Sai Pallavi: సాయిపల్లవి పై ఆగ్రహం వ్యక్తం చేసిన విరాటపర్వం నిర్మాతలు... కారణం అదేనా?
Sai Pallavi: సాయి పల్లవి, రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం.ఈ సినిమా జూన్ 17వ తేదీ ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మొదటిరోజు మొదటి షోతోనే ఎంతో మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం పెద్దగా రాబట్టలేకపోయింది. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో వేణు ఊడుగుల దర్శకత్వంలో
సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఇక ఈ సినిమాలో ఎంతోమంది నటీనటులు ఉన్నప్పటికీ సాయి పల్లవి మాత్రం ఎంతో హైలెట్ అయ్యింది. ప్రమోషన్ కార్యక్రమాలను కూడా సాయి పల్లవిని హైలెట్ చేస్తూ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇక ఈ సినిమాలో అనుకున్న విధంగానే సాయిపల్లవి పాత్ర కీలకంగా ఉండి సినిమాని ముందుకు నడిపించింది.అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టకపోవడంతో నిర్మాతలు సాయి పల్లవి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కలెక్షన్లు రాకపోవడానికి సాయిపల్లవి కారణమని భావిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సాయిపల్లవి కాశ్మీర్ పండిట్లు హత్య గోవధ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపాయి. ఈ క్రమంలోనే చాలామంది సాయిపల్లవి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలని నిరసనలు చేపట్టారు. కొన్ని చోట్ల సాయిపల్లవి పై కేసులు కూడా పెట్టారు.
ఈ విధంగా సాయి పల్లవి మతాలను ఉద్దేశిస్తూ మాట్లాడటం వల్ల సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమా చూడము అంటూ మరికొందరు పెద్దఎత్తున సాయి పల్లవి వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు.దీంతో సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు సినిమాపై తీవ్ర ప్రభావం చూపాయని అందుకే సినిమా కలెక్షన్లను రాబట్టలేకపోయింది అంటూ నిర్మాతలు సాయి పల్లవి పై ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకున్నప్పటికి కలెక్షన్ల పరంగా నిరాశ కలిగించిందని చెప్పాలి.
తమిళనాడు రాజకీయాల్లో సినీ కుటుంబాలకు సంబంధించిన సంఘటనలు తరచూ చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటుడు సత్యరాజ్ కుటుంబంలో…
మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…
నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…
వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…