Tag Archives: rk roja

RK Roja: టీవీ షోలో మంత్రి రోజాకు అవమానం.. అందుకే పిలిచారా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న రోజా?

RK Roja: రోజా పరిచయం అవసరం లేని పేరు ఒకానొక సమయంలో వెండితెర నటిగా ఇండస్ట్రీని ఏలిన రోజా అనంతరం రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా రాజకీయాలలో కొనసాగుతూనే ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు.దాదాపు 10 సంవత్సరాల పాటు జడ్జిగా జబర్దస్త్ కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన రోజా ప్రస్తుతం మంత్రి పదవి రావడంతో ఈమె ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనటువంటి రోజా రాజకీయాలలో బిజీగా ఉన్నారు. అయితే దసరా పండుగ సందర్భంగా మల్లెమాలవారు నిర్వహించినటువంటి స్పెషల్ ఈవెంట్లో రోజా గెస్ట్ గా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే రోజా తనదైన శైలిలో అందరిని సందడి చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎప్పటిలాగే అందరూ కలిసి ఆటపాటలతో సందడి చేయడమే కాకుండా ఒకరిపై మరొకరు పంచ్ లు వేస్తూ ఎంతో సందడి చేశారు.అయితే ఈ ప్రోమో చివరిలో రోజా ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకొని షో మధ్యలో నుంచి బయటకు వెళ్లిపోయారు.అసలు ఏం జరిగిందో తెలియదు కానీ రోజా మాత్రం ఇలా నన్ను అవమానించడానికి ఇక్కడికి పిలిచారా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

RK Roja: కన్నీళ్లు పెట్టుకున్న రోజా..

వేదికపైనే ఈమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవమానంతో షో మధ్యలో నుంచి బయటకు వెళ్లినట్టు ఈ ప్రోమోలో చూపించారు. మరి నిజంగానే రోజాకు అవమానం జరిగిందా లేకపోతే షోపై హైప్ తీసుకురావడానికి ప్రోమో ఇలా కట్ చేశారా అనే విషయం తెలియాలంటే ఈ కార్యక్రమం ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి. ప్రస్తుతం ఈ కార్యక్రమం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

RK Roja: చిన్న చిన్న యాంకర్లే పెద్ద కార్లు కొంటున్నారు.. నేను కొంటె తప్పా… రోజా అన్నది ఆ యాంకర్ నేనా.. వైరల్ అవుతున్న కామెంట్స్!

RK Roja: వెండితెర నటిగా, బుల్లితెర న్యాయ నిర్ణేతగా, రాజకీయ నాయకురాలిగా మంత్రిగా ఎన్నో బాధ్యతలు చేపట్టి విశేషమైన ప్రేక్షకాదరణ గుర్తింపు సంపాదించుకున్న నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఇండస్ట్రీలో సుమారు 150 సినిమాలకు హీరోయిన్ గా పనిచేశారు. అలాగే రచ్చబండ జబర్దస్త్ వంటి కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో కూడా తన మార్క్ ఏంటో చూపించారు. ఇకపోతే మంత్రిగా ఈమె బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రోటోకాల్ ఫాలో అవుతూ జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో రోజా ఎంతో ఖరీదైన కోట్ల విలువ చేసే కారు కొన్నారు. ఈ క్రమంలోనే ఈ కారుపై ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

అయితే ఈ విషయంపై రోజా స్పందిస్తూ తాను ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నానని తాను ఇలా కోట్ల రూపాయల విలువచేసే కారు కొనడంలో ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని ఈమె తెలిపారు.తాను ఎలాంటి అక్రమ సంపాదనతో కొనలేదని కావలసి వస్తే తన ఇన్కమ్ టాక్స్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అంటూ సవాల్ విసిరారు.

RK Roja: యాంకర్ల గురించి రోజా షాకింగ్ కామెంట్స్…

ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల నుంచి యాంకర్లుగా పనిచేస్తున్న వారి పెద్ద పెద్ద ఆడి, బెంజ్, బీఎండబ్ల్యూ కార్లు కొనుగోలు చేస్తున్నారు. ఇలా చిన్నచిన్న యాంకర్లే ఖరీదైన కార్లలో తిరుగుతున్నప్పుడు తాను ఇలాంటి కారు కొనడంలో ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ విధంగా రోజా యాంకర్ల గురించి ప్రస్తావన చేయడంతో రోజా అన్నది ఏ యాంకర్ ని..ఈమె యాంకర్ మంజుషని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అంటూ చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే మంజూష ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే బెంజ్ కార్ కొనడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే రోజా ఈమెను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు భావిస్తున్నారు.

RK Roja: జబర్దస్త్ ద్వారా లక్షలు సంపాదించా… కావాలంటే నా ఐటీ రిటన్స్ చెక్ చేసుకోండి.. సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా..!

RK Roja: వెండితెరపై నటిగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి రోజా ఇండస్ట్రీకి దూరమైన తర్వాత ఈమె బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.ఇలా బుల్లితెర కార్యక్రమాలతో ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేస్తున్న ఈమె మరోవైపు రాజకీయాలలో కూడా కొనసాగుతున్నారు.ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా నగరి నియోజక వర్గం నుంచి గెలుపొందిన రోజా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ పర్యటక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.

ఈ క్రమంలోనే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రోటోకాల్ ఫాలో అవుతూ తాను జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు.ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో ఈమె దాదాపు పది సంవత్సరాల నుంచి జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.అయితే ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైన ఈమె మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. ఇక తాజాగా రోజా కోట్లు విలువచేసే ఖరీదైన కారును కొనుగోలు చేశారు.

ఇలా ఈమె ఖరీదైన కారు కొనుగోలు చేయడంతో ప్రతిపక్ష నేతలు రోజాపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. రోజా అక్రమంగా సంపాదిస్తూ ఇలాంటి ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసింది అంటూ బురద చల్లే ప్రయత్నం చేశారు. ఈమె గురించి ఇలా ప్రతిపక్ష నేతలు మాట్లాడటంతో రోజా స్పందించి ఘాటుగా సమాధానం చెప్పారు.

RK Roja: ప్రతిపక్షాలకు ఘాటుగా జవాబిచ్చిన మంత్రి…

తాను 150 సినిమాలకు పైగా నటించాను. అలాగే పది సంవత్సరాల నుంచి జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జిగా కొనసాగుతున్నాను జబర్దస్త్ కార్యక్రమం ద్వారా లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకున్నానని తెలిపారు.అంతగా అనుమానం ఉంటే నేను కట్టే ఇన్కమ్ టాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకోమని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. మొత్తానికి రోజా గురించి వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించి చెక్ పెట్టారు.

RK Roja: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న మంత్రి రోజా… తెలంగాణ సీఎం పై ప్రశంసల కురిపించిన మంత్రి!

RK Roja: ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్న రోజాశ్రావణ మాసంలో స్వాతి నక్షత్రం రోజున స్వామి వారిని దర్శనం చేసుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రావణమాసంలో ఇలా స్వామివారిని దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. స్వామివారి కరుణ కటాక్షాలు తనపై ఉండి, ప్రజలకు మరింత సేవ చేయడం కోసం తనకు శక్తి సామర్థ్యాలను ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్న అంటూ ఈమె వెల్లడించారు.ఇకపోతే తాను గతంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత తనకు మంత్రి పదవి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇకపోతే స్వామివారి దర్శనం అనంతరం ఆలయ నిర్మాణ పనుల గురించి ఈమె మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పై ప్రశంసల కురిపించారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ నిర్మాణాన్ని ఎంతో అద్భుతంగా చేపట్టారని ఈ సందర్భంగా రోజా పేర్కొన్నారు. ఇలా నరసింహస్వామి వారి ఆలయం నిర్మించడం కేసీఆర్ గారికి పూర్వజన్మ సుకృతం అంటూ తెలిపారు.

RK Roja: అరుదైన అవకాశం కేసీఆర్ గారికి దక్కింది…

సాధారణంగా భగవంతుడు తనకు నచ్చిన వారితోనే ఆలయం నిర్మించుకుంటారని అలాగే స్వామివారి ఆలయాన్ని నిర్మించే పుణ్యఫలం కేసీఆర్ కి దక్కిందంటూ ఈమె కేసీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రోజా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Jabardasth: నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్.. అందుకే తక్కువ రెమ్యూనరేషన్.. అసలు విషయం బయట పెట్టిన ఏడుకొండలు?

Jabardasth: జబర్దస్త్ కార్యక్రమం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ కార్యక్రమం పేరు మారుమోగిపోతుంది.ఈ విధంగా ఈ కార్యక్రమం వార్తల్లో నిలవడానికి గల కారణం కేవలం కిరాక్ ఆర్పీ చేసిన సంచలన వ్యాఖ్యలే అని చెప్పాలి.జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కిరాక్ ఆర్పి ఆ కార్యక్రమం నుంచి బయటకు వస్తూ ఆ కార్యక్రమం పై ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతుంది.

ఇకపోతే ఆర్పీ చేసిన వ్యాఖ్యల వల్ల జబర్దస్త్ కార్యక్రమం తో సంబంధం ఉన్న వారందరూ ఒక్కొక్కరుగా ఈ కార్యక్రమం పై స్పందిస్తూ తమదైన శైలిలో వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమంలో ఒకప్పుడు మేనేజర్ గా వ్యవహరించినటువంటి ఏడుకొండలు ప్రస్తుతం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టడమే కాకుండా సుడిగాలి సుదీర్ గెటప్ శీను వంటి వారిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ జడ్జిలుగా ఉన్నటువంటి నాగబాబు రోజా రెమ్యూనరేషన్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోజా నాగబాబు రెమ్యునరేషన్ విషయంలో ఎందుకు తేడాలు ఉన్నాయి అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఏడుకొండలు సమాధానం చెబుతూ నాగబాబుతో పోలిస్తే రోజా గారికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చే వాళ్ళం అని చెప్పారు అలా రోజాకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి గల కారణం కూడా ఈయన వివరించారు.

Nagababu: నాగబాబు రాజకీయాలు వరుణ్ తేజ్ కెరీయర్ కి బ్రేక్ వేస్తుందా..వరుణ్ కి గుదిబండలా మారిన నెగిటివిటీ!

రోజా హీరోయిన్ కనక ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చాము…

రోజా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే ఆమెకు హీరోయిన్ రేంజ్ రెమ్యూనరేషన్ ఇచ్చాము. ఇక నాగబాబు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. అందుకే ఆయనకు అదే స్థాయిలో రెమ్యూనరేషన్ ఇచ్చామని ఏడుకొండలు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇలా నాగబాబు రోజా రెమ్యూనరేషన్ మధ్య పోలికను ఏడుకొండలు చెప్పడంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

R.K Roja: రోజాకు మంత్రి పదవి రాకూడదని దేవుని ప్రార్థించిన నటి.. సుధీర్ గెటప్ శ్రీను వెళ్ళిపోవడానికి కారణం అతనేనా?

R.K Roja: తెలుగు బుల్లితెరపై గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఎంతో విజయవంతంగా ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇలా విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకోవడంతో ఈ కార్యక్రమంలో సందడి చేసిన సుడిగాలి సుదీర్ టీమ్ విపరీతమైన క్రేజ్ ఏర్పరచుకున్నారు.అయితే గత కొంత కాలం నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ , గెటప్ శ్రీను కనిపించడం లేదు.

R.K Roja: రోజాకు మంత్రి పదవి రాకూడదని దేవుని ప్రార్థించిన నటి.. సుధీర్ గెటప్ శ్రీను వెళ్ళిపోవడానికి కారణం అతనేనా?

ఈ విధంగా వీరిద్దరి ఈ కార్యక్రమానికి దూరం కావడానికి ఎన్నో రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇకపోతే తాజాగా వచ్చే వారం ప్రసారం కాబోయే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ ప్రోమోలో భాగంగా జడ్జి ఇంద్రజ టీం లీడర్స్ ను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలోనే ఆటో రాంప్రసాద్ ను ప్రశ్నిస్తూ ఈ కార్యక్రమం నుంచి గెటప్ శ్రీను సుడిగాలి సుధీర్ వెళ్ళిపోవడానికి కారణం నువ్వే నంట కదా అని ప్రశ్నించారు.

R.K Roja: రోజాకు మంత్రి పదవి రాకూడదని దేవుని ప్రార్థించిన నటి.. సుధీర్ గెటప్ శ్రీను వెళ్ళిపోవడానికి కారణం అతనేనా?

నువ్వు స్క్రిప్టులు సరిగా రాకపోవడంతోనే గెటప్ శ్రీను సుడిగాలి సుదీర్ ఇక్కడి నుంచి వెళ్లిపోయారంట నిజమేనా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆటో రాంప్రసాద్ మాట్లాడుతూ.. సీరియస్ గా ఈ ప్రశ్న అడిగిన వాళ్లకు నా సమాధానం అని చెబుతుండగానే అతని మాటలు కట్ చేస్తారు. అనంతరం ఆటో రాంప్రసాద్ ఇంద్రజను మరొక ప్రశ్న వేశారు.

అలా ఎందుకు మొక్కుకున్నారు మేడం?

ఈ సందర్భంగా రాంప్రసాద్ ఇంద్రజను ప్రశ్నిస్తూ మీరు రోజా గారికి మంత్రి పదవి రాకూడదని దేవుడిని మొక్కు కున్నారట.. అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు ఇంద్రజ సమాధానం చెబుతూ ఉండగా తన మాటలను కట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ప్రోమో వైరల్ గా మారడమే కాకుండా ఎపిసోడ్ పై భారీ అంచనాలు పెంచాయి. మరి ఈ రెండు ప్రశ్నలకు వీరిద్దరూ ఏ విధమైనటువంటి సమాధానాలు చెబుతారో తెలియాలంటే వచ్చే శుక్రవారం వరకు వేచి చూడాలి.

R.K Roja: నా భర్త మాటలను తెలుగుదేశం నేతలు వక్రీకరిస్తున్నారు..తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు: ఆర్ కె రోజా

R.K Roja: రోజా మంత్రి అయిన తర్వాత ఆమె భర్త సెల్వమణి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.తమిళ సినిమాలు కేవలం చెన్నైలో మాత్రమే షూటింగ్ జరుపుకోవాలని వైజాగ్ వంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోకూడదని ఆయన చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నేతలు తప్పు పడుతున్నారు.

R.K Roja: నా భర్త మాటలను తెలుగుదేశం నేతలు వక్రీకరిస్తున్నారు..తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు: ఆర్ కె రోజా

ఈ క్రమంలోనే సెల్వమణి ఈ విషయం గురించి ఎంత వివరణ ఇచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీ నేతలు సెల్వమణి మాటలను తప్పుగా భావిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయం మంత్రి రోజా దృష్టికి రావడంతో ఆమె తన భర్త మాటలకు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ తన భర్త అన్న మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలియజేశారు.

R.K Roja: నా భర్త మాటలను తెలుగుదేశం నేతలు వక్రీకరిస్తున్నారు..తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు: ఆర్ కె రోజా

తెలుగుదేశం పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగానే తన భర్త అన్న మాటలను వక్రీకరిస్తున్నారని ఈమె వెల్లడించారు. తమిళనాడుచిత్ర పరిశ్రమకు చెందిన సినిమాలు అక్కడే షూటింగ్ జరుపుకుంటుంటే అక్కడ కార్మికులకు ఉపాధి దొరుకుతుందన్న ఉద్దేశంతోనే తన భర్త అలా మాట్లాడాలని రోజా వివరణ తెలిపారు. ఇకపోతే ఏపీ ప్రభుత్వం వైజాగ్ లో సినిమా షూటింగ్ జరుపాలని జీవో విడుదల చేసినప్పటికీ వైజాగ్ లో చిత్రీకరణ జరగడంలేదని ఈమె తెలియజేశారు.

మంచి జరగాలన్న ఉద్దేశంతోనే…

మాకు ఏపీ అంటే అభిమానం ఉంది కనుక ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు లోకేష్ బాలకృష్ణ ఏపీలో ఎందుకు ఇల్లు కట్టుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు.అందరికీ మంచి జరగాలని ఉద్దేశంతోనే తన భర్త ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అయితే టిడిపి ప్రభుత్వం మాత్రం తన స్వార్థం కోసం తన భర్త మాట్లాడిన మాటలను వక్రీకరిస్తున్నారని రోజా ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు.ఇక ఈ విషయంపై స్పందించి వివరణ ఇచ్చిన తరువాత ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

ఆ పార్టీ వాళ్లు రోజాని ఎంతో హింసించారు..వారి వల్ల ఎన్నో ఆస్తులు కోల్పోయాము: సెల్వమని

సీనీనటిగా, ఎంఎల్ఏ గా రోజా అందరికీ సుపరిచితమే. రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనీనటిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఆ తరువాత రాజకీయాలలోకి అడుగు పెట్టింది. తాజాగా రోజా భర్త సెల్వమణి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని రోజా రాజకీయ జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

చంద్రబాబునాయుడు కోరిక మేరకు తెలుగుదేశం పార్టీ లోకి వెళ్లి మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసింది. అయితే రాజకీయాల్లో ఆమెకు తీవ్ర నిరాశ ఎదురైంది. అలా రాజకీయాల్లోకి ఎంటరైన రోజా చుట్టూ కుల రాజకీయాలు జరిగాయని ఆ పార్టీ వాళ్ళు మోసం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినా అతను ఏమి చేయకపోవడంతో ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు తెలిపారు.

టిడిపి పార్టీలో ఉన్నప్పుడు రోజాను ఎంతో హింసించారని రాజకీయాలలో తనని ఎదగనివ్వకుండా చేశారని సెల్వమణి వెల్లడించారు. టిడిపి పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో గెలవడం కోసం సుమారు నాలుగైదు ఇల్లులను కూడా అమ్మకున్నామని ఆ పార్టీ వల్ల ఎంతో ఆస్తి నష్టాన్ని కూడా భరించామని ఈ సందర్భంగా సెల్వమణి తెలియజేశారు.

ఇలా తెలుగుదేశం పార్టీలో ఎన్నో హింసలకు గురి చేసిన తర్వాత ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్ళినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కేవలం 10 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. తనని కలవడానికి వెళ్లినప్పుడు రాజశేఖరరెడ్డిగారు సాదరంగా ఆహ్వానించి మంచిగా మాట్లాడటం చూసి నాకు పదవి అవసరం లేదు కేవలం పార్టీలో ఉంటానని రోజా చెప్పినట్టు సెల్వమని చెప్పారు. అప్పటినుంచి రోజా రాజశేఖర్ రెడ్డి పార్టీలో ఉండటమే కాకుండా తన మరణానంతరం జగన్ వెంట నడిచారు అని ఈ సందర్భంగా సెల్వమణి తెలియజేశారు. ఏ పార్టీలో మీకు శత్రువులు ఎక్కువగా ఉన్నారనే ప్రశ్న ఎదురుగా ప్రతి పార్టీలోనూ శత్రువులు ఉంటారని. ఈ సందర్భంగా సెల్వమణి తెలియజేశారు.

మా ఎన్నికల పై నటి రోజా షాకింగ్ కామెంట్స్…నా మద్దతు వారికే..!

చిత్ర పరిశ్రమలో ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి మా ఎన్నికలలో పోటీ నెలకొంది.ఈ ఎన్నికలలో పెద్ద ఎత్తున లోకల్ నాన్ లోకల్ అనే వివాదం చెలరేగుతోంది.తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు వాళ్ళకే పట్టం కట్టాలని పలువురు భావించగా మరికొందరు.. ఈ వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు.

ఇదిలా ఉండగా మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి మెగా కుటుంబం మద్దతు తెలుపగా మంచు కుటుంబానికి పలువురు సీనియర్ నటీనటులు మద్దతు తెలుపుతున్నారు.

ఇప్పటికే పలువురు నటీనటులు మీడియాతో మాట్లాడుతూ తెలుగు వారికే మా పట్టం కట్టాలని తెలుగు వాడి గౌరవాన్ని నిలబెట్టాలి అంటూ మంచూ ప్యానల్ కు మద్దతు తెలిపారు. ఇలా మా ఎన్నికలు రోజురోజుకు ఉత్కంఠత నెలకొల్పుతున్న సమయంలో మా ఎన్నికలపై నటి ఎమ్మెల్యే రోజా స్పందించారు.

ప్రస్తుతం నగరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మా ఎన్నికల గురించి రోజా మాట్లాడుతూ… సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ చేసినటువంటి వారి మేనిఫెస్టోను చూశాను. తాను లోకల్ నాన్ లోకల్ అనే తేడా చూడకుండా ఎవరి మేనిఫెస్టోలో అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే వారికే తన ఓటు అంటూ ఈ ఎన్నికల పై షాకింగ్ కామెంట్స్ చేశారు.