Brahmanandam: టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమెడియన్ గా ఎన్నో వందల సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన ప్రస్తుతం కాస్త సినిమాలను తగ్గించారనే చెప్పాలి. ఇక బ్రహ్మానందం గారికి ఇద్దరు సంతానం అనే విషయం మనకు తెలిసిందే.
వీరి పెద్ద కుమారుడు గౌతమ్ ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటించారు. అయితే ఈయన ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు చిన్న కుమారుడు సిద్ధార్థ్. ఈయన ఉద్యోగ నిమిత్తం విదేశాలలో స్థిరపడ్డారు. అయితే తాజాగా తన చిన్న కుమారుడికి బ్రహ్మానందం ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరిపిన సంగతి మనకు తెలిసిందే.
బ్రహ్మానందం తన కుమారుడు సిద్ధార్థ్ కు ఐశ్వర్య అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బ్రహ్మానందం చిన్న కోడలు ఐశ్వర్య గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఐశ్వర్య కరీంనగర్ కు చెందిన ప్రముఖ డాక్టర్ పద్మజా వినయ్ గారి కుమార్తె. కరీంనగర్ లో పద్మజ సంతాన సాఫల్య కేంద్రం ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచింది. ఇలా పద్మజ వినయ్ గారి ఏకైక కుమార్తె ఐశ్వర్య కూడా ప్రముఖ గైనకాలజిస్ట్ కావడం విశేషం.ఇలా డాక్టర్ అయినటువంటి అమ్మాయిని బ్రహ్మానందం తన కోడలుగా చేసుకుంటున్నారు. ఇక ఈమె పేరిట తమ తల్లిదండ్రులు భారీగానే ఆస్తులను పోగు చేశారని తెలుస్తోంది. ఏది ఏమైనా బ్రహ్మానందం బడా ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని తన కోడలుగా తీసుకొచ్చారని తెలుస్తోంది.
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…