Tag Archives: telugu film industry

Bigg Boss 6: బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ యంగ్ హీరో.. బిగ్ బాస్ ఎంట్రీ వెనుక అసలు కారణం ఇదేనా?

Bigg Boss 6: బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి.ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారం అవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్లలో పూర్తి చేసుకొని ఆరవ సీజన్ ప్రసారం కావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి చేసుకుంది.

Bigg Boss 6: బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ యంగ్ హీరో.. బిగ్ బాస్ ఎంట్రీ వెనుక అసలు కారణం ఇదేనా?

బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా తొలిసారిగా బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో భాగంగా లేడీ కంటెస్టెంట్ విన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమం ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసింది. ఇదిలా ఉండగా బుల్లితెరపై సీజన్ సిక్స్ ప్రసారం చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.ఎప్పటిలాగే ఈసారి కూడా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిని బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంపిక చేసినట్లు సమాచారం.

Bigg Boss 6: బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ యంగ్ హీరో.. బిగ్ బాస్ ఎంట్రీ వెనుక అసలు కారణం ఇదేనా?

ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ లు వీళ్లే అంటూ ఇప్పటికే కొందరి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమంలోకి టాలీవుడ్ యంగ్ హీరో ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్త వైరల్ అవుతుంది. తూనీగ తూనీగ సినిమాతో వెండితెర అరంగ్రేటం చేసిన హీరో సుమంత్ అశ్విన్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రేక్షకాదరణ కోసమే బిగ్ బాస్ ఎంట్రీ…

సుమంత్ అశ్విన్ కేరింత, హ్యాపీ వెడ్డింగ్, వంటి సినిమాలలో నటించిన పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. అందుకే మంచి గుర్తింపు సంపాదించుకోవడం కోసమే ఆయన ఈ కార్యక్రమంలోకి వెళ్లడానికి ఒప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇక తాజాగా సుమంత్ 7 డేస్ 6 నైట్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Sai Pallavi: సాయిపల్లవి పై ఆగ్రహం వ్యక్తం చేసిన విరాటపర్వం నిర్మాతలు… కారణం అదేనా?

Sai Pallavi: సాయి పల్లవి, రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం.ఈ సినిమా జూన్ 17వ తేదీ ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మొదటిరోజు మొదటి షోతోనే ఎంతో మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం పెద్దగా రాబట్టలేకపోయింది. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో వేణు ఊడుగుల దర్శకత్వంలో
సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు సమర్పణలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

Sai Pallavi: సాయిపల్లవి పై ఆగ్రహం వ్యక్తం చేసిన విరాటపర్వం నిర్మాతలు… కారణం అదేనా?

ఇక ఈ సినిమాలో ఎంతోమంది నటీనటులు ఉన్నప్పటికీ సాయి పల్లవి మాత్రం ఎంతో హైలెట్ అయ్యింది. ప్రమోషన్ కార్యక్రమాలను కూడా సాయి పల్లవిని హైలెట్ చేస్తూ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇక ఈ సినిమాలో అనుకున్న విధంగానే సాయిపల్లవి పాత్ర కీలకంగా ఉండి సినిమాని ముందుకు నడిపించింది.అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టకపోవడంతో నిర్మాతలు సాయి పల్లవి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Sai Pallavi: సాయిపల్లవి పై ఆగ్రహం వ్యక్తం చేసిన విరాటపర్వం నిర్మాతలు… కారణం అదేనా?

ఈ సినిమా కలెక్షన్లు రాకపోవడానికి సాయిపల్లవి కారణమని భావిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సాయిపల్లవి కాశ్మీర్ పండిట్లు హత్య గోవధ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపాయి. ఈ క్రమంలోనే చాలామంది సాయిపల్లవి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలని నిరసనలు చేపట్టారు. కొన్ని చోట్ల సాయిపల్లవి పై కేసులు కూడా పెట్టారు.

సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలే కారణమా…

ఈ విధంగా సాయి పల్లవి మతాలను ఉద్దేశిస్తూ మాట్లాడటం వల్ల సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమా చూడము అంటూ మరికొందరు పెద్దఎత్తున సాయి పల్లవి వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు.దీంతో సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు సినిమాపై తీవ్ర ప్రభావం చూపాయని అందుకే సినిమా కలెక్షన్లను రాబట్టలేకపోయింది అంటూ నిర్మాతలు సాయి పల్లవి పై ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకున్నప్పటికి కలెక్షన్ల పరంగా నిరాశ కలిగించిందని చెప్పాలి.

NTR Remuneration: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత భారీగా పెరిగిన ఎన్టీఆర్ మార్కెట్.. ఒక్కో సినిమాకు భారీ రెమ్యూనరేషన్?

NTR Remuneration: ఒకప్పుడు తెలుగు సినిమాలు కేవలం మన తెలుగు రాష్ట్రాలలో మాత్రమే పరిమితమై ప్రేక్షకులను సందడి చేసేవి. క్రమక్రమంగా తెలుగు సినిమాలు దక్షిణాది రాష్ట్రాలలో పలు భాషలలో విడుదల అవుతూ ఆదరణ సంపాదించుకున్నాయి.ఈ విధంగా ఒకానొక సమయంలో అగ్రహీరోలు ఒక్కో సినిమాకు 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటే అదే పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అని చెప్పాలి.

NTR Remuneration: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత భారీగా పెరిగిన ఎన్టీఆర్ మార్కెట్.. ఒక్కో సినిమాకు భారీ రెమ్యూనరేషన్?

రాజమౌళి పుణ్యమా అంటూ తెలుగు హీరోల మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ఈయన తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించారు.అప్పటినుంచి తెలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే ఇతర భాషలలో కూడా ఈ సినిమాలపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే కొందరు పాన్ ఇండియా స్టార్ హీరోలుగా మారిపోయారు.

NTR Remuneration: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత భారీగా పెరిగిన ఎన్టీఆర్ మార్కెట్.. ఒక్కో సినిమాకు భారీ రెమ్యూనరేషన్?

ఈ విధంగా పాన్ ఇండియా హీరోగా మారిన కొందరు సెలబ్రెటీల రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచారు. సుమారు ఒక్కో సినిమాకు 50 కోట్ల పైగా రెమ్యునరేషన్ తీసుకోగా ప్రభాస్ అల్లు అర్జున్ వంటి వారు వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇకపోతే వీరి బాటలోనే రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా హీరోగా గుర్తింపు పొందిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం 45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మూడు సంవత్సరాల కాల్షీట్స్ ఇచ్చారు.

భారీగా పెరిగిన తెలుగు హీరోల మార్కెట్…

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న కొరటాల సినిమాకు ఏకంగా 60 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఏది ఏమైనా రాజమౌళి వల్ల మన తెలుగు హీరోల మార్కెట్ పూర్తిగా పెరిగిపోయింది. త్వరలోనే కొరటాల, ఎన్టీఆర్ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది.

Acharya: ఆచార్య నైజాం డిస్ట్రిబ్యూటర్ కి 14 కోట్ల రూపాయలను వెనక్కి ఇచ్చిన కొరటాల.. ఆచార్య తిప్పలు మామూలుగా లేవుగా?

Acharya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు డైరెక్టర్ కొరటాల శివ. రచయితగా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈయన సినిమాతో దర్శకుడిగా మారారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కొరటాల అనంతరం శ్రీమంతుడు జనతాగ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకొని అపజయం ఎరుగని దర్శకుడు గా పేరు సంపాదించుకున్నారు.

Acharya: ఆచార్య నైజాం డిస్ట్రిబ్యూటర్ కి 14 కోట్ల రూపాయలను వెనక్కి ఇచ్చిన కొరటాల.. ఆచార్య తిప్పలు మామూలుగా లేవుగా?

ఈ క్రమంలోనే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన సినిమా ఆచార్య. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా థియేటర్ వద్ద విడుదల అయ్యి మొదటి షో తోనే ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. కొరటాల శివ దర్శకత్వంలో మెగా హీరోలు కలిసి నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే డిస్ట్రిబ్యూటర్లు సైతం కోట్లల్లో డబ్బులు ఖర్చు చేసి సినిమాని కొనుగోలు చేశారు.

Acharya: ఆచార్య నైజాం డిస్ట్రిబ్యూటర్ కి 14 కోట్ల రూపాయలను వెనక్కి ఇచ్చిన కొరటాల.. ఆచార్య తిప్పలు మామూలుగా లేవుగా?

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కోవడంతో ఈసినిమా కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు పెద్దఎత్తున నష్టపోయారు. ఈ విధంగా నష్టపోయిన వారికి మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ రామ్ చరణ్ ఆర్థిక సహాయం చేశారని తెలుస్తోంది. ఇకపోతే వీరందరిలో కెల్లా నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను అధిక మొత్తంలో డబ్బును నష్టపోయినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న కొరటాల…

ఇలా వరంగల్ శీను ఆచార్య సినిమాని నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి కోట్ల రూపాయల నష్టపోవడంతో కొరటాల శివ ముందుకు వచ్చి వరంగల్ శీనుకి ఏకంగా 14 కోట్ల రూపాయలు రిటర్న్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. కొరటాల శివ తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ 30సినిమా మొదలు పెట్టడానికి ముందే ఇదంతా క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే వరంగల్ శీనుకి 14 కోట్ల రూపాయలను రిటర్న్ చేశారట. ఏది ఏమైనా ఇండస్ట్రీలో అపజయమే తెలియని కొరటాల శివకు ఆచార్య సినిమా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని చెప్పవచ్చు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశకు గురి చేయడంతో ఎన్టీఆర్ సినిమా విషయంలో కొరటాల ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Ram Charan: వామ్మో రామ్ చరణ్ ధరించిన జాకెట్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎన్ని లక్షలో తెలుసా?

Ram Charan: సాధారణంగా సెలబ్రిటీలు వారి హోదాకు అనుగుణంగా వారు ఉపయోగించే వస్తువుల విషయంలో కూడా ఎంతో ఖరీదైన వస్తువులను, ఎంతో స్టైలిష్ గా ఉండే వాటిని ఉపయోగిస్తూ ఉంటారు.ఇలా వీటి కోసం లక్షల్లో ఖర్చు చేయడం మనం చూస్తున్నాము. ఇకపోతే త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం తన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.

Ram Charan: వామ్మో రామ్ చరణ్ ధరించిన జాకెట్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎన్ని లక్షలో తెలుసా?

ఈ విధంగా రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన తర్వాత కాస్త హై ప్రొఫెషనల్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో శంకర్ దర్శకత్వంలో తన తదుపరి సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఆయన తన పదవ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఉపాసన రామ్ చరణ్ దంపతులు తమ పదవి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం కోసం ఈ దంపతులు ఇటలీ వెళ్లిన విషయం మనకు తెలిసిందే.

Ram Charan: వామ్మో రామ్ చరణ్ ధరించిన జాకెట్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎన్ని లక్షలో తెలుసా?

ఇటలీలో ఎంతో సరదాగా గడుపుతూ పెళ్లి రోజున ఘనంగా జరుపుకున్న అనంతరం తిరిగి ఈ జంట హైదరాబాద్ వచ్చారు.అయితే హైదరాబాద్ ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ మీడియా కంట పడటంతో ఒక్కసారిగా ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలలో రామ్ చరణ్ రా అని రాసి ఉన్న డెనిమ్ జాకెట్ ధరించారు. ఎంతో స్టైలిష్ లుక్ లో ఉన్నటువంటి రామ్ చరణ్ ఫోటో వైరల్ కావడంతో చాలా మంది ఆయన ధరించిన జాకెట్ ధర ఎంత అంటూ పెద్దఎత్తున సెర్చ్ చేస్తున్నారు.

జాకెట్ ధర అక్షరాల రెండు లక్షల రూపాయలు

ఈ క్రమంలోనే రాంచరణ్ ధరించిన జాకెట్ ధర ఏకంగా 2600 డాలర్లు. మన భారతీయ కరెన్సీ ప్రకారం ఈ జాకెట్ ఖరీదు అక్షరాల రెండు లక్షల రూపాయలు. ఇలా ఈ జాకెట్ ధర రెండు లక్షల ధర ఉందని తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. రామ్ చరణ్ నటించిన ఈ జాకెట్ ధరతో ఒక ఫ్యామిలీ ఏడాది పాటు ఎంతో సంతోషంగా గడప వచ్చని కామెంట్లు చేస్తున్నారు.

Anchor Suma: కెరీర్ విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్న సుమ..ఇక ఆ రంగానికి గుడ్ బై!

Anchor Suma: బుల్లితెరపై మకుటంలేని మహారాణిగా, స్టార్ మహిళ కొన్ని దశాబ్దాల నుంచి యాంకర్ గా పనిచేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మళయాళీ అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిలా తెలుగు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఎంతోమంది అభిమానులను సందడి చేస్తోంది.

Anchor Suma: కెరీర్ విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్న సుమ..ఇక ఆ రంగానికి గుడ్ బై!

ఇలా బుల్లితెరపై ప్రతి ఒక్క ఛానల్ లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా పెద్ద ఎత్తున సినిమా ఈవెంట్లకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సుమ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే బుల్లితెరపై ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు.

Anchor Suma: కెరీర్ విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్న సుమ..ఇక ఆ రంగానికి గుడ్ బై!

ఈ క్రమంలోనే జయమ్మ పంచాయతీ సినిమా ద్వారా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన సుమకు చేదు అనుభవం ఎదురైంది. ఈ సినిమా కోసం సుమ ఎంతో కష్టపడి నటించడమే కాకుండా పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించి సినిమాపై భారీ అంచనాలను పెంచుకుంది.ఈ విధంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న జయమ్మ పంచాయతీ సినిమా సుమకు నిరాశను కలిగించింది.

సినీరంగానికి గుడ్ బై చెప్పిన సుమ…

ఈ విధంగా ఈ సినిమా ప్రేక్షకులను సందడి చేయలేకపోవడంతో సుమ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు.ఇక తనకు వెండితెర పెద్దగా అచ్చు రాలేదని అందుకే ఇకపై తాను సినిమాల్లో నటించకూడదని షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తనకు ఎంతో కలిసి వచ్చిన బుల్లితెర పైనే ప్రేక్షకులను సందడి చేయాలని ఈమె నిర్ణయించుకున్నారట.జయమ్మ పంచాయతీ సినిమా ద్వారా కొంతమంది దర్శకనిర్మాతలు తనని కలిసి కథలు వివరిస్తున్న ఎంతో సున్నితంగా తిరస్కరిస్తోంది.

Ennenno Janmala Bandham Child Artist: ఎన్నెన్నో జన్మల బంధం చైల్డ్ ఆర్టిస్ట్ ఖుషి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Ennenno Janmala Bandham Child Artist: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క సీరియల్ సినిమా ద్వారా ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విధంగా మొదటి సినిమా లేదా సీరియల్ తోనే ఎంతోమంది విపరీతమైన గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ విధంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ఖుషి ఒకరు.

Ennenno Janmala Bandham Child Artist: ఎన్నెన్నో జన్మల బంధం చైల్డ్ ఆర్టిస్ట్ ఖుషి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

ఈ సీరియల్ లో ఖుషి పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తూ మొదటి సీరియల్ తోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఖుషి పాత్రలో నటిస్తున్నటువంటి ఈ చిన్నారి అసలు పేరు నైనిక. తన ముద్దు పేరు మిన్ను సంగారెడ్డికి చెందిన ఖుషి ఊహా తెలిసినప్పటి నుంచి నటనపై ఎంతో ఆసక్తి పెంచుకుంది. ఈ క్రమంలోనే డబ్ స్మాష్ వీడియోస్, టిక్ టాక్ వీడియోల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Ennenno Janmala Bandham Child Artist: ఎన్నెన్నో జన్మల బంధం చైల్డ్ ఆర్టిస్ట్ ఖుషి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

టిక్ టాక్ వీడియోలతో గుర్తింపు…

ఇలాంటి టిక్ టాక్ వీడియోలు ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నైనిక అనంతరం ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో నటించే అవకాశాన్ని అందుకుంది. ఈ సీరియల్ లోఖుషి తన అమాయకపు నటనతో ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది.ఇలా మొదటి సీరియల్ తోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఖుషి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం నైనిక క్యూట్ ఫొటోస్ పై మీరు ఓ లుక్కేయండి.

Actress Suchitra: కన్న కూతురే నన్ను డేటింగ్ చేయమని బలవంతం పెట్టింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి సుచిత్రా కృష్ణమూర్తి..

Actress Suchitra: నటి సుచిత్రా కృష్ణమూర్తి 1991లో వచ్చిన మలయాళ చిత్రం ‘కిలుక్కింపెట్టి’తో జయరామ్‌ సరసన నటించి వెండితెర అరంగేట్రం చేశారు. ఆ తర్వాత తమిళ శివరంజని సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన ఈమె షారుక్ ఖాన్ కభీ హా కభీ నా, జజ్‌బాత్‌ ఆగ్‌, రోమియో అక్బర్ వాల్టర్‌ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.

Actress Suchitra: కన్న కూతురి నన్ను డేటింగ్ చేయమని బలవంతం పెట్టింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి సుచిత్రా కృష్ణమూర్తి?

ఈమె కేవలం నటిగా మాత్రమే కాకుండా గాయనిగా కూడా పేరు సంపాదించుకున్నారు. తాజాగా కార్తీక్ ఆర్యన్ కియారా అద్వానీ జంటగా నటించిన ‘భూల్‌ భులయా 2’, అదేవిధంగా ‘గిల్టీ మైండ్స్‌’ వెబ్‌ సిరీస్‌లో నటించింది.తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న సుచిత్ర తన గురించి తన కూతురు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

Actress Suchitra: కన్న కూతురి నన్ను డేటింగ్ చేయమని బలవంతం పెట్టింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి సుచిత్రా కృష్ణమూర్తి?

నటి సుచిత్ర దర్శకుడు శేఖర్‌ కపూర్‌ను వివాహం చేసుకున్న ఎనిమిదేళ్లకు తన భర్తకు విడాకులిచ్చి విడిపోయారు. వీరిద్దరికీ కావేరి కపూర్ అనే కూతురు కూడా ఉన్నారు. ఇలా తన కూతురుతో కలిసి ఒంటరిగా గడుపుతున్న నటి సుచిత్రను ఇతరులతో డేటింగ్ చేయమని తన కూతురు తనని బలవంతం చేసిందని ఈ సందర్భంగా ఈమె షాకింగ్ న్యూస్ చెప్పారు. కన్న కూతురే డేటింగ్లో పాల్గొనమని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఎన్నో అసభ్యకరమైన మెసేజ్ లు వచ్చేవి…

తనకు తెలియకుండా తన కూతురు డేటింగ్ యాప్ లో తన డీటెయిల్స్ నమోదు చేసి డేటింగ్ చేయమని బలవంతం చేస్తుంది. అయితే తన భర్త నుంచి విడిపోయిన తర్వాత ఆమె మరొక వ్యక్తితో రిలేషన్ లో ఉండగా అతను కూడా తనని మోసం చేశాడని, ఇప్పుడు తాను ఉన్నది ఇతరులతో డేటింగ్ చేయడం కోసం కాదు అని తన కూతురుకు అర్థమయ్యేలా వివరించానని తెలిపారు. ఈ క్రమంలోనే డేటింగ్ యాప్ లో తన వివరాలు నమోదు చేయడం వల్ల తనకు ఎన్నో అసభ్యకరమైన మెసేజ్ లు వచ్చేవి దీంతో తన కూతురే స్వయంగా తన డీటెయిల్స్ అన్ని తొలగించిందని ఈ సందర్భంగా సుచిత్ర కృష్ణమూర్తి వెల్లడించారు.

Pranitha Subhash: సాయి పల్లవికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి ప్రణీత..!

Pranitha Subhash:నటి సాయి పల్లవి విరాటపర్వం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాశ్మీర్ పండిట్ల హత్యలను, ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని కొట్టి చంపి జైశ్రీరామ్ అంటూ చెప్పడం రెండు ఒకటేనని, అప్పటికీ ఇప్పటికీ పెద్ద మార్పు లేదు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

Pranitha Subhash: ఇండైరెక్ట్ గా నటి సాయి పల్లవికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి ప్రణీత.. సానుభూతి చూపించు అంటూ కామెంట్స్!

ఈ క్రమంలోనే ఈ విషయంపై ఎంతోమంది స్పందిస్తూ సాయిపల్లవి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఆమె పై కేసు నమోదు చేయడమే కాకుండా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా పలువురు నటి సాయి పల్లవి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Pranitha Subhash: ఇండైరెక్ట్ గా నటి సాయి పల్లవికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి ప్రణీత.. సానుభూతి చూపించు అంటూ కామెంట్స్!

ఇదిలా ఉండగా గురువారం నటి ప్రణీత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇండైరెక్టుగా సాయిపల్లవి పై తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సాయి పల్లవి పేరు ఎక్కడ ఉపయోగించకపోయినప్పటికీ ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..కాశ్మీరీ ఇస్లామిస్ట్ మిలిటెన్సీని చిన్న సమస్యగా భావిస్తున్నట్లయితే.. కాశ్మీరీ పండిట్ల దుస్థితిని ఒక సాధారణ సమస్యగా భావించినట్లయితే మరోసారి ఈ సినిమా చూడండి. సినిమా చూసి బాధితుల ఆర్థనాథాలను విను, సాను భూతి చూపించు అని పేర్కొన్నారు.

ఏం మాట్లాడినా వివాదమే అవుతుంది…

ఈ పోస్టులో ప్రణీత ఎక్కడ సాయి పల్లవి పేరు ఉపయోగించకపోయిన పరోక్షంగా సాయిపల్లవి ఉద్దేశిస్తూ ఈ పోస్ట్ చేశారని పలువురు భావిస్తున్నారు ఈ క్రమంలోనే కొందరు సాయిపల్లవి పేరు కూడా ప్రస్తావించి ఉంటే ఇంకా బాగుండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున ఆమెపై నెగిటివిటీ తీసుకువచ్చాయి.అయితే ఈ విషయం గురించి తాను ఇప్పుడు ఏం మాట్లాడినా అది కేవలం సినిమా ప్రమోషన్ కోసమే అవుతుందని అయితే తప్పకుండా ఈ విషయంపై వివరణ ఇస్తానని సాయిపల్లవి తెలియజేశారు.

Shakeela: సొంత వాళ్లను నమ్మి రెండు కోట్ల రూపాయలు నష్టపోయిన షకీలా.. చివరికి ఏం చేసిందంటే?

Shakeela: తెలుగు సినిమా ఇండస్ట్రీలో శృంగార తారగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న షకీలా అందరికీ సుపరిచితమే.ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె సినిమాలతో డబ్బు బాగా సంపాదించినప్పటికీ ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయింది. ప్రస్తుతం ఈమెకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆర్థికంగా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

Shakeela: సొంత వాళ్లను నమ్మి రెండు కోట్ల రూపాయలు నష్టపోయిన షకీలా.. చివరికి ఏం చేసిందంటే?

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా తన సినిమాలలో సంపాదించిన డబ్బును మొత్తం అయిన వాళ్లను నమ్మి దారుణంగా మోసపోయినట్లు వెల్లడించారు. తన సినిమాలలో సంపాదించిన డబ్బులు సుమారు రెండు కోట్ల వరకు తన అక్కను నమ్మి అక్క చేతిలో పెట్టాను. అయితే తన అక్కే తనని దారుణంగా మోసం చేసిందని ఈ సందర్భంగా షకీలా వెల్లడించారు.

Shakeela: సొంత వాళ్లను నమ్మి రెండు కోట్ల రూపాయలు నష్టపోయిన షకీలా.. చివరికి ఏం చేసిందంటే?

ఒకానొక సమయంలో వెళ్లి తన అక్కని డబ్బులు అడిగితే తాను వేరే వ్యక్తిని నమ్మి మోసపోయానని సమాధానం చెప్పింది.ఈ విధంగా అక్క తనకు మోసం చేసిన తాను అక్కతో మాట్లాడే దాన్ని కానీ అక్క తనతో మాట్లాడలేదని షకీలా తెలిపారు. తనతో మాట్లాడకూడదని అక్కకు తన కుటుంబ సభ్యులు చెప్పడంతో తనతో మాట్లాడలేదని షకీలా తెలిపారు.ఈ విధంగా తన సొంత అక్కని నమ్మి తాను రెండు కోట్ల రూపాయలు నష్టపోయానని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.

అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరం..

బయట వ్యక్తులు ఎవరైనా మనల్ని మోసం చేస్తే మనం వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి న్యాయం కోసం పోరాటం చేయవచ్చు. కానీ సొంత వాళ్లే మోసం చేస్తే పోలీసులకు కంప్లైంట్ ఎలా ఇస్తామని ఈ సందర్భంగా షకీలా పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా పెద్దఎత్తున డబ్బును నష్టపోయినట్లు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన షకీల ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యారు.