Tag Archives: shahid kapoor

Mrunal Thakur: అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటాను… ఆయనే నా ఫస్ట్ క్రష్: మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకొని నటిస్తూ బిజీగా ఉన్నారు ఇప్పటికే నాని విజయ్ దేవరకొండ వంటి హీరోల సరసన నటించే అవకాశాలను అందుకున్నారు.

ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తనకు సంబంధించిన విషయాలన్నింటిని కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా ఓ సందర్భంలో ఈమె మాట్లాడుతూ తనకు ఆటలు అంటే చాలా ఇష్టం అని తెలిపారు. ముఖ్యంగా క్రికెట్ బాస్కెట్ బాల్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు.

ఇక తన సోదరి వల్లే తనకు క్రికెట్ పై చాలా ఇష్టం ఏర్పడిందని తనకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం అంటూ ఈ సందర్భంగా తన ఫేవరెట్ క్రికెటర్ గురించి కూడా ఈమె తెలియజేశారు.ఇక హీరోల విషయానికి వస్తే తనకు షాహిద్ కపూర్ అంటే చాలా ఇష్టం అని తెలిపారు. ఇండస్ట్రీలోకి రాకముందు తన ఫోటో ఏదైనా పేపర్లో కనిపిస్తే తాను కట్ చేసి బుక్ లో పేస్ట్ చేసుకొనే దానినని తెలియజేశారు.

Mrunal Thakur: అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా…


ఇక షాహిద్ కపూర్ తన ఫస్ట్ క్రష్ అని అలాంటి హీరోతో కలిసి తిరిగి నాకు నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసానని ఈమె తెలియజేశారు.ఇక తాను ఒక క్లాసికల్ డాన్సర్ అని ఆ అనుభవం నాకు సీతారామం సినిమాలో ఎంతో ఉపయోగపడిందని తెలియజేశారు. ఇక నటనపరంగా తనని పూర్తిగా అర్థం చేసుకున్న వాడిని తాను పెళ్లి చేసుకుంటాను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Bolly wood Star Hero: భార్యను ట్రోలింగ్ చేసిన స్టార్ హీరో… దిమ్మ తిరిగే కౌంటర్ వేసిన హీరో భార్య?

ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ భార్యమీరా రాజ్‌పుత్‌ సోషల్ మీడియా వేదికగా బాత్రూంలో మిర్రర్ సెల్ఫీ తీసుకున్న ఫోటోని షేర్ చేశారు.అయితే ఈ ఫోటో షేర్ చేయడంతో నేటిజెన్లు కూడా ఈ ఫోటో గురించి పెద్దగా పట్టించుకోలేదు.ఎప్పుడైతే ఈ ఫోటో పై స్వయంగా నటుడు షాహిద్ కపూర్ కామెంట్ చేశారో అప్పుడే ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ సందర్భంగా షాహిద్ కపూర్ తన భార్య షేర్ చేసిన ఫోటోపై కామెంట్ చేస్తూ తను సెల్ఫీ దిగడానికి కనీసం బాత్రూం నుంచి బయటకు వచ్చే వరకు కూడా వేచి ఉండలేకపోయింది అంటూ కామెంట్ చేశారు. ఈ విధంగా తన భర్త తన గురించి ఇలా ట్రోల్ చేయడంతో స్పందించిన మీరా తనదైన శైలిలో కౌంటర్ వేశారు.

భర్తకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన.. మీరా రాజ్ పుత్..

ఈ క్రమంలోనే మీరా రాజ్ పుత్ తన భర్త షాహిద్ కపూర్ చేసిన కామెంట్ కి రిప్లై ఇస్తూ ఇషాన్ కట్టర్‌కు పోస్ట్ చేయాల్సిన ఈ కామెంట్ పొరపాటుగా తనకు పోస్ట్ చేశారేమో అంటూ సెటైరికల్ కామెంట్ చేశారు. ఇలా వీరిద్దరూ ఒకరిపై ఒకరు ట్రోలింగ్ చేసుకోవడం, కౌంటర్లు ఇవ్వడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

Shahid Kapoor: ఆ సినిమాను ఓటీటీలో విడుదల చెయ్యకండి.. కావాలంటే రెమ్యూనరేషన్ తగ్గించుకుంటా.. యంగ్ హీరో?

Shahid Kapoor: ప్రస్తుతం కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పలు ఆంక్షలు విధించడం వల్ల థియేటర్లు మూత పడ్డాయి. ఈ క్రమంలోనే విడుదల కావాల్సిన సినిమాలన్నీ మరోసారి వాయిదా వేసుకున్నాయి. ఇలా వాయిదా వేసుకున్న చిత్రాలలో జెర్సీ హిందీ రీమేక్ చిత్రం కూడా ఒకటి. అన్ని పరిస్థితులు అనుకూలించి ఉంటే ఈ సినిమా డిసెంబర్ 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

Shahid Kapoor: ఆ సినిమాను ఓటీటీలో విడుదల చెయ్యకండి.. కావాలంటే రెమ్యూనరేషన్ తగ్గించుకుంటా.. యంగ్ హీరో?

అయితే కరోనా ఆంక్షల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో ఈ సినీ నిర్మాతలు ఈ సినిమాను థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై స్పందించిన హీరో షాహిద్ కపూర్ ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి ఒప్పుకోలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తప్పకుండా రికార్డులను సృష్టిస్తుందని నమ్మడం వల్ల ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయడానికి ఇష్టపడటం లేదు.

Shahid Kapoor: ఆ సినిమాను ఓటీటీలో విడుదల చెయ్యకండి.. కావాలంటే రెమ్యూనరేషన్ తగ్గించుకుంటా.. యంగ్ హీరో?

తెలుగులో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న అర్జున్ రెడ్డి సినిమా హిందీలో రీమేక్ చేసి ఎంతో పాపులారిటీ దక్కించుకున్న షాహిద్ కపూర్ ఈ సినిమా ద్వారా మరింత క్రేజ్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమాని థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేయడంతో ఎలాంటి ఫలితం ఉండదని భావించారు.

తన రెమ్యూనరేషన్లు ఎంతైనా కోత విధించండి..

ఎంతో అద్భుతమైన ఇలాంటి చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్లోనే చూడాలని బాధించిన ఈ హీరో ఏకంగా తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి కూడా వెనకాడటం లేదు. ఈ సినిమా కోసం షాహిద్ కపూర్ 31 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా ఇందులో 5 లేదా 10 కోట్లు లేదా ఎంతైనా కోత విధించాలని ఆయన నిర్మాతలను వేడుకున్నారు. కొద్ది రోజుల పాటు ఈ సినిమా విడుదలను వాయిదా వేసి అనంతరం థియేటర్లోనే విడుదల చేయాలని నిర్మాతలను రిక్వెస్ట్ చేశారు. మరి ఈయన విన్నపాన్ని నిర్మాతలు వింటారా? లేక ఈ సినిమాని థియేటర్లో విడుదల చేస్తారా.. అనే విషయం తెలియాల్సి ఉంది.

సినిమా సెట్ లో గాయపడిన బాలీవుడ్ హీరో.. ఏకంగా 25 కుట్లు పడటంతో మారిన ఫేస్?

సాధారణంగా సినిమా షూటింగ్ సమయంలో కొన్ని ప్రమాదాలు జరగడం సర్వసాధారణం.అలాగే కొన్ని పెద్ద ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి ఇలాంటి ప్రమాదాలు హీరో హీరోయిన్ల ముఖ కవళికలు మారిపోవడమే కాకుండా కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా ఇలాంటి ఘటన బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ విషయంలో కూడా జరిగిందని ఆయన వెల్లడించారు.

తెలుగులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన జెర్సీ సినిమా హిందీ రీమేక్ చిత్రం చేస్తున్నారు. ఈ రీమేక్ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఈ సినిమా క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కడం వల్ల ఈ సినిమా షూటింగ్ కోసం షాహిద్ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు.

ఈ సమయంలో బాల్ చాలా బలంగా తన పెదవికి తగిలిందని ఆ సమయంలో పూర్తిగా తన పెదవి మొత్తం గాయపడిందని ఈ సందర్భంగా వెల్లడించారు.ఈ ప్రమాదంలో తన పెదవికి ఏకంగా 25 కుట్లు పడ్డాయని ఇక తన పెదవి మొత్తం పాడైపోయిందని భావించారు. కొద్దిరోజుల పాటు చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు.

ఈ ప్రమాదం నుంచి కోలుకోవడానికి తనకు సుమారు రెండు నెలల సమయం పట్టిందని అందుకోసమే రెండు నెలలపాటు ఈ సినిమా షూటింగ్ ను కూడా వాయిదా వేశారని ఈ సందర్భంగా షాహిద్ కపూర్ జెర్సీ సినిమా షూటింగ్ సమయంలో తనకు జరిగిన ప్రమాదం గురించి వెల్లడించారు.

ఆ సినిమా చూసి ఏడ్చేశాను.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా: షాహిద్ కపూర్

టాలీవుడ్ లో నానీ హీరోగా బంపర్ హిట్ కొట్టిన చిత్రం జెర్సీ. 2019లో ఈ సినిమా విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీనికి ఎన్నో అవార్డులు కూడా వరించాయి. ఇక దీనిని హిందీ రిమేక్ లో డిసెంబర్ 31 న అదే పేరుతో విడుదల చేయనున్నారు. దీనిలో హీరోగా షాహిద్ కపూర్ నటించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించారు.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జెర్సీకి సంబంధించి విశేషాలను చిత్ర బృందం పంచుకుంది. హీరో షాహిద్ కపూర్ మాట్లాడుతూ.. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాకు హిందీ రిమేక్ లో వచ్చిన సినిమా కబీర్ సింగ్. ఈ సినిమా తన జీవితంలో గొప్ప విజయమన్నారు. ఆ సినిమాకు సంబధించి కొన్ని ట్రోల్ చేసినా.. మంచి విజయం సాధించిందన్నారు. 18 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న తనకు ఇంత పెద్ద భారీ కలెక్షన్లు రాలేదన్నారు.

కబీర్ సింగ్ సినిమాతో తన క్రేజ్ ఒక్కసారిగా మారిపోయిందన్నారు. ఆ సినిమా నుంచే తనకు యాక్షన్ సినిమాలు చేయమని ఎంతో మంది సలహాలు ఇచ్చారన్నారు. అందుకే నిర్మాతల వద్దకు వెళ్లాలనని వాళ్లు రూ.200 నుంచి 300 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాలు తీయడానికి ఒప్పుకున్నారని.. తాను ఇంత వరకు అంత భారీ బడ్జెట్ తో సినిమాలు తీయలేదని ఎమోషనల్ అయ్యారు. ఆ ఘనత కేవలం కబీర్ సింగ్ సినిమాతో దక్కిందన్నారు. ఇక జెర్సీ సినిమా కథ తనకు చాలా నచ్చిందని.. ఆ సినిమా చివర్లో ఏడ్చేశాను అని చెప్పారు.

ఈ సినిమాను అతడు కబీర్ సింగ్ విడుదలకు కాకముందే చూశానన్నారు. ఈలోపు నేను కబీర్‌సింగ్‌ చేస్తుండటంతో జెర్సీ వాయిదా పడిందని.. అయినప్పటికీ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి నాకోసం ఎంతో కాలం ఎదురుచూశారన్నారు. ఈ సందర్భంగా అతడు గౌతమ్‌కి థ్యాంక్స్ చెప్పారు. ఇక ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో జెర్సీ ది బెస్ట్ అని అన్నారు.

వెబ్ సిరీస్ లో విలన్ పాత్రలో నటి.. ఎవరంటే?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు, ఇతర భాషలలో పలు సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్న నటి రాశీ ఖన్నా కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా,డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌పై బాగా ఫోకస్ పెట్టినట్లు ఉన్నారు. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ” ది ఫ్యామిలీ మెన్” వెబ్ సిరీస్
ఫేమ్‌ రాజ్‌ అండ్‌ డీకే దర్శకద్వయం రూపొందిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌లో షాహిద్‌ కపూర్, విజయ్‌ సేతుపతితో పాటు ఓ లీడ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు.

తాజాగా రాశీ ఖన్నా ప్రస్తుతం అజయ్ దేవగన్ నటించనున్న రుద్ర అనే టైటిల్ తో ప్రచారం జరుగుతున్న వెబ్ సిరీస్ లో ఓ కీలక పాత్రలో చేయడానికి ఈ ముద్దుగుమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వెంటిలేటర్ ఫేమ్ ఎమ్. రాజేష్ ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించనున్నారు.ఈ వెబ్ సిరీస్ ఇంగ్లిష్‌ సైకలాజికల్‌ క్రైమ్‌ డ్రామా ‘లూథర్‌’ ఆధారంగా రూపొందుతున్నగా ఇందులో రాశి ఖన్నా విలన్ పాత్రలో నటించనుందని సమాచారం వినిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఈ నెల 21వ తేదీ నుంచి మొదలు కానున్నట్లు తెలియజేశారు.

ఇకపోతే రాశిఖన్నా ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా అక్కినేని నాగచైతన్య సరసన “థాంక్యూ” సినిమాలో, గోపీచంద్ సరసన”పక్కా కమర్షియల్”వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే కోళీవుడ్ ఇండస్ట్రీలో మరో మూడు క్రేజీ ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.