Tag Archives: samantha akkineni

నిన్ను బాగా మిస్ అవుతున్నా.. నీ కోసం ప్రార్థిస్తూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత..!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సమంత సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనకు ఏమాత్రం విరామం దొరికిన తన స్నేహితులతో కలిసి ఎంతో సరదాగా గడుపుతుంటారు. సమంతకు ఇండస్ట్రీలో కేవలం అతి కొంతమంది స్నేహితులు మాత్రమే ఉన్నారు. వీటిలో వెన్నెల కిషోర్ ఒకరు. ఈ క్రమంలోనే నేడు (సెప్టెంబర్ 19)వెన్నెల కిషోర్ పుట్టినరోజు కావడంతో వెన్నెల కిషోర్ కు పెద్ద ఎత్తున అభిమానులు ఇతర సెలబ్రిటీలు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలోనే వెన్నెల కిషోర్ పుట్టినరోజు సందర్భంగా సమంత అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రస్తుతం సమంత చెన్నైలో ఉండగా.. నిన్ననే ఈమె తిరుపతి, శ్రీకాళహస్తి దైవ దర్శనాలు చేసుకుని తిరిగి చెన్నై వెళ్లారు. నేడు వెన్నెల కిషోర్ పుట్టినరోజు కావడంతో సమంత అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ క్రమంలోనే వెన్నెల కిషోర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. హ్యాపీ బర్త్డే వెన్నెల కిషోర్.. నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను.. నిన్ను ఆ దేవుడు చల్లగా చూడాలి..నువ్వు నీ పక్కవారిని ఎలా అయితే నవ్విస్తావో ఆ దేవుడు కూడా నిన్ను అలా నవ్వించే వారి మధ్యలో ఉంచాలని ప్రార్థిస్తున్నాను అంటూ అంటూ వెన్నెల కిషోర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో సమంత విషెస్ కు స్పందిస్తూ వెన్నెల కిషోర్ తిరిగి రిప్లై ఇచ్చాడు.

నీ శుభాకాంక్షలు ఈరోజు నాకు ఎంతో ప్రత్యేకంగా మారాయి నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను అంటూ వెన్నెల కిషోర్ హగ్స్ ఎమోజీలను షేర్ చేశారు. మొత్తానికి సమంత ఇలా తన స్నేహితుడి కోసం భగవంతుడిని ప్రార్థిస్తూ అతనికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ విషయంలో సమంతను వెనక్కినెట్టిన రష్మిక మందన్న!

ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ రష్మిక మందన. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. అంతకుముందే కన్నడలో అడుగు పెట్టేసింది. స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది. పైగా ఇండియన్ క్రష్ గా అభిమానుల హృదయలలో నిలిచింది. బాలీవుడ్లో కూడా దూసుకెళ్తుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టా లో ఓ ఫోటో షేర్ చేసుకుంది. అందులో తన కంటి చూపుతో అందర్నీ మాయచేయగా.. ఈ ఫోటోకే ఎన్నో లైక్స్ వచ్చాయి.

ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ రష్మిక మందన.

ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. అంతకుముందే కన్నడలో అడుగు పెట్టేసింది

స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది. పైగా ఇండియన్ క్రష్ గా అభిమానుల హృదయలలో నిలిచింది.

బాలీవుడ్లో కూడా దూసుకెళ్తుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా తన ఇన్ స్టా లో ఓ ఫోటో షేర్ చేసుకుంది. అందులో తన కంటి చూపుతో అందర్నీ మాయచేయగా..

ఈ ఫోటోకే ఎన్నో లైక్స్ వచ్చాయి.

రష్మిక మందన్న హాట్ అండ్ లేటెస్ట్ ఫోటోలు..

రష్మిక మందన్న హాట్ అండ్ లేటెస్ట్ ఫోటోలు..

రష్మిక మందన్న హాట్ అండ్ లేటెస్ట్ ఫోటోలు..

వీడియో వైరల్: సమంత ట్రైనింగా మజాకా..ఎగిరెగిరి తంతోంది!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కినేని ఇంటికి కోడలైన సమంత అచ్చం తన అత్త బాటలోనే నడుస్తోంది. అమలకు మూగజీవాలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదేవిధంగా సమంత కూడా తనకెంతో ఇష్టమైన పెట్ హష్ గురించి తన అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమంత తన పెట్ ను తన బిడ్డగా భావించి ఎంతో ప్రేమగా చూసుకుంటుంది.

తన హష్ కోసం సమంత కొన్నిసార్లు చైతన్యతో గొడవ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.హష్ ను ఎవరు ప్రేమగా చూసుకుంటారు?హష్ కి ఎవరంటే ఇష్టం అనే విషయాలలో తరచు వీరి మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఈ విధంగా వీరిద్దరూ తమ హష్ పై ఎంతో ప్రేమను చూపిస్తారు.

తాజాగా హైదరాబాద్ నగరం వర్షంతో తడిసి ముద్దయింది. ఈ క్రమంలోనే వాతావరణం ఎంతో చల్లగా ఆహ్లాదకరంగా ఉండటంతో సమంత తన హష్ తో కలిసి గార్డెన్లో ఎంతో సరదాగా ఆడుకున్నారు.ఈ విధంగా వీరిద్దరూ ఆడుకున్న టువంటి వీడియోను సమంత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.instagram.com/reel/CRTjNjVgwim/?utm_source=ig_web_copy_link

ఈ వీడియోలో సమంత, తన హష్ బెలూన్ ఆట ఆడారు.ఆ బెలూన్‌ను సమంత పైకి ఎగిరేస్తుంటే.. హష్ సైతం పైకి ఎగిరి ఎగిరి తంతోంది.. అలా ఇద్దరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ కనిపించారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది నెటిజన్లు ఆకట్టుకుంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు సమంత ట్రైనింగా ..మజాకా సమంత ట్రైనింగ్ ఇస్తే ఈ మాత్రం ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మమ్మీ అంటూ ఫోటో షేర్ చేసిన సమంత.. కంగ్రాట్స్ చెప్తున్న అభిమానులు? వెంటనే..

ఏంటి? అక్కినేని సమంత తల్లి కాబోతుందా? చైతన్య తండ్రి కాబోతున్నాడా? అంటే అవుననే అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత తల్లి కాబోతుందని ప్రచారం జరుగుతుంది. అభిమానులు కూడా సమంత ఫోటో కింద కంగ్రాట్స్ అంటూ విష్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే..

అక్కినేని సమంత తన ఇంస్టాగ్రామ్ లో సమంత తన ఫోటో షేర్ చేస్తూ.. ఈ ఫోటో మా అమ్మ తీసింది అని చెప్పేది కాస్త.. కెమెరా సింబల్ పెట్టి మమ్మీ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇంకేముంది.. సమంత నిజంగానే తల్లి కాబోతుందని అభిమానులు అంత కలిసి శుభాకాంక్షలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

దీంతో ఖంగుతిన్న సమంతా.. తాను పెట్టిన క్యాప్షన్ రాంగ్ గా కన్వే అవుతుందని గ్రహించి.. వెంటనే క్యాప్షన్ మార్చేసింది.. ఇందుకు సంబంధించిన ఫోటో కొద్దీ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తల్లి కాబోతున్న సమంత.. అసలు విషయం ఏమిటంటే?

అక్కినేని వారసుడు నాగచైతన్య, టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రేమించకొని ఐదు సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.వీరి పెళ్లి జరిగి దాదాపు ఐదు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఎలాంటి శుభవార్తను చెప్పకపోవడంతో అభిమానుల దృష్టి మొత్తం వారికి రాబోయే వారసుడిపై ఉంది. ఈ క్రమంలోనే సమంత తల్లి కాబోతుందా అనే విషయం గురించి ఇప్పటికే ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై సమంత స్పందిస్తూ కొంతమేర అసహనం వ్యక్తం చేశారు.

తాజాగా మరోసారి సమంత సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు మొత్తం సమంత తల్లి కాబోతుందా?గర్భవతివా? త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అంటూ వివిధ రకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధంగా నెటిజనులు కామెంట్ చేయడానికి గల కారణం ఏమిటంటే ఆ ఫోటోలో సమంత ఎంతో క్యూట్ గా కూర్చుని మామిడిపండు వైపు తదేకంగా చూడటం ఇందుకు కారణమని చెప్పవచ్చు.

ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ ఫోటోలో అందరి చూపు సమంత వైపు కాకుండా మామిడికాయ వైపు పడటంతో ఈ విధమైనటువంటి సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే సమంత ఈ విధంగా ఫోటో షేర్ చేయడం వెనుక కారణం ఏమిటంటే.. సమంత సినిమా రంగంలో పాటు వ్యాపార రంగంలోకి అడుగు పెట్టిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తన దుస్తుల వ్యాపారమైన సాకీ దుస్తులను ప్రమోషన్ లో భాగంగా సమంత ఈ విధమైనటువంటి డ్రెస్ ధరించి బయట కూర్చుని ఉన్నటువంటి ఫోటోను షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలో మామిడికాయ ఉండటంతో అందరి ఫోకస్ దానిపై పడటం వల్ల ఈ విధమైనటువంటి సందేహాలు తలెత్తాయని చెప్పవచ్చు. నిజంగానే సమంత తన అభిమానులకు ఎప్పుడు శుభవార్త చెబుతారో అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

సమంత జీవితాన్ని మార్చేసిన సినిమా ఏంటో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో సమంత అక్కినేని ఒకరు. హీరోయిన్ గా పలు భాషల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న సమంత తన 34 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న. ఈ విధంగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకొని సెలబ్రిటీ గా రాణిస్తున్న సమంత జీవితాన్ని ఆ ఒక్క సినిమా మార్చేసిందని చెప్పవచ్చు.

సమంత మొట్టమొదటిసారిగా తెలుగులో నాగ చైతన్య సరసన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఏం మాయ చేసావే” సినిమాలో నటించి కుర్రకారులందరిని మాయ చేసింది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన నటించే అతన్ని ప్రేమించి, 2017వ సంవత్సరంలో పెద్దల సమక్షంలో ఒకటై తెలుగింటి కోడలుగా అడుగు పెట్టింది. పెళ్లి కాకముందే ఎన్నో గ్లామరస్ పాత్రలో నటించి మంచి విజయాలను అందుకున్న సమంత పెళ్లి తర్వాత కూడా అదే స్పీడ్ తో దూసుకుపోతోంది.

పెళ్లి తర్వాత కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఈమె నటించిన “ది ఫ్యామిలీ మెన్” రెండవ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే విడుదల కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ తెలిపింది. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత మొట్ట మొదటిసారిగా పౌరాణిక చిత్రమైన “శాకుంతలం” సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతోంది.

కేవలం వెండితెరపై, వెబ్ సిరీస్ లో మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఇంత మంచి గుర్తింపును సంపాదించుకున్న సమంత ఒక వ్యాపార వేత్తగా కూడా మారారు. సాకీ బ్రాండ్ దుస్తులను ప్రారంభించి మంచి వ్యాపారవేత్తగా కూడా మార్కులు సంపాదించారు. ఈ విధంగా సమంత ఇంతటి క్రేజ్ జీవితానికి కారణం ఏం మాయ చేసావే సినిమా అని చెప్పవచ్చు.

పెళ్లి అయితే ఏంటి? సమంతనే సౌత్ స్టార్ హీరోయిన్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకున్న సమంత అక్కినేని ఏప్రిల్ 28న తన 34 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నది. ఈ క్రమంలోనే ఆమెకి అభిమానులు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఏ మాయ చేసావే సినిమాలో ఎంతో అమాయకంగా జెస్సీ పాత్రలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తరువాత అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకొని తెలుగింటి కోడలుగా అడుగుపెట్టింది.

పెళ్లి కాక ముందు వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమంతా పెళ్లయిన తర్వాత తన స్పీడ్ కి బ్రేక్ పడుతుందని ఎంతో మంది భావించారు. కానీ పెళ్లి అయిన తరువాత సమంత రెట్టింపు వేగంతో దూసుకు పోతూ మరింత గుర్తింపును సంపాదించుకుంది. పెళ్లయిన తర్వాత గ్లామరస్ పాత్రలు కాకుండా ఎంతో అద్భుతంగా నటించే అవకాశాలను పొందుతున్నారు. కేవలం వెండి తెరపై మాత్రమే కాకుండా బుల్లితెర పై బిగ్ బాస్ కార్యక్రమానికి కొన్ని రోజులు వ్యాఖ్యాతగా వ్యవహరించి తనలో ఉన్న నైపుణ్యాన్ని బయటపెట్టింది.

అదేవిధంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా ఆహా యాప్ ద్వారా ప్రసారమైన “సామ్ జామ్”షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించి తన మార్క్ ఏంటో నిరూపించుకున్నారు. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ, గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “శాకుంతలం”అనే పౌరాణిక సినిమాలో నటిస్తున్నారు. వృత్తిపరంగా కెరియర్ పరంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న సమంత మంచి మనసున్న అమ్మాయిగా కూడా గుర్తింపు పొందింది.

ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది అనాధ పిల్లలను ఆదుకొని వారికి విద్య వైద్యం అందిస్తూ ఎంతో గొప్ప మనసున్న అమ్మాయిగా గుర్తింపు సంపాదించుకుంది. ఇవేకాక బిజినెస్ రంగం వైపు అడుగులు వేస్తూ తన సత్తా ఏంటో నిరూపించుకుంది.’సాకీ’ పేరుతో మహిళల ఫ్యాషన్ దుస్తులను అందుబాటులోకి తెస్తూ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. ఈ వ్యాపారం తన బిడ్డ లాంటిదని సమంత చెప్పడం విశేషం.ఈ విధంగా వివిధ రంగాలలో ఎంతో చురుకుగా పాల్గొంటూ మంచి గుర్తింపును సాధించుకున్న అక్కినేని సమంత ఎప్పుడు స్టార్ హీరోయిన్ అని చెప్పవచ్చు

బట్టలిప్పేసి రచ్చ ఎందుకు సమంత.. మీ అత్తను చూసి నేర్చుకో.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..?

ఈ మధ్య కాలంలో వివాదాల ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న నటి శ్రీరెడ్డి సమంతను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సమంత డ్రెస్సింగ్ ను ట్రోల్ చేస్తున్న శ్రీరెడ్డి అదే సమయంలో అమల, నమ్రతలను ప్రశంసిస్తూ ఉండటం గమనార్హం. చైతన్య పుట్టినరోజు సందర్భంగా మాల్దీవులకు వెళ్లిన సమంత సోషల్ మీడియాలో బికినీ ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలపై శ్రీరెడ్డి విమర్శలు చేసింది. తాజాగా సమంత ఒక ప్రకటన కోసం పోటో షూట్ చేసింది.

సమంత పోటోషూట్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల గురించి శ్రీరెడ్డి స్పందిస్తూ అక్కినేని కుటుంబంలో అమల గారు డ్రెస్సింగ్ విషయంలో ఎంతో పద్ధతిగా ఉంటారని.. పెళ్లికి ముందు పెళ్లి తరువాత అమల డ్రెస్సింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. అమల పశువులపై ప్రేమతో ఒక సంస్థను ప్రారంభించారని అమల గారిని చూసి సమంత నేర్చుకోవాలంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే అమల గారు అంటే ఇష్టమైనా నాగార్జున గారు మాత్రం తనకు నచ్చరంటూ కామెంట్ చేశారు. బట్టలు విప్పేసి సమంత ఎందుకు రచ్చ చేస్తుందో తనకు అర్థం కావడం లేదని.. సమంతలో క్యూట్ నెస్ ఉంది కానీ హాట్ నెస్ లేదని.. అందాలను విప్పి చూపించినా సమంతకు సూట్ కాదని శ్రీరెడ్డి పేర్కొన్నారు. అలాంటి బట్టలేసుకుని జనాలను ఇబ్బంది పెట్టకంటూ సమంతపై శ్రీరెడ్డి సెటైర్లు వేశారు.

సమంత కు తాను కూడా ఫ్యాన్ నని అయితే ఒక ఫ్యాన్ గా నాకు సమంత డ్రెస్సింగ్ సెన్స్ నచ్చడం లేదని అన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సక్సెస్ కు నమ్రత కారణమని.. నమ్రత మహేష్ కు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో సమంత చూడాలని అన్నారు. హీరో నాగచైతన్యకు పెద్దగా హిట్లు లేవని సమంత చైతన్య కెరీర్ విషయంలో దృష్టి పెడితే బాగుంటుందని శ్రీరెడ్డి ఉచిత సలహా ఇచ్చారు.

కళ్లకు గంతలు కట్టుకుని మెగాస్టార్ ఏం చేశారో తెలుసా?

కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా చిత్ర నిర్మాణ పనులు ఆగిపోవడంతో ప్రముఖ సినీ సెలబ్రిటీస్ మొత్తం ఇంటికే పరిమితమయ్యారు.అయితే ఇంటికే పరిమితమైన హీరోలందరూ ఛాలెంజ్ లో భాగంగా రోజు ఇంటి పనులను చేస్తూ తమ చాలెంజ్ పూర్తి చేసేవారు. ఈ చాలెంజ్ లో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి తన ఇంటిని శుభ్రం చేస్తూ, అలాగే దోసెలను వేస్తూ తన చాలెంజ్ పూర్తి చేసిన సంగతి మనకు తెలిసిందే.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి సమంత వ్యాఖ్యాతగా “ఆహా” యాప్ ద్వారా నిర్వహిస్తున్న సామ్ జామ్ అనే టాక్ షో కి మెగాస్టార్ చిరంజీవి వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. అయితే క్రిస్మస్ కానుకగా మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో సందడి చేయనున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఒక ప్రోమోను విడుదల చేశారు.

ఈ వీడియోలో సమంత అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సమంత చిరంజీవిని “మీరు ఎప్పుడైనా సినిమా చూస్తూ ఏడ్చారా”? అనే ప్రశ్నను అడగడంతో అందుకు చిరంజీవి గారు సమాధానం చెబుతూ… ఓ సినిమాకు వెళ్లి కన్నీళ్ళు పెట్టుకున్నానని, కిందకు వంగి కళ్ళు తుడుచుకుంటున్న సమయంలో లైట్లు వేశారు తాను పైకి లేచేసరికి పైట చేతిలో ఉందని నవ్వుతూ చెప్పారు. అంతేకాకుండా ఈ షోలో చేతులు లేని బాలుడు ఎంతో అద్భుతంగా చిరంజీవి బొమ్మను నోటితో గీయడంతో ఎంతో ఆనంద పడ్డారు.

అంతే కాకుండా సమంత కరోనా సమయంలో దోస చాలెంజ్ ను గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా చిరంజీవిగారితో దోసెలను వేయించారు. అయితే ఈసారి మాత్రం చిరంజీవిగారు కళ్ళకు గంతలు కట్టుకొని దోసే వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరిని ఆకట్టుకుంది.

సమంత ఫిట్ నెస్ కి కారణం ఏమిటో తెలుసా?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం వారి సినీ ప్రస్థానాన్ని కొనసాగించాలి అంటే వారికి శరీర ఫిట్ నెస్ ఎంతో అవసరం. వారి శరీరాకృతిని సక్రమంగా ఉంచుకోవడానికి ఎంతో కష్టపడుతుంటారు. జిమ్ కి వెళ్లడం, వ్యాయామం చేయటం, డైట్ ఫాలో కావడం వంటివి రెగ్యులర్ గా చేయడం వల్ల వారి శరీరం ఫిట్ గా ఉండటం వల్ల వారికి అవకాశాలు వస్తుంటాయి.

ఈ నేపథ్యంలోనే మన టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరైన సమంత తన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు తన శరీరాకృతిలో ఎలాంటి మార్పులు లేకుండా ఒకే విధంగా మనకు కనిపిస్తుంది. సమంత ఫిట్ నెస్ ఎలా మెయింటెన్ చేస్తుంది అన్న అనుమానం కూడా కలిగింది.అయితే సమంత అలా కనిపించడం వెనుక ఎంతో కష్టం కూడుకుంది. ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత తరువాత ఏకంగా తెలుగింటి కోడలిగా అడుగుపెట్టింది.

లాక్ డౌన్ కారణంగా సినిమాలు లేకపోవడంతో వెబ్ సిరీస్ ద్వారా తన అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తున్నారు. ఈ మధ్యనే ఆహా యాప్ ద్వారా సామ్ జామ్ అనే టాక్ షో కి వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్నారు. ఇలా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సమంత ప్రస్తుతం తన ఫిట్ నెస్ కి సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

ఆటో 10 కేజీలు, ఇటు 10 కేజీల బరువును మోస్తూ జిమ్ సూట్ లో ఎంతో కష్టపడుతున్నారు. తన శరీరం ఫిట్ నెస్ కోసం సమంత కష్టపడుతున్న ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు సమంత ఫిట్ నెస్ కి కారణం ఇదేనా… అని అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సమంత సూపర్ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే సమంత ఈ ఫోటో ప్రస్తుతం తన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.