Actress Sneha:టాలీవుడ్ ఇండస్ట్రీకి తరుణ్ హీరోగా నటించిన ప్రియమైన నీకు సినిమా ద్వారా పరిచయమయ్యారు నటి స్నేహ. ఈమె ఎంతో సాంప్రదాయమైన దుస్తులను ధరించి ఎంతో అద్భుతమైన ప్రేమ కథలను, కుటుంబ కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకుంది.స్నేహ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సౌందర్య లేని లోటును భర్తీ చేసిందని చెప్పాలి.
ఇకపోతే స్నేహ సౌందర్య అంత గుర్తింపు సంపాదించుకోకపోయినా తన కట్టుబొట్టుతో సౌందర్యను గుర్తు చేశారు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్నేహ ఫెడ్ అవుట్ అయ్యారు. ఇక స్నేహ ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ తమిళ నటుడిని వివాహం చేసుకున్న తర్వాత పలు సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించడమే కాకుండా పలు బుల్లితెర యాడ్స్ ద్వారా కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇలా పలు యాడ్స్ షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవంలో సందడి చేసిన స్నేహ ఓసారి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు చేదు అనుభవాన్ని ఎదుర్కొందని అప్పట్లో వార్తలు వచ్చాయి. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అంటేనే అక్కడికి ఎంతో మంది అభిమానులు చేరుకుంటారు. అయితే ఆ క్షణంలో ఎంతోమంది హీరోయిన్స్ ను తాకరాని చోట తాకుతూ ఉంటారు అయితే కొందరు వాటిని మౌనంగా భరించగా మరికొందరు మాత్రం అలాంటి చేష్టలపై రియాక్ట్ అవుతుంటారు.
ఈ క్రమంలోనే నటి స్నేహ సైతం ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారట.ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు పక్కనే ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి స్నేహ నడుమును గిల్లడంతో ఒక్కసారిగా స్నేహ గట్టిగా అరిచారట. అయితే అక్కడ సిబ్బందికి స్నేహ అసలు విషయం చెప్పడంతో వెంటనే పోలీసులు తనని అదుపులోకి తీసుకున్నారని అయితే ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కావడంతో వెంటనే బెయిల్ పై బయటకు వచ్చారని తెలుస్తుంది అయితే ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…