గోపురం ఫోటోని షేర్ చేస్తూ వివాదంలో చిక్కుకున్న మెగా కోడలు… ఫైర్ అవుతున్న నెటిజన్స్!
Upasana: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె మెగా కోడలిగా మాత్రమే కాకుండా అపోలో ఆసుపత్రి చైర్ పర్సన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ సామాజిక అంశాలపై స్పందిస్తూ సలహాలు ఇస్తూ ఉంటారు.
ఇలా సోషల్ మీడియాలో మంచి కోసం ఉపయోగించే ఉపాసన తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక గోపురం ఉన్న ఫోటోని షేర్ చేస్తూ నెటిజన్ల ఆగ్రహానికి బలైందని చెప్పవచ్చు.ఈ క్రమంలోని ఈమె షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది.
జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపాసన దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గోపురం ఉన్న ఫోటో షేర్ చేశారు. అయితే ఈ గోపురంలో దేవుళ్ళతో పాటు కొందరు మనుషుల బొమ్మలు కూడా ఉన్నాయి.అయితే ఆ ఫోటోలలో తనతోపాటు రామ్ చరణ్ కూడా ఉన్నారు ఎక్కడున్నారో కనిపెట్టండి అంటూ ఈ ఫోటోని షేర్ చేశారు.
ఇలా ఈ ఫోటో షేర్ చేసిన కొద్ది సమయానికి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ ఫోటో పై స్పందిస్తూ తమదైన శైలిలో మెగా కోడలు ఉపాసన పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఫోటో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తూ మీ పై ఉన్న గౌరవాన్ని తగ్గించుకోకండి అంటూ నెటిజన్లు ఈమె పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…