Tag Archives: salaar

Pruthviraj sukumaran: ప్రభాస్ ఫుడ్ పెట్టి చంపేస్తాడు… పొరపాటున కూడా ఆయన వద్ద నోరు జారకూడదు: పృథ్వీరాజ్ సుకుమారన్

Pruthviraj sukumaran: పృథ్వీరాజ్ సుకుమారన్ త్వరలోనే సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో ఈయన వరదరాజు మన్నార్ పాత్రలో నటించారు. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇక రాజమౌళితో నిర్వహించినటువంటి ఒక ఇంటర్వ్యూలో భాగంగా పృథ్వీరాజ్ రాజమౌళి ఆతిథ్యం గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ మామూలుగానే షూటింగ్ లొకేషన్లో కనుక ఉంటే ఆయన అందరి కోసం ప్రత్యేకంగా వారికి ఇష్టమైనటువంటి ఫుడ్ తెప్పిస్తారు అనే సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఒకరోజు తన భార్యతో సంవత్సరాల కూతురు షూటింగ్ లోకేషన్ కి వచ్చారు. ఆ సమయంలో ప్రభాస్ తనతో మాట్లాడుతూ నీకేం ఇష్టమని చెప్పడంతో చిన్నమ్మాయి కావడంతో తనకు ఇష్టమైనటువంటి చెప్పేసింది. షూటింగ్ లొకేషన్లో నా కూతురు చెప్పినటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్ని ఆరోజు రాత్రికి మా ఇంటికి వచ్చాయని ఆ ఫుడ్ ఐటమ్స్ చూసి నేను ఒక్కసారిగా షాక్ అయ్యానని తెలిపారు.

పొరపాటున నోరు జారకూడదు…


ఆరోజు వాటన్నింటిని పెట్టించడానికి నేను మరొక రూమ్ కూడా వాడాల్సి వచ్చింది అంటూ ఈ సందర్భంగా పృథ్వీరాజ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈయన పక్కన ఉంటే మనం డైటింగ్ కూడా మర్చిపోతామని పొరపాటున కూడా ఈయన వద్ద నాకు ఇది ఇష్టం అని నోరు జారకూడదని అలా జారితే ఫుడ్ పెట్టి చంపేస్తారు అంటూ ప్రభాస్ ఆతిథ్యం గురించి ఎంతో గొప్పగా చెప్పారు.

Prabhas: సలార్ సినిమా కోసం నేను పెద్దగా కష్టపడింది లేదు.. నా ఆలోచనలే ఈ సినిమా: ప్రభాస్

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్నటువంటి ప్రభాస్ ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన సలార్ సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ ఈ సినిమా కథను తాను ప్రశాంత్ ఇద్దరు కూర్చొని సిద్ధం చేశామని తెలిపారు. నాలో ఉన్నటువంటి ఆలోచనలు నేను చెప్పగా ప్రశాంత్ కొన్ని యాడ్ చేసి ఈ సినిమా కథను సిద్ధం చేశారని ప్రభాస్ వెల్లడించారు. ఇక ఈ సినిమా కోసం నేను పెద్దగా కష్టపడింది ఏమీ లేదని తెలిపారు. నేను ఈ సినిమా షూటింగ్ కి రావాలి అనే ఫీలింగ్ కంటే అక్కడికి వెళ్తే ప్రశాంత్ తో ఆనందంగా ఉండవచ్చు అన్న ఉద్దేశంతోనే షూటింగ్ కి వచ్చేవాడినని ఎప్పుడూ కూడా ఆయన నన్ను వెయిట్ చేయనివ్వలేదు, అతని ప్లానింగ్ చూసి నేను ఆశ్చర్యపోయాను అంటూ ప్రభాస్ తెలిపారు.

నేను షూటింగ్ లొకేషన్లోకి వచ్చేలోపు ప్రశాంత్ అన్ని సిద్ధం చేసి పెట్టుకొని ఉంటారని నేను సెట్ లోకి రాగానే ప్రశాంత్ నా పైనే ఎక్కువగా షూట్ చేసేవారని ప్రభాస్ తెలిపారు. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేసిన తర్వాత మీరు కండలు మాత్రం పెంచాలి అంటూ డైరెక్టర్ నాకు చెప్పారు ఆయన చెప్పిన విధంగానే నేను చేశాను అయితే నాకు గత 21 సంవత్సరాల కెరియర్ లో కష్టపడిన దానికంటే ఈ సినిమా కోసం నేను పెద్దగా కష్టపడలేదని ప్రభాస్ తెలిపారు.

ప్రశాంత్ ప్లానింగ్ సూపర్..

ఇక ఈ సినిమా కథను ఎంతో వర్క్ షాప్ చేసి సిద్ధం చేసుకున్నట్లు ప్రభాస్ తెలిపారు. ఇలా సలార్ సినిమా గురించి ప్రభాస్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయ్యాయి ఇక ఈ టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం విశేషం.

Salaar: సలార్ పృధ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో ఆ టాలీవుడ్ హీరోని తీసుకోవాలనుకున్నారా… ఏమైందంటే?

Salaar: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం సలార్. ఈ సినిమా ఎన్నో అంచనాలను ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

ఇకపోతే ఈ సినిమాలో జగపతిబాబు ఆయన కొడుకు మెయిన్ విలన్లుగా కనిపించబోతున్నారు ఇక జగపతిబాబు కొడుకు పాత్రలో మలయాళ నటుడు పృధ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే పృధ్విరాజ్ పాత్రలో టాలీవుడ్ హీరో అయితే బాగుంటుందని ప్రభాస్ డైరెక్టర్ కి సలహా ఇచ్చారట అయితే డైరెక్టర్ మాత్రం చాలా సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది.

ప్రభాస్ తన ఆప్తమిత్రుడు అయినటువంటి హీరో గోపీచంద్ ఈ సినిమాలో విలన్ పాత్రలో తీసుకోవాలని సూచించారట ఇదివరకు వీరిద్దరూ వర్షం సినిమాలో హీరో విలన్లుగా నటించిన సంగతి మనకు తెలిసిందే. దీంతో ప్రభాస్ గోపీచంద్ పేరును సూచించగా ప్రశాంత్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇద్దరూ కూడా తెలుగువారే అయితే మార్కెట్ పరంగా ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాదని చెప్పడంతో ప్రభాస్ ఈ విషయంలో సైలెంట్ అయ్యారట.

Salaar: రెండు భాగాలుగా సలార్…


ఈ విధంగా ప్రభాస్ గోపీచంద్ పేరును సూచించగా ఆయన మాత్రం మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో భాగమయ్యారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ మొదటి సారి హీరోయిన్ గా నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28 విడుదలకు సిద్ధమవుతుంది.ఈ సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Prabhas: ప్రభాస్ సలార్ మేకింగ్ వీడియో లీక్.. అదిరిపోయిన ప్రభాస్ లుక్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

Prabhas: బాహుబలి తర్వాత పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన సలార్ ప్రాజెక్టుకే వంటి సినిమా షూటింగులతో బిజీగా గడుపుతున్నారు. ఇక తాజాగా ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది.

కృష్ణంరాజు గారి మరణం తర్వాత సినిమా షూటింగ్లకు కాస్త విరామం ఇచ్చిన ప్రభాస్ కృష్ణంరాజు గారి సంస్కరణ సభలన్నీ పూర్తయిన తర్వాత రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నటువంటి సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.ఈ షెడ్యూల్ లో ప్రశాంత్ నీల్ ప్రభాస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఇకపోతే సాధారణంగా సినిమా షూటింగ్లో జరుగుతున్న సమయంలో కొన్ని సన్నివేశాలు లీక్ అవడం సర్వసాధారణం.

ఇలా లీకులు కాకుండా మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పెద్ద ఎత్తున కొన్ని సన్నివేశాలు లీక్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనగా ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో ప్రభాస్ అదిరిపోయే లుక్ లో కనిపించడంతో అభిమానులు సైతం ప్రభాస్ కటౌట్ చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Prabhas: వరుస షూటింగ్లతో బిజీగా మారిన ప్రభాస్..

ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇక ప్రభాస్ సలార్ సినిమాతో పాటు ప్రాజెక్ట్ కె వంటి సినిమా షూటింగులలో కూడా పాల్గొనబోతున్నారు.ఈ రెండు చిత్రాల అనంతరం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న స్పిరిట్ సినిమాలో ఈయన బిజీ కానున్నారు. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఆది పురుష్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

ఆ అభిమానికి ఖరీదైన బహుమతి.. అతడి వింత పనికి ప్రభాస్ ఫిదా..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు బాహుబలి తర్వాత అతడి ఫేట్ మారిపోయింది. ఇంటర్నేషనల్ ఫిగర్ అయిపోయాడు. ఏ సినిమా తీసినా ఇక పాన్ ఇండియా లెవల్లో తీసేస్తున్నాడు. అతడికి ఇచ్చే రెమ్యూనరేషన్ విషయానికి వస్తే బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తగ్గడం లేదనేది టాక్. ఇటీవల ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త అసహనానికి గురవుతన్న మాట వాస్తవమే.

సినిమాకు సంబంధించి ఏమాత్రం అప్ డేట్ రాకపోవడం.. మిగతా హీరోలకు సంబంధించి లుక్స్, పోస్టర్లు, సాంగ్స్ ఇలా ఏదో ఒకటి వస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ చిర్రెత్తిపోతున్నారు. దీనిపై యూవీ క్రియేషన్స్ కూడా ఆలోచించి.. ఇటీవల రాధేశ్యామ్ నుంచి ఓ సాంగ్ ను రిలీజ్ చేసింది. అంతే కాకుడా .. ఇంత ఇమేజ్ ను సాధించుకున్న ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశవ్యాప్తంగా బోలెడు మంది అభిమానులను సొంతం చేసుకున్న డార్లింగ్ ప్రభాస్..ప్రజెంట్ వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక అతడి అభిమానుల్లో ఒకరు. తన హెడ్‌పై ఇంగ్లిష్ అక్షరాలతో ప్రభాస్ అని కనిపించేలా జుట్టు కత్తిరించుకున్నాడు. కాగా సదరు వీరాభిమానాని ఇటీవల ప్రభాస్ ను కలిశాడు.

అతడితో కొంత టైం స్పెండ్ చేసిన ప్రభాస్.. అతడికి ఊహించని గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. వెరీ కాస్ల్టీ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. వాళ్లిద్దరు కలిసి దిగిన ఫొటోలు, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్ మంచి మనసు ఆయన ఇచ్చిన గిఫ్ట్ ద్వారా నిరూపితమైందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఆ వీరాభిమాని మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది.

ఎన్నో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి.. వాటిని తట్టుకొని నేడు ఈ స్థాయిలో ఉన్నానంటూ..

ఒకప్పుడు ఎంతో ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లు.. ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టడంతో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. దీనికి ఎవరూ అతీథులు కాదు. ఎవరికైనా కష్టాలు రావచ్చు. అటు టాలీవుడ్, బాలీవుడ్, సాధారణ ప్రజలకు కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం చెప్పుకునే విషయం ఏంటంటే.. తెలుగులో ‘ఆహా కళ్యాణం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బ్యూటీ వాణీకపూర్. కానీ ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో ఆమెను నిరాశకు గురిచేసింది. తర్వాత తెలుగులో సినిమా ఆఫర్లు రాలేదు.

కానీ బాలీవుడ్ లో మాత్రం ఆమె హవా కొనసాగింది. అక్కడ కొన్ని వరుస హిట్లతో తన పొజిషన్ ని ఇప్పుడు సుస్థిరం చేసుకుంది. శుధ్ దేశీ రొమాన్స్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన వాణి కపూర్.. తర్వాత బేఫిక్రే..వార్ లాంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకుని ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే ఆమెకు సంబంధించి ఓ సీక్రెట్ ఇప్పుడు అభిమానులకు షాక్ ను గురిచేస్తోంది. కపూర్ వంశస్తురాలిగా బాలీవుడ్ కి పరిచయమైన ఈ అమ్మడికి కూడా అందరిలానే కష్టాలు ఒడిదుడుకులు ఉన్నాయి. 19 సంవత్సరాల వయస్సులో ఆమె తన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

వాళ్ల కుటుంబసభ్యులు ఆర్థిక కష్టాలు భరించలేక ఎంతగానో కుమిలిపోయారని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఆమె తన కుటుంబానికి అండగా నిలబడాలనే నిశ్చయంతో స్వయంగా కుటుంబ బాధ్యతలు నెత్తిన వేసుకున్నానని వాణీ చెప్పుకొచ్చింది. సనిమాలో నటిగా ఎదిగే సమయంలో ఇంటి నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని.. తానే ఎన్నో ఆటుపోటులను తట్టుకొని నేడు ఈ స్థాయికి వచ్చానని చెప్పింది. మోడలింగ్ లోకి రావడానికి కారణం కూడా ఆర్థిక కష్టాలే అని చెప్పింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సరసన బెల్ బాటమ్ లో నటించింది.

ఈ సనిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఒక సనిమాలో నటిస్తున్న ఈ బామ.. షామ్ శ్రీ అనే చిత్రంలో కూడా నటిస్తోంది. టాలీవుడ్ లో ఆమెకు లక్ కలసిరాలేదనే చెప్పాలి. అయితే తాజాగా ఆమె టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చి.. సలార్ లాంటి భారీ క్రేజీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా జరిగింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది.