Tag Archives: Siddharth

Siddharth -Aditi: రహస్యంగా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన అదితి సిద్ధార్థ్?

Siddharth -Aditiy: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో
సిద్ధార్థ్ అదితి రావు హైదరి జంట ఒకటి. వీరిద్దరూ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరూ కలిసి అవే భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం సినిమాలో కలిసిన నటించారు. ఇక ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు..

ఇక వీరిద్దరూ కలిసి ముంబైలో సహజీవనం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి జంటగా వెళ్లారు. అయితే వీరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ వీరు మాత్రం ఎప్పుడూ కూడా తమ రిలేషన్ గురించి ఓపెన్ అవ్వలేదు. ఇలా రహస్యంగా తమ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నటువంటి ఈ జంట ఇటీవల రహస్యంగా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.

ఇలా ముంబైలో సహజీవనం చేస్తున్నటువంటి ఈ జంట తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని రంగనాథ స్వామి ఆలయ మండపంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులతో వీరి వివాహ వేడుక హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఇలా వీరిద్దరు పెళ్లి చేసుకున్నారనే వార్త వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతారు.

తెలంగాణలో వివాహం..
రిలేషన్ లో ఉన్నటువంటి ఈ జంట ఇలా రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటని ఆరా తీస్తున్నారు అయితే ఇలా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరికీ ఇది మొదటి వివాహం కాదని వీరిద్దరికీ ఇది రెండో వివాహమనే చెప్పాలి ఇప్పటికే వీరిద్దరూ పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటూ తిరిగి రెండో పెళ్లి చేసుకున్నారు.

Oye: ఓయ్ సినిమా టైటిల్ వెనుక ఇంత అర్థం దాగి ఉందా.. ఎన్ని రోజులు తెలియనేలేదే?

Oye: నటుడు సిద్ధార్థ్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే ఈయన బేబీ షామిలి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూ నటించినటువంటి మొట్టమొదటి చిత్రం ఓయ్ ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు ఇక ఈ సినిమాలో నటుడు సిద్ధార్థ హీరోగా నటించారు.

ఈ సినిమాకు ఆనంద్ రంగా డైరెక్టర్ గా పని చేశారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి కథ సంగీతం ఉన్నప్పటికీ ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 2009వ సంవత్సరంలో విడుదల అయినా ఈ సినిమా తిరిగి మరోసారి ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ఈ సినిమా గురించి డైరెక్టర్ పలు విషయాలను వెల్లడించారు. ఇక ఈ సినిమాలో సంధ్య పాత్రలో నటించిన షామిలి హీరో సిద్ధార్థ్ ను ఓయ్ అంటూ పిలుస్తూ ఉంటారు. ఇలా తనని ఓయ్ అని పిలవడానికి ఈ సినిమాకు ఓయ్ అని టైటిల్ పెట్టడానికి గల కారణాన్ని ఈ సందర్భంగా డైరెక్టర్ వెల్లడించారు.

ఈ సినిమాకు టైటిల్ తాను మణిరత్నం సినిమాలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని పెట్టానని తెలిపారు. మణిరత్నం సినిమాలలో హీరోయిన్లు హీరోని ఓ అంటూ పిలుస్తూ ఉంటారు అందుకే నేను కూడా ఈ సినిమాకు అదే టైటిల్ పెట్టాను. ఇక ఈ సినిమాకు టైటిల్ పెట్టడం వెనుక మరో కారణం ఉందని తెలిపారు.

వన్ ఇయర్…

సంధ్యతో ఉదయ్ ప్రేమకథ 2007 జనవరి 1న అతడి పుట్టినరోజు నాడు స్టార్ట్ అవుతుంది. క్రిస్మస్ కు సంధ్యను ఉదయ్ షిప్ లోకి తీసుకెళ్లడం వరకు కొనసాగి డిసెంబర్ 31తో ముగుస్తుంది.2008 జనవరి ఒకటవ తేదీకి ఆమె చనిపోయి ఉంటుంది. ఇలా వీరి ప్రయాణం ఒక సంవత్సరం పాటు జరుగుతుంది.Oy అంటే వన్ ఇయర్ అని అర్థం అంటూ ఈ సందర్భంగా డైరెక్టర్ ఈ సినిమా టైటిల్ ద్వారానే హీరో హీరోయిన్ల ప్రయాణం ఏడాది పాటు అంటూ చెప్పేశారు. ఇలా ఈ విషయం తెలిసి ఈ సినిమా టైటిల్ లో ఇంత అర్థం దాగి ఉందా ఇన్ని రోజులు అసలు తెలీదు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Oye Movie: ఒరేయ్ గుండు నాయాల అంటూ డైరెక్టర్ ను తిట్టిన నెటిజన్.. డైరెక్టర్ రియాక్షన్ ఇదే?

Oye Movie: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఇప్పటికే ఎంతోమంది హీరోల సినిమాలు తిరిగే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే త్వరలోనే నటుడు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన ఓయ్ సినిమా కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

ఆనంద్ రంగా దర్శకత్వంలో 2009వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే తిరిగి మరోసారి ఈ సినిమాని వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు. ఇక ఇదే విషయాన్ని డైరెక్టర్ ఆనంద్ రంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఇలా డైరెక్టర్ ఈ సినిమా రీ రిలీజ్ పోస్టర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక నేటి ఏకంగా డైరెక్టర్ ను తిట్టిపడేశారు.. ఒరేయ్ గుండు నాయాల ఇంత మంచి సినిమాని తీసి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ నేటిజన్ చేసినటువంటి ఈ కామెంట్ పై డైరెక్టర్ స్పందించారు.

సారీ చెప్పిన నెటిజన్..

ఇక దానికి దర్శకుడు.. స్మైల్ ఎమోజితో రిప్లై ఇచ్చారు. దానికి ఆ నెటిజెన్ రియాక్ట్ అవుతూ..సారీ సార్ అలా పిలిచినందుకు అని కామెంట్ చేయగా, దర్శకుడు దానిని స్పోర్టివ్ గా తీసుకోని..ఏం పర్వాలేదు. కానీ నువ్వు అన్నది నిజమే అంటూ రిప్లై ఇవ్వడమే కాకుండా నేటిజన్ చేసినటువంటి కామెంట్ చాలా పాజిటివ్ గా తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/p/C2z0828JquF/?utm_source=ig_embed&ig_rid=3e91ae2f-ce29-40b6-9dd5-aeefe2b9e580

Siddharth: బొమ్మరిల్లు -2 పై సిద్దార్థ్ షాకింగ్ కామెంట్స్… ప్రేమ కథ సినిమాలను చేసి విసుగుస్తోందంటూ?

Siddharth: సౌత్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు పొందిన సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం. తెలుగు, తమిళ్ భాషలలో సూపర్ హిట్ సినిమాలలో నటించిన సిద్ధార్థ్ లవ్ స్టోరీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచి లవర్ బాయ్ గా గుర్తింపు పొందాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఓయ్‌, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన సిద్దార్థ్ ప్రస్తుతం లవ్ స్టోరీస్ కి బ్రేక్‌ చేస్తూ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేశారు. ప్రస్తుతం టక్కర్‌ వంటి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావటానికి సిద్ధంగా ఉన్నాడు.

కార్తిక్‌ క్రిష్‌ దర్శకత్వం వచ్చిన ఈ సినిమాలో సిద్దార్థ్ కి జోడీగా దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించింది. ఈ నెల 9న ఈ సినిమా రిలీజ్‌ కాబోతుంది. తాజాగా టక్కర్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సిద్ధార్థ లవ్ స్టోరీ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా సిద్దార్థ్‌ మాట్లాడుతూ..’ ప్రేమకథ అనేది భావోద్వేగంతో కూడిన, అలసిపోయే ప్రయాణం. ఒక్కసారి ఆ సినిమాలు చేస్తే అలాంటి సినిమాలలోనే నటించాలని ఇండస్ట్రీలో ఒక అభిప్రాయం ఉంది. నేను లవ్‌ స్టోరీస్‌ చేస్తే, రాబోయే దశాబ్దం వరకు నాకు అలాంటి అవకాశాలే వచ్చే ప్రమాదం ఉంది.అందుకే ఇకపై లవ్ స్టోరీస్ కి దూరంగా ఉండాలనుకుంటున్నట్టు సిద్ధార్థ్‌ తెలిపాడు.

Siddharth: నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది..’


ఇక బొమ్మరిల్లు 2 గురించి కూడా సిద్దార్థ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “బొమ్మరిల్లుసినిమాకి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని.. ఆ సినిమాలోని భావోద్వేగాలకు మించిన భావోద్వేగాలను అందిండం చాలా కష్టమైన పని. ఒకవేళ అలాంటి ఎమోషన్స్ అందించగలమని, నేటి ట్రెండ్‌కి సరిపోయే కథ వచ్చినప్పుడు చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. కానీబొమ్మరిల్లుమ్యాజిక్‌ని సీక్వెల్‌లో పునఃసృష్టి చేయడం చాలా కష్టమైన పని అని సిద్దార్థ్ వెల్లడించాడు. దీంతో ఇంతకాలం బొమ్మరిల్లు-2 సినిమా మీద అభిమానులు పెట్టుకున్న ఆశలు నెరవేరేలా కనిపించటం లేదు.

Siddharth: శర్వానంద్ పెళ్లిలో పాట పాడుతూ అందరినీ సందడి చేసిన సిద్దార్థ్… వీడియో వైరల్!

Siddharth: టాలీవుడ్ కూల్ అండ్ హీరో శర్వానంద్ జూన్ మూడవ తేదీ జైపూర్ లోని శ్రీ లీల ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. పెద్దలు, సన్నిహితులు సినీ సెలబ్రిటీల సమక్షంలో శర్వానంద్ రక్షిత వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు నటుడు సిద్ధార్థ్ అదితి రావు హైదరి జంటగా హాజరైన సంగతి మనకు తెలిసిందే. మహాసముద్రం సినిమాలో జంటగా నటించిన వీరిద్దరూ అప్పటినుంచి చాలా చనువుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ వీరి గురించి వార్తలు వస్తున్నాయి. ఇలా వీరిద్దరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న వీరు మాత్రం ఈ వార్తల పై క్లారిటీ ఇవ్వలేదు.

ఇకపోతే సిద్ధార్థ్ అదితి ఇద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న ఈ వార్తలను ఖండించే ప్రయత్నం చేయకపోయినా వీరిద్దరూ కలిసి పలుసార్లు జంటగా మీడియా కంటికి కనబడుతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి శర్వానంద్ వివాహ వేడుకలలో కూడా సందడి చేయడంతో మరోసారి డేటింగ్ రూమ్ తెరపైకి వచ్చాయి. ఈ విధంగా శర్వానంద్ వివాహ వేడుకలలో పెద్ద ఎత్తున ఈ జంట సందడి చేశారు. ఈ వేడుకలలో భాగంగా మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొందరు సింగర్స్ పెద్ద ఎత్తున పాటలు పాడుతూ సందడి చేశారు.

Siddharth: ఓయ్ సినిమా పాట పాడుతూ…


ఈ క్రమంలోనే సిద్ధార్థ్ నటించిన ఓయ్ సినిమా నుంచి 176 బీచ్ హౌస్ లోప్రేమ దేవత అనే పాటను పాడారు. ఈ పాట పాడుతున్న సమయంలో సిద్ధార్థ సైతం వేదికపైకి వెళ్లి అద్భుతంగా ఈ పాటను పాడి అక్కడ ఉన్నటువంటి వారందరినీ ఎంటర్టైన్ చేశారు. ఇలా సిద్ధార్థ్ పాట పాడుతున్నటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా ఈ హీరో పాట పాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి గెస్ట్ లు అందరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా స్నేహితుడి వివాహ వేడుకలలో సిద్ధార్థ్ చాలా ఎంజాయ్ చేశారని తెలుస్తోంది.

Siddharth -Aditi Rao Hydari: శర్వానంద్ పెళ్లి వేడుకలలో జంటగా సందడి చేసిన సిద్దార్థ్ అదితి!

Siddharth -Aditi Rao Hydari: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నటువంటి వారిలో నటుడు సిద్దార్థ్ నటి అదితి రావు హైదరి జంట ఒకటి.వీరిద్దరూ కలిసి గత ఏడాది దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం అనే సినిమాలో నటించారు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ నటించినప్పటికీ సిద్దార్థ్ అదితి జంటగా నటించారు.ఈ సినిమా సమయం నుంచి వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ కూడా ముంబై వీధులలో కలిసి కెమెరా కంటికి కనబడుతున్నారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరాయి.ఇక వీరి గురించి ఇలాంటి వార్తలు వస్తున్నప్పటికీ ఈ ప్రశ్న ఎదురైన ప్రతిసారి వీరిద్దరూ ఈ ప్రశ్నను దాటవేస్తున్నారే తప్ప ఎవరు కూడా ఖండించే ప్రయత్నం చేయడం లేదు. ఇకపోతే వీరిద్దరూ జంటగా పలు సందర్భాలలో మీడియా కంటికి చిక్కిన సంగతి మనకు తెలిసిందే.

ఇక తాజాగా వీరిద్దరూ జంటగా నటుడు శర్వానంద్ పెళ్లిలో సందడి చేశారు. ఈ క్రమంలోని ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శర్వానంద్ పెళ్లికి రావడానికి ముంబై ఎయిర్పోర్ట్ లోజంటగా కనిపించినటువంటి వీరిద్దరూ జైపూర్ చేరుకొని శర్వానంద్ వివాహానికి హాజరయ్యారు. అదేవిధంగా జైపూర్ లో రాజస్థాన్ నటి, రాజకీయవేత్త బినా కాక్ ఇంటికి వెళ్లి ఆమెను కలిసి తనతో దిగినటువంటి ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.


Siddharth -Aditi Rao Hydari: శర్వానంద్ పెళ్లిలో సిద్ధార్థ్… అదితి

ఇలా వీరిద్దరూ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వీరిద్దరూ పెళ్లికి మాత్రమే కాకుండా శర్వానంద్ నిశ్చితార్థానికి కూడా ఇద్దరు జంటగా కలిసి వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి వెళ్లడంతో వీరి గురించి వచ్చే రూమర్స్ బాగా వైరల్ అవుతున్నాయి.ఇలా వీరిద్దరి డేటింగ్ రూమర్స్ వైరల్ అవుతున్నప్పటికీ వీరు మాత్రం ఈ వార్తలు గురించి ఖండించే ప్రయత్నం కానీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.

Brahmanandam: బ్రహ్మానందం చిన్న కోడలు బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా… కోట్ల ఆస్తులకు వారసురాలు!

Brahmanandam: టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమెడియన్ గా ఎన్నో వందల సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన ప్రస్తుతం కాస్త సినిమాలను తగ్గించారనే చెప్పాలి. ఇక బ్రహ్మానందం గారికి ఇద్దరు సంతానం అనే విషయం మనకు తెలిసిందే.

వీరి పెద్ద కుమారుడు గౌతమ్ ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటించారు. అయితే ఈయన ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు చిన్న కుమారుడు సిద్ధార్థ్. ఈయన ఉద్యోగ నిమిత్తం విదేశాలలో స్థిరపడ్డారు. అయితే తాజాగా తన చిన్న కుమారుడికి బ్రహ్మానందం ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరిపిన సంగతి మనకు తెలిసిందే.

బ్రహ్మానందం తన కుమారుడు సిద్ధార్థ్ కు ఐశ్వర్య అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బ్రహ్మానందం చిన్న కోడలు ఐశ్వర్య గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Brahmanandam: డాక్టర్ గా పేరు పొందిన ఐశ్వర్య…


ఐశ్వర్య కరీంనగర్ కు చెందిన ప్రముఖ డాక్టర్ పద్మజా వినయ్ గారి కుమార్తె. కరీంనగర్ లో పద్మజ సంతాన సాఫల్య కేంద్రం ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచింది. ఇలా పద్మజ వినయ్ గారి ఏకైక కుమార్తె ఐశ్వర్య కూడా ప్రముఖ గైనకాలజిస్ట్ కావడం విశేషం.ఇలా డాక్టర్ అయినటువంటి అమ్మాయిని బ్రహ్మానందం తన కోడలుగా చేసుకుంటున్నారు. ఇక ఈమె పేరిట తమ తల్లిదండ్రులు భారీగానే ఆస్తులను పోగు చేశారని తెలుస్తోంది. ఏది ఏమైనా బ్రహ్మానందం బడా ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని తన కోడలుగా తీసుకొచ్చారని తెలుస్తోంది.

Brahmanandam: బ్రహ్మానందం ఇంట్లో పెళ్లి సందడి..ఘనంగా చిన్న కొడుకు నిశ్చితార్థ వేడుక..?

Brahmanandam: హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గురించి తెలియని వారంటూ ఉండరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్. గా గుర్తింపు పొందిన బ్రహ్మానందం కొన్ని వందలకు పైగా సినిమాలలో నటించి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఇక ప్రస్తుతం వయసు పెరగటంతో అడపా దడపా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా బ్రహ్మానందం ఇంట్లో పెళ్లి సందడి మొదలైనట్లు తెలుస్తోంది.

తాజాగా బ్రహ్మానందం చిన్న కుమారుడి నిశ్చితార్థ వేడుక హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రహ్మానందంకి ఇద్దరూ కుమారులు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. పెద్ద కుమారుడు గౌతమ్ హీరోగా కొన్ని సినిమాలు నటించాడు. అయితే సరైన విజయాలు అందుకోకపోవడంతో సినిమాలకు దూరం అయ్యాడు. ఇక చిన్న కొడుకు సిద్దార్థ్ విదేశాలలో సెటిల్ అయ్యాడు.

తాజాగా ఆదివారం రోజున సిద్దార్థ్ నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది. డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె ఐశ్వర్యతో సిద్దార్థ్‌ నిశ్చితార్ధం జరిగింది. సిద్దార్ధ్‌కు కాబోయే భార్య ఐశ్వర్య కూడా డాక్టరే కావడం విశేషం. ఈ నిశ్చితార్థ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.
ఇక ఈ పెళ్లి పెద్దలు కుదిర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Brahmanandam: ఘనంగా నిశ్చితార్థ వేడుక…

ఇక వీరి పెళ్లి కూడా తొందర్లోనే జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇక చిన్న కుమారుడి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిపించాలని బ్రహ్మానందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సిద్ధార్థ, ఐశ్వర్య నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో బ్రహ్మానందం దంపతులతో పాటు అతని పెద్ద కుమారుడు గౌతమ్ కోడలు పిల్లలు కూడా ఉన్నారు. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు సిద్ధార్త్, ఐశ్వర్య దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Siddharth -Aditi Rao Hydari: మరోసారి జంటగా కనిపించిన లవ్ బర్డ్స్… వైరల్ అవుతున్న సిద్ధార్థ్, అదితి ఫోటోలు!

Siddharth -Aditi Rao Hydari: సిద్ధార్థ్, అదితిరావు హైదరి మధ్య ఏదో ఉందంటూ గత కొద్దిరోజులకు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇలా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని ముంబైలో ఇద్దరు సహజీవనం కూడా చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున వీరి రిలేషన్ గురించి వార్తలు వస్తున్నాయి.ఇలా తరచూ వీరి డేటింగ్ రూమర్స్ వినిపించినప్పటికీ ఈ విషయం గురించి ఈ జోడి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఇక ఈమె కోసం సిద్ధార్థ్, చెన్నై వదిలి ముంబైకి వెళ్లిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఇక ముంబైలో వీరిద్దరూ కలిసి రెస్టారెంట్లకు వెళ్లడం షాపింగ్ వెళ్లడం వీధుల వెంట జంటగా కనిపించడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని వార్తలు బలం అయ్యాయి అయితే ఈ వార్తలు గురించి ఎప్పుడూ కూడా వీరిద్దరూ క్లారిటీ ఇస్తూ ఖండించే ప్రయత్నం చేయలేదు.

ఇకపోతే తన స్నేహితుడు శర్వానంద్ నిశ్చితార్థానికి కూడా వీరిద్దరూ కపుల్స్ మాదిరిగా జంటగా హాజరు కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక తాజాగా మరోసారి ఈ ప్రేమ పక్షులు జంటగా ముంబై థియేటర్లో సందడి చేశారు.అదితి నటించిన జూబిలీ అనే సిరీస్ నేటి నుంచి ఆమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది ఈ క్రమంలోనే సెలబ్రిటీల కోసం ముంబైలోని ఓ థియేటర్లో ప్రీమియర్ షో వేశారు.

Siddharth -Aditi Rao Hydari: కలిసి సినిమా చూసిన జోడి…


ఈ ప్రీమియర్ షో చూడటం కోసం సిద్ధార్థ్, అదితి జంటగా హాజరయ్యారు. ఇలా ఈ షో చూడటానికి వెళ్ళిన వారు చూసి రాకుండా ఫోటోలకు కలిసి పోజులిచ్చారు దీంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ కావడంతో మరోసారి వీరి డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి.ఇక వీరిద్దరూ మహాసముద్రం అనే సినిమాలో కలిసిన నటించారు అప్పటి నుంచి వీరి మధ్య ఈ విధమైనటువంటి రిలేషన్ కొనసాగుతుందని వార్తలు వస్తున్నాయి.మరి ఇప్పటికైనా ఈ జంట వీరి మధ్య ఉన్న రిలేషన్ పై స్పందిస్తూ క్లారిటీ ఇస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Adithi Rao Hydari: సిద్దార్థ్ తో డేటింగ్ వార్తలపై షాకింగ్ కామెంట్స్ చేసిన అదితి రావు… ఏమన్నారంటే?

Adithi Rao Hydari: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య రిలేషన్ గురించి రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో గత కొంతకాలంగా హీరో సిద్దార్థ్ హీరోయిన్ ఆదితి రావు గురించి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా వారిద్దరు రిలేషన్లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల అదితి రావు ఈ వార్తలపై స్పందించి తమ మధ్య అలాంటి రిలేషన్ లేదని క్లారిటీ ఇచ్చింది.

ఇక వీరిద్దరూ ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్లడం, అలాగే సోషల్ మీడియాలో కూడా కలిసి ఫోటోలు వీడియోలు షేర్ చేయటంతో వీరి రిలేషన్ గురించి ఇప్పటికి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇటీవల అదితి రావు నటించిన తాజ్ సినిమా విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ క్రమంలో ఒక చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో అదితి పాల్గొనింది. ఈ ఇంటర్వ్యూలో సిద్ధార్థతో కలిసి ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నించగా అదితి స్పందిస్తూ…

” ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయం పట్ల ఆసక్తి ఉంటుంది. అలాగే కొందరికి ఇలాంటి వాటిపై ఆసక్తి ఉండవచ్చు. ఈ విషయంలో మీకు ఒక అభిప్రాయం ఉంది. ఈ విషయం గురించి నేను ఏం చెప్పినా కూడా మీకు నచ్చిన విధంగా ఊహించుకుంటారు అని షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో ఇది అభిమానుల ప్రశ్న అని యాంకర్ అనగానే వారు ఎప్పుడూ ఇలా నన్ను ప్రశ్నించలేదు అంటూ నవ్వుతూ చెప్పింది.

Adithi Rao Hydari: మంచి కంటెంట్ సినిమాలను అందించగలం…


ఇక ఆ తర్వాత సినిమా గురించి మాట్లాడుతూ.. కొంత మందికి మమ్మల్ని ఇలా స్క్రీన్ పై కలిసి చూడటం ఇష్టం. అలాంటి వారి కోసం మేము చేసే పనిని ప్రేమిస్తూ.. మరింత కష్టపడి పనిచేయాలి. అలా చేసినప్పుడే మంచి కంటెంట్ అందించగలం” అంటూ చెప్పుకొచ్చింది. ఇలా మరొకసారి సిద్ధార్థతో తనిఖీ ఉన్న రిలేషన్ గురించి అదితి క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పటికైనా ఈ వార్తలకు బ్రేక్ పడుతుందో లేదో చూడాలి మరి.