Tag Archives: tarun

Tarun: ఏ శుభవార్త ఉన్న ముందుగా మీతోనే చెబుతాను… పెళ్లి వార్తలపై స్పందించిన హీరో తరుణ్!

Tarun: తరుణ్ పరిచయం అవసరం లేని పేరు ఒకప్పటి లవర్ బాయ్ గా ఎంతో మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి తరుణ్ క్రమక్రమంగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈయన తిరిగి ఇండస్ట్రీలోకి వస్తే బాగుంటుందని చాలామంది అభిమానులు భావించారు. అదేవిధంగా ఇప్పటివరకు ఈయన ఒంటరిగానే తన జీవితాన్ని గడుపుతున్నారు.

ఈ క్రమంలోనే తరుణ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అన్న ప్రశ్నలు కూడా తలెత్తడంతో తన తల్లి రోజా రమణి త్వరలోనే తరుణ్ పెళ్లి జరుగుతుందంటూ కామెంట్స్ చేశారు. దీంతో తరుణ్ పెళ్లి గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తరుణ్ మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నారు అంటూ ఓ వార్త సంచలనంగా మారింది. దీంతో పలువురు ఈ వార్తలపై విభిన్న శైలిలో స్పందించారు.

ఇలా మెగా ఇంటికి తరుణ్ అల్లుడు కాబోతున్నారంటూ వస్తున్నటువంటి వార్తలపై తరుణ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. ఈ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమేనని ఈయన కొట్టి పారేశారు. తాను అలాంటి శుభవార్త ఏదైనా ఉంటే ముందుగా సోషల్ మీడియా వేదికగాను మీడియా ముందు తాను తెలియజేస్తానని తెలిపారు.

Tarun: ఆ వార్తలన్నీ అవాస్తవమే…


ఇక తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలన్నీ కూడా ఆ వాస్తవమేనని ఆయన ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తనకు ఏ మాత్రం అర్థం కాదు అంటూ ఈ సందర్భంగా ఇంటికి అల్లుడు కాబోతున్నారన్న వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు పులిస్టాప్ పడింది. ఈయన నిహారికను వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి.

Hero Tarun: తరుణ్ పెళ్ళి, సెకండ్ ఇన్నింగ్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన రోజా రమణి..?

Hero Tarun: టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా గుర్తింపు పొందిన హీరో తరుణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ నటి రోజా రమణి వారసుడైన తరుణ్ చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు పదికి పైగా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు.

ఆ తర్వాత హీరోగా మారి నువ్వే కావాలి సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందాడు. ఇక అప్పటినుండి తరుణ్ ప్రేమ కథ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన తరుణ్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు.

ఇదిలా ఉండగా ఇప్పటివరకు తరుణ్ వివాహం చేసుకోకుండా బ్యాచిలర్ గానే జీవితాన్ని గడుపుతున్నాడు దీంతో తరుణ్ వివాహం గురించి తరచూ అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తరుణ్ తల్లి రోజా రమణి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తరుణ్ వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Hero Tarun: త్వరలోనే పెళ్లి జరుగుతుంది…


ఈ ఇంటర్వ్యూలో రోజా రమణి మాట్లాడుతూ
“తరుణ్ గురించి వస్తున్న రూమర్స్ వల్ల చాలా బాధ కలుగుతుందని తెలిపింది. అంతేకాకుండా తరుణ్ హీరోగా మళ్లీ ఇండస్ట్రీలో ఇవ్వబోతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తరుణ్ సినిమాతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నాడని తెలిపింది. తరుణ్ ని వెండితెరపై మళ్ళీ చూడాలని ఆశగా ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ క్రమంలో తరుణ్ వివాహం గురించి మాట్లాడుతూ తరుణ్ వివాహం జరిగితే చాలని, అయితే తొందరలోనే అది కూడా జరుగుతుందని రోజా రమణి తెలిపింది.

Tarun -Priyamani: తరుణ్ ప్రియమణి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు జరిగాయా.. మరి పెళ్లి ఎందుకు జరగలేదో తెలుసా?

Tarun -Priyamani: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు మోస్ట్ లవర్ బాయ్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి వారిలో నటుడు తరుణ్ ఒకరు.బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తరుణ్ నువ్వే కావాలి నువ్వు లేక నేను లేను ప్రియమైన నీకు వంటి వరుస హిట్ సినిమాలతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా వరుస సినిమాలు సక్సెస్ అవడంతో పెద్ద పెద్ద బ్యానర్లు ఈయన ముందు క్యూ కట్టేవి.

ఇకపోతే అప్పట్లో ఈయన ఆర్తి అగర్వాల్ తో కలిసి సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఆర్తి అగర్వాల్ ను తన కుమారుడికి చేసుకోవడం ఇష్టం లేనటువంటి తరుణ్ తల్లి రోజా రమణి వీరి పెళ్లికి అడ్డుపడిందనీ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక ఆర్తి అగర్వాల్ తో బ్రేకప్ తర్వాత ఈయన ప్రియమణితో కలిసి నవ వసంతం అనే సినిమాలో నటించారు.

ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా సమయంలో ప్రియమణి తరుణ్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు తెలిసినటువంటి తరుణ్ తల్లి సరాసరి షూటింగ్ లొకేషన్లోకి వెళ్లి ప్రియమణిని నేరుగా అడిగిందట.నువ్వు నిజంగానే నా కొడుకుతో ప్రేమలో ఉన్నావా ఉంటే చెప్పు మీ పెళ్లి చేయడానికి తాను సిద్ధమేనంటూ ఈమె తరుణ్ తో పెళ్లికి ప్రియమణిని ఒప్పించే ప్రయత్నం చేశారట.

Tarun -Priyamani: తప్పుడు వార్తలు అంటూ కొట్టి పారేసిన ప్రియమణి…

ఇలా రోజా రమణి తరుణ్ తో పెళ్లి గురించి అడగడంతో ఒక్కసారిగా షాక్ అయిన ప్రియమణి అసలు మీరు చెప్పే వరకు మా ఇద్దరి గురించి ఇలాంటి వార్తలు వస్తున్నాయని నాకు తెలియదు అసలు ఒక సినిమాలో నటిస్తేనే ప్రేమలో పడతారా ఇవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే అంటూ ప్రియమణి కొట్టి పారేశారు. ఇలా అప్పట్లో ప్రియమణి తరుణ్ గురించి ఈ వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.

Tarun -Aarthi Aggarwal: తరుణ్ ఆర్తి అగర్వాల్ విషయం తెలిసి పేరెంట్స్ అలాంటి పని చేశారా?

Tarun -Aarthi Aggarwal: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ రెండు మూడు సినిమాలలో కనుక నటిస్తే వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు రావడం సర్వసాధారణం ఇలా ఎంతోమంది సెలబ్రెటీలు ఇలాంటి వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.అయితే కొందరు కలిసి నటించిన సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని అందరికీ షాక్ ఇవ్వగా మరికొందరు మాత్రం తమ మధ్య ఏమి లేదని చెబుతూ ఆ వార్తలను ఖండిస్తూ ఉంటారు.

ఇప్పుడు సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది అయితే అప్పట్లో సోషల్ మీడియా లేదు కనుక చాలామంది సెలబ్రిటీలు ఇలాంటి ఎఫైర్స్ నడిపించినప్పటికీ పెద్దగా బయటకు తెలిసేది కాదు. అయితే ఒకప్పుడు సూపర్ హిట్ పెయిర్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో తరుణ్ ఆర్తి అగర్వాల్ జోడి ఒకటి.

వీరిద్దరూ కలిసి నువ్వు లేక నేను లేను సోగ్గాడు వంటి సినిమాలలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరు ప్రేమలో పడటం రిలేషన్షిప్ కొనసాగించడం వంటివి జరిగిపోయాయి. అయితే ఈ విషయం తెలిసినటువంటి వీరు తల్లిదండ్రులు పూర్తిగా ఈ విషయాన్ని ఖండించారు. ఆర్తి అగర్వాల్ తరుణ్ణి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనటువంటి ఆమె తల్లిదండ్రులు తనని కొద్ది రోజులు అమెరికాలో వీటన్నింటికి దూరంగా ఉంచి తనకు బ్రెయిన్ వాష్ చేశారు.

Tarun -Aarthi Aggarwal: స్నేహితులమని తరుణ్ చెప్పేవారు…

ఇక ఆర్తి అగర్వాల్ గురించి మీడియా తరుణ్ ను ప్రశ్నించడం ఆర్తి అగర్వాల్ తో పాటు శ్రీయ, జూనియర్ ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్ మంచి స్నేహితులని చెప్పేవారు. ఇక వీరిద్దరి మధ్య సీక్రెట్ లవ్ నడుస్తుందని తెలియడంతో ఆర్తి అగర్వాల్ పేరెంట్స్ ఖండించినప్పటికీ తరుణ్ తల్లిదండ్రులు మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. ఇక ఆర్తి అగర్వాల్ బ్రెయిన్ వాష్ చేసి తనకు 2007వ సంవత్సరంలో పెద్దలు కుదిర్చిన అబ్బాయితో వివాహం చేశారు. అయితే 2009లో విడిపోయిన ఈమె 2015లో మరణించారు.

Roja Ramani: తరుణ్ కు నేషనల్ అవార్డు రావడంతో బాగా ఏడ్చేసాము…. ఎమోషనల్ కామెంట్స్ చేసిన నటి రోజా రమణి!

Roja Ramani: నటిగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రోజా రమణి భక్త ప్రహ్లాద సినిమాలో ప్రహ్లాద పాత్రలో నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే ఈ సినిమాలో ప్రహల్లాద పాత్రలో నటించిన రోజా రమణికి తన నటనకు గాను నేషనల్ అవార్డు అందుకున్నారు. అనంతరం హీరోయిన్గా పలు సినిమాలలో నటించి మెప్పించారు.

ఇక ఈమె తన కుమారుడు తరుణ్ ను బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అనంతరం తరుణ్ కూడా ఇండస్ట్రీలో హీరోగా అతి తక్కువ సమయంలోనే ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ఈయన ఎంత తొందరగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారో అంతే తొందరగా ఫెయిడౌట్ అయ్యారు. అయితే తాజాగా నటి రోజా రమణి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి కొన్ని విషయాలు తెలియజేశారు.

తాను భక్త ప్రహ్లాద సినిమాలో ప్రహల్లాదుడి పాత్రలో నటించినందుకు గాను ఉత్తమ బాలనటిగా నేషనల్ అవార్డు వచ్చిందని తెలిపారు. అయితే తరుణ్ సైతం బాలనటుడిగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన అంజలి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇలా తరుణ్ మొదటి సినిమాకే ఉత్తమ బాల నటుడిగా నేషనల్ అవార్డు వచ్చింది.

Roja Ramani: మొదటి సినిమాకే నేషనల్ అవార్డు అందుకున్న తరుణ్…

ఒకరోజు టీవీలో న్యూస్ చూస్తున్న సమయంలో నేషనల్ అవార్డు ప్రకటన వచ్చింది. అయితే అంజలి సినిమాకు గాను మూడు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అందులో మాస్టర్ తరుణ్,బేబీ శృతి బేబీ షాలిని అని మూడు పేర్లు స్క్రోల్ అయ్యాయి. అయితే ఇది చూసి మేము ఒక్కసారిగా షాక్ అయ్యాం కానీ తిరిగి ఈ వార్తలను చూడటానికి కుదరదు కనుక వెంటనే ఇది నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం మణిరత్నం గారికి ఫోన్ చేసాము ఆయన అసలు విషయం చెబుతూ హ్యాపీయేనా అంటూ అడిగారని, ఆ క్షణం ఒక్కసారిగా నేను నా భర్త ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నామని ఈ సందర్భంగా రోజా రమణి తరుణ్ మొదటిసారి నేషనల్ అవార్డు అందుకున్న సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు.

Actress Sneha: షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో స్నేహ నడుము గిల్లిన రియల్ ఎస్టేట్ వ్యాపారి… అప్పట్లో సంచలనంగా మారిన న్యూస్!

Actress Sneha:టాలీవుడ్ ఇండస్ట్రీకి తరుణ్ హీరోగా నటించిన ప్రియమైన నీకు సినిమా ద్వారా పరిచయమయ్యారు నటి స్నేహ. ఈమె ఎంతో సాంప్రదాయమైన దుస్తులను ధరించి ఎంతో అద్భుతమైన ప్రేమ కథలను, కుటుంబ కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకుంది.స్నేహ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సౌందర్య లేని లోటును భర్తీ చేసిందని చెప్పాలి.

ఇకపోతే స్నేహ సౌందర్య అంత గుర్తింపు సంపాదించుకోకపోయినా తన కట్టుబొట్టుతో సౌందర్యను గుర్తు చేశారు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్నేహ ఫెడ్ అవుట్ అయ్యారు. ఇక స్నేహ ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ తమిళ నటుడిని వివాహం చేసుకున్న తర్వాత పలు సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించడమే కాకుండా పలు బుల్లితెర యాడ్స్ ద్వారా కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇలా పలు యాడ్స్ షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవంలో సందడి చేసిన స్నేహ ఓసారి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు చేదు అనుభవాన్ని ఎదుర్కొందని అప్పట్లో వార్తలు వచ్చాయి. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అంటేనే అక్కడికి ఎంతో మంది అభిమానులు చేరుకుంటారు. అయితే ఆ క్షణంలో ఎంతోమంది హీరోయిన్స్ ను తాకరాని చోట తాకుతూ ఉంటారు అయితే కొందరు వాటిని మౌనంగా భరించగా మరికొందరు మాత్రం అలాంటి చేష్టలపై రియాక్ట్ అవుతుంటారు.

Actress Sneha: పోలీసులు అదుపులోకి రియల్ ఎస్టేట్ వ్యాపారి…

ఈ క్రమంలోనే నటి స్నేహ సైతం ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారట.ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు పక్కనే ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి స్నేహ నడుమును గిల్లడంతో ఒక్కసారిగా స్నేహ గట్టిగా అరిచారట. అయితే అక్కడ సిబ్బందికి స్నేహ అసలు విషయం చెప్పడంతో వెంటనే పోలీసులు తనని అదుపులోకి తీసుకున్నారని అయితే ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కావడంతో వెంటనే బెయిల్ పై బయటకు వచ్చారని తెలుస్తుంది అయితే ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది.

మహేష్ సినిమాలో సందడి చేయనున్న..తరుణ్ ఏ సినిమా అంటే?

బాలనటుడిగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు తరుణ్ ఆ తరువాత హీరోగా అద్భుతమైన సినిమాల్లో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. ఇలా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న తరువాత తను నటించిన సినిమాలన్నీ వరుస ఫ్లాప్ కావడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈ క్రమంలోనే ఆహాలో స్ట్రీమ్ అయిన మలయాళ అనువాద చిత్రం అనుకోని అతిథి సినిమా కోసం నటుడు ఫహద్ ఫాజిల్ కి డబ్బింగ్ చెప్పడంతో మరోసారి ఫేమస్ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా తరుణ్ గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోసారి తరుణ్ మేకప్ వేసుకుని వెండితెరపై సందడి చేయనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో కథ మొత్తాన్ని కీలక మలుపు తిరిగే పాత్ర ఉందని, అందులో నటించడానికి హీరో తరుణ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయం గురించి చిత్ర బృందం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈ కథను విన్న తరుణ్ ఈ పాత్రలో చేయడానికి సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

హీరో రోహిత్ పెళ్లి కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డాడో.. తన భార్య గొప్పతనం తెలుసుకోవాల్సిందే..

సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి ఎంత టాలెంట్ ఉన్నా.. లక్ లేకపోతే వారి గమనం అక్కడే ఆగిపోతుంది. రెండు.. మూడు సినిమాలు పెద్ద హిట్ అయినా తర్వాత కెరీర్ సరిగ్గా ఉండదు. ఇలా తెలుగులో చాలామంది హీరోలు ఉన్నారు. అందులో ఒకరు హీరో రోహిత్.16 సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రోహిత్ మంచి హిట్ అందుకున్నాడు. తనకంటూ ఓ మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. తర్వాత నేను సీతా మహాలక్ష్మి, జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమాలతో దూసుకుపోయాడు.

అప్పటి నుంచి అతడికి యూత్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అటు హీరోగా చేస్తూ కూడా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో కూడా నటించాడు రోహిత్. అంతేకాకుండా తరుణ్ హీరోగా నటించిన ‘నవ వసంతం’ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి తన నటనతో అందరినీ మెప్పించాడు. అయితే సినిమాలో అతడి ఫామ్ ను కొనసాగించలేకపోయాడు. ఇటీవల అతడు ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు. చిన్న తనం నుంచి వాళ్ల అమ్మ అతడిని బాగా చూసుకునేదని.. వాళ్ల నాన్న ఎప్పుడూ తాగి వచ్చేవాడని.. దీంతో తాము రోడ్డున పడాల్సిన పరిస్థతి వచ్చిందని చెప్పాడు.

అప్పుడు సినిమాలోకి వచ్చి కుటుంబానికి అండగా ఉన్నా.. తర్వాత కాలంలో సినిమా అవకాశాలు తగ్గినట్లు చెప్పాడు. ఈయనతో పాటు ఉదయ్ కిరణ్, తరుణ్ లాంటి స్టార్ హీరోలకు వచ్చిన గుర్తింపు వచ్చినప్పటికీ.. వాళ్లతో పాటు రోహిత్ కూడా తర్వాత కాలంలో ఫేడ్ అవుట్ అయి పోయారు. అయితే ఇదంతా ఇబ్బంది అనిపించలేదు కానీ.. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకడం కొంచెం కష్టం అయిందని చెప్పుకొచ్చాడు. అయితే ఓ అమ్మాయిని పుస్తకంపై చూసి ఇష్టపడినట్లు.. ఆ అమ్మాయినే భాగస్వామిని చేసుకోవాలని అనుకున్నాడు.. దీంతో ఆమె అతడి జీవితంలోకి రావడంతో ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు.

ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అని.. మా ఇద్దరి మధ్య 10 ఏళ్ల గ్యాప్ ఉన్నా.. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నామని.. తనని అర్థం చేసుకుంటుందని అతడు చెప్పాడు. ప్రస్తుతం రోహిత్ కు ఒక పాప ఉన్నట్లు తెలిపాడు. తనకు మళ్లీ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని కూడా తెలిపాడు. మరో సారి సినిమాలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

ఆదిత్య 369 సినిమా సమయంలో తరుణ్ వయసు ఏంతో తెలుసా? ఆ సినిమా విశేషాలు తరుణ్ మాటల్లో..

ఆదిత్య 369 సినిమా తెలుసు కదా. ఆ సినిమా రిలీజ్ అయి మొన్నటికే 30 సంవత్సరాలు అయింది. అసలు.. 30 ఏళ్ల కిందనే టైమ్ మిషన్ ను కనిపెడితే.. భవిష్యత్తులోకి వెళ్తే ఎలా ఉంటుందో చూపించిన సినిమా అది. నిజంగా ఆ సమయంలో ఆ కథ రాసిన వాళ్లు గ్రేట్. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని.. టైమ్ మిషిన్ ఉంటే.. భవిష్యత్తులోకి వెళ్లి ఏం చేయగలమో చెప్పిన సినిమా అది. అప్పట్లో ఆ సినిమా సంచలనాలను సృష్టించింది.

ఆదిత్య 369 సినిమాలో హీరోగా బాలకృష్ణ నటించారు. ఆయన ఆ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. అయితే.. ఆ సినిమాలో హీరో తరుణ్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హీరో తరుణ్.. ఆ సినిమా గురించి.. విశేషాలు తన అభిమానులతో చెప్పుకొచ్చారు.

అటువంటి సినిమాలను చేయాలంటే గట్స్ ఉండాలి

ఆదిత్య 369 లాంటి సినిమాలను చేయాలంటే చాలా గట్స్ ఉండాలంటూ తరుణ్ తెలిపారు. ఫ్యూచరిస్టిక్ సినిమా అనేది అప్పట్లో కొత్త సబ్జెక్ట్. భవిష్యత్తును టైమ్ మిషన్ తో చూడటం అనేది ఒక కల మాత్రమే. దాన్ని నిజం చేసి.. సరికొత్త కథతో 30 ఏళ్ల కింద అటువంటి సినిమా రావడం.. అటువంటి ప్రతిష్ఠాత్మకమైన సినిమాతో నేను భాగస్వామ్యం అవడం నా అదృష్టం.. అని తరుణ్ చెప్పారు.

బాలకృష్ణ అప్పుడు ఎంత ఎనర్జిటిక్ గా ఉన్నారో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు

ఈ సినిమా ఇంత సూపర్ సక్సెస్ అయిందంటే దానికి కారణం దర్శకనిర్మాతల తర్వాత బాలకృష్ణదే. బాలకృష్ణను చూసి అప్పట్లోనే చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయన నుంచి క్రమశిక్షణ ఎక్కువగా నేర్చుకున్నా. ఆయనకు నటన మీద ఎంతో గౌరవం ఉంటుంది. సెట్ లోకి ఒక్కసారి వచ్చారంటే.. పూర్తిగా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతారు. ఆయన ఇప్పటికీ కలిసినప్పుడల్లా.. అమ్మానాన్న ఎలా ఉన్నారు? అంటూ ముందు ఆ ప్రశ్నే అడుగుతారు. బాలకృష్ణ నిజంగా లెజెండ్ అంటూ బాలకృష్ణను పొగడేశారు తరుణ్.

బాలకృష్ణతో చైల్డ్ ఆర్టిస్ట్ గా రెండు సినిమాలు చేశాను

బాలకృష్ణతో నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా రెండు సినిమాలు చేశాను. ఒకటి ఆదిత్య 369, మరొకటి తల్లిదండ్రులు అనే మూవీ. రెండు సినిమాల్లో బాలకృష్ణతో నటించడం అనేది నా అదృష్టం.. అని తరుణ్ చెప్పారు. ఆదిత్య 369 సినిమా చేసినప్పుడు నాకు 7 ఏళ్లు మాత్రమే. అయితే.. ఆ సినిమా షూటింగ్ సమయం మొత్తం నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే.. టైమ్ మిషన్ అనే కాన్సెప్ట్ ఉండటం, మ్యూజియంలో షూటింగ్ జరగడం.. ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. అందుకే.. ఆ షూటింగ్ జరిగిన రోజులన్నీ నాకు ఇంకా గుర్తున్నాయి. ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటా. ఆ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నిషియన్ నాకు ఇప్పటికీ గుర్తున్నారు.. అని ఆ సినిమా గురించి తన అనుభవాలను తరుణ్ ప్రేక్షకులతో పంచుకున్నారు.

హీరో తరుణ్ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు..!!

బుల్లితెరపై అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమం ఆలీతో సరదాగా. ఈ కార్యక్రమానికి సినిమా సెలబ్రిటీలను ఆహ్వానించి వారితో సరదాగా ముచ్చటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వారి గత జ్ఞాపకాలను, వారి వ్యక్తిగత విషయాలను ఈ కార్యక్రమం ద్వారా అభిమానులకు తెలియజేస్తుంటారు. జులై 19వ తేదీన ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి గెస్ట్ గా సీనియర్ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, హీరో తరుణ్ తల్లి గారు రోజారమణి తన భర్త చక్రపాణి వచ్చారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా.. వీరిద్దరూ ఈ కార్యక్రమంలోకి అడుగుపెట్టగానే అలీ.. అక్క.. బావకు స్వాగతం అంటూ వారిని ఆహ్వానించి వారితో ఎంతో సరదాగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో తమ వ్యక్తిగత విషయాల గురించి రోజారమణి ఎంతో ఓపెన్ అయ్యారు. ఈ సందర్భంగా రోజారమణి మాట్లాడుతూ వారు స్విట్జర్లాండ్ లో ఉన్న సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు.

మేము స్విజర్లాండ్ లో ఉన్నప్పుడు ఓసారి మా ఇంటికి పోలీసులు వచ్చారని, ఆ సమయంలో తరుణ్, తన భర్త చక్రపాణి ఇద్దరూ టవల్ కట్టుకొని పూజలు చేస్తున్నారని రోజా రమణి తెలిపారు. వీరిద్దరికీ భక్తి భావం ఎక్కువగా ఉండటంతో ఇండియా నుంచి తెచ్చిన అగరబత్తులు, కర్పూరం వెలిగించడంతో పోలీసులు స్మోక్ డిటెక్టర్ ద్వారా మా ఇంటిని చుట్టుముట్టారని ఈ సందర్భంగా తెలిపారు.

అదేవిధంగా రోజా రమణి తన చిన్నప్పటి అలవాటును కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు. తనకు చిన్నప్పుడు పౌడర్ తినడం అంటే ఎంతో ఇష్టమని, తరచూ పౌడర్ తినే దానిననీ చిన్ననాటి జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే వీరి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలంటే మనం ఈ కార్యక్రమం ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.