Tag Archives: security

Prabhas: ఆది పురుష్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ సెక్యూరిటీ కోసం అన్ని లక్షలు ఖర్చు చేశారా?

Prabhas: ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకేక్కిన ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.

తిరుపతిలో జరిగిన ఈ కార్యక్రమానికి లక్షల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అయితే ఈ భారీ ఈవెంట్ లో ప్రభాస్ కి సెక్యూరిటీ ఇవ్వడానికి భారీగా ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.దాదాపు వెయ్యి మందికి పైగా పోలీసులు వేడుకకు సెక్యూరిటీగా వచ్చారు. వారు కాకుండా ప్రభాస్ కోసం ప్రవేట్ గా దాదాపు 100 మంది సెక్యూరిటీ వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే బాంబు స్క్వాడ్ సెక్యూరిటీ కూడా హాజరయ్యారని తెలుస్తోంది.

ఈ విధంగా పోలీసులు మాత్రమే కాకుండా 100 మంది ప్రవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడంతో నిర్మాతలకు ఖర్చు కూడా అదనంగా పెరిగిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ సెక్యూరిటీ కోసం నిర్మాతలు దాదాపు పాతిక లక్షల వరకు ఖర్చు చేశారని తెలుస్తుంది. ఒక సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఇలా భారీ స్థాయిలో ఖర్చు చేయడం బహుశా ఇదే మొదటిసారి అని తెలుస్తుంది.

Prabhas: వంద మంది ప్రైవేట్ సెక్యూరిటీ…


ఈ వేడుక కోసం సుమారు మూడు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇప్పటివరకు ఏ సినిమాకి కూడా ప్రీ రిలీజ్ వేడుక కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయలేదు. ఇక పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ కు ఎంతో మంది అభిమానులు ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా భారీ స్థాయిలో అభిమానులు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో వారిని దృష్టిలో ఉంచుకొని ప్రభాస్ సెక్యూరిటీ టైట్ చేశారని సమాచారం.

Ramgopal Varma: రాజమౌళిని చంపడానికి భారీ కుట్ర… భద్రత అవసరమంటూ హెచ్చరించిన వర్మ?

Ramgopal Varma: రాంగోపాల్ వర్మ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే ఈయన సోషల్ మీడియా వేదికగా లేదా ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న కూడా పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.వర్మ ఒక ట్వీట్ చేసిన లేదా ఒక కార్యక్రమంలో పాల్గొన్న తప్పనిసరిగా వివాదం చెలరేగుతుందనే విషయం అందరికీ తెలిసిందే.

ఇలా ఇప్పటికే ఎన్నో వివాదాలు ద్వారా వార్తల్లో నిలిచిన రామ్ గోపాల్ వర్మ తాజాగా రాజమౌళి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకోగా, RRR సినిమా ద్వారా ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే ఎంతోమంది హాలీవుడ్ దర్శకులు రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక తాజాగా అవతార్ సినిమా డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ సైతం రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ క్రమంలోనే వీరిద్దరికి సంబంధించిన వీడియోను రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ మిమ్మల్ని ఇలా చూస్తుంటే కొంతమంది డైరెక్టర్లు చాలా ఈర్షతో ఉన్నారు.

Ramgopal Varma:కుట్ర చేసే వారిలో నేను ఒకడిని…

ఈ క్రమంలోనే కొందరు మీపై కుట్ర చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇలా మీపై హత్యా ప్రయత్నం చేసే వారిలో తాను కూడా ఒకడని, అయితే నాకు 4 పెగ్గులు ఎక్కువ కావడం వల్ల ఈ నిజాలన్ని బయటకు వస్తున్నాయి అంటూ ఈయన షాకింగ్ ట్వీట్ చేశారు. ఇలా రాజమౌళి పై కుట్ర జరగబోతుందని కుట్ర చేసే వారిలో నేను కూడా ఒకరు మీరు మరింత భద్రత పెంచుకోవాలి అంటూ వర్మ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే రాజమౌళి పై ఎలాంటి కుట్ర జరగదని ఇవి కేవలం వర్మ మాటలే అంటూ కొందరు కొట్టి పారేస్తున్నారు.

Sai Pallavi: ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అంత పెద్ద సాహసానికి ఒడి గట్టిన సాయి పల్లవి.. చివరికి ఏమైందంటే?

Sai Pallavi: నాచురల్ బ్యూటీ సాయిపల్లవి ఈ ఏడాది వరుసగా రెండు విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సరసన లవ్ స్టోరీ సినిమా ద్వారా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టారు. అదేవిధంగా డిసెంబర్ 24వ తేదీ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నాని ద్విపాత్రాభినయంలో సాయిపల్లవి హీరోయిన్లుగా శ్యామ్ సింగరాయ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Sai Pallavi: ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అంత పెద్ద సాహసానికి ఒడి గట్టిన సాయి పల్లవి.. చివరికి ఏమైందంటే?

ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీ విడుదలయ్యి మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. సాయి పల్లవి ఇందులో దేవదాసి పాత్రలో నటించారు. ఎప్పటిలాగే ప్రతి సినిమాలోలాగే ఈ సినిమాలో కూడా సాయి పల్లవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఇదిలా ఉండగా సాయిపల్లవి ఈ సినిమా విడుదలైన తర్వాత తన చుట్టూ ఏ విధమైనటువంటి సెక్యూరిటీ లేకుండా ఒక పెద్ద సాహసానికి ఒడిగట్టారు.

Sai Pallavi: ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అంత పెద్ద సాహసానికి ఒడి గట్టిన సాయి పల్లవి.. చివరికి ఏమైందంటే?

ఈ క్రమంలోని ఈ సినిమా థియేటర్ ల వద్ద ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఏకంగా ఈమె బుర్ఖా ధరించి హైదరాబాద్ లోని శ్రీ రాములు థియేటర్ కి వెళ్లారు. అయితే బుర్ఖాలో ఉన్న సాయి పల్లవిని ఎవరు గుర్తించలేదు. సినిమా పూర్తయిన తర్వాత సాయి పల్లవి బయటకు రాగానే బయట ఒక రిపోర్టర్ సరాసరి సాయిపల్లవి దగ్గరకు వెళ్లి సినిమా ఎలా ఉంది అని తనని అడిగారు.

కారు ఎక్కిన తర్వాత ఐడెంటిటీ రివిల్ చేసిన సాయి పల్లవి:

ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సరాసరి కారులోకి వెళ్ళిన తర్వాత సాయి పల్లవి తన
ఐడెంటిటీ రివీల్ చేయడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సాయిపల్లవి ఈ విధంగా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బయట తిరగడం కష్టం. ఈమెను ఎవరు గుర్తించలేదు కనుక సరిపోయింది అదే కనుక ఒకవేళ గుర్తుపట్టి ఉంటే అక్కడ పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి ఎంతో కష్టతరం అయ్యేదని పలువురు భావిస్తున్నారు. మరి కొంతమంది ఈ సినిమా ప్రమోషన్ లో ఇది ఒక భాగమేనని వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.