సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి ఎంత టాలెంట్ ఉన్నా.. లక్ లేకపోతే వారి గమనం అక్కడే ఆగిపోతుంది. రెండు.. మూడు సినిమాలు పెద్ద హిట్ అయినా తర్వాత కెరీర్ సరిగ్గా ఉండదు. ఇలా తెలుగులో చాలామంది హీరోలు ఉన్నారు. అందులో ఒకరు హీరో రోహిత్.16 సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రోహిత్ మంచి హిట్ అందుకున్నాడు. తనకంటూ ఓ మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. తర్వాత నేను సీతా మహాలక్ష్మి, జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమాలతో దూసుకుపోయాడు.
అప్పటి నుంచి అతడికి యూత్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అటు హీరోగా చేస్తూ కూడా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో కూడా నటించాడు రోహిత్. అంతేకాకుండా తరుణ్ హీరోగా నటించిన ‘నవ వసంతం’ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి తన నటనతో అందరినీ మెప్పించాడు. అయితే సినిమాలో అతడి ఫామ్ ను కొనసాగించలేకపోయాడు. ఇటీవల అతడు ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు. చిన్న తనం నుంచి వాళ్ల అమ్మ అతడిని బాగా చూసుకునేదని.. వాళ్ల నాన్న ఎప్పుడూ తాగి వచ్చేవాడని.. దీంతో తాము రోడ్డున పడాల్సిన పరిస్థతి వచ్చిందని చెప్పాడు.
అప్పుడు సినిమాలోకి వచ్చి కుటుంబానికి అండగా ఉన్నా.. తర్వాత కాలంలో సినిమా అవకాశాలు తగ్గినట్లు చెప్పాడు. ఈయనతో పాటు ఉదయ్ కిరణ్, తరుణ్ లాంటి స్టార్ హీరోలకు వచ్చిన గుర్తింపు వచ్చినప్పటికీ.. వాళ్లతో పాటు రోహిత్ కూడా తర్వాత కాలంలో ఫేడ్ అవుట్ అయి పోయారు. అయితే ఇదంతా ఇబ్బంది అనిపించలేదు కానీ.. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకడం కొంచెం కష్టం అయిందని చెప్పుకొచ్చాడు. అయితే ఓ అమ్మాయిని పుస్తకంపై చూసి ఇష్టపడినట్లు.. ఆ అమ్మాయినే భాగస్వామిని చేసుకోవాలని అనుకున్నాడు.. దీంతో ఆమె అతడి జీవితంలోకి రావడంతో ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు.
ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అని.. మా ఇద్దరి మధ్య 10 ఏళ్ల గ్యాప్ ఉన్నా.. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నామని.. తనని అర్థం చేసుకుంటుందని అతడు చెప్పాడు. ప్రస్తుతం రోహిత్ కు ఒక పాప ఉన్నట్లు తెలిపాడు. తనకు మళ్లీ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని కూడా తెలిపాడు. మరో సారి సినిమాలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…