Tag Archives: urvashi rautela

Urvashi Rautela: పవన్ కళ్యాణ్ జగన్ ఇద్దరిలో ఊర్వశి ఓటు ఎవరికో తెలుసా?

Urvashi Rautela: ఊర్వశి రౌతెలా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగిపోతున్నటువంటి పేరు. ముంబై కి చెందినటువంటి ఈమె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇక ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క సినిమాలో కూడా ఈమె స్పెషల్ సాంగ్ ద్వారా అందరిని సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బ్రో ఈ సినిమాలో ఈమె మై డియర్ మార్కండేయ అనే స్పెషల్ సాంగ్ ద్వారా సందడి చేశారు. ఇక ఈ సాంగులో నటించినటువంటి ఈమె ఈ సినిమా విడుదలవుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు.

ఇక ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేయగా పవన్ ఆంటీ ఫ్యాన్స్ మాత్రం ఈమె పాత వీడియోలను షేర్ చేస్తూ ట్రోల్ చేశారు. ఈమె గతంలో కూడా కొంతమంది హీరోలను సీఎం అంటూ సంబోధించడం గమనార్హం.అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

Urvashi Rautela: పవన్ కళ్యాణ్ కే నా ఓటు…


ఈ క్రమంలోనే చాలామంది పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నలు వేశారు ఒకవేళ మీరు కనుక ఓటు వేయాలనుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వేస్తారా లేదా జగన్మోహన్ రెడ్డికి వేస్తారా అంటూ ఈమెకు ఒక ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఓటు వేస్తానని చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా పవన్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Urvashi Rautela: ఏపీ సీఎం పవన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నటి ఊర్వశి రౌతేలా… ఏకిపారేస్తున్న నేటిజన్స్?

Urvashi Rautela: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ హీరోలుగా నటించిన తాజా చిత్రం బ్రో ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఇలా ఈ సినిమా నేడు విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఈ సినిమాలో మై డియర్ మార్కండేయ అనే సినిమాలో ముంబై ముద్దుగుమ్మ ఊర్వసి నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఊర్వశి ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సినిమా నేటి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈమె ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలి అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ పోస్టుల్లో పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి అంటూ ఈమె పోస్ట్ చేయడం సంచలనంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కలిసి బ్రో ది అవతార్ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది రేపే ఈ సినిమా విడుదల కాబోతుంది అందరం మళ్ళీ కలుద్దాం అంటూ ఈమె పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేస్తూ చేసినటువంటి ఈ ట్వీట్ సంచలనగా మారింది. దీంతో నేటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Urvashi Rautela: ఆ మాత్రం జ్ఞానం లేదా..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనే విషయాన్ని ఈమె మర్చిపోయి ఇలాంటి పోస్ట్ చేశారా లేకపోతే పవన్ కళ్యాణ్ ని సీఎం అనుకొని ఇలాంటి పోస్ట్ చేశారా అని కామెంట్లు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అని పవన్ కళ్యాణ్ జనసేన అధినేత మాత్రమేనని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియని పొజిషన్లో ఉన్నారా అంటూ ఈమె పై మండిపడుతున్నారు.

Urvashi Rautela: వామ్మో బ్రో సినిమా స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…మరీ ఈ రేంజ్ లోనా?

Urvashi Rautela: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం బ్రో. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ సినిమా వినోదయం చిత్తం సినిమాకు రీమేక్ చిత్రంగా తెలుగులో తెరకెక్కుతోంది దాదాపు షూటింగ్ పనులు అన్నింటిని పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 28వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. తమిళంలో నటుడు సముద్రఖని నటించిన ఈ సినిమా తెలుగులో ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించబోతున్నారు.

ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులు అన్నింటిని పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.ఇక తమిళంలో స్పెషల్ సాంగ్ లేకపోయినప్పటికీ తెలుగులో స్పెషల్ సాంగ్ ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఈ పాటలో నటించడానికి నటి రకుల్ ప్రీత్ సింగ్ ఎంపిక చేశారు.ఈ పాటలో రకుల్ నటించాల్సి ఉండగా చివరి క్షణంలో రకుల్ హాండ్ ఇవ్వడంతో ఊర్వశీ రౌతెల ఎంట్రీ ఇచ్చారు.

హైదరాబాద్లో ప్రత్యేకంగా ఒక సెట్ ఏర్పాటు చేసి అక్కడ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ పాట కోసం ప్రస్తుతం ఊర్వశి హైదరాబాద్లోనే ఉన్నారు. ఇకపోతే ఈ పాట కోసం ఈమె తీసుకునే రెమ్యూనరేషన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేవలం ఐదు నిమిషాల పాటు కోసం ఊర్వసి భారీగానే డిమాండ్ చేశారని తెలుస్తోంది.

Urvashi Rautela: రెండు కోట్లు డిమాండ్ చేసిన నటి..

ఈ పాటలో డాన్స్ చేయడం కోసం ఊర్వశి రౌతేల ఏకంగా రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారట. ఇలా రెండు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తేనే తాను ఈ పాటలో చేస్తానని డిమాండ్ చేయడంతో నిర్మాతలు కూడా చేసేదేమీ లేక ఈమె అడిగిన మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఏది ఏమైనా ఐదు నిమిషాల పాటు కోసం రెండు కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

Urvashi Rautela: ఊర్వశి ధరించిన నెక్లెస్ ఖరీదు అన్ని వందల కోట్లా…. జోక్ బాగుందంటూ కామెంట్ చేస్తున్న నెటిజన్స్!

Urvashi Rautela: 76వ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్స్ ఎంతో ఘనంగా జరిగాయి. ఈ ఫిలిమ్ ఫెస్టివల్స్ లో బాగంగా ఎంతోమంది సినీ తారలు ఈ వేడుకలో సందడి చేశారు. ఇక ఫిలిం ఫెస్టివల్స్ లో భాగంగా నటి ఊర్వశి రౌటేలా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. గులాబీ రంగు డ్రెస్ ధరించి న ఈమె మెడలో మొసలి నెక్లెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇలా మొసలి నెక్లెస్ తో పాటు ఇయర్ రింగ్స్ కూడా ధరించారు.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ ఫోటోలపై స్పందిస్తూ అలాంటి ఫిలిం ఫెస్టివల్స్ కి కూడా ఫేక్ జ్యువెలరీ వేసుకుని వెళ్లడం అవసరమా అంటూ ఈమె ఫోటోలపై కామెంట్లు చేశారు. ఇలా ఊర్వశి ఫోటోలు పై కామెంట్లు చేయడంతో తన టీమ్ స్పందిస్తూ అసలు విషయం వెల్లడించారు.

ఈ సందర్భంగా ఊర్వశి టీం ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ… ఊర్వశి ధరించిన మొసలి నక్లెస్ నిజమైన దేనని క్లారిటీ ఇచ్చారు. ఈట్ నెక్లెస్ ధర 276 కోట్ల రూపాయలు అని తెలియజేయడంతో అందరూ ఒకింత ఆశ్చర్య పోవడమే కాకుండా మరికొందరు కామెంట్ చేస్తూ నెక్లెస్ ధర ఇలా కోట్లు రూపాయలలో ఉంటుందా జోక్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Urvashi Rautela: 276 కోట్ల ధర…

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఊర్వశి రౌటేలా ఈ మధ్యకాలంలో వరుస స్పెషల్ సాంగ్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వరుస సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా సందడి చేస్తున్నటువంటి ఈమె కెన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఓ మెరుపు మెరుసారు.

Urvashi Rautela: బాస్ పార్టీ పాట కోసం ఊర్వశి రౌటేలా రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Urvashi Rautela: బాబీ దర్శకత్వంలో చిరంజీవి శృతిహాసన్ జంటగా నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య.ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా పది రోజుల వ్యవధిలోనే 200 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.

ఇక సినిమాలోని బాస్ పార్టీ సాంగ్ ఎలాంటి సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ కు మెగాస్టార్ చిరంజీవి పర్ఫామెన్స్ అద్భుతంగా సెట్ అయింది. ఇక ఈ పాటలో చిరంజీవి సరసన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా అదిరిపోయే పర్ఫామెన్స్ చేశారు.

ఈ పాటలో నటించడం కోసం ఊర్వశి తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఈ సినిమాలోని ఈ పాటను ఒక ప్రత్యేకమైన సెట్ వేసి షూటింగ్ చేశారని తెలుస్తోంది. ఈ సెట్ కోసం సుమారు 30 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ఇక ఈ పాటలో నటించినందుకు గాను నటి ఊర్వశి ఏకంగా రెండు కోట్ల రూపాయల ఛార్జ్ చేసినట్టు తెలుస్తుంది.

Urvashi Rautela: రెండు కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు…


ఇలా ఒక పాట కోసం రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని పెద్ద మొత్తంలోనే ఈ రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. కేవలం మూడు నిమిషాల పాటు కోసం ఊర్వశి రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే ఆమె క్రేజ్ ఇండస్ట్రీలో ఎలా ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Urvashi Rautela -Rishabh Pant: మళ్లీ ప్రేమలో పడ్డ అక్క తమ్ముడు.. ఇదేం రోత అంటూ మండిపడుతున్న ఫ్యాన్స్?

Urvashi Rautela -Rishabh Pant: సాధారణంగా సినీ సెలబ్రిటీలకు క్రికెటర్లకు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు క్రికెటర్లతో ప్రేమలో పడి వారిని పెళ్లిళ్లు చేసుకున్న వారు ఉన్నారు అలాగే ప్రేమలో ఉండి బ్రేకప్ చెప్పుకున్న వారు కూడా ఉన్నారు. అయితే గత కొద్దిరోజులుగా ఊర్వశి రౌటేలా రిషబ్ పంత్ వ్యవహారం గురించి మనకు తెలిసిందే. వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు వచ్చినప్పటికీ అలాంటిదేమీ లేదని ఇద్దరి మధ్య అక్క తమ్ముళ్ల అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు.

ఇలా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం గురించి వార్తలు రావడం అలాగే వీరిద్దరి మధ్య ఏదో గొడవలు రావడంతో సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ అక్క తమ్ముడు అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే క్రికెటర్ రిషబ్ సోషల్ మీడియా వేదికగా నన్ను వదిలే అక్క అంటూ కామెంట్ చేయగా ఈ కామెంట్ పై ఊర్వశి స్పందిస్తూ.. నా సంగతి వదిలేసి నువ్వు బ్యాటింగ్ సరిగ్గా చేయి తమ్ముడు అంటూ కామెంట్ చేశారు.

ఈ విధంగా అక్కా తమ్ముడు అంటూ పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకున్నటువంటి వీరిద్దరి మధ్యవివాదానికి ముగింపు పలుకుతూ ఊర్వశి సారీ అంటూ ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టారు. అయితే తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గినట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా ఊర్వశి ఫ్లేట్ పిటాయిస్తూ ఆ సారీ రిషబ్ కి పెట్టలేదని కామెంట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Urvashi Rautela -Rishabh Pant:వీరి రిలేషన్ పై మండిపడుతున్న నెటిజన్స్

ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు అక్క తమ్ముడు అంటూ ట్రోల్ చేసుకున్నటువంటి వీరిద్దరూ తిరిగి ప్రేమికులుగా మారి చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇది తెలిసినటువంటి నేటిజన్స్.. అక్క తమ్ముళ్లు చట్టా పట్టాలు తిరగడం ఏంటి మరి ఇంత రోతగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరి వీరి గురించి బాలీవుడ్ మీడియాలో వస్తున్నటువంటి ఈ వార్తలపై ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Urvashi Rautela: ఆ క్రికెటర్ ప్రేమిస్తున్నాడంటూ కామెంట్స్ చేసిన ఊర్వశి రౌతెలా.. అక్క నన్ను వదిలేయ్ అంటూ క్రికెటర్ కౌంటర్?

Urvashi Rautela: బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా గురించి పరిచయం అవసరం లేదు.బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న ఈమె సమయం చూసి ఓ క్రికెటర్ తనని ప్రేమిస్తున్నాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడిప్పుడే ఇండియన్ క్రికెట్ టీం లో అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్ గా పేరు సంపాదించుకున్నారు క్రికెటర్ రిషబ్ పంత్.

ఇలా సమయం చూసి ఊర్వశి రిషబ్ పంత్ తనని ప్రేమిస్తున్నాడు అంటూ ఈమె చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె రిషబ్ పంత్ పేరు ప్రస్తావించకుండా ఆర్పి అంటూ తన గురించి వెల్లడించారు.

ఈ విధంగా నటి ఊర్వశి క్రికెటర్ తనని ప్రేమిస్తున్నాడు అంటూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఈ వీడియో క్రికెటర్ రిషబ్ పంత్ స్పందిస్తూ నటి ఊర్వశి పేరు ప్రస్తావించకుండా అక్క నన్ను వదిలేయ్ అంటూ ఈమెపై పరోక్షంగా దాడి చేశారు.ఊర్వశి పేరు బయటకు చెప్పకుండా అక్క అంటూనే కొందరు వారికి పబ్లిసిటీ కోసం మరికొందరి పేర్లను వాడుకుంటూ ఉన్నవి లేనట్టు చెబుతుంటారు అని ఈయన పరోక్షంగా ఆమె వీడియో పై స్పందిస్తూ కౌంటర్ వేశారు.

Urvashi Rautela: అక్క అని సంబోధించిన క్రికెటర్..

మొత్తానికి క్రికెటర్ రిషబ్ పంత్ అక్క అంటూ కామెంట్ చేయడంతో వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని అయితే నటి ఊర్వశి కేవలం తన పబ్లిసిటీ కోసమే తన పేరును ఉపయోగిస్తుంది అంటూ పలువురు భావిస్తున్నారు. మొత్తానికి ఈయన ఊర్వశి వీడియో పై స్పందిస్తూ తనకు భారీ కౌంటర్ వేశారని పలువురు భావిస్తున్నారు.

Saravanan: థియేటర్లో హీరో ఏడుస్తుంటే నవ్వలేక చస్తున్న ఆడియన్స్.. శరవణన్ యాక్టింగ్ కు ఆడియన్స్ రియాక్షన్ ఇదే?

Saravanan: ఇన్ని రోజులపాటు మోడల్ గా,వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శరవణన్ ఎప్పటికైనా హీరోగా నటించాలని భావించారు. ఈ క్రమంలోనే 51 సంవత్సరాల వయసులో నటి ఊర్వశి రౌతెల హీరోయిన్ గా ఈయన నటించిన చిత్రం ది లెజెండ్.ఈ సినిమా విడుదలై దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది.

ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ కన్నా నెగిటివ్ రెస్పాన్స్ తో విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో శరవణన్ నటనకు ఆడియన్స్ రెస్పాండ్ అవుతూ విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ సినిమా అచ్చం సంపూర్ణేష్ బాబు సినిమాల ఉందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

ముఖ్యంగా ఈ సినిమాలో తన భార్య చనిపోతే శరవణన్ ఎమోషనల్ గా ఏడ్చే సన్నివేశం ఒకటి ఉంది.ఈ సన్నివేశంలో స్క్రీన్ పై థియేటర్ ఏడుస్తూ ఉంటే థియేటర్లో మాత్రం ప్రేక్షకులు అతని యాక్టింగ్ చూసి పడి పడి నవ్వుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భారీగా పబ్లిసిటీ చేసుకున్న శరవణన్..

ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాని శరవణన్ తన సొంత డబ్బులతో నిర్మించారు. ఇక ఈ సినిమాలో తమిళ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటీనటులు నటించారు.ఎప్పటికైనా హీరోగా కనిపించాలని ఆశపడిన ఈయన 51 సంవత్సరాల వయసులో ఇలా ది లెజెండ్ సినిమాతో తన కలను నిజం చేసుకున్నారు.మొత్తానికి ఈ హీరో ఈ సినిమా ద్వారా తన షాపింగ్ మాల్స్ కి కావాల్సినంత పబ్లిసిటీ సంపాదించుకున్నారని చెప్పాలి.

Urvashi Rautela: ప్రేమ గాటుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నటి.. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్!

Urvashi Rautela: సాధారణంగా సెలబ్రెటీలు అంటే మీడియా అటెన్షన్ కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. వారు ఏంచేస్తున్నారు…ఎటు వెళ్తున్నారు.. వారి లైఫ్ స్టైల్, ఫ్యామిలీ విషయాలు ఇలా అన్నింటిపై ప్రజలకు ఆసక్తి ఉంటుంది కాబట్టి మీడియా కూడా వీటిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఇది సినీ రంగంలో ఉన్నవారిపై మరింతగా ఎక్కువగా ఉంటుంది. 

Urvashi Rautela: ప్రేమ గాటుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నటి.. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్!

నటినటుల కనిపిస్తే చాలు కెమెరాలతో క్లిక్ మనిపిస్తుంటారు. వారి వ్యక్తిగత జీవితానికి భంగం కలిగిస్తున్నయంటూ.. చాలా సార్లు సెలబ్రెటీలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ఊర్వశీ రౌతేలా మెడ మీద ఎర్రటి మరక కనిపించింది. ఇక దీన్ని క్యాప్చర్ చేసిన ఓ వెబ్ సైట్.. తనకు నచ్చిన విధంగా హద్దులు దాటేసి ఊర్వశి మెడపై లవ్ బైట్ అంటూ.. రాసేసింది. 

Urvashi Rautela: ప్రేమ గాటుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నటి.. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్!

ఇది చూసిన ఊర్వశి ఘాటుగానే స్పందించింది. సదరు వైబ్ సైట్ న్యూస్ ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోషల్ మీడియా వేదికపై ఈ కథనంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. 

సోషల్ మీడియా వేదకగా ఊర్వశి ఆగ్రహం..


‘హాస్యాస్పదంగా ఉంది! అది నా రెడ్‌ లిప్‌స్టిక్‌, మాస్క్‌ తీస్తూ పెడుతున్నప్పుడు అది నా మెడకు అంటింది. పెదాలకు రెడ్‌ లిప్‌స్టిక్‌ పెట్టుకున్న తర్వాత దాన్ని మెయింటెన్‌ చేయడం ఎంత కష్టమో ఏ అమ్మాయిని అడిగినా చెప్తుంది. ఒకరి ప్రతిష్టను దిగజార్చడం కోసం ఏదిపడితే అది రాస్తారా? ఇలాంటి ఫేక్‌ న్యూస్‌లు రాసే బదులు నా విజయాల గురించి రాయొచ్చు కదా?’ అని ట్వీట్‌ చేసింది. అంతేకాదు ఈ అసత్య ప్రచారం చేసినందుకుగానూ తనకు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని డిమాండ్‌ చేసింది. ఊర్వశి 2013లో సింగ్‌ సాబ్‌ ద గ్రేట్‌ సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. సనమ్‌ రే, గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ, హేట్‌ స్టోరీ 4, పాగల్‌ పంతి వంటి పలు చిత్రాల్లో నటించింది. ఆమె చివరగా వర్జిన్‌ భానుప్రియ సినిమాలో కనిపించింది.

ఆమె ధరించిన వజ్రాల దుస్తుల ధర ఎంతో తెలుసా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఊర్వశి రౌతేలా తన అందం, అభినయంతో హిందీ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. 2013లో ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అంతక ముందు మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది.

ఆమె వర్జిన్ భాను ప్రియ, సనమ్ రే, పాగల్ పంతి, హేట్ స్టోరీ 4, గ్రేట్ గ్రాండ్ మస్తీ వంటి చిత్రాల్లో నటించింది. ఈమె నటించిన మరో సినిమా బ్లాక్ రోజ్. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈమెకు సంబంధించి మరో విషయం ఏంటంటే.. 2015 సంవత్సరంలో ఉర్వశి రౌతేలా భారత్ తరఫున మిస్ యూనివర్స్ పోటీల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

ఇక తాజాగా 2021లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఆమె కూడా పాల్గొంది. అందాల పోటీల్లో కాదులేండి.. ఆమె న్యాయ నిర్ణేతగా ‘మిస్ యూనివర్స్-2021’ వ్వవహరించారు. ఈ పోటీలు ఇజ్రాయిల్ లో జరిగిన విషయం తెలిసిందే. దీని ద్వారానే అమె ఓ గుర్తింపు సాధించారు. అత్యంత చిన్న వయస్సులోనే ఈ గ్రాండ్ ఈవెంట్లో భారతదేశం తరఫున జడ్జి చేసిన మొదటి వ్యక్తిగ నిలిచారు.

ఇక ఆమె ఈ షో ముగిసిన తర్వాత నేరుగా ముంబైకి చేరుకున్నారు. ఇక అక్కడ ఉన్న కెమెరా కళ్లు ఆమెపై క్లిక్ మనిపించాయి. గులాబీ రంగు దుస్తులు ధరించి కనిపించిన ఆమె ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా మరో విషయం ఏంటంటే.. ఆమె ధరించిన ఆ గులాబీ డ్రెస్ విలువ ఎంతో తెలుసా.. దాదాపు రూ.5లక్షలు అంట. ఈ డ్రెస్ పై వజ్రాలు కూడా ఉన్నాయి. ఇక ఆమె ధరించిన చెవి రింగులో కూడా వజ్రాలతో ఉండటం విశేషం. దీనికి సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.