Shahid Kapoor: ఆ సినిమాను ఓటీటీలో విడుదల చెయ్యకండి.. కావాలంటే రెమ్యూనరేషన్ తగ్గించుకుంటా.. యంగ్ హీరో?
Shahid Kapoor: ప్రస్తుతం కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పలు ఆంక్షలు విధించడం వల్ల థియేటర్లు మూత పడ్డాయి. ఈ క్రమంలోనే విడుదల కావాల్సిన సినిమాలన్నీ మరోసారి వాయిదా వేసుకున్నాయి. ఇలా వాయిదా వేసుకున్న చిత్రాలలో జెర్సీ హిందీ రీమేక్ చిత్రం కూడా ఒకటి. అన్ని పరిస్థితులు అనుకూలించి ఉంటే ఈ సినిమా డిసెంబర్ 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
అయితే కరోనా ఆంక్షల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో ఈ సినీ నిర్మాతలు ఈ సినిమాను థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై స్పందించిన హీరో షాహిద్ కపూర్ ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి ఒప్పుకోలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తప్పకుండా రికార్డులను సృష్టిస్తుందని నమ్మడం వల్ల ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయడానికి ఇష్టపడటం లేదు.
తెలుగులో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న అర్జున్ రెడ్డి సినిమా హిందీలో రీమేక్ చేసి ఎంతో పాపులారిటీ దక్కించుకున్న షాహిద్ కపూర్ ఈ సినిమా ద్వారా మరింత క్రేజ్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమాని థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేయడంతో ఎలాంటి ఫలితం ఉండదని భావించారు.
ఎంతో అద్భుతమైన ఇలాంటి చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్లోనే చూడాలని బాధించిన ఈ హీరో ఏకంగా తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి కూడా వెనకాడటం లేదు. ఈ సినిమా కోసం షాహిద్ కపూర్ 31 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా ఇందులో 5 లేదా 10 కోట్లు లేదా ఎంతైనా కోత విధించాలని ఆయన నిర్మాతలను వేడుకున్నారు. కొద్ది రోజుల పాటు ఈ సినిమా విడుదలను వాయిదా వేసి అనంతరం థియేటర్లోనే విడుదల చేయాలని నిర్మాతలను రిక్వెస్ట్ చేశారు. మరి ఈయన విన్నపాన్ని నిర్మాతలు వింటారా? లేక ఈ సినిమాని థియేటర్లో విడుదల చేస్తారా.. అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…