వేదిక పై ఉన్నంత సేపు ఈ అమ్మడు బ్లేజ‌ర్‌ని కాళ్ల‌పై వేసుకొని క‌వ‌ర్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. దీనికి నెటిజన్ల నుంచి వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. రష్మిక మందన్నా కావాలని బి-గ్రేడ్ నటిలా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అంత షో చేయాల్సిన అవసరం లేదని మరికొంతమంది ఘాటుగానే కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోలతో పాటు నెటిజన్ల కామెంట్ కూడా వైరల్ అవుతోంది .

దీనిని హీరోయిన్ గా తీసుకోకుండా ఉండాల్సిందన్న నెటిజన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మిక!

బన్నీ, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్‌17న ఈ చిత్రం విడుదల కానుండటంతో మూవీ టీం ప్రమోషన్స్‌లో ఫుల్‌ బిజీగా ఉంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలవుతున్న నేపథ్యంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు ప్రమోషన్లో భాగంగా వెళ్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఫుల్ గా పెరిగిపోయింది.

ఒకప్పుడు సెలబ్రిటీలను చూడాలన్నా.. కలవాలన్నా.. ఎంతో కష్టపడాల్సి వచ్చేది. కానీ.. ప్రస్తుతం అలా లేదు. ఏ చిన్న అప్ డేట్ వచ్చినా.. తమ అభిమానులతో సెలబ్రిటీలు పంచుకుంటున్నారు. ఈ విషయంలో కొన్ని సార్లు సెలబ్రిటీలకు తలనొప్పులు తప్పడం లేదు. వారు షేర్ చేసే ఫోటోలు.. వీడియోలపై నెగిటివ్ కామెంట్లు చేయడంతో అది వారికి రుచించడం లేదు.

ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతుంటాయి. ఇటీవల రాజ్‌పుత్‌కి సంబంధించిన ఓ వీడియోపై పాయల్ రాజ్‌పుత్‌ను ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప హీరోయిన రష్మికాను ఓ నెటిజన్ ట్రోల్ చేశాడు . ఏం జరిగిందటే.. రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సామీ సామీ సాంగ్‌ కోసం ఎంతో కష్టపడ్డా. అది చూశాక అందరూ నన్ను ప్రశంసిస్తే చాలు. డైరెక్టర్స్‌ ఏం చెబితే అదే నేను చేస్తా’ అంటూ మాట్లాడిన వీడియోను రష్మిక తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. అసలు దీన్ని హీరోయిన్‌గా తీసుకోకుండా ఉండాల్సింది. ఇది..దీని ఓవర్‌ యాక్టింగ్‌ అంటూ కామెంట్‌ చేశాడు. ఇది చూసిన రష్మిక.. ”యాక్టింగో, ఓవరాక్టింగో.. నేను జీవితంలో ఏదో ఒకటి సాధించాను. నువ్వు ఏం సాధించావు నాన్నా” అంటూ దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారంది.

సినిమా స్టోరీ నాకు చెప్పనేలేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన పుష్ప హీరోయిన్ రష్మికా..!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ప్రెస్టేజియస్ మూవీ పుష్ఫ. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వేయిట్ చేస్తున్నారు. ఇప్పటికే దేవీశ్రీప్రసాద్ అందిచిన మ్యూజిక్ అభిమానులను అలరిస్తోంది.

దీంతో ఈసినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాపై సంచనల వ్యాఖ్యలు చేసింది హరోయిన్ రష్మికా మందన్న తనకు స్టోరీ తెలియకుండానే యాక్ట్ చేశానని చెప్పింది.
సుకుమార్ సినిమా అంటేనే స్టోరీని సీక్రెట్ గా ఉంచుతారు. స్టోరీ గురించి ఒకరిద్దరికి తప్పితే ఎక్కువ మందితో డిస్కస్ చేయరనే అభిప్రాయం కూడా ఉంది.

షూటింగ్ సమయంలో చిన్నచిన్న మార్పులు చేయడం.. కథను మార్చడం వంటివి చేస్తుంటాడు. సినిమా డిసెంబర్ 17న విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను చేస్తోంది. వీటికి రష్మికా స్పెషల్ అట్రక్షన్ గా నిలుస్తున్నారు. తాజాగా సినిమా గురించి రష్మికా ఆసక్తికర కామెంట్లు చేసింది. పుష్ఫ సినిమా చేస్తున్న సమయంలో కథ గురించి తెలియదని.. డబ్బింగ్ చెబుతున్నప్పుడే కథ గురించి తెలిసిందన్నారు.

ఈ సినిమాను మిస్ చేసుకుంటే.. పెద్ద హిట్ ను కోల్పోయేదాన్ని అని చెప్పుకుంటూ వచ్చింది. ఈ చిత్రంలో రష్మికా డీ గ్లామరస్ రోల్ లో కనిపిస్తోంది. బన్నీ ఊరమాస్ గెటప్ లో లారీ డ్రైవర్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. సినిమా ఈనెల 17న విడుదలవుతోంది. విడుదల తరువాత ఎన్ని రికార్డులను పుష్ప మూవీ కొల్లగొడుతుందో చూడాలి.

చిన్న వయసు వారితో డేటింగ్ చేస్తే తప్పేంటి… షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక!

రష్మిక మందన్నా ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎంతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ కన్నడ హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. రష్మిక ఏకంగా పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే రష్మిక ఇంటర్వ్యూలో తన రిలేషన్‌షిప్‌ స్టేటప్‌పై ఓపెన్‌ అప్‌ అయ్యింది. ఈ క్రమంలోనే ఒక మీడియా వ్యక్తి మీరు మీ కన్నా చిన్న వ్యక్తితో డైటింగ్ చేస్తారా? అని ప్రశ్నించగా అందుకు రష్మిక తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ వయసుకు ప్రేమకు ఏమాత్రం సంబంధం లేదని.. మనసుకు నచ్చిన వారిని మన లైఫ్ పార్ట్నర్ గా ఎంచుకుంటే తప్పేముందని దానికి వయసుతో పని ఏముందని తెలిపారు. మనం వారితో ఏ విధంగా ప్రవర్తిస్తాము అనేది ముఖ్యం అంతేకానీ వారు మనల్ని మార్చడం కోసం ప్రయత్నించకూడదు అంటూ రష్మిక పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ఈమె సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప అనే సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా శర్వానంద్ హీరోగా ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా మూడు చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

అతనితో అనుభవాలు మరిచిపోలేను.. రష్మిక!

టాలీవుడ్ లో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న రష్మిక మందన్న ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఛలో సినిమాతో తెలగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు గీతాగోవిందంతో ఆ మార్క్ ను సెట్ చేసుకుంది. అంతే కాకుండా అగ్రహీరోల సరసన నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది. మహేశ్ బాబు సరసన ఈమె సరిలేరునీకెవ్వరులో నటించింది. తర్వాత ఇప్పుడు విడుదల రాబోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పుష్పలో కూడా నటించింది.

దీనిలో గిరిజన మహిళగా నిటించింది. అయితే రష్మికకు టాలీవుడ్ లోనే కాక బాలివుడ్ లో కూడా అవకాశాలు వచ్చేస్తున్నాయి. ‘గుడ్ బై’ చిత్రంతో బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇస్తోంది కన్నడ బ్యూటీ. తొలి చిత్రంలోనే బిగ్ బి లాంటి లెజెండ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కొట్టేసింది రష్మిక మందన్న. అయితే ఈ మధ్య ‘గుడ్ బై’ సినిమా షూటింగ్ పూర్తైన సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. “అమితాబ్ తో నటించటం ఆనందంగా ఉంది. చాలా రోజుల పాటూ షూటింగ్ చేయటం వల్ల యాక్టర్స్ ఒకర్ని ఒకరు బాగా తెలుసుకోగలుగుతారు. మేమంతా అదే చేశాం.

అందువల్లే చక్కటి పర్ఫామెన్సెస్ వచ్చాయి. డైరెక్టర్, మిగతా వారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ‘గుడ్ బై’ సినిమా ఒక క్రేజీ ఎక్స్ పీరియన్స్” అని చెప్పుకొచ్చింది. మొదటి రోజు అమితాబ్‌‌తో కలిసి పనిచేసిన అనుభవాలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అమితాబ్‌‌‌తో కలిసి నటించడం జీవితంలో మరిచిపోలేనిది అంటుంది ఈ బ్యూటీ. ‘ముందు రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత దర్శకుడు వికాస్‌‌తో నెక్స్ట్ డే చేయాల్సిన సన్నివేశాల గురించి ఎక్స్‌‌‌ప్లైన్ చేయించుకుని వాటిని అమితాబచ్చన్‌‌‌తో ఎలా చేయాలా అనేది చర్చించి మరీ ప్రాక్టీస్ చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది.

ఆయనతో నటించేటప్పుడు పాత్రలో లీనమైపోవడంతో పెద్దగా ఆందోళన పడలేదని అంటుంది. ఆయనతో కలిసి నటించడం పెద్ద కష్టమే కాదు అని చెప్పుకొచ్చింది ఈ లక్కీ బ్యూటీ. వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ‘గుడ్ బై’ మాత్రమే కాక సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్నూ’సినిమా కూడా చేస్తోంది ఈ భీష్మ బ్యూటీ.

పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నందుకే రష్మిక మందన్న స్టార్ హీరోయిన్ అయిందా..?

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న సినిమాల కారణంగా పెళ్ళి క్యాన్సిల్ చేసుకుందని సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి. అందుకు కారణం ఆమె ఎంగేజ్‌మెంట్ అయ్యాక పెళ్ళి రద్దు చేసుకోవడమే. రష్మిక కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరజ్‌పేట్‌లో పుట్టింది. ఆమె కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. ఎం.ఎస్.రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఇక బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఇన్ 2014 జాబితాలో స్థానం సంపాదించింది రష్మిక మందన్న. అంతేకాదు 2016లో 24వ స్థానం లభించగా, 2017లో మొదటి స్థానంలో నిలిచింది.

దాంతో బాగా పాపులారిటీ సాధించింది. 2014 లో రష్మిక మందన్న మోడలింగ్ రంగంలో ఎంటరైంది. ఆమె అదే సంవత్సరం క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది, క్లీన్ & క్లియర్ బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ కన్నడ చిత్ర పరిశ్రమలోని దర్శక, నిర్మాతల దృష్ఠిని ఆకర్షించింది. అలా కిరిక్ పార్టి అనే కన్నడ చిత్రంతో సినిమా ఇండస్ట్రీలో ఎంట్రి ఇచ్చింది. ఆ చిత్రంలోని రష్మిక నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అయితే డెబ్యూ మూవీ చేస్తున్న సమయంలోనే సహ నటుడు రక్షిత్ శెట్టితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.

ఇక మొదటి సినిమా తరువాత రష్మికకు పునీత్ రాజ్‌కుమార్ సరసన అంజని పుత్ర, గణేష్ సరసన ఛమక్ అనే కన్నడ చిత్రాలలో నటించే అవకాశాలు వరుసగా దక్కాయి. అంతేకాదు టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్యతో కలసి ఛలో సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్ లో ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, నాని, నితిన్ ల సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంది. టాలీవుడ్ లో రష్మిక నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ సాధించడంతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారి భారీ రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి చేరుకుంది.

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే 5 భాషలలో క్రేజ్ ఊహించనంతగా పెరిగిపోతుంది. కాగా ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ తో బాలీవుడ్ లో మూడు సినిమాలలో నటించే అవకాశం అందుకుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి కూతురిగా గుడ్ బై సినిమా, అలాగే సిద్దార్థ్ మల్‌హోత్రాకి జంటగా మిషన్ మజ్ఞు సినిమాలు చేస్తుండగా మరో క్రేజీ ఆఫర్ ని దక్కించుకుంది. ఇక కోలీవుడ్ లో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చి కార్తి సరన సుల్తాన్ సినిమా చేసింది. తమిళంలో కూడా రష్మికకి బాగా క్రేజ్ పెరిగింది.

అయితే ఈ కన్నడ బ్యూటీ ముందే ఈ సక్సెస్ పసిగట్టింది. మొదటి సినిమా కిరాక్ పార్టీ తర్వాత వరుసగా మూడు సినిమాలలో అవకాశం దక్కడంతో ఖచ్చితంగా తాను స్టార్ హీరోయిన్ అవుతాననే గట్టి నమ్మకం కలిగి జులై 2017లో రక్షిత్ శెట్టితో జరిగిన నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుంది. ఒకవేళ ఆ సమయంలో గనక రష్మిక పెళ్ళి చేసుకొని ఉంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఎంతమాత్రం ఉండేది కాదు. పెళ్ళి తర్వాత పరిస్థితులు మారిపోతాయని ముందే గ్రహించింది. ఇది సినిమా కెరీర్ కి ప్లస్ అయినా పీటలవరకు వచ్చిన పెళ్ళిని పెటాకులు చేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదని కొందరు అభిప్రాయపడ్డారు.