సినీ పరిశ్రమలోసమవుజ్జీలుగా ఉన్న ఇద్దరు హీరోల చిత్రాలు ఒకేరోజు విడుదల అవ్వడం చూశాం. లేదా ఒక హీరో చిత్రాలు ఒకే రోజు రెండు విడుదలవడం చూశాం. లేదా ఒకే టైటిల్ తో రెండు చిత్రాలు రావడం చూశాం. కానీ ఒకే కథను ఆధారంగా చేసుకుని రెండు చిత్రాలు రావడం అరుదు. కానీ తెలుగు సినీ పరిశ్రమలో ఒకే కథతో ఇద్దరు హీరోలు వేరువేరు చిత్రాలు చేశారు.
అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కూతురు సత్యవతి, అల్లుడు యార్లగడ్డ సురేంద్ర కుమార్ కుమారుడే సుమంత్. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమ కథ’ చిత్రం తో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత యువకుడు, సత్యం లాంటి చిత్రాల్లో ఆయన నటించారు. జెనీలియాతో జత కట్టిన “సత్యం” సినిమా సుమంత్ కి మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత వచ్చిన సుమంత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిపోయాయి.
2005, ఆర్.ఎస్.మూవీ ప్రొడక్షన్స్, వి.సముద్ర దర్శకత్వంలో “మహానంది” సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాలో శ్రీహరి ప్రధాన పాత్ర పోషించగా, సుమంత్, అనుష్క హీరో, హీరోయిన్లుగా నటించారు. సంగీత దర్శకుడు కృష్ణమోహన్ అందించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. సుమంత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.
విలక్షణ నటుడు మోహన్ బాబు పెద్ద కుమారుడు హీరో విష్ణు. ‘రగిలే గుండెలు’ అనే సినిమాతో బాలనటుడిగా తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టారు. 2003లో విష్ణు సినిమాతో హీరోగా తెరపై కనిపించాడు. సూర్యం, అస్త్రం, గేమ్ లాంటి చిత్రాల్లో నటించిన విష్ణుకి విజయాన్ని ఇవ్వలేకపోయాయి. అలాంటి క్రమంలో.. 2007, సిరి వెంకటేశ్వర ఫిలిమ్స్, శ్రీను వైట్ల దర్శకత్వంలో “ఢీ” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో శ్రీహరి ప్రధాన పాత్ర పోషించగా విష్ణు, జెనీలియా హీరో, హీరోయిన్లుగా నటించారు. చక్రి అందించిన సంగీతం పర్వాలేదు అనిపించుకుంది. “డీ” చిత్రం బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది.
ఈ రెండు చిత్రాల్లో శ్రీహరి సెటిల్మెంట్, దాదాగిరి పాత్రలో నటించారు. ఆయనకు ‘మహానంది’ సినిమాలో గారాల చెల్లిగా అనుష్క నటించగా, “ఢీ” సినిమాలో జెనీలియా నటించింది. మహానందిలో సుమంత్, శ్రీహరికి సన్నిహితుడిగా నటించగా, డీ చిత్రంలో శ్రీహరి “అడ్డా”లో విష్ణు గుమస్తాగా నటించారు. శ్రీహరికి తెలియకుండా, లేదా ఎదిరించి రెండు చిత్రాల్లో హీరోలు ఆయన చెల్లెలిని వివాహం చేసుకుంటారు. ఇలా అనేక రకాలైన అంశాలు రెండు చిత్రాల్లో కనబడడం గమనార్హం. చివరికి ప్రత్యర్థులపై పోరాడి విజయం సాధిస్తారు. దాదాపు రెండు సంవత్సరాల తేడాతో వచ్చిన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఒకటి యావరేజ్ గా నిలువగా మరొకటి హిట్ కొట్టింది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…