Sai Kiran : అలనాటి సింగర్ సుశీలమ్మ మనవడు, సింగర్ రామకృష్ణ గారి కొడుకు సాయి కిరణ్. కానీ ఏమాత్రం తండ్రి రెఫరెన్స్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన సాయి కిరణ్ మొదటి సినిమా ‘నువ్వే కావాలి’ సినిమాలో నటించి మంచి గుర్తింవు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత నటించిన ‘ప్రేమించు’ సినిమాతో నటుడుగా మరో మెట్టు ఎక్కాడు సాయి కిరణ్. అయితే మంచి సినిమాలు పడకపోవడం వల్ల అందం, అభినయం రెండూ ఉన్నా సాయి కిరణ్ హీరోగా మంచి స్థానాన్ని నిలుపుకోలేక పోయాడు. అలా అని నిరుత్సాహ పడకుండా బుల్లితెరపై నటిస్తూ మెప్పిస్తున్నాడు. అయితే సీరియల్స్ లో నటించడం వల్ల మలయాళం, తమిళం ఇలా అన్ని భాషల వాళ్లకు చేరువయ్యానని నాకు చాలా మంది అభిమానులు ఉన్నారంటూ సాయి కిరణ్ చెప్పారు.
వారితో నటించాలనేది కోరిక… బింబిసార పార్ట్ 2 లో ఎన్టీఆర్ తో నటిస్తున్నా…
ఇక అడపాదడపా సినిమాలను కూడా చేస్తున్న సాయి కిరణ్ తనకు నచ్చిన ఈ తరం హీరోల గురించి మాట్లాడుతూ మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని వారి సినిమాలు ఖచ్చితంగా చూస్తానని చెప్పారు. ఇక వారితో కలిసి నటించే అవకాశం వస్తే ఖచ్చితంగా సినిమాలో చేస్తానని చెప్పారు. మహేష్ పర్సనాలిటీ కి నేను సరిపోతాను కాబట్టి ఆయనతో నటించడం బాగుంటుందని అనిపిస్తుంది.
ఇక బన్నీ స్టైలిష్ గా తనని తాను చెక్కుకుని పైకి వచ్చాడు అతనితో నటించాలని కోరిక. ఇక మూడో కోరిక ఎన్టీఆర్ తో నటించాలని అది నెరవేరబోతోంది అంటూ, బింబిసార పార్ట్ 2 లో నటిస్తున్నాను అంటూ లీక్ చేశారు. ఎన్టీఆర్ నటన చాలా ఇష్టమని కళ్ళతోనే హవభావాలను చూపిస్తారు అలాంటి నటుడితో నటిస్తే మనకు చెప్పుకోడానికి బాగుంటుంది అంటూ చెప్పారు సాయి కిరణ్. మొత్తానికి బింబిసార పార్ట్ 2 లో ఎన్టీఆర్ నటిస్తున్నాడ్సనే విషయం మాత్రం లీక్ అయిపోయింది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…