RK Roja: ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్న రోజాశ్రావణ మాసంలో స్వాతి నక్షత్రం రోజున స్వామి వారిని దర్శనం చేసుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రావణమాసంలో ఇలా స్వామివారిని దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. స్వామివారి కరుణ కటాక్షాలు తనపై ఉండి, ప్రజలకు మరింత సేవ చేయడం కోసం తనకు శక్తి సామర్థ్యాలను ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్న అంటూ ఈమె వెల్లడించారు.ఇకపోతే తాను గతంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత తనకు మంత్రి పదవి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఇకపోతే స్వామివారి దర్శనం అనంతరం ఆలయ నిర్మాణ పనుల గురించి ఈమె మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పై ప్రశంసల కురిపించారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ నిర్మాణాన్ని ఎంతో అద్భుతంగా చేపట్టారని ఈ సందర్భంగా రోజా పేర్కొన్నారు. ఇలా నరసింహస్వామి వారి ఆలయం నిర్మించడం కేసీఆర్ గారికి పూర్వజన్మ సుకృతం అంటూ తెలిపారు.
సాధారణంగా భగవంతుడు తనకు నచ్చిన వారితోనే ఆలయం నిర్మించుకుంటారని అలాగే స్వామివారి ఆలయాన్ని నిర్మించే పుణ్యఫలం కేసీఆర్ కి దక్కిందంటూ ఈమె కేసీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రోజా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…