Tag Archives: upasana konidela

Upasana: చిరంజీవి నివాసంలో ఉపాసన సీమంతం వేడుక.. ఫోటోలు వైరల్..?

Upasana: మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం గర్భంతో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. పెళ్లి జరిగిన పది సంవత్సరాలకు రాంచరణ్ ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో అటు కుటుంబ సభ్యులు, ఇటు మెగా అభిమానులు కూడా మెగా వారసుడి కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా హైదరాబాద్లోని చిరంజీవి నివాసంలో ఉపాసన సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి.

ప్రస్తుతం ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సీమంతం వేడుకకు మెగా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.ఈ సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలను ఉపాసన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. అలాగే కొన్ని రోజుల క్రితం ఉపాసన రామ్ చరణ్ కలిసి దుబాయ్ వెకేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉపాసన స్నేహితులు ఆమెకు సీమంతం వేడుక నిర్వహించారు.

ఉపాసన గర్భంతో ఉన్నప్పటికీ కడుపులో పెరుగుతున్న బిడ్డతో పాటు భర్తతో కలిసి దేశ విదేశాలు తిరుగుతూ వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది..గతంలో ఆస్కార్ అవార్డుల కోసం రామ్ చరణ్ అమెరికా వెళ్లగా ఉపాసన కూడా రామ్ చరణ్ తో పాటు అమెరికా వెళ్ళింది. ఇక ఇటీవల రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ కలిసి దుబాయిలో వెకేషన్ ఎంజాయ్ చేశారు.

Upasana: అత్తయ్య సురేఖతో ఉపాసన…

ఆ తర్వాత అటు నుంచి అటే మాల్దీస్ కి వెళ్లారు. రామ్ చరణ్,ఉపాసనా ఇద్దరు కూడా తమ మొదటి బిడ్డ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇంతకాలం పిల్లల గురించి ఉపాసన ఎన్నో విమర్శలు ఎదురుకుంది. ఇక ఇప్పుడు మాతృత్వంలో మాధుర్యాన్ని అనుభవిస్తోంది. తాజాగా ఈమె షేర్ చేసిన బేబీ షవర్ ఫోటోలలో తన అత్తయ్య సురేఖతోపాటు అల్లు అర్జున్ అన్నయ్య బాబి భార్య అల్లు నీలుషా ఉన్నారు ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.

Upasana: ఉపాసన జాతకంలో అలాంటి దోషాలు ఉన్నాయా… వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్?

Upasana: ఉపాసన ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈమె పేరు కూడా ఒకటి. ఇందుకు గల కారణం మరి కొద్ది రోజులలో తల్లి కాబోతుండడమే కారణమని చెప్పాలి. ఉపాసన రాంచరణ్ దాదాపు పది సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇలా వివాహమైనప్పటినుంచి రాంచరణ్ ఉపాసన దంపతులు ఎంతో ప్రేమగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

ఇకపోతే ఉపాసన రాంచరణ్ దంపతులు పెళ్లయిన పది సంవత్సరాల వరకు పిల్లల గురించి ఆలోచించకపోవడంతో ఈ ప్రశ్నలు పదేపదే ఉపాసనను చాలా ఇబ్బంది పెట్టాయని చెప్పాలి.పిల్లల విషయంలో వీరిద్దరిని చాలామంది వివిధ రకాలుగా ట్రోల్ చేశారు. అయితే ఈ విషయం గురించి తాజాగా ఉపాసన మాట్లాడుతూ నేను ఈ విధమైనటువంటి ట్రోల్స్ కి ఏ మాత్రం బాధపడలేదని చెప్పారు.

ఇక ప్రస్తుతం ఈమె ప్రెగ్నెంట్ కావడంతో మరి కొద్ది రోజులలో బుల్లి వారసుడు లేదా వారసురాలు రాబోతున్నారని కుటుంబ సభ్యులు అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఉపాసన రాంచరణ్ ప్రస్తుతం హాలిడే వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఉపాసన జాతకం గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Upasana:ఉపాసనకు విమర్శలు తప్పవా…

ఉపాసన జాతకంలో పలు దోషాలు ఉన్నాయి అంటూ పెద్ద ఎత్తున ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఉపాసన కుమారుడికి కనక జన్మనిస్తే ఆయన మెగా కుటుంబానికి మరింత పేరు ప్రతిష్టలు తెచ్చేవారు అవుతారని అదే అమ్మాయి కనుక పుడితే ఉపాసన క్రేజ్, ఫెమ్ పూర్తిగా విమర్శలు పాలయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈ వార్తలపై మెగా అభిమానులు కొందరు ఆందోళన చెందుతున్న మరి కొందరు మాత్రం ఇవన్నీ వట్టి అవాస్తవాలేనని కొట్టిపారేస్తున్నారు.

Upasana: గర్భంతో ఉన్న ఉపాసనకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ పంపిన అలియా… ఏం పంపించారో తెలుసా?

Upasana: మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. ఇలా ఈమె పెళ్లి జరిగిన పది సంవత్సరాల తర్వాత తల్లి కాబోతున్నారన్న వార్త అందరిని ఎంతో సంతోషానికి గురిచేసింది. ఇకపోతే
మరి కొద్ది రోజులలో ఉపాసన బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇక మెగా వారసుడి కోసం అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో బాలీవుడ్ నటి అలియా భట్ తనకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ పంపిస్తూ తనని సర్ప్రైజ్ చేశారు.ఈ క్రమంలోనే ఆలియా పంపించిన గిఫ్ట్ కు సంబంధించిన ఫోటోలను ఉపాసన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేస్తూ అలియాకు కృతజ్ఞతలు తెలిపారు. మరి ఆలియా ఉపాసనకు ఎలాంటి గిఫ్ట్ పంపించిందనే విషయానికి వస్తే…

అలియా భట్ ప్రస్తుతం ఈద్ ఏ మమ్మా అనే క్లోతింగ్ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో ప్రెగ్నెన్సీ సమయంలో తనకు కంఫర్ట్ గా ఉండే దుస్తులను కానుకగా పంపించారు. అదేవిధంగా పుట్టబోయే పిల్లలకు అవసరమయ్యే దుస్తులను కూడా కానుకగా పంపించారు.


Upasana: డ్రెస్సులను గిఫ్ట్ గా పంపిన అలియా…


ఇలా ప్రెగ్నెన్సీతో ఉన్న తనకు అవసరమయ్యే దుస్తులను పంపించడంతో ఉపాసన ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ తనకు కృతజ్ఞతలు తెలిపారు.అయితే అలియా భట్ ఇదివరకే ఎన్టీఆర్ పిల్లలకు కూడా ఇలా బట్టలను గిఫ్ట్ గా పంపిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈమె ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన RRR సినిమాలో సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.

Upasana Konidela: తల్లి కాబోతున్న ఉపాసన…? వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫోటోలు.. ఆనందంలో మెగా ఫాన్స్!

Upasana Konidela: మెగా కోడలు ఉపాసన గురించి పరిచయం అవసరం లేదు. అపోలో హాస్పటల్ చైర్ పర్సన్ గా, మెగా కోడలిగా వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలోను ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నెటిజెన్లకు ఎన్నో సలహాలు సూచనలు చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఇలా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఉపాసన మెగా కోడలుగా అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఈమెకు తరచూ పిల్లలు లేరనే ప్రశ్న ఎదురవుతూనే ఉంది. ఇలా ఉపాసన పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న సమయంలో కూడా తనకు పిల్లల గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఈమె ఈ విషయంపై సీరియస్ అవ్వడమే కాకుండా అది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని సమయం వచ్చినప్పుడే సమాధానం చెబుతా అంటూ ఆ ప్రశ్నను దాటవేశారు.

ఇకపోతే ఉపాసన తాజాగా వినాయక చవితి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.తన డ్రైవర్ తనని వినాయక చవితి నిమర్జనం కార్యక్రమ నిమిత్తం తన ఇంటికి ఆహ్వానించడంతో ఉపాసన ఈ నిమజ్జన కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు.అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఫోటోలలో స్పష్టంగా ఉపాసన బేబీ బంప్ తో ఉన్నట్టు క్లారిటీగా తెలుస్తోంది.అదేవిధంగా రామ్ చరణ్ తోను అలాగే తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలలో కూడా ఉపాసన బేబీ బంప్ తో కనిపించడంతో ఈమె ప్రెగ్నెంట్ అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Upasana Konidela: మెగా వారసుడొస్తున్నాడు…

ఈ విధంగా ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలియడమే కాకుండా అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మెగా వారసుడు రాబోతున్నారంటూ మెగా ఫాన్స్ ఎంతో ఖుషి అవుతున్నారు. ఇక ఈ విధంగా ఉపాసన బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన తెలియజేయబోతున్నారని తెలుస్తుంది. మరి ఈ శుభవార్తను అధికారికంగా మెగా ఫ్యామిలీ ఎప్పుడు తెలియచేస్తారోనని మెగా ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Upasana Konidela: గోల్డెన్ టెంపుల్ లంగర్ సేవలో పాల్గొన్న మెగాకోడలు… చరణ్ కోసమే ప్రత్యేక పూజలు!

Upasana Konidela:రామ్ చరణ్ భార్యగా, మెగా కోడలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉపాసన అందరికీ సుపరిచితమే.ఈమె సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలను షేర్ చేయడమే కాకుండా అపోలో హాస్పిటల్ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఉపాసన తాజాగా సోషల్ మీడియా వేదికగా మరొక వీడియోని షేర్ చేశారు.

Upasana Konidela: గోల్డెన్ టెంపుల్ లంగర్ సేవలో పాల్గొన్న మెగాకోడలు… చరణ్ కోసమే ప్రత్యేక పూజలు!

ఈ వీడియోలో ఉపాసన పంజాబ్ లోని అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ ని సందర్శించినట్టు తెలుస్తోంది. గోల్డెన్ టెంపుల్ లో ఉపాసన ప్రత్యేకంగా లంగర్ సేవలో పాల్గొన్నట్లు తెలియజేశారు. ఇక ఈ వీడియోని ఉపాసన పోస్ట్ చేస్తూ కృతజ్ఞతాభావంతో Mr.C అమృత్ సర్ లో లంగర్ సేవలను నిర్వహించారు.

Upasana Konidela: గోల్డెన్ టెంపుల్ లంగర్ సేవలో పాల్గొన్న మెగాకోడలు… చరణ్ కోసమే ప్రత్యేక పూజలు!

అయితే ప్రస్తుతం రామ్ చరణ్ తన RC 15 సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఈ సేవలో పాల్గొన్న లేకపోయారు. ఆయన తరపున ఈ సేవలో పాల్గొనే అధికారం, హక్కు నాకు కల్పించినందుకు, రామ్ చరణ్ ప్రేమతో నన్ను ఆశీర్వదించబడటం ఎంతో వినయంగా అంగీకరిస్తున్నాను అంటూ ఉపాసన ఈ వీడియో ద్వారా వెల్లడించారు.

లంగర్ సేవలో ఉపాసన…

ఈ విధంగా రామ్ చరణ్ పాల్గొనవలసిన పూజలో ఉపాసన పాల్గొని పూజ నిర్విఘ్నంగా పూర్తి చేశారు. పూజ అనంతరం గురుద్వారా కమిటీ ఉపాసనకు గోల్డెన్ టెంపుల్ చిత్రపటాన్ని అందించారు. ఆర్ఆర్ఆర్ విజయవంతం కావడంతో రామ్ చరణ్ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు RRR చిత్ర బృందంతో కలిసి ఉపాసన కూడా గోల్డెన్ టెంపుల్ ను సందర్శించిన విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా అమృత్ సర్ లో జరుగుతోంది.

Upasana: పెళ్ళిలు స్వర్గంలో కాదు.. భూమిపై నిర్ణయించబడతాయి..ఉపాసన కొణిదెల!

Upasana: ప్రేమించడం.. ప్రేమలో పడటం అనేది ఎవరికైనా సులభంగానే ఉంటుంది. అయితే ఆ ప్రేమలో చాలా కాలం ఉండటం అనేది కొంతమందికే సాధ్యం అవుతుంది. పార్క్ లో సాయంత్రం వేల అలా.. సరదాగా కాలక్షేపం చేసినంత సులభంగా మాత్రం ప్రేమలో ఉండటం కుదరదు అని.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన అన్నారు.

Upasana: పెళ్ళిలు స్వర్గంలో కాదు.. భూమిపై నిర్ణయించబడతాయి..ఉపాసన కొణిదెల!

ప్రేమికులు దినోత్సవం సందర్భంగా ఆమె నెటిజన్లతో ముచ్చటించారు. ప్రస్తుతం ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఆమెకు వివాహం అయి దాదాపు 10 సంవత్సరాలు పూర్తయిందని.. మా ఇద్దరి మధ్య ప్రేమ ఇంత అన్యోనంగా ఉండటానికి గల కారణం ఏంటో చెప్పారు. ఆ రహస్యాన్ని నెటిజన్లతో పంచుకున్నారు.

Upasana: పెళ్ళిలు స్వర్గంలో కాదు.. భూమిపై నిర్ణయించబడతాయి..ఉపాసన కొణిదెల!

నీ అది ఎప్పటికీ నిజం కాదు అని..

అంతే కాదు జీవిత భాగస్వామితో ఎక్కువ కాలం సుఖంగా ఉండాలంటే ఏం చేయాలనే విషయాన్ని కూడా చెప్పారు. ప్రేమికుల దినోత్సవం తనకు ప్రత్యేకమైనది అని చెబుతూ.. బంధం బలంగా ఉండేందుకు కొన్ని టిప్స్ చెప్పారు. అవి ఏంటంటే.. ఆరోగ్యంగా ఉంటే ఏ పని అయినా చేయగలం. కాబట్టి ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ వహించాలని చెప్పారు. దానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రతీ రోజు వ్యాయామం చేయడం కూడా ముఖ్యమంటూ చెప్పుుకొచ్చారు. తమ భాగస్వామితో కొత సమయాన్ని అయినా స్పెండ్ చేయాలని.. దీనిని అలవాటు చేసుకోవాలని చెప్పారు. ఖాళీ సమయం దొరికితే.. డిన్నర్ డేట్, సినిమాలు చూడటం లాంటి పనులు పెట్టుకోవాలని అన్నారు. ఇక ప్రతీ ఒక్కరి పెళ్లి స్వర్గంలో నిర్ణయిస్తారు(Marriages Are Made In Heaven) అని అంటుంటారు. కానీ అది ఎప్పటికీ నిజం కాదు అని.. ఇద్దరు వ్యక్తులు మనసు పడి..భూమిపైనే శ్రమిస్తే.. ఆ వివాహం అవుతుందని.. శ్రమ ఒక్కటే వివాహానికి పునాది అంటూ చెప్పారు. ఇక అంతే కాకుండా ఎదుటి వ్యక్తిపై ఎక్కువగా ప్రేమ, గౌరవం చూపించాలని.. అప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉంటుందన్నారు.

Upasana: గోపురం ఫోటోని షేర్ చేస్తూ వివాదంలో చిక్కుకున్న మెగా కోడలు… ఫైర్ అవుతున్న నెటిజన్స్!

Upasana: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె మెగా కోడలిగా మాత్రమే కాకుండా అపోలో ఆసుపత్రి చైర్ పర్సన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ సామాజిక అంశాలపై స్పందిస్తూ సలహాలు ఇస్తూ ఉంటారు.

గోపురం ఫోటోని షేర్ చేస్తూ వివాదంలో చిక్కుకున్న మెగా కోడలు… ఫైర్ అవుతున్న నెటిజన్స్!

ఇలా సోషల్ మీడియాలో మంచి కోసం ఉపయోగించే ఉపాసన తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక గోపురం ఉన్న ఫోటోని షేర్ చేస్తూ నెటిజన్ల ఆగ్రహానికి బలైందని చెప్పవచ్చు.ఈ క్రమంలోని ఈమె షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది.

గోపురం ఫోటోని షేర్ చేస్తూ వివాదంలో చిక్కుకున్న మెగా కోడలు… ఫైర్ అవుతున్న నెటిజన్స్!

జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపాసన దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గోపురం ఉన్న ఫోటో షేర్ చేశారు. అయితే ఈ గోపురంలో దేవుళ్ళతో పాటు కొందరు మనుషుల బొమ్మలు కూడా ఉన్నాయి.అయితే ఆ ఫోటోలలో తనతోపాటు రామ్ చరణ్ కూడా ఉన్నారు ఎక్కడున్నారో కనిపెట్టండి అంటూ ఈ ఫోటోని షేర్ చేశారు.

హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి…

ఇలా ఈ ఫోటో షేర్ చేసిన కొద్ది సమయానికి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ ఫోటో పై స్పందిస్తూ తమదైన శైలిలో మెగా కోడలు ఉపాసన పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఫోటో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తూ మీ పై ఉన్న గౌరవాన్ని తగ్గించుకోకండి అంటూ నెటిజన్లు ఈమె పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సమంతది నిజమైన ప్రేమ.. షాకింగ్ కామెంట్స్ చేసిన మెగా కోడలు!

టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్యకాలంలో విడాకుల వ్యవహారంతో ఈమె సోషల్ మీడియాలో ఎక్కువగా నిలిచింది. ఈ విడాకుల వ్యవహారంలో నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోలింగ్స్ కూడా చేశారు. ఇదిలా ఉంటే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన, సమంతల స్నేహం గురించి అందరికి తెలిసిందే. సమంతకు ఎంతో మందికి తెలిసిన వారు ఉన్నప్పటికీ సన్నిహితుల కొంతమంది మాత్రమే ఉన్నారు.

అలాంటి వారిలో ఉపాసన కూడా ఒకరు. వీరిద్దరూ ఫిట్నెస్, ఆరోగ్యం,మహిళా శక్తి వంటి ఎన్నో విషయాలలో కలిసి పనిచేశారు. వీరిద్దరి పక్కన పెట్టి చూస్తే ఆలోచనలు కూడా ఒకే విధంగా కనిపిస్తాయి. ఈ క్రమంలోనే ఉపాసన, సమంతకు మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే గతంలో ఉపాసన సొంత వెబ్ సైట్ అయిన యువర్ లైఫ్ కో ఇన్ కు సమంత గెస్ట్ ఎడిటర్ గా కూడా వ్యవహరించింది.

ఇటీవలె ఉపాసన ఒక ఇంటర్వ్యూ సమంత గురించి పలు ఆసక్తికర వాఖ్యలు చేసింది. తాను తెలంగాణలో పుట్టిన అమ్మాయినని. దసరా లాంటి పండుగల సమయంలో మాంసం తినడం తనకు కూడా చాలా ఇష్టం అని ఆమె తెలిపింది.సమంత ఆర్టికల్ ఎడిట్ చేసిన తర్వాత మాంసం చాలావరకు తగ్గించినట్లు తెలిపారు.

సమంతలో సహాయం చేసే గుణం ఉందని తెలిపింది.అంతేకాకుండా సమంత తనకు ఎన్నో విషయాలలో అండగా నిలిచిందని ఉపాసన చెప్పుకొచ్చింది. సమంత అది నిజమైన ప్రేమ అని ఉపాసన తెలిపింది. ఉపాసన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమంత విషయానికి వస్తే విడాకుల తర్వాత ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఆమె తన స్నేహితులతో కలిసి విహారయాత్రలలో పాల్గొంటోంది. తన సినిమాల విషయంఫై కూడా బాగా శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది.

పిల్లల విషయంలో మెగా ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన ఉపాసన.. అసలేం జరగదంటే?

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి కోడలు, యంగ్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఈమె మెగా ఇంటి కోడలిగా కంటే తన సొంత గుర్తింపుతో తెలుగు ప్రజలకు పరిచయమైంది. ఈమె అపోలో వైస్ చైర్మన్ బాధ్యతలు చేపడుతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ప్రజలకు హెల్త్ టిప్స్ గురించి బాగా వివరిస్తుంది. అంతేకాకుండా కోవిడ్ సమయంలో కూడా తన వంతు సహాయంతో ముందుకు వచ్చింది.

ఇక రామ్ చరణ్, ఉపాసన ఓ మీటింగ్ లో తొలిసారిగా పరిచయం పెంచుకోగా.. అలా వారి మధ్య ప్రేమ మొదలయిందని.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి 2012లో పెళ్లి చేసుకున్నారని గతంలో తెలిపారు. ఇక ఈ ఏడాదికి తమ పెళ్ళి జరిగి 9 ఏళ్లు అవగా ఇప్పటికీ తమకు పిల్లలు పుట్టే లేరన్న సంగతి అందరికీ తెలిసిందే. పైగా తమకు పిల్లల గురించి అభిమానుల నుండి మీడియా నుండి కూడా తెగ ప్రశ్నలు ఎదురవగా వాటి గురించి ఎన్నోసార్లు స్పందించారు. అయినా కూడా ఇలాంటి ప్రశ్నలు ఎదురవడంతో ఉపాసన సోషల్ మీడియాలో కామెంట్ బాక్స్ ని కూడా బ్లాక్ చేసింది.

ఇక గతంలో తమ పిల్లల గురించి ఉపాసన స్పందించిన విషయం ప్రస్తుతం మళ్లీ నెట్టింట్లో వైరల్ గా మారింది. పిల్లల విషయంలో పూర్తిగా మా వ్యక్తిగత విషయం ఉంటుందని, మాకు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మాకు పిల్లలు కలుగుతారని ఘాటుగా స్పందించింది. అంతేకాకుండా మాకేమైనా వయసు అయిపోయిందా అంటూ మండిపడింది. అయినా మా వ్యక్తిగత విషయాల గురించి మీరు మధ్యలోకి రావద్దని.. మా కెరీర్ లో మాకు కొన్ని గోల్స్ ఉన్నాయని.. అవన్నీ తీరిన తర్వాత పిల్లల గురించి ఆలోచిస్తామని తెలిపింది.

అంతేకాకుండా తమ ఇంట్లో కూడా తమ కుటుంబ సభ్యులు తమ నిర్ణయం మీదనే ఉన్నారని.. దయచేసి మా వ్యక్తిగత జీవితంలోకి రాకుండా ఉండటం మంచిదని స్పందించింది ఉపాసన. ఇక మెగా అభిమానులు మాత్రం రామ్ చరణ్ వారసుడిని చూడాలని ఎంతో తాపత్రయ పడుతున్నారు. కానీ ఇప్పటంతలా అభిమానుల కోరిక తీరేలా లేదని తెలుస్తుంది.