Chiranjeevi – Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో అందమైన జంటగా పేరు సంపాదించుకున్న సమంత నాగచైతన్య వాళ్ళ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ఇలా వీరిద్దరూ విడాకులు ప్రకటన చేసిన తర్వాత సమంత పూర్తిగా తన కెరీర్ పై దృష్టి సారిస్తూ తన ప్రతి ఒక్క కదలికను, ఆలోచనలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
విడాకుల ప్రకటన తర్వాత ఎంతో మానసిక వేదనను అనుభవించిన సమంత ఆ బాధ నుంచి బయట పడటం కోసం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించి ఈ సినిమా విజయంలో భాగమైంది. అయితే ఇప్పటివరకు ఐటమ్ సాంగ్ లో నటించని సమంత ఒక్కసారిగా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి ప్రతి ఒక్కరీ దృష్టిని ఆకర్షించింది.
ఇదిలా ఉండగా తాజాగా ఈ పాటలో సమంత నటించడం వెనుక మెగాస్టార్ చిరంజీవి హస్తం ఉందని తాజాగా ఈ విషయం బయటపడింది. సమంత తీసుకున్న ఈ డెసిషన్ వెనుక మెగాస్టార్ ఉన్నట్లు సమాచారం. విడాకుల తర్వాత సమంత పూర్తి డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని తెలుసుకున్న చిరంజీవి ఒక ప్రైవేట్ ఈవెంట్లో భాగంగా రామ్ చరణ్, చిరంజీవి, సమంత కలిశారు. అయితే ఆమెను ఆ బాధ నుంచి బయటకు రప్పించడం కోసం చిరంజీవి వీలైనంతవరకూ సినిమాలతో బిజీ కావాలని తెలియజేశారట.
ఇలా ఈ ఈవెంట్లో పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ గురించి చెప్పడం ఆ పాట నచ్చితే అందులో డాన్స్ చేయమని మెగాస్టార్ తనకు సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి మాటకు గౌరవం ఇచ్చిన సమంత పుష్ప సినిమాలోని ఉ అంటావా మామ.. ఊ ఊ అంటావా మామ అనే పాటకు స్టెప్పులు ఇరగదీసి మరింత ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.ఇలా సమంత ఐటమ్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా ఉందని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…