Tag Archives: telugu film industry

Actor Naresh: మూడు పెళ్లిళ్లు పెటాకులు కావడంతో నాలుగో పెళ్లికి రెడీ అవుతున్న నటుడు నరేష్.. వధువు ఎవరంటే?

Actor Naresh: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి విజయనిర్మల ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నటుడు నరేష్.ఈయన కెరియర్ మొదట్లో పలు సినిమాలలో హీరోగా నటించి అందరిని మెప్పించారు. ప్రస్తుతం పలు సినిమాలలో తండ్రి పాత్రల ద్వారా నటిస్తూ విశేషమైన అభిమానాన్ని సంపాదించుకున్న నరేష్ వృత్తిపరమైన జీవితం ఎంతో విజయవంతంగా కొనసాగుతున్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారని చెప్పాలి.

Actor Naresh: మూడు పెళ్లిళ్లు పెటాకులు కావడంతో నాలుగో పెళ్లికి సిద్ధమైన నటుడు నరేష్.. వధువు ఎవరంటే?

ఇప్పటికే నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.అయితే ఈయన ముగ్గురితోను పలు కారణాల వల్ల విడాకులు తీసుకోవడం గమనార్హం. ఇలా మూడు పెళ్లిళ్లు పెటాకులు కావడంతో నరేష్ ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తున్నారు. అయితే గత కొంత కాలం నుంచి చిత్ర పరిశ్రమకు చెందిన నటి పవిత్ర లోకేష్ తో ప్రేమలో ఉంటూ తనతో సహజీవనం చేస్తున్నారని పెద్దఎత్తున వార్తలు వచ్చాయి.వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో భార్యాభర్తలుగా నటించి సందడి చేశారు.

Actor Naresh: మూడు పెళ్లిళ్లు పెటాకులు కావడంతో నాలుగో పెళ్లికి సిద్ధమైన నటుడు నరేష్.. వధువు ఎవరంటే?

విడాకులు రాకపోవడంతో సమస్య..

ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో హిట్ ఫెయిర్ గా ఉన్నటువంటి ఈ జంట నిజ జీవితంలో కూడా ఒక్కటవ్వాలని భావిస్తున్నారట.అయితే పవిత్ర లోకేష్ తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చినప్పటికీ ఇంకా విడాకులు అధికారకంగా మంజూరు కాకపోవడంతో నరేష్ పవిత్ర లోకేష్ పెళ్ళికి ఆటంకంగా ఏర్పడిందని ఎప్పుడైతే పవిత్ర లోకేష్ కి విడాకులు అధికారకంగా మంజూరు అవుతాయో తదుపరి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Charan -Upasana: చరణ్ ఉపాసన పెళ్లి బంధానికి పదేళ్ళు… పెళ్లి రోజు వేడుకల కోసం అక్కడికి వెళ్ళిన రామ్ చరణ్ దంపతులు?

Charan -Upasana: మెగా వారసుడి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తన అద్భుతమైన నటన శైలితో ఇండస్ట్రీలో అగ్ర హీరోగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ఈయన ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూనే ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండు కుటుంబాలు బాగా ఉన్నతమైన కుటుంబాలు కావడంతో పెద్దలు కూడా వీరి పెళ్లిని ఎంతో ఘనంగా నిర్వహించారు.

Charan -Upasana: చరణ్ ఉపాసన పెళ్లి బంధానికి పదేళ్ళు… పెళ్లి రోజు వేడుకల కోసం అక్కడికి వెళ్ళిన రామ్ చరణ్ దంపతులు?

ఇక పోతే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ దంపతులు వారి వృత్తిపరమైన జీవితాలతో బిజీగా ఉంటున్నారు.రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండగా ఉపాసన పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతూ అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు తీసుకున్నారు.

Charan -Upasana: చరణ్ ఉపాసన పెళ్లి బంధానికి పదేళ్ళు… పెళ్లి రోజు వేడుకల కోసం అక్కడికి వెళ్ళిన రామ్ చరణ్ దంపతులు?

ఈ విధంగా వీరిద్దరు వృత్తిపరమైన జీవితం బిజీగా గడుపుతూ వైవాహిక జీవితంలో కూడా ఈ దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు.ఇకపోతే వీరి వివాహం జరిగి పదేళ్ళు కావడంతో పెద్ద ఎత్తున వివాహ దినోత్సవ వేడుకలను జరుపుకోవడం కోసం ఇద్దరు ఇటలీకి వెళ్లినట్లు తెలుస్తోంది. దేశంలో ప్రఖ్యాత నగరాల్లో ఒకటైన మిలాన్ నగరంలో వీరిద్దరు తమ పెళ్లి రోజు వేడుకలను జరుపుకోవడానికి ప్లాన్ చేశారు.

చరణ్ సంతానం విషయంలో అసంతృప్తి చెందుతున్న అభిమానులు..

ఇక వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో ఎంతో బిజీగా సంతోషంగా గడుపుతున్న ఈ జంటకు ఒకటే వెలితి. వీరికి పెళ్లి అయ్యి ఒక దశాబ్దం పూర్తి అవుతున్నప్పటికీ ఇంకా సంతానం లేకపోవడం మెగా అభిమానులకు ఎంతో అసంతృప్తిగా ఉంది. ఎంత పనులలో బిజీగా ఉన్నప్పటికీ పిల్లల విషయంలో మరి ఇంత ఆలస్యం కావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రామ్ చరణ్ తో పాటు పెళ్లయిన హీరోలు ఆయనకన్నా ఎంతో ఆలస్యంగా పెళ్లి చేసుకున్న వారు కూడా ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యారు. అయితే వీళ్ళు మాత్రం ఇంకా పిల్లల గురించి ఆలోచించకపోవడం గమనార్హం.

Serial Artists : వామ్మో… ఈ సీరియల్ హీరోయిన్స్ రోజుకు తీసుకునే రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Serial Artists: సినిమాలలో నటించే హీరోయిన్లకే కాదు బుల్లితెరపై సీరియల్స్ లో నటించే హీరోయిన్లకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది.ఈక్రమంలోనే ప్రతిరోజూ ఎన్నో సీరియల్స్ ద్వారా పలువురు తారలు బుల్లితెర ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేస్తూ ఉన్నారు.ఒక రకంగా చెప్పాలంటే సినిమా హీరోయిన్ల కన్నా సీరియల్ హీరోయిన్ లకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. అదేవిధంగా వీరికి రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుతుందని చెప్పాలి.

Serial Artists: వామ్మో…ఈ సీరియల్ హీరోయిన్స్ రోజుకు తీసుకునే రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

వెండితెర హీరోయిన్లకు సినిమాకు ఇంత అని రెమ్యూనరేషన్ ఇస్తారు. అయితే బుల్లితెర హీరోయిన్ కి అలా కాదు వీరికి రోజువారి కాల్షీట్స్ ఆధారంగా పారితోషకం అందిస్తారు. ఈ విధంగా బుల్లితెర నటీమణులకు ఒక్క రోజుకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ బాగా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం బాగా పాపులారిటీ సంపాదించుకున్న బుల్లితెర హీరోయిన్ ఎవరు ఎంతలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలుసుకుందాం..

కార్తీకదీపం సీరియల్ ద్వారా అందరికీ ఎంతో సుపరిచితమైన నటి ప్రేమి విశ్వనాథ్ తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ఈమె ఒక రోజు షూటింగ్ లో పాల్గొంటే 30 వేల రూపాయల పారితోషికం తీసుకుంటారు. అదేవిధంగా వదినమ్మ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల మదిని దోచిన సుజిత ఒక రోజుకు 25 వేల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారు.

Serial Artists: వామ్మో…ఈ సీరియల్ హీరోయిన్స్ రోజుకు తీసుకునే రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఒకప్పుడు వెండితెరపై హీరోయిన్ గా సందడి చేసిన సీనియర్ నటీమణులు ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ కస్తూరి ప్రస్తుతం బుల్లితెరపై గృహలక్ష్మి సీరియల్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈమె ఒక రోజుకు 25 వేల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారు. జానకి కలగనలేదు సీరియల్ ద్వారా రాశి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈమె ఒక్క రోజుకు 25 వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటారు.

భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న బుల్లి తెర తారలు…

చంటిగాడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం బుల్లితెర హీరోయిన్ స్థిరపడిన సుహాసిని ఒక రోజు కాల్షీట్ కోసం ఈమె 25 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అదేవిధంగా నవ్య స్వామి 25 వేలు, మేఘన లోకేష్ 20 వేలు, అగ్నిసాక్షి ఐశ్వర్య 20 వేలు, కార్తీక దీపం విలన్ శోభా శెట్టి ఒక రోజుకు 15 వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఈ విధంగా బుల్లితెర నటీమణుల రోజుకు భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

Nayanathara wedding: నయనతార పెళ్లికి విగ్నేష్ శివన్ కి ఏ రేంజ్ లో కట్నకానుకలు ఇచ్చారో తెలుసా?

Nayanathara wedding:దక్షిణాది సినీ ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమపక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి నయనతార విగ్నేష్ ఎట్టకేలకు నేడు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ప్రేమలో విహరిస్తున్న ఈ జంట వీరు పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా ఆ ప్రశ్నలు దాటేస్తూ సస్పెన్స్ పెట్టారు.ఈ క్రమంలోనే నేడు హిందూ సాంప్రదాయ పద్ధతిలో బంధువులు అతిథులు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

Nayanathara wedding: నయనతార పెళ్లికి విగ్నేష్ శివన్ కి ఏ రేంజ్ లో కట్నకానుకలు ఇచ్చారో తెలుసా?

నేడు ఈ జంట ఉదయం 8.30 గంటలకు షెరటాన్ గ్రాండ్, మహాబలిపురంలో షెరటాన్ గ్రాండ్‌లో జరిగింది. ఇకపోతే వీరి పెళ్ళికి కోలీవుడ్ సెలబ్రిటీలతో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులు కూడా హాజరైనట్లు సమాచారం. పెళ్లికి నయనతార ధరించిన నగలు డైమండ్ రింగ్ తో సహా దాదాపు 5 కోట్ల విలువ చేసే నగలు ధరించారని తెలుస్తోంది. ఇక ఈమె పెళ్లి కోసం ప్రత్యేకంగా బంగారు దారాలతో తయారు చేయించుకున్న గద్వాల పట్టు చీరలు కట్టుకున్నారట. ఈ చీర ఖరీదు దాదాపు 5 లక్షల వరకు ఉంటుందని సమాచారం.

Nayanathara wedding: నయనతార పెళ్లికి విగ్నేష్ శివన్ కి ఏ రేంజ్ లో కట్నకానుకలు ఇచ్చారో తెలుసా?

ఇకపోతే నయనతార తన భర్తకు పెళ్ళికి కానుకగా ఖరీదైన బహుమతిని కట్నం కింద ఇచ్చారని తెలుస్తోంది. చెన్నైలోని కాస్ట్లీ ఏరియాలో నయనతార ఎంతో విలాసవంతమైన ఇంటిని వీరి అభిరుచులకు అనుగుణంగా డిజైన్ చేయించి ఆ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తన భర్త విగ్నేష్ పేరుపై రాసి తనకు కానుకగా ఇచ్చారని తెలుస్తోంది.

నెట్ ఫ్లిక్ లో ప్రసారం కానున్న నయన్ విగ్నేష్ పెళ్లి వేడుక..

ఈ విధంగా వీరిద్దరూ పెళ్లి కోసం భారీ మొత్తంలోనే ఒకరికొకరు కానుకలు సమర్పించుకొన్నారని తెలుస్తోంది. ఇక పోతే వీరి పెళ్లి మహాబలిపురంలో జరిగినప్పటికీ రిసెప్షన్ మాత్రం ఫైవ్ స్టార్ హోటల్లో ఎంతో ఘనంగా నిర్వహించనున్నారని తెలుస్తోంది.అయితే ప్రస్తుతం నయనతార పెళ్లికి సంబంధించిన ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి .అయితే వీరి పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు వీడియోలు బయటకు రాకుండా ఈ జంట ఎంతో అప్రమత్తమయ్యారు. ఇకపోతే వీరి పెళ్లి వేడుకను ఏకంగా నెట్ ఫ్లిక్ కి 2.5 కోట్ల రూపాయలకు అమ్మినట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరి పెళ్లి నెట్ ఫ్లిక్ లో ప్రసారం కానుంది.

Actor Parvatheesam : నా డబ్బులు ఇవ్వలేదు సార్ అని డైరెక్టర్ మారుతికి ఫోన్ చేస్తే.. ఏమన్నాడో తెలుసా? : యాక్టర్ పార్వతీశం కామెంట్స్ వైరల్!

Director Maruthi: పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన అనంతరం కేరింత సినిమాతో నటుడు పార్వతీశం పరిచయమయ్యారు.ఈ క్రమంలోనే పలు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన రెండు సినిమాలలో నటించారు. మారుతి దర్శకత్వంలోనూ రోజులు మారాయి, భలే మంచి చౌక బేరం వంటి రెండు సినిమాలలో నటించినట్టు ఈయన తెలిపారు.

Director Maruthi: డబ్బులు ఇవ్వలేదని మారుతి గారికి ఫోన్ చేస్తే.. ఆయన అలా మాట్లాడారు.. యాక్టర్ పార్వతీశం కామెంట్స్ వైరల్!

ఇకపోతే కేరింత సినిమాలో నటించడం కోసం పార్వతీశం దిల్ రాజుకు డబ్బులు ఇచ్చినట్లు పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విషయం గురించి ప్రశ్నించగా దిల్ రాజు గారికి నేను డబ్బులు ఇవ్వడం ఏంటి అంటూ ఈయన ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. ఇకపోతే మారుతి గారు మీకు పేమెంట్ ఇవ్వడానికి ఇబ్బందులు పెట్టారు అని కూడా వార్తలు వచ్చాయని ప్రశ్నించగా ఈ విషయం గురించి పార్వతీశం క్లారిటీ ఇచ్చారు.

Director Maruthi: డబ్బులు ఇవ్వలేదని మారుతి గారికి ఫోన్ చేస్తే.. ఆయన అలా మాట్లాడారు.. యాక్టర్ పార్వతీశం కామెంట్స్ వైరల్!

ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలలో ఒక్కరు కూడా పేమెంట్ ఎగ్గొట్ట లేదని మారుతి గారు కూడా ఎప్పుడూ తనని పేమెంట్ కోసం ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. ఇక మారుతి గారి ప్రొడక్షన్ లో చేసిన ఈ రెండు సినిమాలకు కూడా ఆయన కరెక్ట్ గా పేమెంట్ ఇచ్చారని తెలిపారు. ఇక సార్ పేమెంట్ కావాలని అతనికి చిన్న మెసేజ్ చేస్తే చాలు గంటలో నా అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవుతాయని తెలిపారు.

ఎప్పుడు పేమెంట్ కోసం ఇబ్బంది పెట్టలేదు…

ఒకవేళ క్యాష్ కనుక ఉంటే ఆఫీస్ కి వెళ్లి తీసుకో అంటూ తనకు సమాధానం చెబుతారు కానీ ఆయన పేమెంట్ విషయంలో ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. ఇక చోటా కె నాయుడు గురించి మాట్లాడుతూ ఆయన ఎంతో మంచివారని ఆయన స్టైల్, ఆయన డిగ్నిటీ ఎంతో బాగుంటుందని ఈ సందర్భంగా నటుడు పార్వతీశం చోటా కె నాయుడు గురించి తెలిపారు.తను ఒకసారి ఎవరైనా ఇష్టపడితే ఎంతో ప్రేమగా చూసుకుంటారని అంత మంచి మనస్తత్వం అని పార్వతీశం ఈ సందర్భంగా చోటా కె నాయుడు గురించి తెలిపారు.

Manchu Lakshmi: ఏంటి మంచు లక్ష్మి హెయిర్ నిజమైనది కాదా… ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుందా?

Manchu Lakshmi: సీనియర్ నటుడు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి నటిగా గుర్తింపు పొందడం కోసం సరికొత్త ప్రయత్నాలు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ విధంగా ఈమె ఎన్నో విభిన్న కథా చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో గుర్తింపు పొందలేదు. ఇకపోతే ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న మంచులక్ష్మి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

Manchu Lakshmi: ఏంటి మంచు లక్ష్మి హెయిర్ నిజమైనది కాదా… ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుందా?

మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఏ చిన్న పోస్ట్ పెట్టిన నెటిజన్లు పెద్ద ఎత్తున తనని ట్రోల్ చేయడం చేస్తుంటారు. ఇదివరకు ఇలా ఎన్నో సార్లు లక్ష్మీ మంచు అభిమానుల నుంచి చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు.తాజాగా మంచు లక్ష్మి ఎంతో అందంగా తయారయ్యి చుడీదార్ వేసుకుని ఉన్నటువంటి వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Manchu Lakshmi: ఏంటి మంచు లక్ష్మి హెయిర్ నిజమైనది కాదా… ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుందా?

ఇక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది లక్ష్మీ మంచు అభిమానులు చాలా అందంగా ఉన్నావు అంటూ కామెంట్ చేయగా మరికొందరు క్యూట్ అంటూ పెద్ద ఎత్తున ఈ వీడియోపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా ఈమె బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తో పోల్చారు.ఈ విధంగా అందరూ తన పై ప్రశంసలు కురిపిస్తూ ఉండగా ఒక నెటిజన్ మాత్రం మంచు లక్ష్మి మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారా.. అని ప్రశ్నించారు.

ఫోర్ హెడ్ ఎలా కవర్ చేశారు..

మరీ మీ ఫోర్ హెడ్ ఎలా కవర్ చేశారంటూ కామెంట్ పెట్టారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ అవును కదా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మంచు లక్ష్మి చిన్న పోస్ట్ పెట్టినా కూడా వైరల్ అవుతూ పలు సందేహాలకు దారి తీస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం షూస్ ముందు పెట్టుకున్న ఫోటోని షేర్ చేయడంతో కొందరు చెప్పుల షాపు పెట్టుకున్నావా అంటూ కామెంట్ చేశారు. ఇలా నిత్యం ఏదో ఒక విధంగా నెటిజన్ల ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు.

Balakrishna Remakes: బాలకృష్ణ సినీ కెరీర్ లో నటించిన రీమేక్ చిత్రాలు ఏంటో తెలుసా?

Balakrishna Remakes: ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలో రీమేక్ సినిమాల హవా నడుస్తోంది. ఒక భాషలో విడుదలై మంచి విజయం సాధించిన సినిమాల రీమేక్ హక్కులను కొనుగోలు చేసి ఇతర భాషలలో విడుదల చేసేవారు కాదు. అప్పట్లో ఎంతో మంది స్టార్ హీరోలు సైతం ఇతర భాషలలో మంచి విజయం సాధించిన సినిమాలను రీమేక్ చేస్తూ తెలుగులో కూడా మంచి విజయాలను అందుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ నటించిన రీమేక్ సినిమాలు ఇక్కడ తెలుసుకుందాం…

Balakrishna Remakes: బాలకృష్ణ సినీ కెరీర్ లో నటించిన రీమేక్ చిత్రాలు ఏంటో తెలుసా?

బాలకృష్ణ నటించిన లయన్ సినిమాని హాలీవుడ్‌లో తెరకెక్కిన ‘టోటల్ రీకాల్’కు ఇన్‌స్ప్రేషన్‌గా తీసుకొని తెరకెక్కించారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం సినిమాని ఆధారంగా బాలకృష్ణ పాండురంగడు సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.తమిళంలో కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు సినిమాకి రీమేక్ సినిమా బాలకృష్ణ ఒక్క మగాడు చిత్రంలో నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

Balakrishna Remakes: బాలకృష్ణ సినీ కెరీర్ లో నటించిన రీమేక్ చిత్రాలు ఏంటో తెలుసా?

తమిళంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘సామి’ మూవీకి రీమేక్‌గా బాలకృష్ణ లక్ష్మీనరసింహ సినిమాలో నటించారు. కన్నడలో హీరో విష్ణువర్ధన్ హీరోగా నటించిన రాజ నరసింహ సినిమాకి రీమేక్ చిత్రంగా పలనాటి బ్రహ్మనాయుడు సినిమాల్లో నటించారు ఈ సినిమా పెద్దగా ఆదరణ పొందలేదు.గొప్పింటి అల్లుడు’ సినిమా హిందీలో గోవిందా హీరోగా తెరకెక్కిన ‘హీరో నంబర్ 1’ సినిమాకు రీమేక్.

రీమేక్ చిత్రాలతో హిట్ కొట్టిన బాలయ్య…

వీటితోపాటు బాలకృష్ణ నటించిన శ్రీకృష్ణార్జున విజయము, భైరవ ద్వీపం, బ్రహ్మర్షి విశ్వామిత్ర, ముద్దుల మేనల్లుడు, అశోక చక్రవర్తి, ముద్దుల మామయ్య, రాముడు భీముడు, మువ్వగోపాలుడు, రాము, బాబాయ్ అబ్బాయ్, ఆత్మబలం మంగమ్మగారి మనవడు వంటి సినిమాలన్నీ కూడా బాలకృష్ణ ఇతర భాషలలో విజయం సాధించిన సినిమాలకు చిత్రాల్లో నటించారు.

Actress Indraja: ఇంద్రజ పెళ్లి వెనుక ఇంత తతంగం నడిచిందా.. ఇంద్రజ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి కారణం అదేనా?

Actress Indraja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎన్నో సినిమాలలో నటించి అందరినీ ఎంతగానో ఆకట్టుకున్న నటి ఇంద్రజ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈమె ఆలీ నటించిన యమలీల సినిమా ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. ఇకపోతే ఇంద్రజ తెలుగులో కన్నా బాలీవుడ్ ,కోలీవుడ్ చిత్రాల్లో ఎక్కువగా సందడి చేశారు. ఇంద్రజ ప్రస్తుతం చెన్నైలో స్థిరపడినప్పటికీ ఈమె కుటుంబ విషయానికి వస్తే ఇంద్రజ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అమ్మాయి.

Actress Indraja: ఇంద్రజ పెళ్లి వెనుక ఇంత తతంగం నడిచిందా.. ఇంద్రజ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి కారణం అదేనా?

బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఇంద్రజ సినిమాల పై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగారు. ఇకపోతే ఈమె వివాహం మాత్రం ముస్లిం వ్యక్తితో జరగడం విశేషం. ఇంద్రజ తన భర్తకు ఉన్న కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారని అతని ద్వారా తనతో స్నేహం ఏర్పడి సుమారు ఆరు సంవత్సరాల పాటు ఇద్దరి మధ్య స్నేహ బంధం ఉందని ఇంద్రజ తెలిపారు.

Actress Indraja: ఇంద్రజ పెళ్లి వెనుక ఇంత తతంగం నడిచిందా.. ఇంద్రజ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి కారణం అదేనా?

ఇలా ఆరు సంవత్సరాల పాటు స్నేహబంధంలో ఉన్న మేము ఒకరికొకరు బాగా అర్థం చేసుకోవడంతో మా మనసులు కలిసాయని, మా మనసులు కలవడంతో మా పెళ్లి జరిగిందని ఇంద్రజ తెలిపారు. ఆయన కూడా ఇండస్ట్రీలో రచయితగా, యాడ్ ఫిలిం మేకర్ గా పని చేస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే తమ కుటుంబానికి ఎన్నో బిజినెస్ లు ఉన్నాయని, ప్రస్తుతం ఆయన బిజినెస్ చూసుకుంటూ ఉన్నారని ఇంద్రజ తెలిపారు.

కథ నచ్చితే ఏ పాత్రలో నటించడానికైనా సిద్ధమే…

ఇకపోతే ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగిన ఇంద్రజ తిరిగి ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరైతే ఈ పాత్ర మాత్రమే ఇంద్రజకు సరిపోతుందని తన వద్దకు వస్తారో అలాంటి సినిమాలలో తాను తప్పకుండా నటిస్తానని తెలిపారు. కథ నచ్చితే ఆ పాత్ర ఏదైనా సరే అమ్మ, అక్క, వదిన పాత్రలలో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.ప్రస్తుతం ఈమె పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూనే బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.

Anchor Rashmi: సుధీర్ తోనే కాదు వారందరితో కూడా నాకు ఎఫైర్ ఉందన్నారు… షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రష్మీ!

Anchor Rashmi: జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మి గౌతమ్ గురించి అందరికీ సుపరిచితమే.ఈమె జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా సుడిగాలి సుదీర్ తో జతకట్టి పలు స్కిట్ లలో పాల్గొనేవారు. ఈ క్రమంలోనే చాలామంది సుడిగాలి సుధీర్ రష్మీ జోడి ఇష్టపడటమే కాకుండా, వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉండటంతో చాలా మంది వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందంటూ పెద్దఎత్తున వార్తలు సృష్టించారు.

Anchor Rashmi: సుధీర్ తోనే కాదు వారందరితో కూడా నాకు ఎఫైర్ ఉందన్నారు… షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రష్మీ!

ఈ విధంగా తన గురించి వస్తున్న లవ్ ఎఫైర్స్ గురించి రష్మీ గతంలో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని షాకింగ్ కామెంట్ చేశారు. అయితే ఈ వీడియో పాతది అయినప్పటికీ మరోసారి ఈ వీడియో వైరల్ కావడంతో రష్మీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఇంటర్వ్యూ ద్వారా మాట్లాడుతూ తనకు సుడిగాలి సుధీర్ కు ఆ ఫైర్ గురించి ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.

Anchor Rashmi: సుధీర్ తోనే కాదు వారందరితో కూడా నాకు ఎఫైర్ ఉందన్నారు… షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రష్మీ!

జబర్దస్త్ కార్యక్రమంలో కేవలం సుడిగాలి సుదీర్ తో మాత్రమే కాకుండా, చలాకి చంటితో కూడా తనకు ఎఫైర్ పెట్టారని ఈ సందర్భంగా ఈమె షాకింగ్ కామెంట్ చేశారు.మిగిలిన టీమ్ మెంబర్స్ అందరికీ పెళ్లి కావడంతో వారితో తనకు ఎలాంటి లింక్ పెట్టలేదని పెళ్లి కాని వారు అందరితోనూ తనకు ఎఫైర్స్ పెట్టారని ఈ సందర్భంగా తెలిపారు. ఇలా మా అందరిదీ సేమ్ ఏజ్ కావడంతో చాలా మంది మా మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ భావించారు.

ఇలాంటి వార్తలను సరదాగా తీసుకుంటాను…

ఈ విధంగా తన గురించి వస్తున్న ఎఫైర్స్ గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని, ఇలాంటి రూమర్స్ అన్నింటినీ తాను చాలా సరదాగా తీసుకుంటానని రష్మి తెలిపారు.జబర్దస్త్ కార్యక్రమంలోకి వచ్చిన తరువాత తనలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి ఏ విషయమైనా ముందు సీరియస్ గా తీసుకోకుండా చాలా సరదాగా తీసుకోవడం అలవాటు అయింది. అందుకే తన గురించి వస్తున్నటువంటి ఇలాంటి రూమర్స్ ను కూడా తను పెద్దగా పట్టించుకోలేదని ఈ సందర్భంగా రష్మి తనపై వచ్చిన రూమర్స్ గురించి స్పందించారు.

Chiranjeevi: దాసరి నిర్ణయంతో ఆ రోజు చిరంజీవి మొహం చూడలేకపోయాను.. దవళ సత్యం కామెంట్స్ వైరల్!

Chiranjeevi:తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న దవల సత్యం దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కాయి. ధవళ సత్యం దాసరి గారి జూనియర్ కావడంతో ఆయన సహాయంతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇండస్ట్రీలోకి రాకముందు ఇద్దరూ కలిసి నాటకాలు వేస్తూ ఉండేవాళ్లమని అనంతరం దాసరి సహాయంతోనే ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.

Chiranjeevi: దాసరి నిర్ణయంతో ఆ రోజు చిరంజీవి మొహం చూడలేకపోయాను.. దవళ సత్యం కామెంట్స్ వైరల్!

ఇకపోతే దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన శివరంజని సినిమా కోసం ధవళ సత్యం కో-డైరెక్టర్ గా పనిచేశారు. ఇక ఈ సినిమాకి నలుగురు హీరోలు ఆప్షన్ గా ఉన్నారు. చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్, ఇంకొక హైదరాబాద్ చెందిన ఒక అబ్బాయి నలుగురు హీరోలు ఆప్షన్ గా ఉన్నారు. నా ఒపీనియన్ అయితే నేను శివరంజని సినిమా కోసం చిరంజీవిని తీసుకోవాలని దాసరి గారికి చూపించాను. ఇక పద్మజా వదిన సుధాకర్ పేరు ప్రస్తావించారు.

Chiranjeevi: దాసరి నిర్ణయంతో ఆ రోజు చిరంజీవి మొహం చూడలేకపోయాను.. దవళ సత్యం కామెంట్స్ వైరల్!

ఇకపోతే హైదరాబాద్ నుంచి కొందరు రాజకీయ నాయకుల హరిప్రసాద్ ను హీరోగా తీసుకోవాలని ఫోన్లు చేసేవారు. ఇక ఈ విషయంలో బాగా ఆలోచించిన దాసరిగారు ఈ సినిమాకి హరి ప్రసాద్ ను ఫైనల్ చేశారు.అదేంటి అన్నయ్య అలా చేసావంటే ఇండస్ట్రీలో కొన్ని కొన్ని విషయాలలో ఇలాగే వ్యవహరించాల్సి ఉంటుంది. నువ్వు ఎలా చేస్తావో తెలియదు హరి ప్రసాద్ ని హీరోగా అద్భుతంగా చూపించాలి అంటూ దాసరి గారు చెప్పారు.

రాజకీయ నాయకుల ఒత్తిడే కారణం….

ఈ విధంగా శివరంజని సినిమా కోసం హీరోగా హరి ప్రసాద్ ను సెలెక్ట్ చేయగానే నేను బయటకు వెళ్లి పోయాను.అయితే బయట చిరంజీవి గారు నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను కనబడితే నాకు చెప్పేసి వెళ్లిపోవాలని ఆయన ఎదురు చూస్తున్నారు. అయితే ఆ సమయంలో నేను చిరంజీవి మొహం చూడలేకపోయానని ఈ సందర్భంగా దవళ సత్యం శివరంజని సినిమా సమయంలో జరిగిన సంఘటన గురించి తెలియజేశారు. అయితే ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదని హరిప్రసాద్ స్థానంలో చిరంజీవిని పెట్టి ఉంటే సినిమానే వేరే ఉండేది అంటూ ఆయన తెలిపారు. ఇకపోతే తాను డైరెక్టర్ అయిన తర్వాత జాతర సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవిని హీరోగా సెలెక్ట్ చేశానని, ఆ విషయంలో ఎవరు చెప్పినా వినకుండా చిరంజీవి హీరోగా పెట్టి జాతర సినిమా చేశానని తెలిపారు.