Shahid Kapoor: ఆ సినిమాను ఓటీటీలో విడుదల చెయ్యకండి.. కావాలంటే రెమ్యూనరేషన్ తగ్గించుకుంటా.. యంగ్ హీరో?
Shahid Kapoor: ప్రస్తుతం కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పలు ఆంక్షలు విధించడం వల్ల థియేటర్లు మూత పడ్డాయి. ఈ క్రమంలోనే విడుదల కావాల్సిన సినిమాలన్నీ మరోసారి వాయిదా వేసుకున్నాయి. ఇలా వాయిదా వేసుకున్న చిత్రాలలో జెర్సీ హిందీ రీమేక్ చిత్రం కూడా ఒకటి. అన్ని పరిస్థితులు అనుకూలించి ఉంటే ఈ సినిమా డిసెంబర్ 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
అయితే కరోనా ఆంక్షల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో ఈ సినీ నిర్మాతలు ఈ సినిమాను థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై స్పందించిన హీరో షాహిద్ కపూర్ ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి ఒప్పుకోలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తప్పకుండా రికార్డులను సృష్టిస్తుందని నమ్మడం వల్ల ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయడానికి ఇష్టపడటం లేదు.
తెలుగులో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న అర్జున్ రెడ్డి సినిమా హిందీలో రీమేక్ చేసి ఎంతో పాపులారిటీ దక్కించుకున్న షాహిద్ కపూర్ ఈ సినిమా ద్వారా మరింత క్రేజ్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమాని థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేయడంతో ఎలాంటి ఫలితం ఉండదని భావించారు.
ఎంతో అద్భుతమైన ఇలాంటి చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్లోనే చూడాలని బాధించిన ఈ హీరో ఏకంగా తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి కూడా వెనకాడటం లేదు. ఈ సినిమా కోసం షాహిద్ కపూర్ 31 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా ఇందులో 5 లేదా 10 కోట్లు లేదా ఎంతైనా కోత విధించాలని ఆయన నిర్మాతలను వేడుకున్నారు. కొద్ది రోజుల పాటు ఈ సినిమా విడుదలను వాయిదా వేసి అనంతరం థియేటర్లోనే విడుదల చేయాలని నిర్మాతలను రిక్వెస్ట్ చేశారు. మరి ఈయన విన్నపాన్ని నిర్మాతలు వింటారా? లేక ఈ సినిమాని థియేటర్లో విడుదల చేస్తారా.. అనే విషయం తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…